మహానుభావులు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
690 views
1 months ago
ఆయనను అందరూ "అప్పా" అని పిలుస్తారు. ఆయన అసలు పేరు? KP రామస్వామి. కోయంబత్తూరులోని KPR మిల్లుల యజమాని. వృత్తిరీత్యా వస్త్ర పరిశ్రమ దిగ్గజం. కానీ, ఆయన ఎంచుకున్నది మాత్రం తండ్రి పాత్ర. కార్పొరేట్ పెద్దలు ఉద్యోగుల శ్రమను దోచుకొంటారు, ఖర్చు తగ్గించుకొంటారు, లాభాల గురించి మాత్రమే చూలుకొంటారు అని అనుకొంటాం. ఈ వ్యక్తి మాత్రం జీవితాలను మార్చడంలో నిమగ్నమయ్యారు. ఎలాగంటారా? మిల్లు కార్మికులను గ్రాడ్యుయేట్లుగా మార్చడం ద్వారా. విద్యను వారి మెరుగైన జీవితానికి పునాదిగా మార్చడం ద్వారా. ఇదంతా ఒక చిన్న అభ్యర్థనతో మొదలైంది. ఒకసారి ఆయన మిల్లులోని ఒక యువతి "అప్పా (అంటే నాన్న), నాకు చదువంటే ఇష్టం. కానీ పేదరికం కారణంగా నా తల్లిదండ్రులు నన్ను పాఠశాల నుండి మాన్పించి ఇక్కడికి పంపారు. కానీ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను." అని చెప్పింది. ఆ పిలుపు, ఆ ఒక్క వాక్యం ఆయన్ని మార్చేసింది. తన కార్మికులకు కేవలం జీతం ఇవ్వడంతో పాటు, వారికి భవిష్యత్తును ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. మిల్లు లోపలే పూర్తి స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 8 గంటల షిఫ్ట్ తర్వాత 4 గంటల తరగతులు. తరగతి గదులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, యోగా కోర్సు కూడా. అన్నిటికీ పూర్తిగా నిధులు సమకూర్చబడ్డాయి. ఎలాంటి షరతులు లేవు. మరి ఫలితం? 24,536 మంది మహిళలు 10వ, 12వ, UG మరియు PG డిగ్రీలు పొందారు. చాలా మంది ఇప్పుడు నర్సులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులుగా ఉన్నారు. ఈ సంవత్సరం తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుండి 20 మంది గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఒక వ్యాపారవేత్త ఉద్యోగుల నిష్క్రమణ గురించి ఆందోళన చెందుతారని మీరు ఊహించవచ్చు. ఈ మహిళలు వెళ్లిపోతే ఏమిటి? కార్మికులు తరచూ మిల్లు వీడి వెళ్లిపోతే ఎలా అని. KP రామస్వామి గారు ఏమి చెబుతారంటే.. "నేను వారి సామర్థ్యాన్ని వృథా చేస్తూ మిల్లులోనే ఉంచాలనుకోవడం లేదు. వారు ఇక్కడకు ఎంచుకుని రాలేదు, పేదరికం కారణంగా వచ్చారు. వారికి భవిష్యత్తును ఇవ్వడం నా పని, ఇది పంజరం కాదు అని. ఆయన ఖచ్చితంగా అదే చేస్తున్నారు.... వారు వెళ్లిపోతారు. కెరీర్లు నిర్మించుకుంటారు. ఆ తర్వాత? వారి గ్రామాల నుండి మరింతమంది అమ్మాయిలను మిల్లుకు పంపుతారు. ఈ చక్రం కొనసాగుతుంది. ఇది కేవలం CSR కార్యక్రమం కాదు. ఇది నిజమైన అర్థంలో మానవ వనరుల అభివృద్ధి. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో 350 మంది మహిళలు తమ డిగ్రీలు అందుకున్నారు. KP రామస్వామి గారు ఒక అసాధారణ అభ్యర్థన చేశారు. మీరు లేదా మీ స్నేహితులు వారిని నియమించుకోగలిగితే, ఇతర అమ్మాయిలకు మరింత చదువుకోవడానికి ఆశ కలుగుతుంది అని. ఒకసారి ఆలోచించండి. కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఒక వ్యక్తి వ్యాపారం గురించి అడగడం లేదు. తన కార్మికుల కోసం ఉద్యోగాలు అడుగుతున్నారు. ఇలాంటివి మనం చాలా అరుదుగా చూస్తాము. ఈ కథ కేవలం KPR మిల్లుల గురించి మాత్రమే కాదు. ఇది నాయకత్వం, కార్పొరేట్ నీతి, దేశ నిర్మాణంలో ఒక పాఠం. #💗నా మనస్సు లోని మాట #motivational #మహానుభావులు #mahanubhavulu #endharo mahanubhavulu
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
901 views
2 months ago
పద్మశ్రీ మంగళా కపూర్. "మీరు నా ముఖాన్ని, నా శరీరాన్ని కాల్చవచ్చు. నన్ను బాధపెట్టవచ్చు. కానీ మీరు నా ధైర్యాన్ని నా నుండి తీసివేయలేరు. నా స్వంత బలం ధైర్యం మీకు భయంగా మరియు నా విజయానికి మార్గంగా మారుతుంది." ఇదే ఆత్మ విశ్వాసంతో ఇదే అభిరుచితో, యాసిడ్‌తో ముఖం కాలిపోయిన కాశీకి చెందిన 12 ఏళ్ల బాలిక ముందుకు సాగింది. ఆమె తన ముఖానికి 37 కి పైగా ఆపరేషన్లు చేయించుకోవలసి వచ్చింది. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రజలు ఆమెను 'నక్కి' లాగా ఎగతాళి చేసేవారు. చుట్టూ జనం ఉన్నారు, కానీ ఆమె లోపల నుండి వచ్చే అరుపులు వినడానికి ఎవరూ రాలేరు. నేడు, అదే చిన్న అమ్మాయి చాలా మంది మహిళలకు ప్రేరణగా మారింది. విధి ఆమె ముందు ఒక భయంకరమైన పరీక్ష పెట్టింది. ఒక వైపు శరీరంపై గాయాలు… జీవితంపై సందేహాలు… కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ప్రశ్న..! “ఇంతటితో నా కథ ఆగిపోవాలా?” అక్కడే పుట్టింది ఓ అసాధారణ సంకల్పం. ఆ బాధను సంగీతంగా మార్చుకున్న మహిళే ప్రొఫెసర్ మంగళ కపూర్ గారు. యాసిడ్‌ అటాక్‌ లాంటి దుర్ఘటనను జయించి, భారత శాస్త్రీయ సంగీతంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తరతరాల విద్యార్థులకు సంగీతాన్ని మాత్రమే కాదు, జీవితం ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించారు. నేడు 2026లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అది కేవలం గౌరవం కాదు… ఓ మహిళ ధైర్యానికి, ఓ జీవన పోరాటానికి దక్కిన జాతీయ వందనం. అందంగా ఉండటమే కాదు… ధైర్యంగా నిలబడగలగటమే నిజమైన అందం. మంగళ కపూర్ గారు బాధను బలంగా మార్చుకున్న సజీవ ఉక్కు మహిళ. వీరిని ఎంత అభినందించినా తక్కువే.🙏🇮🇳💐💐👏👏 #endharo mahanubhavulu #mahanubhavulu #మహానుభావులు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
634 views
2 months ago
మా ఇంట్లో ఏసీ ఉండదు... అరట్టై శ్రీధర్‌ వేంబు ఆయన సంపద రూ.50 వేల కోట్ల రూపాయలు గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌... నిత్యం ఈ టెక్‌ దిగ్గజాలతో పోటీపడుతుంటారు శ్రీధర్‌ వేంబు. తాజాగా ‘అరట్టై’తో వాట్సాప్‌కీ సవాలు విసిరి... ‘మెటా’తోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు! ఆయన సంపద కూడా ఆ స్థాయిలోనే ఉంది... రూ.50 వేల కోట్ల రూపాయలు మరి! ఈ విజయాలన్నింటినీ తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూరిలో ఉంటూనే సాధిస్తున్నారాయన. మన దేశంలో సరికొత్త ఐటీ విప్లవానికి నాంది పలికిన శ్రీధర్‌ వేంబుతో చేసిన అరట్టై(పిచ్చాపాటి)లోని కొన్ని విశేషాలివి... *పల్లెలంటే ప్రాణం!* మా నాన్నావాళ్లది తంజావూరులోని ఒళిగచ్చేరి అనే కుగ్రామం. కావేరి ఉపనది కొల్లిడం ప్రవహించే పల్లెకాబట్టి... పచ్చదనంతో నిండి ఉండేది. నాకు ఎప్పుడు సెలవులొచ్చినా ఈ ఊరికి వచ్చేసేవాణ్ణి. సెలవులు అయిపోయాక తిరిగి వెనక్కి వెళ్ళనని మొండికేసేవాణ్ణి. ఏడ్చి గీపెడుతున్న నన్ను బలవంతంగా తీసుకొచ్చి బస్సెక్కించేవారు. ఆ ఊరి గుర్తుగా ఏ రాయో రప్పో తెచ్చుకుని... దాచుకునేవాణ్ణి. ఆ ఊరిపైన నాకున్న మమకారమే జోహో కంపెనీని గ్రామీణ ప్రాంతాలకి తెచ్చేలా చేసింది! *మూడున్నరవేల రూపాయలతోనే…* మా నాన్న సాంబమూర్తి వేంబు మద్రాసు హైకోర్టులో స్టెనోగా చేసేవారు. అప్పట్లో ఆయన జీతం రూ.3500! ఆ అత్తెసరు ఆదాయంతోనే మా అమ్మ కన్మణి మమ్మల్నందర్నీ పెంచింది. నేను చిన్నప్పటి నుంచీ స్కాలర్‌షిప్‌లతోనే చదువుకున్నాను. చిన్నప్పుడు అమ్మ నేర్పిన పొదుపు, నిరాడంబర జీవనం నా జీవిత విధానంగా మారిపోయాయి. *ఓనమాలు దిద్దాను…* ఐఐటీ-మద్రాసులో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాక... అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ముగించాను. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం... బంగ్లా కూడా ఇచ్చారు. అక్కడితో మా కుటుంబ కష్టాలన్నీ తీరిపోయేవే కానీ... నాకు అధ్యాపకవృత్తి సరిపోదనిపించింది. బయటకొచ్చేశాను. నాకే మాత్రం అర్థంకాని సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. క్వాల్‌కమ్‌ సంస్థలో ఉద్యోగినయ్యాను. చిన్నకంపెనీల అవసరాలని తీర్చే సాఫ్ట్‌వేర్‌లని అందించాలని... ‘అడ్వెంట్‌ నెట్‌ కంపెనీ’ని ప్రారంభించాను. *పేరులో ఏముంది..?* మా సంస్థ లక్ష్యం చిన్న కంపెనీలే కాబట్టి ‘అడ్వెంట్‌ నెట్‌’ అన్న పేరుని... స్మాల్‌ ఆఫీస్‌ హోమ్‌ ఆఫీస్‌(సోహో) అని మార్చుకున్నాం. విభిన్నంగా ఉండాలని ‘ఎస్‌’ని కాస్తా జెడ్‌గా మార్చి ‘జోహో’గా చేశాం! *వాడి కోసం…* మా అబ్బాయి పేరు సిద్ధు. వాడికి రెండేళ్లు ఉన్నప్పుడు ఆటిజం ఉందని తెలిసింది. దాంతో నేనూ నా భార్య ప్రమీల తీవ్ర మానసిక క్షోభని అనుభవించాం. చిన్నప్పుడు నేను చూసిన పల్లెటూరి వాతావరణం వాడికి మేలు చేస్తుందని బలంగా నమ్మాను. నేను గ్రామీణ ప్రాంతాల్లోనే జీవించాలని నిర్ణయించుకోడానికి అదీ ఓ కారణమని చెప్పాలి! *పల్లెటూరి సత్తా అది!* మనం వాడుతున్న చాటింగ్, ఈమెయిల్‌ ఆప్‌లు అమెరికావి! నాకో దశలో... మన డేటా అంతటినీ వాళ్లు మనకి వ్యతిరేకంగా వాడితే ఎలా అన్న భయం కలిగింది. అందుకే మనదైన ఈమెయిల్‌ రూపొందించాలని... జోహోమెయిల్‌ని ప్రారంభించాను. ‘వాట్సాప్‌’కి ప్రత్యామ్నాయంగా అచ్చమైన తమిళపదంతో ‘అరట్టై’ని మొదలుపెట్టాను. మన పల్లెటూరి యువతే వీటికోసం పనిచేశారు. ఎనిమిదేళ్ల తర్వాత... వాటికి ఇప్పుడు లక్షల డౌన్‌లోడ్‌లు వస్తుండటం చూస్తే ఆనందంగా ఉంది! *ఫోర్క్‌లు ఎందుకు?* చెన్నైలో ఆఫీసు పెట్టిన కొత్తల్లో అక్కడున్న ఎగ్జిక్యూటివ్‌లూ ఉద్యోగులూ ఫోర్క్‌తో తినకపోతే చిన్నచూపు చూసేవాళ్లు. మన పద్ధతుల్ని కించపరచడం నాకు నచ్చలేదు. అందుకే, గ్రామీణ ప్రాంతాల్లో... పల్లెటూరి యువతతోనే సంస్థను నడిపి విజయం సాధించాలనుకున్నాను. ‘స్పోక్స్‌ అండ్‌ హబ్‌’ పేరుతో పల్లెటూళ్ళలో కంపెనీ శాఖల్ని ఏర్పాటుచేశాను. మొదట తమిళనాడు తెన్కాశిలోని మత్తలంపాళయానికి దగ్గర్లో ఉన్న సిల్లరైపురవు అనే ఊళ్లో ఆఫీసును ప్రారంభించి... నేనూ అక్కడే ఉండిపోయాను. *చాపమీదే…* తెన్కాశికి దగ్గర్లో చిన్న ఇంట్లోనే ఉంటాను. చాపమీదే పడుకుంటాను. మా ఇంట్లో ఫ్యాన్‌ తప్ప ఏసీ ఉండదు. తెల్లవారుజామున నాలుగింటికే నిద్రలేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడాక... సైకిల్‌ మీద పొలానికి వెళ్లి పనుల్ని చూస్తుంటాను. ఊళ్లోని పిల్లలతో కలిసి చెరువులో ఈత కొడతాను. పనిమీద తెన్కాశి పట్టణానికి వెళ్లాలంటే నేనే ఎలక్ట్రిక్‌ ఆటో నడుపుకుంటూ వెళతాను. You are inspiration to many of us Sir 🫡🫡 How Simple You, Your lifestyle and Your Working style.......How grounded your thoughts are..... Loving your roots and living to the core.....is really really Appreciable......Your love towards your native place & Your Motherland is sooo impressive..... Shine on Sir......Make Our people also shine also...... Congratulations 🎉 🎉 🎉 🎉 🎉 🎉 Sir.....& salute 🫡 🫡 🫡 To your Contribution to our people.. #తెలుసుకుందాం #simplycity #endharo mahanubhavulu #mahanubhavulu #మహానుభావులు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.3K views
3 months ago
సాక్షాత్ ఆ బాలా త్రిపుర సుందరీ దేవియే బాలగా శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటిలో నడయాడేది. "బాలత్రిపురసుందరి అమ్మవారి గాజులు" శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లోని ఆడవారు ఒకసారి గాజులు కొంటున్నారు. గాజులు అమ్మే అతను అందరికీ గాజులు వేసాడు. అతను వేసిన గాజులకు ఎంతయ్యింది అని శాస్త్రి గారు అడిగితే, 6 మందికి 6 డజన్లు వేసాను. కనుక డజనుకు 12 రూపాయలు చొప్పున 72 రూపాయలు ఇమ్మనాదు గాజులు అమ్మే అతను. మా ఇంట్లో ఉన్నది 5 మంది ఆడవారే కదా! అన్నారు శాస్త్రి. ఇంట్లోని వారు కాదు ఇందాక ఒక చిన్న పిల్ల కూడా గాజులు వేసుకుని లోపలికి వెళ్ళింది కదా అన్నాడతను. అప్పుడు శాస్త్రిగారు పూజ గదికి వెళ్లి చూడగా అక్కడ చిన్న పిల్లలకు సరిపోయే 12 గాజులు ఉన్నాయి. శాస్త్రి గారికి అర్థం అయ్యింది. 6 డజన్లకు డబ్బులు ఇచ్చారు ఇంకొక విషయం తెలుసా అక్కడ ఆ చిత్రంలో కనిపిస్తున్న పసిపాప ఎవరో కాదు సాక్షాత్తుగా ఆ "బాలా" అమ్మవారే . శాస్త్రి గారి ఇంటిని ఫోటో తీస్తుంటే గుమ్మం దగ్గర ఎవరూ లేరు,ఫోటో కడిగి చూస్తే ఈ పాప అందులో కనిపించింది. శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన. వారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట. అది వారి అనుభవం. 🙏🕉️🙏🕉️🙏🕉️🙏 #తెలుసుకుందాం #bhakti #భక్తి #భక్తి #మహానుభావులు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
694 views
4 months ago
క్రింద ఇచ్చిన ఫోటో శ్రీమతి విశాఖ హరి మరియు ఆమె కుమారుడు రాజగోపాల హరి ది. శ్రీమతి విశాఖ హరి CAలో గోల్డ్ మెడలిస్ట్. ఆమె మన సనాతన ధర్మం, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మరియు శాస్త్రాల గురించి చాలా విస్తృతమైన జ్ఞానం సంపాదించారు. ఆమె తన CA గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తో ఏదైనా MNCలో ఉద్యోగంలో చేరి ఉండవచ్చు లేదా ఏ విదేశానికో వెళ్లి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కానీ, ఆమె మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మరియు శాస్త్రాల మీద అభిమానంతో వాటిని ప్రచారం చేయడం కోసం కర్నాటక సంగీత గాయకురాలుగా మరియు హరికథా గాయక విద్వాంసురాలుగా జీవితం గడపడానికి నిర్ణయించుకుంది. ఆమె తన హరి కథలు చాలా వరకు తమిళ భాషలో చెప్తారు. ఇంకో విశేషం ఏమిటంటే శ్రీమతి విశాఖ హరి కుటుంబం వారి ఏకైక కుమారుడు రాజగోపాల్ హరిని కూడా తల్లిని అనుసరించడానికి నిర్ణయం తీసుకుని ఆ దిశగా పిల్లాడిని హరి కథల సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా తీర్చి దిద్దుతున్నారు. హిందువులమైన మనం మన కెరీర్ పై దృష్టి పెట్టకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుందికి భయపడతతాం. అలాగే మన పిల్లల కెరీర్ విషయంలో కూడా. కానీ మనకి కనీసం ఒక బాధ్యత వుంది. ఇటువంటి హిందూ కళలను, హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న కళాకారుల, ధర్మ ప్రవచనకారుల కార్యక్రమాలన్నింటిలో పాల్గొని అటువంటి వారిని ప్రోత్సహించాలి. అలాగే మన పిల్లలకు కూడా ఇటువంటి కళలపై కనీసం హాబీలు గా అయినా ఆసక్తి కలిగేటట్లు ప్రోత్సహించాలి. హిందూ యువత విశాఖ హరి వంటి ఉన్నత విద్యావంతుల నుండి ప్రేరణ పొంది మన ధర్మం, సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలను అనుసరించాలి, పరిరక్షించాలి. #తెలుసుకుందాం #మహానుభావులు #mahanubhavulu🙏🙏🙏 #endharo mahanubhavulu #సనాతన హిందూ ధర్మం దేశ రక్షణ ధర్మ రక్షణ