జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
370 views
11 days ago
రైతు సంక్షేమమే లక్ష్యం… రైతు భరోసాతో అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – ఎమ్మెల్యే జారె 22.03.2026 - ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రేపటి నుంచి ఆర్థిక సహాయం అందనుందని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు తెలిపారు. ఈ పథకం కింద నియోజకవర్గంలో మొత్తం 45,456 మంది రైతులు లబ్ధి పొందుతూ, సుమారు రూ. 25.39 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులను ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. మండలాల వారీగా లబ్ధిదారులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి: అన్నపురెడ్డిపల్లి మండలం – 4,838 మంది రైతులకు రూ. 2.63 కోట్లు అశ్వారావుపేట మండలం – 12,950 మంది రైతులకు రూ. 7.34 కోట్లు చంద్రుగొండ మండలం – 6,067 మంది రైతులకు రూ. 3.26 కోట్లు దమ్మపేట మండలం – 11,272 మంది రైతులకు రూ. 6.31 కోట్లు ములకలపల్లి మండలం – 10,329 మంది రైతులకు రూ. 5.86 కోట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు అండగా నిలుస్తూ రైతు భరోసా నిధులను విడుదల చేయడం ప్రభుత్వం రైతు పక్షపాతాన్ని చాటిచెబుతోందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అశ్వారావుపేట నియోజకవర్గ రైతులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 🌾 #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్