ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అపర ఏకాదశి 🕉️ Apara Ekadashi 2023 🙏 ఏకాదశి విశిష్టత

PSV APPARAO
621 వీక్షించారు
19 గంటల క్రితం
#ఏకాదశి రోజున ప్రత్యేక నియమాలు తెలుసా #ఏకాదశి #అపరా ఏకాదశి ప్రాముఖ్యత 🕉️🙏 #అపర ఏకాదశి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అపర ఏకాదశి 🕉️ Apara Ekadashi 2023 🙏 ఏకాదశి విశిష్టత *రేపు అపరా ఏకాదశి* *(మే 13)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
PSV APPARAO
599 వీక్షించారు
20 గంటల క్రితం
#హనుమాన్ జయంతి హనుమాన్ చాలీసా🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: హనుమజ్జయంతి / హనుమాన్ జయంతి / హనుమాన్ జన్మోత్సవం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమాన్ చాలీసా 🕉️ జై హనుమాన్ 🔯🚩 #🚩శ్రీ హనుమాన్ చాలీసా📿 🔔 *పరిజ్ఞానం* 🔔 *హనుమాన్ చాలీసా పై... 25 ప్రశ్నలు, సమాధానములు!* *1. చాలీసా" అంటే ఏమిటి?* ``` జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు(చాలిస్ అంటే హిందీ లో 40 అని.)``` *2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?*``` జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. ‘అజ్ఞానమును’ హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.``` *3. ఆంజనేయ - అర్థం?*``` జ. ఆంజనేయ అంటే... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం, జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.``` *4. తులసీదాస్ అస్సలు పేరు?*``` జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.``` *5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?*``` జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్యవల్ల వచ్చిన తేజో వర్చస్సు యే “సువర్చల”. ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.``` *6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి?*``` జ. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్’ హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.``` *7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?*``` జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.``` *8. హనుమంతుని పంచ ముఖములు ఏవి?*``` జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు, హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే...తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము. దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు. పశ్చిమం గరుడ ముఖం. అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు. ఉత్తరం వరాహ ముఖం. అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది. 9. “జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి? జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము. https://youtu.be/SqdYfa_Avg0 10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు? జ.126 సం.జీవించాడు. 11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే. 12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు? జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు. 13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ? జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో. 14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి? జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు. 15. కపీశ అంటే అర్థం ఏమిటి? జ. కపీశ అంటే... a) కపులకు ఈశుడు b) కపి రూపంలో ఉన్న ఈశుడు సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం. 16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏 17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ? జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే అగ్ని ముఖావై దేవాః. దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు. 18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ? జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం. 19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా? జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ. 20 . నామస్మరణ మహిమ ఏమిటి? జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం. 21. మహాత్ముడు అంటే ఎవరు ? జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 22 . ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి? జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి. 23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి? జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర. 24 . విక్రమ అంటే అర్థం ఏమిటి? జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు. 25. సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ? జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు . https://youtu.be/SqdYfa_Avg0 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
540 వీక్షించారు
20 గంటల క్రితం
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: హనుమజ్జయంతి / హనుమాన్ జయంతి / హనుమాన్ జన్మోత్సవం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమజ్జయంతి #🕉️హనుమజ్జయంతి🙏🎊 #🕉️హనుమజ్జయంతి శుభాకాంక్షలు 🙏🎊 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
PSV APPARAO
648 వీక్షించారు
20 గంటల క్రితం
#హనుమంతుడు ... తమలపాకులు అర్చన #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ ఆంజనేయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏మంగళవారం భక్తి స్పెషల్🙏 🕉️*ఆంజనేయుడు.. తమలపాకులు*🕉️ 🕉️ఓసారి సీతారాములు తమలపాకులు సేవిస్తున్నారట. అమ్మ సీతమ్మ చిలుకలు చుట్టి రాముని నోటికి అందిస్తుంటే రాముని నోరు ఎర్రగా అవుతూ చూడడానికి మనోహరంగా కనిపించాడట. అక్కడే ఉన్న ఆంజనేయుడు అమ్మా పచ్చని ఆకులు ఇస్తున్నావు. రాముని నోరు మాత్రం ఎర్రని పండులాగా తయారు అవుతోంది ఏమిటి అని అడిగాడట. రామునికి తమలపాకులంటే ఇష్టం అందుకే రాముని నోట్లో కి వెళ్లగానే అవి అన్నీ పండ్లు అయిపోతున్నాయి అందట సీతమ్మ. అంతే రాముల వారికి తమలపాకులంటే అంత ఇష్టమా నేనా తమలపాకులనే చుట్టుకుంటా అని నాగవల్లిని తన శరీరమంతా పేర్చుకుని రామునికి కనిపించాడట పవనపుత్రుడు. అపుడు రాముడే నీకు ఎవరైతే తమలపాకులతో పూజ చేస్తారో వారికి తీరని కోరికలంటూ ఏమీ ఉండవు ఆంజనేయ ఆన్నాడట. 🕉️ కలియుగంలో నీవే నా భక్తుల కోరికలను తీర్చుము అని కరువలిపట్టికి ఆజ్ఞ ఇచ్చాడట రాముడు. అందుకే హనుమన్నకు తమలపాకులతో పూజ, సంసారంలో ప్రశాంతతను కోరేవారు ఆంజనేయుని తమలపాకు దండ వేస్తే వారికి శాంతి లభ్యమవుతుంది. 🕉️ గౌరవహీనంగా తమ బతుకులున్నాయనుకొనేవారు. కూడా నాగవల్లిని అంజన్నకు సమర్పిస్తేచాలు వారికి గౌరవ మర్యాదలు లభ్యమవుతాయి. హనుమంతునికి తమలపాకులను సమర్పించిన వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. సుందరకాండ పారాయణ చేసి తమలపాకుల దండ హనుమన్నకు వేస్తే అన్నింటా విజయం లభిస్తుంది.
PSV APPARAO
752 వీక్షించారు
8 రోజుల క్రితం
#అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా #అంగారక చతుర్థి #అంగారక సంకటహర చతుర్థి💐🎂 #🌺💐🙏అంగారక సంకటహర చతుర్థి🌺💐🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺#అంగరక_చతుర్థి 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. _"ఓం గం గణపతయే నమః"_ పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
1.1K వీక్షించారు
8 రోజుల క్రితం
#సంకట హర చతుర్థి వ్రతం ఎందుకు చేయాలి? #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺#అంగరక_చతుర్థి 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. _"ఓం గం గణపతయే నమః"_ పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
661 వీక్షించారు
11 రోజుల క్రితం
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ / బుద్ధ పూర్ణిమ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #బుద్ధ పూర్ణిమ #బుద్ధ పూర్ణిమ స్పెషల్ *ఆచరణే ఆరాధన* _ఆచరణే ఆరాధన_ మనం పురాణ పురుషుల, మహనీయుల జయంతులు వంటి వాటిని ఘనంగా జరుపుకుంటాం గాని వారు చెప్పిన బోధనలు పాటించటంలో వెనుకబడి ఉంటుంటామని ఇంతకు ముందే తెలుసు కున్నాం. ఆయా బోధనలు చేసిన మహాత్ములను మనం ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. కలిసి మాట్లాడి ఉండక పోవచ్చు. ఒక్క పైసా ఇచ్చి ఉండక పోవచ్చు. వారి బోధనలను ఆచరణలో పెట్టటమే వారి పట్ల మనం గౌరవాన్ని, భక్తి, శ్రద్ధలను కనబరచినట్లు అవుతుంది. ఆ విషయాన్నే తెలుపుతుంది మహాభారతంలోని ఏకలవ్యుని కథ. ఎదురుగా గురువు లేకున్నా, ఆయనను మనసులో నిలుపుకుని సాధన చేసి విలువిద్యలో అద్భుత నైపుణ్యాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఇటువంటి సంఘటనే బుద్ధ భగవానుని జీవితంలోను జరిగింది. బుద్ధ భగవానుడు దేశాటనలో భాగంగా ఒక రాత్రి వేళ కుమ్మరి శాలకు చేరుకున్నాడు. ఆ శాలకు ఆయన కన్న ముందే ఒక యువ పరి వ్రాజకుడు వచ్చి ఉన్నాడు. వారికి పూర్వ పరిచయం లేదు. ఆ యువ పరివ్రాజకుని మాట, ప్రవర్తన బాగా నచ్చాయి బుద్ధ భగవానునికి. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఓ భిక్షూ! నీవెవరి పేరున ప్రవ్రుజిడవైనావు లేక నీ శాస్త ఎవరు? ఎవరి ధర్మాన్ని ఇష్టపడతావు? అని ఆ యువకుని ప్రశ్నించాడు. అతడు సమాధానమిస్తూ, 'మిత్రమా! శాక్య పుత్రుడైన శ్రవణ గౌతము డున్నాడు. అతడు భగవంతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు. అతనే నా శాస్త్ర, నేనతని ధర్మాన్నే ఇష్టపడతాను అన్నాడు. దానితో బుద్దుడు ఒకింత ఆశ్చర్యంతో 'ఆ సమ్యక్ సంబుద్ధుడు ఇప్పుడెక్కడున్నాడు. నీవు ఆయనను ఎపుడైనా చూశావా? చూస్తే గుర్తించగలవా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ సన్యాసి చెబుతున్న సమ్యక్ సంబుద్ధుడు తానే. ఆ యువ సన్యాసికి తానెప్పుడూ ఏదీ ప్రత్యక్షంగా బోధించలేదు. దానికా యువ సన్యాసి 'నేను భగవంతుని ఏ నాడూ చూడలేదు. అందువల్ల చూసినా గుర్తించలేను అన్నాడు. పరో క్షంగా తన బోధనలు విని భక్తి శ్రద్ధలతో వాటిని ఆచ రిస్తున్న ఆ యువ సన్యాసికి బుద్ధుడు తానెవరో తెలిపి ధర్మాన్ని వివ రిస్తూ ఇంకెన్నో విషయాలను తెలి యజేశాడు. ఆనందం హృద యంలో పొంగి పొరలగా, రెండు కళ్ళలో నీరు ఉబ కగా, ఆ యువ సన్యాసి బుద్ధ భగ వానుని పాద పద్మాలపై తల ఉంచాడు. రెండు చేతులూ జోడించి, 'భగవాన్! నేను మిమ్మల్ని మిత్రమా అన్నందుకు నన్ను క్షమించండి. నా పేరు పుష్కర స్వాతి. నాకు ప్రవ్రాజ్య ఉప సంపద బ్రిక్టు సంఘంలో సదస్యత్ర ఇవ్వండి' అని ప్రార్థించాడు. భక్తి, శ్రద్ధ అంటే అవి. ఏ మహనీయుని విషయంలోనైనా మనకు ఆరాధనా భావముంటే వారి బోధను ఆచరించాలి గాని పాదపూజలతో, పూలహారాలతో, హారతి అర్చనలతో సరిపెట్టు కోరాదు. అవి ఉద్ధరించవు. సనాతన ధర్మం మనం ఆరు రుణాలతో పుడ తామని చెబుతుంది. అవి భూత రుణం, పితృరుణం, మాతృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం. ఇవి తీర్చుకోవాలంటారు. వాటికి విధా నాలున్నాయి. వాటిలో ఋషి రుణాన్ని తీర్చుకోవడం ఎలా గంటే వారు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని వారు చేసిన రచ నలు చదివి ఆచరించడం ద్వారానేనని చెబుతారు. అంటే నిజమైన ఆరాధన ఆయా మహనీయుల బోధనలు ఆచరించడమేనని తెలుస్తుంది. లోకోపకారమే ఆ మహ నీయుల ఉద్దేశం. వారి బోధ నలు ఆచరించడం ద్వారా మన జీవితాలు, సమాజం బాగు పడతాయి. అవి బాగుపడితే రాష్ట్రం, దేశం ఇలా అన్నీ బాగుపడతాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*