*సామాజిక న్యాయం దిశగా అంబేద్కర్ ఆశయాలకు నూతన దిశ — దమ్మపేటలో ఘనంగా జయంతి వేడుకలు*
14.04.2026 - మంగళవారం
దమ్మపేట మండలంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారి సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ గారు దేశానికి అందించిన సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ వంటి విలువలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.
ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ విద్య, సమాన హక్కులు, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని పేర్కొన్నారు.
సమాజంలో వివక్షలకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే జారె అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ గారు, ఎంపీడీవో రవీందర్ రెడ్డి గారు, ఎంఈఓ జగపతి గారు, సీఐ నాగరాజు రెడ్డి గారు, ఎస్సై సాయి కిషోర్ రెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ వాసం రాణి గారు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
👉 “అంబేద్కర్ ఆలోచనలు – సమాజానికి దిశానిర్దేశం, సమానత్వం మనందరి లక్ష్యం”
#కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు