*ఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేటను తీర్చిదిద్దుతాం — ఎమ్మెల్యే జారె*
30.01.2026 – శుక్రవారం
అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున
*13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జూపల్లి రమేష్ గారు*,
*6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వారి శ్రీమతి జూపల్లి శశికళ గారు*,
*10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మిండా హరిబాబు* గారు
నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు, అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామం నుంచి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు *భారీ ర్యాలీగా* అశ్వారావుపేటకు చేరుకుని *నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.*
ఈ ర్యాలీ కాంగ్రెస్ శక్తిని స్పష్టంగా చాటిందని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు* మాట్లాడుతూ —
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక *అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని* తెలిపారు.
మున్సిపాలిటీ అభివృద్ధిలో కౌన్సిలర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల సమస్యలపై పోరాడే నాయకులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అశ్వారావుపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే జారె గారు పదవ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ, కౌన్సిలర్ అభ్యర్థి మిండా హరిబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే నాయకుడు మిండా *హరిబాబు*
గారని ఎమ్మెల్యే కొనియాడారు.
#🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్