అమరావతి

neelapu chinnareddy
1.1K views
1 months ago
#AndhraPradesh రాష్ట్రానికి రాజధాని కావాలి, నిజమే కాని!! అది ఎలా ఉండాలి?? రాజధాని పేరుతో రాష్ట్ర మొత్తం ప్రజల కష్టాన్ని ఒక ప్రాంతంలో, ఒక ప్రాంతం కోసం మన రాష్ట్ర శక్తికి మించి #Amaravathi పేరుతో వృధా చేయాల లేక తక్కువ కర్చుతో రాజధానిని అభివృధ్ధి చేసుకోవాల? అప్పుడు విశాఖపట్టణం అనిన, ఇప్పుడు #MaViGun అనిన YS Jagan Mohan Reddy గారి ఉద్దేశం ఒక్కటే, రాజధాని నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు భారం కాకూడదు, రాజధాని పేరుతో దోపిడి జరగకూడదు అని... అందుకే మేము అప్పుడు #Vizaq కి, ఇప్పుడు #MaViGun కి మద్ధతు ఇస్తాం... #responsibility #credibility #capitalcityమీరు ఆంధ్రా రాష్ట్ర రాజధానిగా దేనికి సపోర్ట్ చేస్తారు? అమరావతి vs మావిగన్| Chandrababu vs Jagan| Amaravati vs Mavigun| #amaravathi #mavigun #amaravathivsmavigun #ysjagan #cmchandrababu #appolitics #apcapital #apcapitalpolls #AndhraPradesh #అమరావతి రైతుల ఆవేదన 🙏 #అమరావతి ఉద్యమం@ 600 days #కరోనాలో కూడా జై అమరావతి నినాదాలు ఇంటి నుండే #అమరావతి
P.Venkateswara Rao
578 views
1 months ago
#ఏపీ అప్డేట్స్ 🎯 * #అమరావతి రాజధాని పనుల్లో ఏదో భారీ తేడా కొడుతోంది❗* July 3, 2026🎯 అమరావతి రాజధాని నగరం… కేవలం కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ఆంధ్రుల కల, వేలాది మంది రైతుల త్యాగాల పునాది. అయితే, ఈ కల సాకారం కావడంలో ఎదురవుతున్న జాప్యం, వ్యవస్థలో కనిపిస్తున్న లోపాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషణలకు కేంద్రబిందువుగా మారాయి. అమరావతి: వ్యవస్థాత్మక వైఫల్యం.. అధికారుల నిస్సహాయత… అమరావతికి అసలు విలన్లు ఎవరో వెతకడానికి ప్రతిపక్షాల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు నిర్ణయాధికారం చేతిలో ఉన్న ప్రభుత్వమే, తన విధాన నిర్ణయాలతో ఒకప్పుడు ‘విలన్’గా ముద్రపడిన వారిని మళ్లీ ప్రమాదకరమైన శక్తిగా మారుస్తోందన్నది రాజకీయ పరిశీలకుల మాట. దీనికి నిదర్శనంగా ఎస్‌వీఆర్ శ్రీనివాస్ ఉదంతాన్ని ఒక కీలక మలుపుగా చూడాలి. ముంబై మెట్రో, అటల్ సేతు, ధారావి పునర్నిర్మాణం వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను సమర్థవంతంగా నడిపించిన ఎస్‌వీఆర్ శ్రీనివాస్ వంటి అధికారి, అమరావతికి తన సేవలను అందించాలని ముందుకొచ్చారు. కానీ, వ్యవస్థలో నిర్ణయాధికారం లేకపోవడం, చేతులు కట్టేసే పరిపాలనా తీరు, కనీస సిబ్బంది కొరత… ఆయన వంటి మేధావిని సైతం నిస్సహాయుడిని చేశాయి. ఫలితంగా, ప్రాజెక్టు మీద ఎంతో ఆశతో వచ్చిన ఆ అధికారి, చేసేదేమీ లేక నిష్క్రమించాల్సి వచ్చింది. ఇది ఒక వ్యక్తి వైఫల్యం కాదు, “నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులను భరించే ఓపిక ఈ వ్యవస్థకు ఉందా?” అన్న ప్రశ్నను పాలకుల ముందు ఉంచుతోంది. నాయకత్వ లోపం… ప్రాధాన్యతల గందరగోళం… ఒకప్పుడు సమర్థులైన అధికారులను ఎంచుకుని, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయించడంలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక శైలి ఉండేది. కానీ, ఇప్పుడు అమరావతి విషయంలో ఆ నాయకత్వ పట్టు, ఆ అత్యవసర భావన ఎక్కడో లోపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం అనేది ఒక సర్కారుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కావాలి. ఆ ఆసక్తి, ఆ పట్టుదల పైస్థాయి నుంచి స్పష్టంగా కనిపించకపోతే, అడుగు కదలడం కష్టమని అమరావతి గతిని చూస్తే అర్థమవుతోంది. కాంట్రాక్టుల వేగం… పనుల మందగమనం … ఇక్కడ ఉత్పన్నమవుతున్న మరో ప్రధాన అనుమానం – కాంట్రాక్టుల పంపకం. కాంట్రాక్టులు ఇవ్వడంలో చూపే వేగం, క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేయించడంలో ఎందుకు కనిపించడం లేదు? ఆశించిన ఫలితాలు సాధించని కాంట్రాక్టర్లకే మళ్లీ మళ్లీ ప్రాజెక్టులు ఎందుకు అప్పగిస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మదిలో మెదులుతున్నాయి. కాంట్రాక్టుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం నిర్మాణామా లేక మరేదైనా ఆర్థిక ప్రయోజనమా? అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. క్రెడిట్ అయినా… బాధ్యత అయినా పాలకులదే … నేడు అమరావతికి ప్రతిపక్షం అడ్డంకి కాదు, పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన శత్రువు. ఈ రాజధాని ప్రాజెక్టు జాప్యానికి జగన్ మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేయడంలో అర్థం లేదు, ఎందుకంటే అధికారం, నిర్ణయాధికారం చంద్రబాబు ఇప్పుడు చేతుల్లోనే ఉన్నాయి. బాధ్యత కూడా. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కాంట్రాక్టుల కోసం ఆశపడలేదు, ప్రపంచ స్థాయి రాజధానిని చూద్దామని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అమరావతి విజయవంతమైతే దాని క్రెడిట్ ప్రభుత్వానిదే. అదే అమరావతి ప్రాజెక్టు జాప్యానికి గురైనా, ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత కూడా అధికారంలో ఉన్న నాయకత్వానిదే. అభివృద్ధి పట్ల ప్రాధాన్యతను మార్చుకోకపోతే, చరిత్ర ఈ వ్యవస్థను ఎప్పటికీ క్షమించదు.
P.Venkateswara Rao
667 views
1 months ago
#మావిగన్ V #అమరావతి *మావిగ‌న్‌కు జై.. టీడీపీ అఫీషియ‌ల్‌❗* 03.07.2026🎯 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌కు కూట‌మి ప్ర‌భుత్వంలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న టీడీపీ అధికారికంగా జై కొట్టిందా? అంటే .. ఔన‌ని నెటిజ‌న్లు అంటున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో మావిగ‌న్ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అని వైఎస్ జ‌గ‌న్ తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే మావిగ‌న్‌ను గ‌ట్టిగా వ్య‌తిరేకించే సాహ‌సం సీఎం చంద్ర‌బాబునాయుడు, ఆ పార్టీ నేతలు చేయ‌లేక‌పోతున్నారు. తాము చెబుతున్న‌ది కూడా అదే క‌దా అని టీడీపీ స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. తాజాగా ఐ టీడీపీ అఫీషియ‌ల్‌గా రాజ‌ధానిపై పెట్టిన పోస్టే నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు కూడా 12 ఏళ్లుగా జ‌గ‌న్ చెబుతున్న‌దే క‌దా అంటోన్న‌ద‌ని ఐ టీడీపీ అఫీషియ‌ల్ పేజీ ఎక్స్ వేదిక‌గా గుర్తు చేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ముందుగా వైఎస్ జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ ప్ర‌తిపాద‌నలో ఏముందో తెలుసుకుందాం. కూట‌మి ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన అమ‌రావ‌తి నిర్మాణం …ఎప్ప‌టికీ పూర్తి కాద‌ని వైఎస్ జ‌గ‌న్ తేల్చి చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక భారం త‌ప్ప‌, అది ఎప్ప‌టికీ అభివృద్ధి కాజాల‌ద‌ని ఆయ‌న నిశ్చితాభిప్రాయం. దీని కోసం ల‌క్ష ఎక‌రాలు తీసుకుని, రూ.2 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డి ఎక్క‌డి నుంచి తీసుకొచ్చి వెచ్చిస్తార‌ని ఆయ‌న నిల‌దీస్తున్నారు. పైగా అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఇంత భారీ మొత్తంలో రాజ‌ధానిపై ఖ‌ర్చు పెట్ట‌డం అవ‌స‌ర‌మా? అని ఆయ‌న బ‌లంగా వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్లాన్ బీ కింద మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. మ‌చిలీప‌ట్నం – విజ‌య‌వాడ – గుంటూరు (మావిగ‌న్‌) 110 కిలోమీట‌ర్ల కారిడార్‌ను రాజ‌ధాని ప్ర‌క‌టించాల‌ని జ‌గ‌న్ కోరారు. మ‌చిలీప‌ట్నం వ‌ద్ద పోర్ట్‌, అలాగే గ‌న్న‌వ‌రం వ‌ద్ద అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌, 110 కిలోమీట‌ర్ల ప‌రిధిలో రెండు ఆరు లైన్ల జాతీయ ర‌హ‌దారులు, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌లో రెండు అతిపెద్ద‌ రైల్వే జంక్ష‌న్లు.. మావిగ‌న్‌లో ఉండ‌డాన్ని జ‌గ‌న్ ప్ర‌త్యేక గుర్తు చేస్తున్నారు. మావిగ‌న్‌లో నాలుగు కార్పొరేష‌న్లు, 60 ల‌క్ష‌ల జ‌నాభా వుంది. గ‌ల‌గ‌ల‌పారే కృష్ణా న‌ది, పోల‌వ‌రం కుడి కాల్వ ద్వారా ఇప్ప‌టికే జ‌ల‌సిరి. విజ‌య‌వాడ‌లోని ఎన్టీటీపీఎస్‌, పోల‌వ‌రంలో 960 మెగావాట్ల జ‌ల విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మావిగ‌న్‌కు పుష్క‌లంగా విద్యుత్‌. అందుకే మావిగ‌న్‌ను రాజ‌ధానిగా ఎంచుకుంటే కేవ‌లం ప‌ది శాతం మాత్రమే ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెడితే, మిగిలిన 90 శాతం పెట్టుబ‌డి ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా పెడ‌తార‌ని, త‌ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అప్పుల భారం త‌ప్పుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ ఉద్దేశం. ఈ నేప‌థ్యంలో ఐ టీడీపీ అఫీషియ‌ల్‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు తెరపైకి తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం. “CRDA మాస్టర్ ప్లాన్ ఇది .. ప్రపంచ బ్యాంక్ కి ఇచ్చిన డాక్యుమెంట్ ..గుంటూరు – జగ్గయ్యపేట – నూజివీడు – మచిలీపట్నం ..విజయవాడ Airport కి 30 KM .. మచిలీపట్నం పోర్టుకి 68 KM .. 12 ఏళ్లుగా @ncbn గారు చెప్పేది ఇదే కదా ..?మరి ” MAVIGUN ” అంటే ఏంటి ?ఈ ప్రాంతాలలో కాకుండా గాల్లో కడతారా?” ఇదే సంద‌ర్భంలో మ్యాప్‌ను, ప్ర‌పంచ బ్యాంక్‌కు స‌మ‌ర్పించిన నివేదిక‌లో మావిగ‌న్‌ను బ‌ల‌ప‌రిచే అంశాలే ఉన్నాయ‌న్న‌ట్టు టీడీపీ ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం విశేషం. అమరావతి కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలోని మూడు మండలాలైన (తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి) 25 గ్రామాల్లో 217.23 చదరపు కిలోమీటర్ల (53,748 ఎకరాల) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ సుమారు లక్ష జనాభా (39,000 కుటుంబాలు) నివసిస్తుంది. వ్యాపార కేంద్రమైన విజయవాడ (3 కిలోమీటర్ల దూరంలో), విద్యా కేంద్రమైన గుంటూరు (18 కిలోమీటర్ల దూరంలో) మధ్య వ్యూహాత్మకంగా ఉంది. ఈ నగరం జాతీయ రహదారుల (NH 16: కోల్‌కతా-చెన్నై, NH 65: పూణే-మచిలీపట్నం, NH 30: జగదల్‌పూర్-విజయవాడ) ద్వారా అనుసంధానించారు. దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది అయిన కృష్ణా నది ఒడ్డున అమ‌రావ‌తి ఉంది. జాతీయ జలమార్గం అభివృద్ధికి అనువుగా ఉంది. ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. అలాగే రాబోయే మచిలీపట్నం పోర్టుకు 68 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల, వాణిజ్యానికి ఎంతో అనువుగా వుంటుందని పేర్కొన్న‌ట్టు ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ ప్ర‌చారాన్ని చూస్తే.. అమ‌రావ‌తి కూడా మావిగ‌న్‌లో వుంద‌ని బ‌లంగా చెప్ప‌ద‌లుచుకుంది. కానీ ఆ విష‌యాన్ని వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులు అస‌లు ఒప్పుకోవ‌డం లేదు. అమ‌రావ‌తి, మావిగ‌న్ వేర్వేర‌ని వైఎస్ జ‌గ‌న్ రెండు రోజుల క్రితం మ‌రింత బ‌లంగా చెప్పారు. అంతేకాదు, మావిగ‌న్ అనేది త‌మ ఎన్నిక‌ల ఎజెండాగా వుంటుంద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. అమరావ‌తిలో అవినీతికి తాము వ్య‌తిరేకం అన్న‌ట్టుగా, మావిగ‌న్‌ను స‌మ‌ర్థించ‌లేమ‌ని చంద్ర‌బాబుతో సహా టీడీపీ నాయ‌కులెవ‌రూ ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నారు. అమ‌రావ‌తిని ఎవ‌రూ క‌ద‌ల్చ‌లేర‌ని మాత్ర‌మే టీడీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా మాట్లాడుతున్నారు. అయితే మావిగ‌న్ గురించి చ‌ర్చించ‌డానికి, దాన్ని వ్య‌తిరేకించ‌డానికి టీడీపీలో భ‌యాన్ని చూడొచ్చు. దీన్ని బ‌ట్టి మావిగ‌న్ ఎంత‌గా ప్ర‌భావితం చూపుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. మావిగ‌న్‌లో ఏ విష‌యాలైతే వైసీపీ చెబుతున్న‌దో, అవే క‌దా చంద్ర‌బాబు చెబుతున్నారని టీడీపీ ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అమ‌రావ‌తా? మావిగ‌నా?… ఏదో కావాలో తేల్చుకోవాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇచ్చారు. అయితే ఆ రెండు వేర్వేరు కాద‌ని చెప్ప‌డానికే టీడీపీ మొగ్గు చూపుతోంది. మావిగ‌న్‌పై వైసీపీ దూకుడు పెంచ‌డానికి టీడీపీ ప్ర‌చారం కూడా కార‌ణం అవుతోంది. ఏది ఏమైనా రాజ‌ధాని విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ఎత్తుకున్న మావిగ‌న్‌… టీడీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంద‌న్న‌ది నిజం. అందుకే జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తున్న అంశాల‌కు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా, సంబంధం లేని వాటిని చ‌ర్చ‌కు పెట్టి, త‌న‌దైన డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు చేస్తోంది. అయితే అది ఎంత వ‌ర‌కు రాజ‌కీయంగా పైచేయి సాధిస్తుందో చూడాలి.
P.Venkateswara Rao
488 views
3 months ago
#అమరావతి అంటేనే చంద్రబాబు జేబు సంస్థ అన్నట్లుగా మారిపోయింది. కేవలం భవనాల అద్దాలకు వేలకోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అమరావతి భవనాల నగిషీల పేరిట వేల కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
P.Venkateswara Rao
2.6K views
3 months ago
" 💭 #అమరావతి కలలు… గ్రామాల కన్నీళ్లు! 😭 💦💧 🤔ఒక నగరం కోసం… ఒక రాష్ట్రాన్ని త్యాగం చేశారా?..❓ #AmaravatiReality #PeopleFirst #APPolitics #SaveAndhra #ప్రజలస్వరం #అన్యాయానికివిరుద్ధం #గ్రామాలగొంతు
P.Venkateswara Rao
593 views
3 months ago
#అమరావతి #పొలిటికల్ సెటైర్స్ 😂 *అమరావతిలో ‘అమృత' వ్యాలీ………❗* APRIL 28, 2026🎯 ఆరు ఎత్తిపోతల పథకాలు 88 పంపు సెట్లతో నిద్దర్లాకుండా ఎద్దులా కష్టపడుతున్న సింగపూర్ సాంబాబు……… పంపుల్లో పాములు దూరి పనులు ఆలస్యం కావడంతో అధికారులపై కస్సుబుస్సు మంటూ సీఎం యమ సీరియస్సు……… వచ్చే మూడేండ్లలో ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ అవసరం లేదంటూ..... అమరావతమ్మో… అమరావతి.... కమృతమమ్మో...కమృతము… కంటిమీద కునుకు లేకుండా పచ్చ కామెర్ల సాక్షిగా……… చక్రాలు లేని త్రిపుల్ ఇంజన్ కి ప్రజా వంచక వార్తల చక్రాలు చుట్టి అందులో.. -- రైతుల పేరుతో... ఐదుకోట్ల ప్రజల పేరుతో……… అభివృద్ధి పేరుతో………. దళారీలు, గుంటనక్కలు, పందికొక్కులను కూర్చోపెట్టి అమృతమంతా తాగంగా……. మిగిలిన ఎంగిలి అమృత గుళికలమ్మో గుళికలు తిని బతికితే మీ అదృష్టం……… తినకుంటే మీ పనిబడతాం.... బుల్డోజర్ బాబా మా ఆదర్శం……… హేయ్ హేయ్ నాయకా... హై హై నాయకా... జై జై త్రి'పుల్లు' ఇంజిన్……. ఇంచులేని అభివృద్ధి ఇంకేం చేద్దాం……. ఇంకేం చేద్దాం లడ్డు కథ.. 'బెడ్డెక్కింది' గొడ్డు కథ.. బెడిసికొట్టింది కొవ్వు కథ.. నవ్వులపాలైంది నెయ్యి కథలో న్యాయం గెలిచింది ఐనా.. ద్రోహాలకు అలవాటుపడ్డ అధికారం అబద్ధాలకు అలవాటుపడ్డ నాయకత్వం ఇప్పుడో కొత్త దగా కావాలి………. సారాయి బాబుకు ' కాదేది అనర్హం సరికొత్త ద్రోహానికి ' కొత్త వ్యూహం పుట్టుకొస్తుంది ఏనాడూ నిజం రాయని ఈనాడు రోట్లో……… మసిపూసి మాడికాయ కారం దంచి ఫ్లాష్....ఫ్లాష్....ఫ్లాష్ ……… అమరావతి అమృతానికి గడగడలాడుతున్న గల్ఫ్ దేశాలు! పెట్రోల్... డీజిల్ అక్కర్లేని ట్రిబుల్ ఇంజిన్ తయాలేరో... ఆంధ్రా సర్కార్ యమా బిజీ……… ఉతికి ఆరేసి పాత కార్ల సామానును కాకర తీగ యాలాడదీసినట్లు యాలేసి ప్రపంచం లోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ కాయ అన్నట్లు……… ఉట్టికి యాలగట్టిన అమరావతి టెక్నాలజిస్టులు చేతిలో……… అమరావతి అమృతం సృష్టి రేపే విడుదల త్వరపడండి... ఇంత నెత్తురు, ఇన్ని పసి బుగ్గలు, ఇన్ని అబద్ధాలు, ఇంత అగ్రరాజ్య ఉగ్రవాదం.. ఎందుకు…..