జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
540 views
3 days ago
పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా రాయాలి — ఎమ్మెల్యే జారె 09.03.2026 – సోమవారం అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైనవని తెలిపారు. భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడిక అలవాటు చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె అశ్వారావుపేటలోని శ్రీ సత్యసాయి కళ్యాణమండపంలో సత్యవరపు జగదీష్ – లీలావతి దంపతుల మనవరాలు, నిఖిలేష్ – భవాని దంపతుల కుమార్తె సితార మీనాక్షి అన్నప్రాసన వేడుకలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్‌లో చెలికాని భాస్కరరావు – రజిని దంపతుల కుమారుడు లోకేష్ – కృతి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి గారు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుత్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చల్లా ఆదినారాయణ గారి భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావు గంగాధరరావు గారు, గ్రామ సర్పంచ్ సున్నం జయమ్మ గారు, ఉపసర్పంచ్ నూనె శ్రీనివాసరావు గారు, చల్లా రమణ గారు, నరదలు వీరాస్వామి గారు, జె. ప్రసాద్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్