రాజ్యసభలో కొత్త అధ్యాయం… వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
16.04.2026 – గురువారం
దేశ రాజకీయాల్లో మరో కీలక మైలురాయిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు హాజరై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారితో కలిసి వేం నరేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ —
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర స్థాయిలో బలమైన వాణిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా ప్రతిపాదించి, పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, విజయ్ కుమార్, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
#🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్