ఏపీ, తెలంగాణ న్యూస్

💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
2.3K views
11 days ago
💥ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అజేయం.! 💥ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం శుభపరిణామం. పార్లమెంట్ ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకొనే ఆనందకర తరుణం వచ్చింది. ఇకపై రాజధానిగా అమరావతి అజేయం. ఈ బిల్లుకు మద్దతు పలికిన పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచిపెట్టేయాలి. రాష్ట్రానికి రాజధాని నగరం ఉండటమే ఇష్టం లేని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజాలెవరూ పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సదరు వ్యక్తుల నైజం మరోమారు బయటపడింది.! 💥అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి. ఈ రాజధానిని ప్రతి ఒక్కరూ తమదిగా భావించే విధంగా తీర్చిదిద్దే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ముందుకు తీసుకువెళ్లడంతోపాటు, రాజధాని నగర అభివృద్ధికి బలమైన తోడ్పాటు ఇస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.! 💥పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం తరుణంలో రాష్ట్రంలో కూటమి పక్షాలు చేసే సంబరాల్లో భాగస్వాములు కావాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిస్తున్నాను. మన రాజధాని అమరావతి కోసం తోడ్పాటు ఇచ్చిన శ్రీ నరేంద్ర మోదీ గారికి, అపార అనుభవంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించాలని కోరుతున్నాను"!! ... ✍🏻ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.!! 💥#Raja Comment :1953లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన 'ఆంధ్ర రాష్ట్రం'.! 2026లో ఇప్పుడు, రాజధానికి చట్టబద్ధత పొందిన తొలి రాష్ట్రంగా చరిత్రపుటలలో నిలవనున్న 'ఆంధ్రప్రదేశ్'.!! #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️🙏🏻 #OneStateOneCapital❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
546 views
12 days ago
💥ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషిస్తున్న క్షణాలివి.! 💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. వారంతా గర్వించే క్షణాలివి. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్ సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియచేసిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారు.! 💥ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో., ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిబద్ధత, ఆలోచనలతో... అమరావతి ప్రజా రాజధానికి, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది.!!❤️🙏🏻 #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️🙏🏻 #OneStateOneCapital❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
568 views
12 days ago
💥మన భారతదేశంలో 16వ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది.! మారుతున్న సామాజిక జీవనశైలిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఆధునిక సమాజంలో పెరుగుతున్న 'లివింగ్ రిలేషన్‌షిప్' (సహజీవనం) జంటలను కూడా ఇకపై ఒకే 'కుటుంబం'గా గుర్తించాలని నిర్ణయించింది. 2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ సర్వేలో, 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేశారు. రెండు దశల్లో సాగే ఈ ప్రక్రియలో, తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' సదుపాయాన్ని కూడా కల్పించారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహ వివరాల సేకరణ చేపట్టనున్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. సంక్షేమ పథకాల రూపకల్పనకు, సామాజిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ గణన కీలక పాత్ర పోషించనుంది.!👌🏻🇮🇳 #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #JanaGanana❤️🙏🏻 #LiveInRelationship❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
864 views
16 days ago
💥ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే.! • మనసా వాచా కర్మణా మద్దతు.! • గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది.! • భూములు ఇచ్చిన రైతులను హింసించింది.! • రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం.! • రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు.! • మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి.! • రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.! • సరైన ప్రణాళిక లేకుండా విభజించారు.! • రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు.! • అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది.! • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.! 💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు.! ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి.! 💥తెలుగు నేల అనే భావనే ఉండేది:కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.! 💥భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు:2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.! 💥రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు:చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.! 💥మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి:భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.! 💥విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు:గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.! 💥ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను” అన్నారు.!!❤️🙏🏻 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️ #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
Nara Chandrababu Naidu
3.8K views
22 days ago
Heartiest congratulations to Hon’ble Prime Minister Shri Narendra Modi ji on achieving the historic milestone of becoming the longest-serving head of government in India’s history, completing 8,931 days in service to the nation. This extraordinary achievement reflects his dedication, visionary leadership, and tireless commitment to the progress and prosperity of our country. His vision of a Viksit Bharat by 2047 continues to inspire us all and guide India toward a brighter future. Wishing him continued strength, good health, and success as he leads the nation to even greater heights. #📰 a.p న్యూస్ #🎯ap
Adhithya Newsline
608 views
24 days ago
విద్యా విధానంలో భారీ మార్పులు: సీఎం💥 ##revanthreddy #studentlife #10boardexams #viralnews #telanga news #reels
Adhithya Newsline
616 views
24 days ago
విద్యార్థులకు నెలకు రూ.2000 స్కాలర్‌షిప్💥 #telanga news #scholarships #viralnews #shorts #fyp
PSV APPARAO
4.9K views
1 months ago
#☀తెలంగాణ రాష్ట్రం 🌙వార్తలు విషయలు 🌍 #తెలంగాణ వార్తలు #తెలంగాణలో కల్తీ నెయ్యి గుట్టురట్టు *బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి* హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్‌లో “ప్రైడ్ డెయిరీ” పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు. యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసి, సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రకారం తక్కువ నాణ్యత గల పామ్ ఆయిల్, వనస్పతి మరియు ఇతర పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెయ్యిని అసలైనదిగా చెప్పి ప్రజలకు, హోటళ్లకు మరియు శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 274, 275 కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42
PSV APPARAO
589 views
1 months ago
#చిలుకూరు బాలాజీ ఆలయ స్థాపకుడు సౌందరరాజన్ కన్నుమూత 🪔🙏 #చిలుకూరు బాలాజీ టెంపుల్ #చిలుకూరు బాలాజీ ఆలయం💐🎂 #☀తెలంగాణ రాష్ట్రం 🌙వార్తలు విషయలు 🌍 #తెలంగాణ వార్తలు చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్‌కు పితృవియోగం రంగరాజన్‌ తండ్రి సౌందరరాజన్ (90) కన్నుమూత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్‌