ప్రజల ఆరోగ్యం – విద్య అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది — ఎమ్మెల్యే జారె
ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభం • పదవ తరగతి విద్యార్థులకు ధైర్యం నింపిన ఎమ్మెల్యే
11.03.2026 – బుధవారం
దమ్మపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడమే లక్ష్యమని తెలిపారు. క్యాంపుల ద్వారా వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ ప్రభుత్వం ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పిస్తున్నందున ప్రజలు ఈ ఉచిత ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు సమయానికి అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, విధులను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం త్వరలో నిర్వహించనున్న పదవ తరగతి చివరి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ధైర్యం, ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, మల్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజూ చదివిన పాఠాలను పునర్విమర్శ చేసుకుంటూ సమయపాలనతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. లక్ష్యంతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
అదే విధంగా ఉపాధ్యాయులతో సమావేశమై పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక మార్గదర్శనం అందించాలని తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి గారు, ఉపసర్పంచ్ ఆంగోత్ శ్రీనివాసరావు గారు, మందలపల్లి సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు గారు, కక్కిరాల రమేష్ గారు, టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు గారు, చిన్నశెట్టి యుగంధర్ గారు, పగడాల రాంబాబు గారు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్