#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #ktr #ktrtrs 📣 కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికే❗
🚨 రేవంత్ బావమరిది, పొంగులేటి కొడుకు, బీజేపీ ఎంపీలకే పనులు ⚠️
📢 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క కాంట్రాక్టు అయినా ఇచ్చిండ్రా?
⛔ రూ.4 వేల కోట్ల కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ పనుల్లో బడుగులకు నాలుగు పైసల పనులైనా అప్పగించిండ్రా?
♦️ కాంట్రాక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? డిక్లరేషన్లో చెప్పిందేంది? జీవో 17తో చేస్తున్నదేంది?
📣 చేతగాని సీఎంను అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దాం
💥 మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) ఇవ్వాలి. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే రావాలె కదా! 72 శాతం కాదు కదా 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు జీవోలు తెచ్చింది.
రేవంత్రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెక్కాడు. ఆయన రెగ్యులర్ సీఎం కాదు రెన్యూవల్ సీఎం. ఢిల్లీ కాంగ్రెస్కు నెలనెలా కప్పం కట్టకపోతే ఆయన సీఎం పదవి ఊస్ట్ అవుతది. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులే ఆయన పదవి ఉంటది. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ హై కమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణం. వారికి కప్పం కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మనకు రేవంత్రెడ్డిని అంటగట్టిండ్రు.