ktr

Mohan
728 వీక్షించారు
1 రోజుల క్రితం
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr #ktr #ktrtrs తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) దూకుడు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజం నింపడానికి ప్రత్యేక వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.కేసీఆర్ బస్సు యాత్రప్రజా క్షేత్రంలోకి గులాబీ బాస్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనలు, బస్సు యాత్రలపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రధాన అజెండా: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.వ్యూహాత్మక ప్రచారం: కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లనీయకుండా, బీఆర్‌ఎస్‌ వైపు ఉండేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.కేటీఆర్ పాదయాత్ర/పర్యటనలునిరంతర ప్రజా સંપર્કం: కేటీఆర్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు, పాదయాత్రలు మరియు విస్తృత స్థాయి సమావేశాలతో జనంలో ఉంటున్నారు.ప్రభుత్వ వైఫల్యాల ఎండగట్టడం: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా, బహిరంగ సభల్లో తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.పార్టీ బలోపేతం: క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివేట్ చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతను ముందుండి నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణప్రభుత్వంపై ఒత్తిడి: రైతుల సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లు, మరియు ఇతర ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేతలు నిరంతరం పోరాటాలు చేస్తున్నారు.ప్రత్యేక ప్రణాళిక: పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు భవిష్యత్తులో మరిన్ని భారీ బహిరంగ సభలు, యాత్రలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది
Mohan
708 వీక్షించారు
1 రోజుల క్రితం
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 📣 కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికే❗ 🚨 రేవంత్‌ బావమరిది, పొంగులేటి కొడుకు, బీజేపీ ఎంపీలకే పనులు ⚠️ 📢 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క కాంట్రాక్టు అయినా ఇచ్చిండ్రా? ⛔ రూ.4 వేల కోట్ల కొడంగల్‌-నారాయణపేట లిఫ్ట్‌ పనుల్లో బడుగులకు నాలుగు పైసల పనులైనా అప్పగించిండ్రా? ♦️ కాంట్రాక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? డిక్లరేషన్‌లో చెప్పిందేంది? జీవో 17తో చేస్తున్నదేంది? 📣 చేతగాని సీఎంను అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దాం 💥 మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) ఇవ్వాలి. రూపాయి టెండర్‌ పిలిస్తే 72 పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే రావాలె కదా! 72 శాతం కాదు కదా 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ అడ్డగోలు జీవోలు తెచ్చింది. రేవంత్‌రెడ్డి పేమెంట్‌ కోటాలో గద్దెనెక్కాడు. ఆయన రెగ్యులర్‌ సీఎం కాదు రెన్యూవల్‌ సీఎం. ఢిల్లీ కాంగ్రెస్‌కు నెలనెలా కప్పం కట్టకపోతే ఆయన సీఎం పదవి ఊస్ట్‌ అవుతది. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులే ఆయన పదవి ఉంటది. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్‌ హై కమాండ్‌ మౌనంగా ఉండటానికి ఇదే కారణం. వారికి కప్పం కోసం రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే మనకు రేవంత్‌రెడ్డిని అంటగట్టిండ్రు.
Mohan
791 వీక్షించారు
5 రోజుల క్రితం
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 📢 అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలి: బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు 🌧️ రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డుల్లో తమ ధాన్యం, మక్కలను కోల్పోతున్న రైతన్నలు 📍 అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు తక్షణమే సందర్శించాలి ❌ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలకు ఈ దుస్థితి వచ్చింది ♦️ మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు అనే సాకులు లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి ♦️ మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే సరఫరా చేయాలి ⚡ వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి 🌾 పంట కొనుగోలు పైన ప్రత్యేక దృష్టి సారించి, అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్! #CongressFailedTelangana
Mohan
824 వీక్షించారు
8 రోజుల క్రితం
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs ❇️ పంట కొనుగోళ్ళపైన లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. ❇️ ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 శాతం కొనుగోళ్ళు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధం. ❇️ రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ❇️ అన్నదాతల పరిస్థితిపైన, పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ #కేటీఆర్ 👇 🔹 రాష్ట్రంలో పంట కొనుగోళ్ళ సంక్షోభం తీవ్రంగా ఉన్నదని, దీన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. 🔹 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన పంట కొనుగోళ్ళ పైన, పంటల వారీగా లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 🔹 రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో స్వయంగా పర్యటించిన తాను, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న రైతన్నల దుస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వానికి నిన్న ఒక బహిరంగ లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్ ముచ్చట్లు చెప్పారని మండిపడ్డారు. 🔹 కనీసం రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన చర్చించాలని, రైతన్నల కష్టాలే ఏకైక ఎజెండాగా రేపటి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Mohan
835 వీక్షించారు
25 రోజుల క్రితం
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs బిఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గారు మే 6-7, 2026 తేదీల్లో వరంగల్‌లో జరిగిన 'రైతు సంగ్రామ సదస్సు'లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 34 హామీలు ఏమయ్యాయి?: కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని కేటీఆర్ ఆరోపించారు.రైతు డిక్లరేషన్ బోగస్: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఒక "బోగస్ పత్రం" అని, రైతులకు బాండ్ పేపర్లు రాసి, మాట తప్పారని ఆయన విమర్శించారు.రైతు భరోసా vs రైతు బంధు: ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి, రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సమయానికి సాయం అందించడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.రైతు బంధు/భరోసా 2026 అప్‌డేట్: ఏప్రిల్ 20, 2026న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా రెండో విడతను విడుదల చేసినప్పటికీ, కేటీఆర్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.రుణమాఫీ, కౌలు రైతులు: రూ. 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు రూ. 14,000, రైతు కూలీలకు రూ. 12,000 సాయం ఏమైందని ఆయన నిలదీశారు.కేసీఆర్ రాజ్యం: కాంగ్రెస్ "రభండు (రాహుల్/రేవంత్) రజ్యాం" పోయి, మళ్ళీ కేసీఆర్ రైతు రాజ్యం రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు కేటీఆర్ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలు, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు విధానాలపై రైతుల అసంతృప్తిని పెంచేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు
Mohan
11.9K వీక్షించారు
1 నెలల క్రితం
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party #ktr #ktrtrs KCR | కేసీఆర్‌ హయాంలో అప్పు 3.17 లక్షల కోట్లు.. కాంగ్రెస్‌ దుష్ప్రచారం 7 లక్షల కోట్లు! KCR | కేసీఆర్ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. ఇదీ రిజర్వ్‌ బ్యాంక్‌ నిగ్గు తేల్చిన నిజం రేవంత్‌.. ఆర్బీఐ నివేదికపై ఇప్పుడేమంటారు? సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం 72,658 కోట్లు తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్‌ హయాంలో3 లక్షలకోట్లు అన్నీ కలిపితే 3.87 లక్షల కోట్లు కూడా దాటని మొత్తం అప్పు ఆ రుణంతో 30 లక్షల కోట్ల సంపద సృష్టించిన కేసీఆర్‌ సర్కార్‌ పదేండ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయం అన్ని రంగాలకు జవసత్వాలు.. పెరిగిన ప్రజా జీవన ప్రమాణాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యాండ్‌బుక్‌-2024లో తేటతెల్లం ఏడాదిలోనే రూ.80 వేల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు.. కొత్త పథకం అమలు చేయలేదు సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటేసిన రేవంత్‌ సర్కార్‌ KCR | కేసీఆర్‌ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా.. సెక్రటేరియట్‌ నుంచి కలెక్టరేట్ల దాకా.. అడుగడుగునా రుణ సద్వినియోగం కనపడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి, అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్‌ కౌశలం కండ్లకు కడుతున్నది మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ పన్నెండు నెలల్లో రేవంత్‌ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా 80 వేల కోట్లు! ఇది 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ. మరి ఈ అప్పుతో చేపట్టిన కొత్త ప్రాజెక్టు ఏది? మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది? కూలగొట్టుడే తప్ప.. కొత్తగా తట్టెడు మట్టి కూడా తీయని సర్కారు.. 