పెట్రోల్...డీజల్ కోసమే కదా.-- made in Amaravati__ యుద్ధం ఎందుకని ఇక మిడిలీస్ట్ లో నెత్తురాట అక్కర్లేదని అమెరికా నుంచి సర్రున వచ్చానని బుర్రకథల బాబుగారికి ఫోన్ చేసిన కంపుకిన్ ఇక ప్రపంచం చూపంతా మన దేవతల రాజధానిపైనే అక్కడ తోడబడుతున్న అమృతం పైనే………. అక్కడ సృష్టించబడుతున్న సంపద పైనే……… ఆంధ్రులారా... చిప్పలు సిద్ధం సేసుకోండి……… అధికారులారా... నేను నిద్రపోను.... మిమ్మల్ని నిద్రపోనివ్వను……… ఏయ్ ఏమనుకున్నావ్………. ఎద్దుకు ఈనమని చెప్పింది నేనుకదా……… దున్నకు పాలు పిండింది నేనుకాదా………. గ్యాసు సిలిండర్లు, గోలిగుండ్లు అన్నీ నా సృష్టే.…… అమరావతి రాజధానిలో దేవుణ్ణి కూడా నేనే… ఈనాడు……ఆ………నాడు………ఏనాడైనా……… సమస్య ఉందంటే అధికారుల తప్పుల వేట... క్రెడిట్ చోరీ లో మాత్రం మేటికుండే మహానాడు మొనగాళ్లం గ్యాస్ సిలిండర్లు ల్యాకపోయినా……… గ్లాసులో వైన్ లెక్క మత్తెక్కించే వార్తలు వండి వడ్డించేది మేమే……… రండి బాబూ.. రండి ఆలసించిన ఆశా భంగం అమరావతి అమృతానికి………. మా నాయకుల మోచేతుల కింద అంగలారుస్తూ కూర్చుంది స్వేచ్ఛ..🤗
P.Venkateswara Rao
629 views
4 months ago
#అమరావతి లో నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుండి కమిషన్లు ఎలా వచ్చాయో గతంలో కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతోనే తేలిపోయింది చంద్రబాబు గారు.. కేవలం 750 కోట్ల సెక్రటేరియట్ నిర్మాణం చేసిన రెండు కంపెనీల నుండే దాదాపుగా 20 శాతం 118 కోట్లు ముడుపులు విదేశాల నుండి ఆయా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు,లోకేష్ పీఏ కిలారు ఆదేశాలతో ఎక్కడెక్కడ అందజేశారో ఏయే షెల్ కంపెనీల ద్వారా మళ్లించారో వివరంగా చెప్పారు.. ఈ 118 కోట్ల రూపాయలను చంద్రబాబు అక్రమ సంపాదన గా ఎందుకు పరిగణించకూడదు అంటూ ఐటీ శాఖ ప్రశ్నించిన విషయం ప్రజలు మర్చిపోలేదు.. ఇక ఇప్పుడు గత రేట్లకు డబల్ రేట్లు ఇచ్చి మరీ ఈ కాంట్రాక్టు సంస్థలతో పాటుగా మీ బినామీ/అనుంగు మద్దతుదారులకు వేల కోట్ల రూపాయలు నిర్మాణ కాంట్రాక్టులు ఇచ్చారు.. ఇప్పుడైతే ఏకంగా పనులు మొదలు పెట్టకుండానే ఈ కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చేస్తున్నారు..ఇలా ఇచ్చేయడం అలా కమిషన్లు దండుకోవడం.. ఈ అమరావతి దోపిడీని ప్రశ్నించినందుకేగా వైయస్సార్సీపీ వారిని బుతులూ తిడుతూ,ట్రోల్స్ చేస్తూ, అక్రమ కేస్ లు పెడుతూ,బెదిరిస్తున్నారు..