అమరావతి

P.Venkateswara Rao
477 వీక్షించారు
13 రోజుల క్రితం
#అమరావతి అంటేనే చంద్రబాబు జేబు సంస్థ అన్నట్లుగా మారిపోయింది. కేవలం భవనాల అద్దాలకు వేలకోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అమరావతి భవనాల నగిషీల పేరిట వేల కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
P.Venkateswara Rao
2.6K వీక్షించారు
14 రోజుల క్రితం
" 💭 #అమరావతి కలలు… గ్రామాల కన్నీళ్లు! 😭 💦💧 🤔ఒక నగరం కోసం… ఒక రాష్ట్రాన్ని త్యాగం చేశారా?..❓ #AmaravatiReality #PeopleFirst #APPolitics #SaveAndhra #ప్రజలస్వరం #అన్యాయానికివిరుద్ధం #గ్రామాలగొంతు
P.Venkateswara Rao
572 వీక్షించారు
17 రోజుల క్రితం
#అమరావతి #పొలిటికల్ సెటైర్స్ 😂 *అమరావతిలో ‘అమృత' వ్యాలీ………❗* APRIL 28, 2026🎯 ఆరు ఎత్తిపోతల పథకాలు 88 పంపు సెట్లతో నిద్దర్లాకుండా ఎద్దులా కష్టపడుతున్న సింగపూర్ సాంబాబు……… పంపుల్లో పాములు దూరి పనులు ఆలస్యం కావడంతో అధికారులపై కస్సుబుస్సు మంటూ సీఎం యమ సీరియస్సు……… వచ్చే మూడేండ్లలో ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ అవసరం లేదంటూ..... అమరావతమ్మో… అమరావతి.... కమృతమమ్మో...కమృతము… కంటిమీద కునుకు లేకుండా పచ్చ కామెర్ల సాక్షిగా……… చక్రాలు లేని త్రిపుల్ ఇంజన్ కి ప్రజా వంచక వార్తల చక్రాలు చుట్టి అందులో.. -- రైతుల పేరుతో... ఐదుకోట్ల ప్రజల పేరుతో……… అభివృద్ధి పేరుతో………. దళారీలు, గుంటనక్కలు, పందికొక్కులను కూర్చోపెట్టి అమృతమంతా తాగంగా……. మిగిలిన ఎంగిలి అమృత గుళికలమ్మో గుళికలు తిని బతికితే మీ అదృష్టం……… తినకుంటే మీ పనిబడతాం.... బుల్డోజర్ బాబా మా ఆదర్శం……… హేయ్ హేయ్ నాయకా... హై హై నాయకా... జై జై త్రి'పుల్లు' ఇంజిన్……. ఇంచులేని అభివృద్ధి ఇంకేం చేద్దాం……. ఇంకేం చేద్దాం లడ్డు కథ.. 'బెడ్డెక్కింది' గొడ్డు కథ.. బెడిసికొట్టింది కొవ్వు కథ.. నవ్వులపాలైంది నెయ్యి కథలో న్యాయం గెలిచింది ఐనా.. ద్రోహాలకు అలవాటుపడ్డ అధికారం అబద్ధాలకు అలవాటుపడ్డ నాయకత్వం ఇప్పుడో కొత్త దగా కావాలి………. సారాయి బాబుకు ' కాదేది అనర్హం సరికొత్త ద్రోహానికి ' కొత్త వ్యూహం పుట్టుకొస్తుంది ఏనాడూ నిజం రాయని ఈనాడు రోట్లో……… మసిపూసి మాడికాయ కారం దంచి ఫ్లాష్....ఫ్లాష్....ఫ్లాష్ ……… అమరావతి అమృతానికి గడగడలాడుతున్న గల్ఫ్ దేశాలు! పెట్రోల్... డీజిల్ అక్కర్లేని ట్రిబుల్ ఇంజిన్ తయాలేరో... ఆంధ్రా సర్కార్ యమా బిజీ……… ఉతికి ఆరేసి పాత కార్ల సామానును కాకర తీగ యాలాడదీసినట్లు యాలేసి ప్రపంచం లోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ కాయ అన్నట్లు……… ఉట్టికి యాలగట్టిన అమరావతి టెక్నాలజిస్టులు చేతిలో……… అమరావతి అమృతం సృష్టి రేపే విడుదల త్వరపడండి... ఇంత నెత్తురు, ఇన్ని పసి బుగ్గలు, ఇన్ని అబద్ధాలు, ఇంత అగ్రరాజ్య ఉగ్రవాదం.. ఎందుకు…..