*దమ్మపేటలో న్యాయవాదుల ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే జారె*
17.02.2026 - మంగళవారం
దమ్మపేటలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహించిన ధర్నా ర్యాలీలో ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు పాల్గొని సంఘీభావం తెలిపారు హైదరాబాద్లో న్యాయవాది ఖాధీర్ గారి హత్యను ఖండిస్తూ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు సమాజంలో న్యాయం కోసం పోరాడే శక్తులని వారి భద్రత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు ఖాధీర్ గారి హత్య ఘటన బాధాకరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు
న్యాయవాదుల రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు
#కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు