శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు)

PSV APPARAO
978 views
6 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 🪔 *శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి* 🪔 మనస్సుకు అధిపతి చంద్రుడు'. చంద్రుడు వెన్నెలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం, చంద్రుడంటే 'తల్లి'. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చల మైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగ లుగుతాం. చంద్రాను -గ్రహం, తల్లి ఆరాధ నతో లభిస్తుంది. ప్రతిరోజూ జగన్మాత ఆరాధన చేసినా, శర దృతువులో ఆశ్వయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు అనగా నవమి వరకూ తల్లి ఆరాధనకు శ్రేష్టమని విశేష ఫలితాన్నిస్తుందని పురాణములు, ఉపనిష త్తులు పేర్కొన్నాయి. నవాహ్నిక దీక్షగా (తొమ్మిది రోజులు) వ్రతాన్ని ఆచరించి, మనలో ఉన్న పశు రాక్షసత్వాన్ని పార ద్రోలి, నరుడు నరోత్తముడవుతాడు. పదవరోజు విజయదశమి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవా నికి మకుటాయమానమైన పండుగ, విజయదశమి. నవ రాత్రి పూజకు జయకేతనం విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరీ మాతను విజయదశమి రోజున పూజిస్తారు. "యాదేవీ సర్వభూతేషు, శక్తి రూపేణ సంస్థితా నమ స్తస్యై నమస్తస్యై నమో నమః" అన్నది దేవీ సప్తశతి, శక్తి ఆరాధన ఎందుకు చేయాలి అంటే విశ్వమంతా 'వక్తి'మయం. శక్తిలేనిదే ఏ పనీ చేయలేం. ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే మానవుడు ప్రగతిపథంలో పయని స్తాడు. అంతేకాదు, ఎందరికో ఆదర్శప్రాయుడై వారి జీవితా లలో కూడా వెలుగును నింపే శక్తి వంతుడవుతాడు. దీనితో సమాజ వికాసం కలుగుతుంది. ఇదే దేశాభ్యున్నతికి దోహదం చేస్తుంది. తల్లిగా కరుణించి, లాలించి తండ్రిగా పోషించి, గురు వుగా విజ్ఞానాన్ని అందించి, విశ్వంలోని ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో ఎంత ప్రాధాన్యతనివ్వాలో అన్న విష యాన్ని తెలియజేస్తూ, తప్పుదోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది- జగన్మాత. అందుకే ఆ మహాశక్తిని 'శ్రీమాతా' అన్నారు. జగన్మాత సామ్రాజ్యం- మూడు లోకా లలో వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి 'మహా' రాజ్ఞి'. రాజ లక్షణమైన రాజఠీవి, పరిపాలనకు ఉండవలసిన కాఠిన్యం, మాతృ వాత్సల్యం- ఈ త్రిగుణాలతో సృష్టిస్థితి లయలను త్రిమూర్తులచేత చేయిస్తూ, త్రిమూర్తులకే కాక, చతుర్దశ భువనములకు ప్రభ్వి, సింహాసనేశ్వరి శ్రీ రాజరా జేశ్వరి. 'శ్రీ' అంటే లక్ష్మి, సమస్త లక్ష్మీ సంతతని ప్రసాదించే త్రిజగన్మాత- శ్రీ రాజ రాజేశ్వరి. తల్లి కరుణార్ద్ర నయనాలతో, విశ్వం మేల్కొంటుంది, ప్రపంచం ఉదయిస్తుంది. తల్లి ఆగ్రహిస్తే విశ్వం లయమవుతుంది. విశ్వమహాసామ్రాజ్ఞిగా, తల్లికి అందరూ సమానమే. అయితే ఋజు మార్గంలో విద్యుక్త ధర్మాన్ని నిర్వ ర్తించే వారికి ఆమె చేయూతనిస్తుంది. మండలాధిపతులు, భూమండలాధిపతులు, రాజ్యాధిపతుల అందరూ సామ్రాజ్య పదవీ లబ్ధులు. తన భక్తులకు భాహ్య సామ్రాజ్య పదవికన్న మిన్న అయిన ఆత్మానంద సామ్రాజ్య పదవిని అనుగ్రహించే శ్రీదేవి శ్రీ రాజరాజే శ్వరి, ఇంద్రాది అష్ట దిక్పాలకులు రాజులయితే, వారికి రాజులు సత్వ రజ తమో గుణాతీతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరి చేత సృష్టి, స్థితి లయ కార్యములను గావింపజేసే ప్రభ్వి- శ్రీమాత- శ్రీ మహారాజ్ఞి, సింహసనేశ్వరి, కను కనే శ్రీ రాజరాజేశ్వరి సార్ధక నామధేయురాలైంది. "చితాభస్మాలేపో గరల మశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతి హారీ పశుపతిః కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీఫలమిదమ్" చితాభస్మాన్ని పూసుకొనేవాడు, విషమే ఆహారమయినవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో తల పుట్టె కలవాడు, భూతనాధుడు- పరమశివుడు అయినా ఎల్లలోకాలకు ప్రభువు అయినాడు "ఓ భవుని రాణీ" అని సంభో ధిస్తు అటువంటి జగదీశైక పదవి ఈశ్వరునికి లభించటానికి కారణం- నీ పాణిగ్రహణం పరిపాటే ఫలమేనని, శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య వైభవాన్ని వివరించాడు శ్రీ శంకర భగవత్పాదులు. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు- వీటితో సంపూర్ణ శరణాగతితో భక్తిభా వంతో, తల్లిని స్మరిస్తే, మన యోగక్షేమాల్ని, జగన్మాత చూసుకుంటుంది. ఆ తల్లే శ్రీ రాజరాజేశ్వరి. "పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా పురాణి ధర్మ సంవర్ధని శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి" సర్పభూషణుడైన శివుడు, దేవరాజైన ఇంద్రుడు, జలజభవుడైన బ్రహ్మ, రాక్ష సారులైన దేవతలు- అందరూ జగన్మాత, శ్రీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం ప్రాకులాడతారు. లోకాధిపతులందరూ ఆ జగన్మాత కరుణా కటాక్షము లతోనే శాశ్వత సౌఖ్యాన్ని పొందారని చెప్తూ, అటువంటి శ్రీ మహారాజ్ఞి రాజ్యంలో దుష్టులు అనగా సాధుజనులను నిరాకరించేవారికి ప్రవేశము లేదని, ధర్మవర్తనులకు, త్యాగశీలురకు మాత్రమే- శ్రీ రాజరాజేశ్వరి సామ్రా జ్యంలో స్థానం ఉంటుందని, వారికే ఆ జగన్మాత శాశ్వతానందాన్ని అందిస్తుం దని, తిరువారూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన ధర్మసంవర్ణనీ మాతను సద్గురు త్యాగరాజస్వామి, ఆధ్యమైన ఆది తాళ నిబద్ధనలో, సావేరీ రాగంలో గానం చేశారు. ఇది శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య స్వారాజ్య సిద్ధికి దర్పణం. పరమేశ్వరుణ్ణి రంజింపజేసే పరమేశ్వరి- శ్రీరాజరాజేశ్వరి, ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలని హితవు పలుకుతుంది. శ్రీచక్రం- యంత్రం, శ్రీవిద్య మంత్రం- శ్రీ సహస్రం- తంత్రం- శ్రీచక్రమునందు నవ (తొమ్మిది) ఆవరణ ములుంటాయి. అందులో 'బిందు' రూపంలో మహాచైతన్యంతో వెలిగే, మహోదాత్తశక్తి శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశాల కువలయమే తల్లికి ఆలయం, శ్రీవిద్య, శ్రీచక్ర సంబంధిత విషయాలు గురుముఖతగా తెలిసికోవాలి. అయినా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మనశ రీరమే ఒక శ్రీచక్రం. అందులో నవ ఆవరణలుంటాయి. అవి త్రైలోక్యమోహన చక్రం, సర్వాశాపరిపూర్వక చక్రం, సర్వసంక్షోభణ చక్రం, సర్వసౌభాగ్యదా యక చక్రం, సర్వార్ధసాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, తొమ్మిదవది సర్వానందమయ చక్రం. ముత్తుస్వామి దీక్షి తులవారు నవావరణ కీర్తనలు మనకందించారు. అత్యద్భుతమైన కీర్తనలు. 'శ్రీకమలాంబా జయతి అంబా శ్రీ కమలాంబా జయతి.. సూకరానవాద్యర్చిత మహాత్రిపుర సుందరీం రాజరాజేశ్వరీం సువాసినీం, కర సర్వానందమయ చక్రవాసినీం, చింత్రాయేహం" అని, దేవీ అనుగ్రహసిద్ధుడు, దేవీ ముక్తాహార వరప్రసాది, తొమ్మిదవ ఆవరణానికి మనకిచ్చిన కీర్తన, శ్రీ రాజరాజేశ్వరీ దేవి పూజకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వం, పైకి అనగా సామాన్య దృష్టికి వేరుగా కనపడినా అది ఒకే తత్త్వం, అభిన్న స్వరూపాలు. ఆ రెండు తత్త్వములు వాక్కు అర్ధం లాంటివి. అవి కలిసే ఉంటాయి. ఇదే శివశక్తి సామరస్యం, జీవుడు శివ శక్తుల సంయుక్తోపాసన చేయాలి. ఈ విషయాన్నే 'అంగన సహిత భుజంగ శయన ఎన్నకంగళి గుత్సవవీయో' అనే కీర్తనలో సూచించారు. కర్నాట సంగీతానికి అద్యుడు, వాసుదేవ విఠలుని వాసిగా భజించిన శ్రీపురందరదాసు. ఈ తొమ్మిది రోజులలో (తిథులలో) మహాశక్తిలో, త్రిమూర్తులు అష్టదిక్పా లకులు, సమస్త దేవతలు తమ శక్తుల్ని విలీనం చేస్తారు. ఎందుకంటే, ఏ పురు షుని చేత కాకుండా స్త్రీమూర్తి చేతనే సంహరింపబడేటట్లు, వరములు పొందారు ఆ రాక్షసులు అందరూ. రాక్షసులనందరినీ సంహరించిన తదుపరి, విజయోత్సవంతో, మరల శివశక్తులను ఏకం చేసి అర్ధనారీశ్వర తత్త్వంతో ప్రకృతీ పురుషుల ఏకత్వాన్ని, శివశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజున సాయంత్రం సంధ్యాసమయంలో, శమీవృక్షం (జమ్మిచెట్టు) దగ్గర సంయుక్తో పాసన, ఏకేశ్వరోపాసన చేస్తారు. చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో కలశస్థా పన చేసి, పాడ్యమి తిథి నుంచి జగన్మాత శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించి మరల చంద్ర నక్షత్రమున శ్రవణా నక్షత్రంలో కలశోద్వాసనతో, శమీపూజ ఏకేశ్వరోపాసనతో కలశోద్వాసనతో శరన్నవరాత్రి పూజను విజయ దశమితో ముగిస్తారు. "శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాసిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినీ" అన్న శ్లోకాన్ని పఠిస్తూ శమీవృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. శమీ (జమ్మి) ఆకుల్ని ఒకరికొకరు యిచ్చుకుంటారు. ఈ ఆశ్వయుజ దశమి నుండి, మరలా వచ్చే సంవత్సరం ఆశ్వయుజ దశమి వరకు, విజయాన్ని చేకూర్చి కాపాడమని, శమీ వృక్షాన్ని ప్రార్థిస్తూ, శివశక్తుల సంయుక్తోపాసనగా దర్శి స్తారు. ఈనాటికి ఆ జమ్మిచెట్టు, బ్రాహ్మణ వీధిలో విజయవాడలో ఉన్నది. అక్కడే సంయుక్తోపాసన- శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు చేస్తారు. దీనికి గొప్ప స్థల పురాణం కూడా ఉన్నది. "శ్రీ రాజరాజేశ్వరి, త్రిపురసుందరి శివే పాహిమాం, వందే పూర్ణచంద్రికా శీతలే విమలే"- పూర్ణచంద్రునివలె చల్లనైన తల్లీ అంటూ, పూర్ణచంద్రికారా గంలో, ముత్తుస్వామి దీక్షితులు కీర్తించిన ఈ కీర్తన- చంద్ర నక్షత్రమయిన శ్రవణా నక్షత్రంలో వచ్చే విజయదశమి పండుగకు, శ్రీ రాజరాజేశ్వరీ పూజకు, సంపూర్ణ దీప్తినిస్తుంది. "శంకరి శంకరి కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి పరాత్పరి గౌరి అంబి.. పరమ పావని, భవాని సదాశివ కుటుంబిని.." అని శివశక్తి సామరస్యాన్ని, కల్యాణి లయబ్రహ్మ, కామాక్షి వరప్రసాదుడు- శ్యామశాస్త్రి, మనకందించిన కీర్తన, విజయదశమి రోజున అర్చనలందుకొన్న శ్రీ రాజరాజేశ్వరీ తత్త్వానికి స్ఫూర్తినిస్తుంది. ఆధునిక విజ్ఞాన సముపార్జన, వికాసము- విశ్వమానవ కల్యా ణానికి ఉపకరించాలని, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరీ పూజ, విజ యదశమి రోజున, విజయోస్తు అని చెప్తూ, విశదపరుస్తోంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
PSV APPARAO
768 views
6 months ago
#విజయ దశమి/దసరా (దశరా)/బన్ని (శమీ) చెట్టు/శమీ (జమ్మి) చెట్టు పూజ/పాలపిట్ట దర్శనం 🙏🔱🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత 🪔 *శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి* 🪔 మనస్సుకు అధిపతి చంద్రుడు'. చంద్రుడు వెన్నెలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం, చంద్రుడంటే 'తల్లి'. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చల మైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగ లుగుతాం. చంద్రాను -గ్రహం, తల్లి ఆరాధ నతో లభిస్తుంది. ప్రతిరోజూ జగన్మాత ఆరాధన చేసినా, శర దృతువులో ఆశ్వయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు అనగా నవమి వరకూ తల్లి ఆరాధనకు శ్రేష్టమని విశేష ఫలితాన్నిస్తుందని పురాణములు, ఉపనిష త్తులు పేర్కొన్నాయి. నవాహ్నిక దీక్షగా (తొమ్మిది రోజులు) వ్రతాన్ని ఆచరించి, మనలో ఉన్న పశు రాక్షసత్వాన్ని పార ద్రోలి, నరుడు నరోత్తముడవుతాడు. పదవరోజు విజయదశమి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవా నికి మకుటాయమానమైన పండుగ, విజయదశమి. నవ రాత్రి పూజకు జయకేతనం విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరీ మాతను విజయదశమి రోజున పూజిస్తారు. "యాదేవీ సర్వభూతేషు, శక్తి రూపేణ సంస్థితా నమ స్తస్యై నమస్తస్యై నమో నమః" అన్నది దేవీ సప్తశతి, శక్తి ఆరాధన ఎందుకు చేయాలి అంటే విశ్వమంతా 'వక్తి'మయం. శక్తిలేనిదే ఏ పనీ చేయలేం. ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే మానవుడు ప్రగతిపథంలో పయని స్తాడు. అంతేకాదు, ఎందరికో ఆదర్శప్రాయుడై వారి జీవితా లలో కూడా వెలుగును నింపే శక్తి వంతుడవుతాడు. దీనితో సమాజ వికాసం కలుగుతుంది. ఇదే దేశాభ్యున్నతికి దోహదం చేస్తుంది. తల్లిగా కరుణించి, లాలించి తండ్రిగా పోషించి, గురు వుగా విజ్ఞానాన్ని అందించి, విశ్వంలోని ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో ఎంత ప్రాధాన్యతనివ్వాలో అన్న విష యాన్ని తెలియజేస్తూ, తప్పుదోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది- జగన్మాత. అందుకే ఆ మహాశక్తిని 'శ్రీమాతా' అన్నారు. జగన్మాత సామ్రాజ్యం- మూడు లోకా లలో వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి 'మహా' రాజ్ఞి'. రాజ లక్షణమైన రాజఠీవి, పరిపాలనకు ఉండవలసిన కాఠిన్యం, మాతృ వాత్సల్యం- ఈ త్రిగుణాలతో సృష్టిస్థితి లయలను త్రిమూర్తులచేత చేయిస్తూ, త్రిమూర్తులకే కాక, చతుర్దశ భువనములకు ప్రభ్వి, సింహాసనేశ్వరి శ్రీ రాజరా జేశ్వరి. 'శ్రీ' అంటే లక్ష్మి, సమస్త లక్ష్మీ సంతతని ప్రసాదించే త్రిజగన్మాత- శ్రీ రాజ రాజేశ్వరి. తల్లి కరుణార్ద్ర నయనాలతో, విశ్వం మేల్కొంటుంది, ప్రపంచం ఉదయిస్తుంది. తల్లి ఆగ్రహిస్తే విశ్వం లయమవుతుంది. విశ్వమహాసామ్రాజ్ఞిగా, తల్లికి అందరూ సమానమే. అయితే ఋజు మార్గంలో విద్యుక్త ధర్మాన్ని నిర్వ ర్తించే వారికి ఆమె చేయూతనిస్తుంది. మండలాధిపతులు, భూమండలాధిపతులు, రాజ్యాధిపతుల అందరూ సామ్రాజ్య పదవీ లబ్ధులు. తన భక్తులకు భాహ్య సామ్రాజ్య పదవికన్న మిన్న అయిన ఆత్మానంద సామ్రాజ్య పదవిని అనుగ్రహించే శ్రీదేవి శ్రీ రాజరాజే శ్వరి, ఇంద్రాది అష్ట దిక్పాలకులు రాజులయితే, వారికి రాజులు సత్వ రజ తమో గుణాతీతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరి చేత సృష్టి, స్థితి లయ కార్యములను గావింపజేసే ప్రభ్వి- శ్రీమాత- శ్రీ మహారాజ్ఞి, సింహసనేశ్వరి, కను కనే శ్రీ రాజరాజేశ్వరి సార్ధక నామధేయురాలైంది. "చితాభస్మాలేపో గరల మశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతి హారీ పశుపతిః కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీఫలమిదమ్" చితాభస్మాన్ని పూసుకొనేవాడు, విషమే ఆహారమయినవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో తల పుట్టె కలవాడు, భూతనాధుడు- పరమశివుడు అయినా ఎల్లలోకాలకు ప్రభువు అయినాడు "ఓ భవుని రాణీ" అని సంభో ధిస్తు అటువంటి జగదీశైక పదవి ఈశ్వరునికి లభించటానికి కారణం- నీ పాణిగ్రహణం పరిపాటే ఫలమేనని, శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య వైభవాన్ని వివరించాడు శ్రీ శంకర భగవత్పాదులు. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు- వీటితో సంపూర్ణ శరణాగతితో భక్తిభా వంతో, తల్లిని స్మరిస్తే, మన యోగక్షేమాల్ని, జగన్మాత చూసుకుంటుంది. ఆ తల్లే శ్రీ రాజరాజేశ్వరి. "పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా పురాణి ధర్మ సంవర్ధని శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి" సర్పభూషణుడైన శివుడు, దేవరాజైన ఇంద్రుడు, జలజభవుడైన బ్రహ్మ, రాక్ష సారులైన దేవతలు- అందరూ జగన్మాత, శ్రీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం ప్రాకులాడతారు. లోకాధిపతులందరూ ఆ జగన్మాత కరుణా కటాక్షము లతోనే శాశ్వత సౌఖ్యాన్ని పొందారని చెప్తూ, అటువంటి శ్రీ మహారాజ్ఞి రాజ్యంలో దుష్టులు అనగా సాధుజనులను నిరాకరించేవారికి ప్రవేశము లేదని, ధర్మవర్తనులకు, త్యాగశీలురకు మాత్రమే- శ్రీ రాజరాజేశ్వరి సామ్రా జ్యంలో స్థానం ఉంటుందని, వారికే ఆ జగన్మాత శాశ్వతానందాన్ని అందిస్తుం దని, తిరువారూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన ధర్మసంవర్ణనీ మాతను సద్గురు త్యాగరాజస్వామి, ఆధ్యమైన ఆది తాళ నిబద్ధనలో, సావేరీ రాగంలో గానం చేశారు. ఇది శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య స్వారాజ్య సిద్ధికి దర్పణం. పరమేశ్వరుణ్ణి రంజింపజేసే పరమేశ్వరి- శ్రీరాజరాజేశ్వరి, ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలని హితవు పలుకుతుంది. శ్రీచక్రం- యంత్రం, శ్రీవిద్య మంత్రం- శ్రీ సహస్రం- తంత్రం- శ్రీచక్రమునందు నవ (తొమ్మిది) ఆవరణ ములుంటాయి. అందులో 'బిందు' రూపంలో మహాచైతన్యంతో వెలిగే, మహోదాత్తశక్తి శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశాల కువలయమే తల్లికి ఆలయం, శ్రీవిద్య, శ్రీచక్ర సంబంధిత విషయాలు గురుముఖతగా తెలిసికోవాలి. అయినా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మనశ రీరమే ఒక శ్రీచక్రం. అందులో నవ ఆవరణలుంటాయి. అవి త్రైలోక్యమోహన చక్రం, సర్వాశాపరిపూర్వక చక్రం, సర్వసంక్షోభణ చక్రం, సర్వసౌభాగ్యదా యక చక్రం, సర్వార్ధసాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, తొమ్మిదవది సర్వానందమయ చక్రం. ముత్తుస్వామి దీక్షి తులవారు నవావరణ కీర్తనలు మనకందించారు. అత్యద్భుతమైన కీర్తనలు. 'శ్రీకమలాంబా జయతి అంబా శ్రీ కమలాంబా జయతి.. సూకరానవాద్యర్చిత మహాత్రిపుర సుందరీం రాజరాజేశ్వరీం సువాసినీం, కర సర్వానందమయ చక్రవాసినీం, చింత్రాయేహం" అని, దేవీ అనుగ్రహసిద్ధుడు, దేవీ ముక్తాహార వరప్రసాది, తొమ్మిదవ ఆవరణానికి మనకిచ్చిన కీర్తన, శ్రీ రాజరాజేశ్వరీ దేవి పూజకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వం, పైకి అనగా సామాన్య దృష్టికి వేరుగా కనపడినా అది ఒకే తత్త్వం, అభిన్న స్వరూపాలు. ఆ రెండు తత్త్వములు వాక్కు అర్ధం లాంటివి. అవి కలిసే ఉంటాయి. ఇదే శివశక్తి సామరస్యం, జీవుడు శివ శక్తుల సంయుక్తోపాసన చేయాలి. ఈ విషయాన్నే 'అంగన సహిత భుజంగ శయన ఎన్నకంగళి గుత్సవవీయో' అనే కీర్తనలో సూచించారు. కర్నాట సంగీతానికి అద్యుడు, వాసుదేవ విఠలుని వాసిగా భజించిన శ్రీపురందరదాసు. ఈ తొమ్మిది రోజులలో (తిథులలో) మహాశక్తిలో, త్రిమూర్తులు అష్టదిక్పా లకులు, సమస్త దేవతలు తమ శక్తుల్ని విలీనం చేస్తారు. ఎందుకంటే, ఏ పురు షుని చేత కాకుండా స్త్రీమూర్తి చేతనే సంహరింపబడేటట్లు, వరములు పొందారు ఆ రాక్షసులు అందరూ. రాక్షసులనందరినీ సంహరించిన తదుపరి, విజయోత్సవంతో, మరల శివశక్తులను ఏకం చేసి అర్ధనారీశ్వర తత్త్వంతో ప్రకృతీ పురుషుల ఏకత్వాన్ని, శివశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజున సాయంత్రం సంధ్యాసమయంలో, శమీవృక్షం (జమ్మిచెట్టు) దగ్గర సంయుక్తో పాసన, ఏకేశ్వరోపాసన చేస్తారు. చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో కలశస్థా పన చేసి, పాడ్యమి తిథి నుంచి జగన్మాత శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించి మరల చంద్ర నక్షత్రమున శ్రవణా నక్షత్రంలో కలశోద్వాసనతో, శమీపూజ ఏకేశ్వరోపాసనతో కలశోద్వాసనతో శరన్నవరాత్రి పూజను విజయ దశమితో ముగిస్తారు. "శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాసిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినీ" అన్న శ్లోకాన్ని పఠిస్తూ శమీవృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. శమీ (జమ్మి) ఆకుల్ని ఒకరికొకరు యిచ్చుకుంటారు. ఈ ఆశ్వయుజ దశమి నుండి, మరలా వచ్చే సంవత్సరం ఆశ్వయుజ దశమి వరకు, విజయాన్ని చేకూర్చి కాపాడమని, శమీ వృక్షాన్ని ప్రార్థిస్తూ, శివశక్తుల సంయుక్తోపాసనగా దర్శి స్తారు. ఈనాటికి ఆ జమ్మిచెట్టు, బ్రాహ్మణ వీధిలో విజయవాడలో ఉన్నది. అక్కడే సంయుక్తోపాసన- శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు చేస్తారు. దీనికి గొప్ప స్థల పురాణం కూడా ఉన్నది. "శ్రీ రాజరాజేశ్వరి, త్రిపురసుందరి శివే పాహిమాం, వందే పూర్ణచంద్రికా శీతలే విమలే"- పూర్ణచంద్రునివలె చల్లనైన తల్లీ అంటూ, పూర్ణచంద్రికారా గంలో, ముత్తుస్వామి దీక్షితులు కీర్తించిన ఈ కీర్తన- చంద్ర నక్షత్రమయిన శ్రవణా నక్షత్రంలో వచ్చే విజయదశమి పండుగకు, శ్రీ రాజరాజేశ్వరీ పూజకు, సంపూర్ణ దీప్తినిస్తుంది. "శంకరి శంకరి కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి పరాత్పరి గౌరి అంబి.. పరమ పావని, భవాని సదాశివ కుటుంబిని.." అని శివశక్తి సామరస్యాన్ని, కల్యాణి లయబ్రహ్మ, కామాక్షి వరప్రసాదుడు- శ్యామశాస్త్రి, మనకందించిన కీర్తన, విజయదశమి రోజున అర్చనలందుకొన్న శ్రీ రాజరాజేశ్వరీ తత్త్వానికి స్ఫూర్తినిస్తుంది. ఆధునిక విజ్ఞాన సముపార్జన, వికాసము- విశ్వమానవ కల్యా ణానికి ఉపకరించాలని, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరీ పూజ, విజ యదశమి రోజున, విజయోస్తు అని చెప్తూ, విశదపరుస్తోంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
PSV APPARAO
903 views
6 months ago
#మహిషాసురమర్ధిని స్తోత్రం #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 మహిషాసురమర్దిని స్తోత్రం అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧ || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౨ || అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౩ || అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౪ || అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౫ || అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరే దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౬ || అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౭ || ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగపృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౮ || జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౯ || అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౦ || సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే సితకృత పుల్లిసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౧ || అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే త్రిభువనభూషణభూతకళానిధి రూపపయోనిధి రాజసుతే అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౨ || కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే సకలవిలాస కళానిలయక్రమ కేళిచలత్కల హంసకులే అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౩ || కరమురళీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే మిళిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౪ || కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే ప్రణతసురాసుర మౌళిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౫ || విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౬ || పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౭ || కనకలసత్కల సింధుజలైరను సించినుతేగుణ రంగభువం భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౮ || తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧౯ || అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౨౦ ||
PSV APPARAO
1.9K views
6 months ago
#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత 🔔 *శరణాగతి* 🔔 అమ్మా దుర్గా .. నీ నామమే మంత్రం నీ ధ్యానమే తపం నీ రూపమే సర్వం 🙏 తప్పించుకోలేని ఆపదలు తప్పించి కాచే తల్లి దుర్గవు నీవు 🙏 దాటలేని భవసాగరాలు దాటించు తారకము నీ స్మరణము 🙏 ఓపలేని  సౌఖ్యమిచ్చి తాపత్రయాలు హరించి దరిచేర్చు దయ నీది అపజయమన్న మాట లేక అనుకున్నది సాధింపచేసే అవ్యాజ ప్రేమ నీది 🙏 దుర్లభాలు సులభాలుగా దుర్గమాలు సుగమాలుగా చేయు కరుణ నీది 🙏 సకల జీవ రాశులలో సజీవంగా  వుండు చైతన్యం నీ శక్తి 🙏 చరాచర జగత్తును చిన్న కంటి కదలికలతో నడిపించు పరాక్రమం నీది 🙏 సర్వత్రా వ్యాపించిన నీ విరాట్ రూపమును గుర్తించే  జ్ఞానము ప్రసాదించి తల్లిలా తప్పులు మన్నించి తండ్రిలా ఒప్పులు నేర్పించి తడబడక అడుగులేయించమని పదహారు చేతులతో మము పరిరక్షించమని ప్రార్థిస్తూ. 🙏 https://youtu.be/z9myYa1TQTY 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
1K views
6 months ago
#శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #🔱దుర్గ దేవి🙏 #దుర్గాష్టమి,మహర్నవమి శుభాకాంక్షలు 🔔 *శ్రీ మాత్రే నమః* 🔔 ✨ దుర్గాష్టమి ✨ ఆశ్వయుజ శుక్లపక్షం తొమ్మిది రోజులనూ దసరా లేదా దేవీ నవరాత్రులు అంటారు. చివరి మూడు రోజులు ప్రత్యేకంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి అమ్మవారి కృపను పొందుతారు. పురాణాల్లో రాజులు దేవి మహిషాసురమర్దనిగా విజయం సాధించిన స్ఫూర్తితో ఈ రోజునే దండయాత్రలు ప్రారంభించేవారని చెప్పబడింది. దుర్గాష్టమి నాడు అమ్మవారు లోహుడు అనే రాక్షసుని సంహరించగా లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అని చెబుతారు. “దుర్గ” అంటే – దుర్గతులను తొలగించేది. ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. ‘గ’ అంటే వాటిని నశింపచేసేది. అందుకే ఈరోజు దుర్గాసహస్రనామ పారాయణం, “దుం” బీజాక్షరంతో అమ్మవారి పూజ ప్రత్యేకం. ఈసారి దుర్గాష్టమి మంగళవారంతో కలవడంతో మరింత శ్రేష్టత ఉంది. 🌺🌺🌺 ✨ మహర్నవమి ✨ నవరాత్రి దీక్షలో అత్యంత ముఖ్యమైన రోజు. ‘సిద్ధిదా’ అనే పేరుగల ఈ నవమి మంత్రసిద్ధిని ప్రసాదిస్తుంది. జపసంఖ్య పూర్తిచేసిన ఉపాసకులు ఈరోజు హోమాలు చేసి వ్రతాన్ని సమాప్తి చేస్తారు. క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు ఆయుధపూజలు చేసి, తల్లి కృపను పొందుతారు. భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చిన పవిత్రమైన ఘట్టం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెబుతాయి. 🌸🌸🌸 ✨ విజయదశమి ✨ పాలసముద్ర మథనంలో అమృతం వెలిసిన శుభముహూర్తం ఈ విజయదశమి రోజే. శ్రవణా నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ శుక్ల దశమి “విజయదశమి”. ఈరోజు ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయవంతమవుతుంది అని చతుర్వర్గ చింతామణి గ్రంథం తెలిపింది. శమీపూజ ఈరోజు ప్రత్యేకం. జమ్మిచెట్టు (శమీవృక్షం) పాండవులకు అపరాజితా దేవి రూపంలో విజయాన్ని ఇచ్చింది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి రావణాసురునిపై విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసే ఆచారం కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ క్రింది శ్లోకాన్ని స్మరించడం శ్రేయస్కరం: 🌿శ్లోకము🌿 శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || శ్లోకం వ్రాసిన చీటీని చెట్టు కొమ్మకు కట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది శనిదోష నివారణకు కూడా ప్రయోజనం ఇస్తుందని విశ్వాసం. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
1.6K views
6 months ago
#దేవి శరన్నవరాత్రులు 🔱 దేవి త్రిరాత్ర వ్రతం 🔱 త్రిరాత్ర వ్రత దీక్ష 🔱 బొమ్మల కొలువు 🙏 #దేవి త్రిరాత్ర వ్రతం #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) 🔔 *శ్రీ మాత్రే నమః* 🔔 🙏 ఈ రోజు నుండి మూడు రోజులు “దేవి త్రిరాత్ర వ్రతం” ప్రారంభం 🙏 ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ? అమ్మ దయతోనే సర్వ జగత్తు నడుస్తోంది. ఆమె కరుణ సముద్రం… అమృత హృదయం… ఆ తల్లి చల్లని చూపుల కోసం అఖిలాండాలు ఎదురుచూస్తుంటాయి. అందుకే — తిథి, వారం, నక్షత్రాలు లేకపోయినా, ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తల్లిని ఆరాధించినవారికి కోటిజన్మల పాపరాశి భస్మమవుతుంది. తీరని పుణ్యరాశి లభిస్తుంది అని దేవీభాగవతం చెబుతోంది. ఈ వ్రతరాజమే దుర్గాదేవి వ్రతం లేదా కుమారి పూజ. మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని, రాత్రివేళ తల్లిని ఆరాధించడం సంప్రదాయం. అందుకే వీటిని “శరన్నవ రాత్రులు” అని పిలుస్తారు. 🌸 దేవి తొమ్మిది రూపాలు 🌸 మూడు కన్నులు, పదహారు చేతులతో షోడశభుజ దుర్గాదేవి మహిషిపై సవారై బంగారు వర్ణంతో వనదుర్గాదేవి రుద్రాంశంతో సింహవాహనంపై రుద్రాంశ దుర్గాదేవి శూలిని దుర్గాదేవి – మణిమయ భూషణాలతో అలంకారముగా అష్టభుజ, అగ్ని వర్ణంతో అగ్నిదుర్గాదేవి జయదుర్గాదేవి – సింహవాహనంతో విజయప్రదంగా వింధ్యావాసిని దుర్గాదేవి – బంగారు పద్మంపై ఆశీనురాలు రిపుమారిణి దుర్గాదేవి – ఎర్రవర్ణ భయంకర స్వరూపిణి విష్ణు దుర్గాదేవి – చక్రశంఖాల ధారిణి, అభయముద్రలతో ప్రసన్నముగా ఈ తొమ్మిది రూపాలను ఆరాధించినవారికి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ✨ త్రిరాత్ర వ్రతదీక్ష ✨ తొమ్మిది రోజులు వ్రతం పాటించలేనివారు కేవలం సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష తీసుకుంటారు. దీనినే త్రిరాత్ర వ్రతదీక్ష అంటారు. కొంతమంది వ్రతంలో భాగంగా బొమ్మల కొలువు పెట్టి, పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్లు పంచుతారు. ముతైదువులకు పసుపు-కుంకుమ, తాంబూలాలు ఇస్తారు. అలాగే కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, సుమంగళి వ్రతాలు అన్నీ ఈ ఉత్సవాల్లో భాగమై కనులపండువ చేస్తాయి. 🌺 దుర్గాష్టమి – మహాష్టమి 🌺 అష్టమి తిథి మొత్తం ఉంటే దానిని దుర్గాష్టమి. అష్టమి ముగిసి, అదే రోజున నవమి వస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ రోజు తల్లిని సహస్రనామాలతో, కుంకుమార్చనలతో ఆరాధిస్తే సత్సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే లలితా సహస్రనామం పఠిస్తే, ఎలాంటి భయాలు దగ్గరపడవు. 🔥 మహానవమి – సిద్ధిదా 🔥 మహానవమి నాడు మంత్రసిద్ధి జరుగుతుంది. దీనినే సిద్ధిదా అంటారు. ప్రాచీన కాలంలో రాజులు ఈ రోజున ఆయుధపూజ చేసుకుని జైత్రయాత్రలకు బయలుదేరేవారు. అలవాటుగా ఈ ఆచారం ఇప్పటికీ వాహనపూజ రూపంలో కొనసాగుతోంది. 🌿 విజయదశమి – శమీ పూజ 🌿 దశమి నాడు శమీ పూజ (జమ్మిచెట్టు పూజ) చేస్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ ఆయుధాలు జమ్మిచెట్టు తొర్రలో దాచారని ప్రచారం ఉంది. ఆ రోజు ఆయుధాలు, వాహనాలు, యంత్రాలను అమ్మకు అర్పించి పూజిస్తే శత్రు పీడ తొలగిపోతుంది, విజయం లభిస్తుంది. ఈ విధంగా త్రిరాత్ర వ్రతదీక్ష ఆచరించిన వారికి సర్వ కోరికలు సిద్ధించి, సుఖసమృద్ధులు కలుగుతాయి 🙏. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
789 views
6 months ago
#శ్రీ సరస్వతి దేవి అలంకరణ #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) ఈరోజు ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకరణ........ సరస్వతీ దేవి చరిత్ర....... చదువుల తల్లి దేవనాగరి: సరస్వతీ తెలుగు: సరస్వతీ దేవి వాహనం: హంస , నెమలి హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి , సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ. వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. *“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల* *కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”* నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”. పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు..... పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి.... ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః (10) ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతక నాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః (20) ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః (30) ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖావిభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకార భూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః (40) ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగదాయై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యావాసాయై నమః (50) ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సువీణాయై నమః (60) ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మజాయాయై నమః ఓం విశాలాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం శుభదాయై నమః (70) ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసుర నమస్కృతాయై నమః ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః (80) ఓం నిరంజనాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః (90) ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం రక్త మధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100) ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108) ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తం. #namashivaya777
PSV APPARAO
775 views
6 months ago
#కాళరాత్రి - అమ్మవారి ఏడవ అవతారం #శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 దేవి నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి (శ్రీ మహాచండి దేవి )( 28.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ కాళరాత్రి ( శ్రీ మహాచండి దేవి) శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || నైవేద్యం : 1.కూరగాయలతో వండిన అన్నాన్ని ( కదంబం ప్రసాదం ) 2. రవ్వ కేసరి !! కావలసినవి !! కందిపప్పు 1/2 కప్ బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ) 1 వంకాయ 1/4 సొర్రకాయ 1 దోసకాయ బీన్స్ తగినన్ని 1 పోటాటో వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టోమాటో తగినంత కరివేపాకు కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప 4 పచ్చి మిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గొజ్జు తగినంత కాస్త బెల్లం ( జాగిరి ) ఉప్పు , పసుపు తగినంత 3 చెంచాలు సాంబర్ పౌడర్ పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ . ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ , (టోమాటో తప్ప ) అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్లో వేసి,కొత్తిమీర ,కరివేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా శ్రీ మహాచండి దేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. మహాచండీ అవతారం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం, ఇది విశ్వానికి తల్లిగా, అసుర శక్తుల నుండి రక్షించే దేవతగా భావించబడుతుంది. ఈ అవతారంలో, అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మహాచండీని పూజించడం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని నమ్మకం. ఈ అవతారం నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా ప్రముఖంగా పూజించబడుతుంది. విశిష్టతలు శక్తి స్వరూపిణి: మహాచండీ త్రిశక్తి స్వరూపిణి. ఆమెను ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. రక్షకురాలు: భూమిపై ఉన్న తన బిడ్డలను దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ఆమె తనలోని దైవిక శక్తులను కలిగి ఉంటుంది. శత్రు సంహారిణి: రాక్షసులను సంహరించి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపంలో అమ్మవారు వ్యక్తమవుతుంది. సింహ వాహనం: సింహాన్ని తన వాహనంగా చేసుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎప్పుడు ఆరాధిస్తారు? శరన్నవరాత్రులు మరియు దుర్గాపూజ సమయంలో మహాచండీ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది నవరాత్రులలో ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ప్రాముఖ్యత మహాచండీ అవతారాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. #namashivaya777
PSV APPARAO
697 views
6 months ago
#శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 దేవి నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి (శ్రీ మహాచండి దేవి )( 28.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ కాళరాత్రి ( శ్రీ మహాచండి దేవి) శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || నైవేద్యం : 1.కూరగాయలతో వండిన అన్నాన్ని ( కదంబం ప్రసాదం ) 2. రవ్వ కేసరి !! కావలసినవి !! కందిపప్పు 1/2 కప్ బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ) 1 వంకాయ 1/4 సొర్రకాయ 1 దోసకాయ బీన్స్ తగినన్ని 1 పోటాటో వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టోమాటో తగినంత కరివేపాకు కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప 4 పచ్చి మిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గొజ్జు తగినంత కాస్త బెల్లం ( జాగిరి ) ఉప్పు , పసుపు తగినంత 3 చెంచాలు సాంబర్ పౌడర్ పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ . ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ , (టోమాటో తప్ప ) అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్లో వేసి,కొత్తిమీర ,కరివేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా శ్రీ మహాచండి దేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. మహాచండీ అవతారం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం, ఇది విశ్వానికి తల్లిగా, అసుర శక్తుల నుండి రక్షించే దేవతగా భావించబడుతుంది. ఈ అవతారంలో, అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మహాచండీని పూజించడం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని నమ్మకం. ఈ అవతారం నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా ప్రముఖంగా పూజించబడుతుంది. విశిష్టతలు శక్తి స్వరూపిణి: మహాచండీ త్రిశక్తి స్వరూపిణి. ఆమెను ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. రక్షకురాలు: భూమిపై ఉన్న తన బిడ్డలను దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ఆమె తనలోని దైవిక శక్తులను కలిగి ఉంటుంది. శత్రు సంహారిణి: రాక్షసులను సంహరించి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపంలో అమ్మవారు వ్యక్తమవుతుంది. సింహ వాహనం: సింహాన్ని తన వాహనంగా చేసుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎప్పుడు ఆరాధిస్తారు? శరన్నవరాత్రులు మరియు దుర్గాపూజ సమయంలో మహాచండీ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది నవరాత్రులలో ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ప్రాముఖ్యత మహాచండీ అవతారాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. #namashivaya777
PSV APPARAO
666 views
6 months ago
#శ్రీ మహా చండి దేవి #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) చండీ దేవి పూజ ఎలా చేయాలి? చండీ హోమం (హవనము) దుర్గా సప్తశతిలోని శ్లోకాలను పఠించి, యజ్ఞయాగాగ్నిలో హోమాలు సమర్పించడం ద్వారా చండీ హోమం నిర్వహిస్తారు. దీనితో పాటు నవాక్షరి మంత్రం కూడా ఉంటుంది. కుమారి పూజ & సువాసిని పూజ కూడా ఈ ఆచారంలో ఒక భాగం. #namashivaya777