పెట్రోల్...డీజల్ కోసమే కదా.-- made in Amaravati__ యుద్ధం ఎందుకని ఇక మిడిలీస్ట్ లో నెత్తురాట అక్కర్లేదని అమెరికా నుంచి సర్రున వచ్చానని బుర్రకథల బాబుగారికి ఫోన్ చేసిన కంపుకిన్ ఇక ప్రపంచం చూపంతా మన దేవతల రాజధానిపైనే అక్కడ తోడబడుతున్న అమృతం పైనే………. అక్కడ సృష్టించబడుతున్న సంపద పైనే……… ఆంధ్రులారా... చిప్పలు సిద్ధం సేసుకోండి……… అధికారులారా... నేను నిద్రపోను.... మిమ్మల్ని నిద్రపోనివ్వను……… ఏయ్ ఏమనుకున్నావ్………. ఎద్దుకు ఈనమని చెప్పింది నేనుకదా……… దున్నకు పాలు పిండింది నేనుకాదా………. గ్యాసు సిలిండర్లు, గోలిగుండ్లు అన్నీ నా సృష్టే.…… అమరావతి రాజధానిలో దేవుణ్ణి కూడా నేనే… ఈనాడు……ఆ………నాడు………ఏనాడైనా……… సమస్య ఉందంటే అధికారుల తప్పుల వేట... క్రెడిట్ చోరీ లో మాత్రం మేటికుండే మహానాడు మొనగాళ్లం గ్యాస్ సిలిండర్లు ల్యాకపోయినా……… గ్లాసులో వైన్ లెక్క మత్తెక్కించే వార్తలు వండి వడ్డించేది మేమే……… రండి బాబూ.. రండి ఆలసించిన ఆశా భంగం అమరావతి అమృతానికి………. మా నాయకుల మోచేతుల కింద అంగలారుస్తూ కూర్చుంది స్వేచ్ఛ..🤗
P.Venkateswara Rao
628 వీక్షించారు
1 నెలల క్రితం
#అమరావతి లో నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుండి కమిషన్లు ఎలా వచ్చాయో గతంలో కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతోనే తేలిపోయింది చంద్రబాబు గారు.. కేవలం 750 కోట్ల సెక్రటేరియట్ నిర్మాణం చేసిన రెండు కంపెనీల నుండే దాదాపుగా 20 శాతం 118 కోట్లు ముడుపులు విదేశాల నుండి ఆయా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు,లోకేష్ పీఏ కిలారు ఆదేశాలతో ఎక్కడెక్కడ అందజేశారో ఏయే షెల్ కంపెనీల ద్వారా మళ్లించారో వివరంగా చెప్పారు.. ఈ 118 కోట్ల రూపాయలను చంద్రబాబు అక్రమ సంపాదన గా ఎందుకు పరిగణించకూడదు అంటూ ఐటీ శాఖ ప్రశ్నించిన విషయం ప్రజలు మర్చిపోలేదు.. ఇక ఇప్పుడు గత రేట్లకు డబల్ రేట్లు ఇచ్చి మరీ ఈ కాంట్రాక్టు సంస్థలతో పాటుగా మీ బినామీ/అనుంగు మద్దతుదారులకు వేల కోట్ల రూపాయలు నిర్మాణ కాంట్రాక్టులు ఇచ్చారు.. ఇప్పుడైతే ఏకంగా పనులు మొదలు పెట్టకుండానే ఈ కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చేస్తున్నారు..ఇలా ఇచ్చేయడం అలా కమిషన్లు దండుకోవడం.. ఈ అమరావతి దోపిడీని ప్రశ్నించినందుకేగా వైయస్సార్సీపీ వారిని బుతులూ తిడుతూ,ట్రోల్స్ చేస్తూ, అక్రమ కేస్ లు పెడుతూ,బెదిరిస్తున్నారు..
P.Venkateswara Rao
584 వీక్షించారు
1 నెలల క్రితం
#అమరావతి *📢 ఏపీ రాజధానిపై #శివరామకృష్ణన్_కమిటీ చెప్పిన అసలు నిజాలు❗*📢 ఈ కమిటీని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) నియమించింది. ​ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన రాజధానిని ఎంపిక చేయడం కోసం ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఈ "నిపుణుల కమిటీ" (Expert Committee) ఏప్రిల్ 25, 2014 న ఏర్పాటు అయింది. చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సి. శివరామకృష్ణన్ ని నియమించారు. ఇందులో పట్టణ ప్రణాళిక, ఆర్థిక మరియు సామాజిక రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులు సభ్యులుగా చేర్చారు. ​ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై రిటైర్డ్ ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్యమైన 10 అంశాలను ఒకసారి గమనిద్దాం. రాజధాని అంటే కేవలం భవనాలు కాదు, రాష్ట్ర భవిష్యత్తు అని కమిటీ చెప్పింది. అందులోని ​ముఖ్యమైన 10 అంశాలు ఒకసారి చూద్దాం.. *​అన్నీ ఒకేచోట వద్దు*: పరిపాలన అంతా ఒక్కచోటే కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాలు వెనుకబడిపోతాయి. "అన్నీ ఒకే గంపలో పెడితే, ఆ గంప కింద పడితే అన్నీ పోతాయి" అన్నట్టుగా, అభివృద్ధిని రాష్ట్రమంతటా పంచాలి. *​అతిపెద్ద నగరం అవసరం లేదు*: ఏపీకి ఒకే ఒక భారీ సూపర్ సిటీ అవసరం లేదు. ఉన్న నగరాలనే అభివృద్ధి చేయాలి. *​సారవంతమైన భూములు వద్దు*: పంటలు పండే పచ్చని భూముల్లో రాజధాని కట్టడం భావ్యం కాదు. రైతుల పొట్ట కొట్టవద్దు. *​వికేంద్రీకరణే ముఖ్యం*: హైకోర్టు ఒకచోట, సచివాలయం మరోచోట, డైరెక్టరేట్లు ఇంకోచోట ఉండాలి. అప్పుడే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. *​తక్కువ స్థలంలోనే నిర్మాణాలు*: సీఎం ఆఫీస్, సచివాలయానికి కేవలం 15-20 ఎకరాలు, అసెంబ్లీకి 80-100 ఎకరాలు ఉంటే సరిపోతుంది. వేల ఎకరాలు అవసరం లేదు. *​హడావుడి వద్దు*: హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కాబట్టి, నిదానంగా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలి. "ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు" హడావుడిగా ఆఫీసులను తరలించి ప్రజా ధనాన్ని వృధా చేయకూడదు. ​ఉన్న వనరులను వాడుకోవాలి: ఇప్పటికే ఉన్న నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేయవచ్చు. *​ఆర్థిక భారం*: విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నందున, భారీ ఖర్చుతో కూడిన "గ్రీన్ ఫీల్డ్" రాజధాని కంటే పొదుపుగా నిర్మించుకోవడం ముఖ్యం. *​ప్రాంతీయ మండళ్లు*: రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులు లేదా మండళ్లు ఏర్పాటు చేసి అక్కడి ప్రజల అవసరాలు తీర్చాలి. *​డైరెక్టరేట్లు*: ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో వెదజల్లడం ద్వారా ఆయా ప్రాంతాలు ఆర్థికంగా పుంజుకుంటాయి. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, రాష్ట్రంలోని ప్రతీ గడపకు చేరాలన్నదే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ నిపుణుల కమిటీ సూచనలను పక్కనపెట్టి రాష్ట్ర భవిష్యత్తుని వినాశనం చేసే చర్యలకు సిద్ధమయ్యింది. ​#APCapital #SivaRamaKrishnanCommittee #
P.Venkateswara Rao
636 వీక్షించారు
1 నెలల క్రితం
#అమరావతి *భవనాలతో రాజధాని రాదు… హైదరాబాదుతో అసలు పోలికే లేదు…‼️* April 7, 2026🎯 తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటాడు చంద్రబాబు… ఈమధ్యకాలంలో విన్న భయానకమైన, బీభత్సమైన జోక్ ఇది… ఎప్పటి నుంచో హైదరాబాద్ నేనే కట్టాను అంటున్నాడు, ఇది దానికి పరాకాష్ట… పైగా దీంతో అమరావతిని పోలుస్తాడు… దేని కథ దానిదే… అమరావతి బిల్లు పార్లమెంటులో పాస్ కావడంతో రాయలసీమ వాసుల కళ్లల్లో ఆనందం అంటూ మరో ట్వీట్… బాబోయ్… హైదరాబాద్ చరిత్రకు వందల ఏళ్లు… ఇక్కడ లైఫ్ ఉంది, జనం ఉన్నారు, తెలంగాణ మాత్రమే కాదు, దేశంలోని… కాదు, ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనాన్ని ఈ నగరం అక్కున చేర్చుకుంది, అన్నం పెట్టింది, ఆదరించింది… ఇది ‘ప్యూర్’ మెట్రోపాలిటన్ గ్లోబల్ సిటీ… రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అనగానే… పాతాళభైరవి సినిమాలోలాగా భవనాలు, నగరాలు నిర్మాణం కావు… వేల ఎకరాల భూసేకరణ, కొన్ని భవనాల (ఆ నిర్మాణవ్యయాలు, అక్రమాల ఆరోపణలు వదిలేస్తే) నిర్మాణంతో హైదరాబాద్ వంటి రాజధాని రాదు… ఏబీఎన్ రాధాకృష్ణ శుష్క కవరింగులాగా వచ్చేతరం అనుభవిస్తుంది అనడానికి కూడా లేదు… పాత ల్యాండ్ పూలింగ్ సమస్యలే ఎక్కడివక్కడ ఏడుస్తున్నాయి, కొత్త పూలింగ్ అంటేనే ఆ రైతులు భయపడుతున్నారు… ఇది రియాలిటీ… పైగా గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనేది కాన్సెప్టుపరంగానే లోపభూయిష్టం… సరే, ఓ ఉదాహరణలోకి వెళ్దాం… రాజధాని అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, అద్దాల మేడలు, అద్భుతమైన రోడ్లు మాత్రమే కాదు… అక్కడ నివసించే ప్రాణమున్న జనం… ఈ చేదు సత్యాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని ‘నవరాయ్‌పూర్ అటల్ నగర్’ నేడు ప్రపంచానికి చాటిచెబుతోంది… రెండు దశాబ్దాల నిరీక్షణ… వెలవెలబోతున్న నగరం … 2006లో శ్రీకారం చుట్టిన నవరాయ్‌పూర్ ప్రాజెక్టుకు రెండు దశాబ్దాలు దాటినా, అది నేటికీ ఒక జీవం లేని నగరంగానే మిగిలిపోయింది… సుమారు 9 వేల కోట్లు ఖర్చు చేసి, 19,800 ఎకరాల్లో సకల హంగులతో సెక్రటేరియట్, అసెంబ్లీ, విల్లాలు, ఐటి పార్కులు నిర్మించినా అక్కడ జనం ఉండటానికి ఇష్టపడటం లేదు… 7,100 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, వారంతా పాత రాయ్‌పూర్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు తప్ప, అక్కడ కాపురం ఉండటం లేదు… సాయంత్రం ఐదు దాటితే ఆ నగరం ఒక ‘ఘోస్ట్ టౌన్’ను (నిర్మానుష్య నగరం) తలపిస్తోంది… అమరావతికి నేర్పే పాఠాలేమిటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే తరహా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి… చంద్రబాబు నాయుడు అమరావతిని హైదరాబాద్‌తో పోలుస్తూ కాబోయే ‘విశ్వనగరం’ అని పిలుస్తుంటాడు… కానీ హైదరాబాదు కు వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, సహజ సిద్ధమైన వాణిజ్యంతో ఎదిగిన నగరం… కేవలం భవనాలు కడితే నగరం రాదు అనడానికి నవరాయ్‌పూర్ ఒక సజీవ ఉదాహరణ… బర్మా రాజధాని ‘నేపిడో’ లాగే… నవరాయ్‌పూర్ కూడా ప్లాన్డ్ సిటీగా పేరొందినా, సామాన్యుడికి చేరువ కాలేకపోయింది… ఎంత ఖరీదైన విల్లాలు కట్టినా, ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా ప్రజల జీవనశైలికి, వారి అవసరాలకు అనుగుణంగా నగరం లేకపోతే అది కేవలం ఒక ‘షో పీస్’గానే మిగిలిపోతుంది… అమరావతి కూడా కేవలం పాలకుల గ్రాఫిక్స్ కాకుండా, మనుషులు నడిచే, నవ్వుకునే, బతికే నగరంగా మారాలి… లేదంటే రాయ్‌పూర్ అనుభవం అమరావతికి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలే ప్రమాదం ఉంది… నగరం అంటే నిర్మాణం కాదు… నివాసం…! – 20 ఏళ్ల తర్వాత కూడా రాజధాని కాదు కదా… కనీసం ఓ పట్టణస్థాయిని కూడా చేరలేదు. – పొద్దున్న ఆఫీసు సమయానికి రావడం, సాయంత్రానికి మళ్లీ పాత రాయ్‌పూర్ కి పయనమైపోవడం… ఆఫీసు సమయాలు ముగిసిన తర్వాత కనీసం మనుషులు కూడా కనిపించడం కూడా గగనమే… – మహారాజ కోటను తలపించేలా సచివాలయం… దానికి మహానది పేరు… ఆనుకుని హెచ్‌ఓడీలకు భవనం … దానికి మరో నది ఇంద్రావతి పేరు… చేరువలోనే విధానసభ భవనం కూడా… ఆర్బీఐ, ఎన్ఐఏ, ఎన్టీపీసీ, యూనియన్ బ్యాంక్‌, కెనరా బ్యాంక్ వంటి సంస్థల భారీ భవంతులు… దాదాపుగా 26 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు… ఐనా సిబ్బంది కూడా వచ్చి, పోవడమే తప్ప నవరాయ్‌పూర్ లో నివశించడానికి మొగ్గు చూపరు… అత్యంత ఖరీదైన విల్లాలు… సీఎం, మంత్రుల నివాసాలు… సీఎం నివాసం సుమారు 3 ఎకరాల విస్తీర్ణం, ఒక్కో మంత్రికి దాదాపు ఎకరం స్థలంలో విశాలమైన భవనాలు… ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందికి తగ్గట్టుగా భవనాలు… అతి పెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీ… పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు… ప్రతిష్టాత్మక ఐఐఎం రాయ్‌పూర్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిఫుల్‌ ఐటీ)… కళింగ యూనివర్సిటీ, దిల్లీ పబ్లిక్ స్కూల్… కానీ ఏం లాభం..? అందరూ పాత నగరం నుంచి వచ్చీపోయేవాళ్లే… రెండు జాతీయ రహదారులను ఆనుకుని నగరం… ఎన్‌హెచ్ 43, ఎన్‌హెచ్ 53 కూడా రాజధానికి సమీపాన… రైల్వే లైన్ నిర్మాణం… పాత, కొత్త రాయ్‌పూర్ నగరాల నడుమ ఎయిర్‌పోర్ట్… పక్కా ప్లాన్డ్ సిటీ… అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్… ఎక్కడా ఒక్క కేబుల్ లైన్ కూడా బయటకు కనిపించదు… తెచ్చిన అప్పులు కూడా తీర్చారు, అదిప్పుడు అప్పుల్లేని నగరం… రిసార్ట్స్, గోల్ఫ్‌కోర్స్ కూడా ఉన్నాయి… ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమయ్యింది… ఇటీవల రెండు మ్యాచ్ లు కూడా నిర్వహించారు…. ఇదంతా రియాలిటీ… మన సమీపంలోనే ఉన్న ఉదాహరణ… మళ్లీ చెప్పుకుందాం… లక్షల కోట్లతో రాజధాని రాదు… జనం రావాలి… అది రాత్రికిరాత్రి రాదు… రాదు.. రాదు..!!