80 వేలకోట్లు అప్పు తెచ్చి చేసిందేంది? సాధించిందేంది? ఒక్కో విషపుచుక్క ప్రోదిచేసి కాంగ్రెస్‌ సృష్టించిన అభాండాల భాండం బద్ధలైంది. అప్పులపై తప్పుడు కూతలకుచెంపచెళ్లుమనే సమాధానం దొరికింది. పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పటాపంచలైంది. అభివృద్ధిని చిన్నగాచూపి, అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది. అధికార యావలో కాంగ్రెస్‌ ఇన్నాళ్లు సాగించిన ‘అప్పుల కుప్ప’ప్రాపగాండాను రిజర్వ్‌బ్యాంక్‌ తాజా నివేదిక నిట్టనిలువునా చీల్చిపారేసింది. వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు.. కాంగ్రెస్‌ కత్తిగట్టి సాగించిన ‘మిత్తి’మీరిన ప్రచారాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. కేసీఆర్‌ పట్టించుకోలేదని అందామంటే.. పదేండ్ల పసికూన రాష్ట్రం అన్ని సూచీల్లో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. అభివృద్ధే చేయలేదని అందామంటే.. కండ్లముందు తెలంగాణ ప్రగతి ప్రదీప్తి మిరుమిట్లుగొల్పుతున్నది. సంపదకు లోటులేదు.. సంక్షేమానికి కొరత రాలేదు. దీంతో కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బురదచల్లింది. ధనిక రాష్ట్రంగా ఎదిగిన తీరును దాచి.. బాకా చానళ్లతో, భజంత్రీ పత్రికలతో తప్పుడు కథనాలను వండివార్చింది. అధికార పీఠంపై కూర్చున్నప్పటికీ కాంగ్రెస్‌ తీరు మారలేదు. పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్నే ప్రభుత్వ వేదికలపైనా కొనసాగించింది. పదేండ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారావు మాటల్ని పట్టుకుని సీఎం రేవంత్‌ సైతం అధికారిక సమావేశాల్లో ఆరోపణలకు దిగారు. నిజాలే నివ్వెరపోయేలా శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలకు సున్నంవేశారు. ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో కాంగ్రెస్‌ ఇన్నాళ్లూ సాగించిన అబద్ధపు ప్రచారం శుద్ధ తప్పేనని తేలిపోయింది. పదేండ్లలో తెలంగాణ చేసిన అప్పు 3.17 లక్షల కోట్లేనని ఆధారాలతో, అంకెలతో ఆర్బీఐ సుస్పష్టం చేసింది. సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం మరో రూ.72 వేల కోట్లని వెల్లడించింది. అన్నీ కలిసినా తెలంగాణ అప్పు 3.87 లక్షల కోట్లేనని కుండబద్ధలు కొట్టింది. ఆర్బీఐ లెక్కల తర్వాత కాంగ్రెస్‌ నేతల నోట మాట పడిపోయింది. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్‌ కొన్నేండ్లుగా తీవ్ర దుష్ప్రచారం చేసింది. కేసీఆర్‌ హయాంలో రూ.6.71 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకొని.. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. కానీ.. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమే. అందులోనూ సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం 72వేల కోట్లు. అంటే పదేండ్ల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 3.17 లక్షల కోట్లే!. ఇదెవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే.. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల జమాఖర్చులు చూసే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెప్పిన మాట. పూర్తి ఆధారాలతో, అంకెలతో.. అధికారికంగా ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ 2023-24’లో స్పష్టంచేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72 వేల కోట్ల రుణభారం ఉంటే.. 2023 నాటికి మొత్తం అప్పు రూ.3.89 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.3.17 లక్షల కోట్లు మాత్రమే తెచ్చిందన్నది తేటతెల్లం. మరి ఇన్నాళ్లూ అప్పును రెట్టింపు చేసి రూ.7లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసి.. ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆర్బీఐ నివేదిక చూస్తే స్పష్టమవుతున్నది. తెచ్చిన నిధులు స్వరాష్ట్ర నిర్మాణనికే.. ‘అప్పును భారంగా చూడకుండా.. పెట్టుబడిగా భావించాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే దానికి సార్థకత చేకూరుతుంది. అప్పుకు మించిన ఆదాయం, అంతకుమించిన ప్రయోజనాలు కనిపిస్తాయి’ అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ నియమాన్ని పాటించింది. రుణాల రూపంలో సేకరించిన అప్పులను మూలధన వ్యయంగా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసింది. సంపదను సృష్టించింది. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసింది. నదులకు నడకలు నేర్పి రిజర్వాయర్లకు మళ్లించింది. ఎండిన పొలాలను నదీజలాలతో తడిపి వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచింది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపింది.