తెలుసుకుందాం...!!!

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K views
8 days ago
బొజ్జ గణపయ్యను గరిక (గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యం* *యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు . అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి . అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు . గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు . అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది. దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది . దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను, అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది . నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా …. అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను.* *సంస్కృతము లో గరికను ” దూర్వలం ” అంటారు . శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది.* *శ్రావణమాసం లో వచ్చే బహుళ చతుర్ధి గణపతి కి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున సంకష్టహర చతుర్ధీ వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం . ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. విఘ్నేశ్వరుణునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి.* *విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ” గరిక (గడ్డి) ” పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము . గరికతో పూజిస్తాం గనుక ఈ స్వామిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు . ఈ స్వామిని అర్చించేటపుడు జంట గరికపోచలతో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది.* 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ #తెలుసుకుందాం #🕉️ గణపతి బప్పా మోరియా #🙏జై గణేశాయ నమః🙏 #జై గణేశా.. జై జై గణేశా
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.4K views
19 days ago
ఆదిత్య హృదయం సోత్రం ..............!! తాత్పర్యం మీకు తెలుసా..... తాత్పర్యము: ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను. ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక! ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును. ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది. పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము. సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు. ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు. ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు. సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు. సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు. సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు. సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు. సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు. సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము. తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు. జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు. ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు. సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు. కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు. సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు. సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు. సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు. ఫల శృతి:- రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును. రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును. ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను. ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను. రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను. రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను. అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను . #తెలుసుకుందాం #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.6K views
1 months ago
#దేవాలయం దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యజ్ఞ హోమదుల్లోను కొన్ని శుబకార్యాల్లోను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతిక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. -------------------------------------------------------- గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? “ప్రదక్షిణం ” లో “ప్ర” అనే అక్షరము పాపాలకి నాశనము, “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదిక్షణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని అర్థం. -------------------------------------------------------- ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్నిసుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి. ------------------------------------------------------- గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుబమా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగాపరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము. ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము. -------------------------------------------------------- గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది? దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి. శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరికే శదగోపం. మానవునికి శత్రువులైన కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం. షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికివేలుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. -------------------------------------------------------- దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు? బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము. -------------------------------------------------------- దేవాలయపు వెనుక బాగాన్ని ఎందుకు తాకరాదు? చాల మంది ప్రదిక్షినలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ బాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి. -------------------------------------------------------- దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో తరుముతున్నట్టు ప్రదిక్షణం చేయరాదు. నిండు గర్భిని నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము దైవదర్శనం చేయరాదు. ------------------------------------------------------- గుడిలో ఎలా ఉండాలి? గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి. #ధర్మ సందేహాలు 🚩 #ధర్మ సందేహాలు ##ధర్మ సందేహాలు -నిత్య సత్యాలు🙏🙏 #ధర్మ సందేహాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.6K views
1 months ago
పసుపు కొమ్ములతో పూజ............!! సకల శుభాలను కలిగించే 41 రోజు అమ్మవారి పూజ.... 41 రోజు పూజ ఇంట్లో చేసుకునే అమ్మవారి పూజకు ముందుగా మీరు ఏ కోరికతో చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి.. ప్రతి రోజు ఉదయం ఇల్లు వాకిట్లో శుభ్రం చేసి ఈ 41 రోజు గడపకు పసుపుకుంకుమా పెట్టాలి... అమ్మవారి విగ్రహం ఉన్న వారు అయితే అమ్మవారికి పసుపు నీటితో అబీషేకం చేయాలి, చేస్తున్న సమయంలో శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేయాలి... విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటో ని అలంకరించిన చాలు, విగ్రహం ఉన్నవారు అభేషేకం ఐయ్యాక అమ్మవారికి అలంకారం చేసి, పూజకు కావాల్సిన వి సిద్ధం చేసుకుని దీపాలు అన్ని పెట్టి వినాయకుడికి ముందుగా పూజ చెసుకోవాలి, కొన్ని పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి దండలాగా కట్టాలి ఈ దండను రోజు కట్టాల్సిన పని లేదు మొదటి రోజు కట్టిన పసుపుకొమ్ముల దండను 41 రోజులు వేయవచ్చు, తర్వాత మీ కోరిక ను అమ్మవారికి చెప్పుకుని యదా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించు కుని, 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పసుపుకోమ్ము అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి, (దుర్గ, లలిత, లక్ష్మీ,గాయత్రి, కాళీ,)ఈ దేవతలలో ఏ అష్టోత్తరం అయినా పర్వాలేదు కానీ 41 రోజూ అదే అష్టోత్తరం చదవాలి.. అర్చన ఐయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి.. ఈ 41 రోజు పూజ ప్రారంభంలోనే చిన్న గిన్నెలో పానకం పెట్టాలి పూజ ఐయ్యాక ఆ పానకం తీర్థo లాగా సేవించాలి. వారంలో ఒక్కసారి అయినా తీపి అన్నం, పులిహోర వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం శుభాన్ని కలిగిస్తుంది. ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలి... మరుసటి రోజు మళ్ళీ పూజ సమయంలో శుభ్రం చేసే టప్పుడు ఆ పసుపుకొమ్ముల పక్కకు తీసి పెట్టి ,అవే పసుపు కొమ్ములు మళ్ళి అర్చనకు వాడాలి, అలా 41 రోజు అదే పసుపుకొమ్ముల లు వాడాలి.. 41 రోజు అమ్మవారికి, పంచామృతము అభేషేకం చేసి 11 మంది ముత్తైదువులకు.. తాంబూలం ఇవ్వాలి ఏదైనా తీపి వండి మహా నివేదన చేసి ఆ ముత్తదువులకు తాంబూలంలో పండు తో పాటు ఒక పసుపుకొమ్ము, చిల్లర, పువ్వులు, మీరు వండిన ప్రసాదం వారికి ఇవ్వాలి..అక్షింతలు వేయించుకుంటే మంచిది.. మీరు 11 మందికి ఇచ్చే వారిలో ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి... ఇది చాలా విశేషమైన అర్చన, ఇంటిల్ల పాదికి సకల శుభాలు కలుగుతుంది, గ్రహ దోషం తో పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిస్కారం దొరుకుతుంది.. ఆటంకం వస్తే 7 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు. నియమాలు:....... ఆటంకం రాకూడదు, ఆడవారికి అయితే మైలు స్నానం అయ్యాక 7 వ రోజు నుండి కొనసాగించాలి, ఈ 41 రోజు మాంసాహరం తినకూడదు, పూజ పూర్తి అయ్యాక ఆహారం తినాలి కానీ ఉపవాసం చేయకూడదు మీరు ఎంత సంతోషంగా శ్రద్ధగా పూజ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.. వివాహితులు రోజూ తలస్నానమ్ చేయాలి(బ్రహ్మచర్య నియమం లేదు కనుక). ఆవివాహితులు మంగళ, శుక్ర, నాడు తల స్నానం చేస్తే సరిపోతుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ 9 am లోపు పూజ ఐపోవాలి , ఈ పూజ అంతా అరగంట సమయం పడుతుంది అంతే ఆ కాసేపు అయినా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. ఈ 41 రోజూ కూడా రోజంతా శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఉండటం చాలా మంచిది... ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్ళితే వచ్చాక మళ్ళీ మొదటి నుండి చేయాలి... ఇందులో ఏలాంటి మార్పు ఉండదు.. (మిగిలిన పసుపుకొమ్ములు వంటకు వాడుకోవచ్చు). #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