Amaravati

Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
669 views
1 days ago
అమరావతిలో ఐకానిక్ టవర్లను, సాధారణ పరిపాలనా భవనాలను పోల్చి ఖర్చు ఎక్కువైందని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం చూస్తే, అసలు రాజధాని నిర్మాణం వెనుక ఉన్న ఆలోచననే వారు అర్థం చేసుకోవడం లేదో, లేక తెలిసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సాధారణ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల చదరపు అడుగు రేట్లను తీసుకుని, అమరావతిలో నిర్మించే ఐకానిక్ నిర్మాణాల ఖర్చుతో పోల్చి ఏదో పెద్ద విషయం కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ పోలికే తప్పు. అమరావతిని నిర్మించాలని నిర్ణయించినప్పుడే ఇది కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాకూడదని నిర్ణయించుకున్నాం. ఇది రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే రాజధానిగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణంగా నిలవాలి. అందుకే ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించించాం. అందుకే కొన్ని భవనాలను ప్రత్యేకంగా ఐకానిక్ నిర్మాణాలుగా ప్లాన్ చేశాం. ఒక త్రీ స్టార్ హోటల్ గది నిర్మించడానికి 30-40 లక్షలు ఖర్చవుతుంది. అదే ఫైవ్ స్టార్ హోటల్ గది కోటి ఇరవై లక్షల నుంచి కోటి ముప్పై లక్షల వరకు ఖర్చవుతుంది. అత్యంత లగ్జరీ హోటళ్లలో అది రెండు కోట్ల వరకు కూడా వెళ్లొచ్చు. మూడు చోట్లా గది ఒకటే. కానీ ఖర్చు ఒకటి కాదు. హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ GLA రెండూ ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తాయి. కానీ ఒకటి 20 లక్షలు ఉంటే, మరొకటి 60-70 లక్షలు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం కేవలం ఉపయోగానికి మాత్రమే కాదు, నాణ్యతకు, డిజైన్‌కు, ప్రతిష్ఠకు, గుర్తింపుకు కూడా చెల్లిస్తున్నాం. అమరావతి ఐకానిక్ నిర్మాణాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనం ఢిల్లీకి వెళ్తే వందలాది ప్రభుత్వ భవనాలు కనిపిస్తాయి. కానీ ఫోటోలు దిగేది రాష్ట్రపతి భవన్ ముందు, పార్లమెంట్ ముందు. ఎందుకంటే అవే రాజధాని గుర్తింపును నిర్వచించే నిర్మాణాలు. ప్రపంచంలో ఏ నగరానికి వెళ్లినా వేలాది భవనాలు కనిపిస్తాయి. కానీ ఆ నగరాన్ని గుర్తు చేసే భవనాలు కొన్ని మాత్రమే ఉంటాయి. లండన్‌ను వెస్ట్‌మినిస్టర్ ఎలా నిర్వచిస్తుందో, న్యూయార్క్‌ను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎలా నిర్వచించిందో, అమరావతిని కూడా ఈ ఐకానిక్ నిర్మాణాలే నిర్వచించబోతున్నాయి. అందుకే వాటిపై ఎక్కువ ఖర్చు పెట్టడం వ్యర్థం కాదు. అది ఒక శతాబ్దం నిలిచే రాజధాని గుర్తింపుపై చేసే పెట్టుబడి. అసలు వైసీపీ ప్రజలకు చెప్పని విషయం ఏమిటంటే, అమరావతిలోని చాలా సాధారణ ప్రభుత్వ భవనాలు చదరపు అడుగుకు నాలుగు వేల రూపాయల లోపే నిర్మితమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల కంటే కూడా తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నారు. కానీ వాటిని పక్కనపెట్టి, కేవలం ఐకానిక్ నిర్మాణాల ఖర్చును మాత్రమే తీసుకుని మొత్తం అమరావతి ప్రాజెక్టును విమర్శించడం రాజకీయ ప్రచారం తప్ప, నిజాయితీతో కూడిన విశ్లేషణ కాదు. వాళ్లు చూస్తున్నది ఖర్చు మాత్రమే. మనం చూస్తున్నది 100 సంవత్సరాల తర్వాత కూడా నిలిచే ఒక రాజధాని గుర్తింపును. రెండు సంవత్సరాలు ఆగండి. అమరావతిలో కట్టబోయే ఐకానిక్ భవనాల రేంజ్ ఏమిటో, వాటి స్కేల్ ఎంత పెద్దదో, వాటి ఆర్కిటెక్చర్ ఎంత ప్రత్యేకమో అప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వైసీపీ నాయకులు విమర్శిస్తున్న నిర్మాణాలే, రేపు అమరావతి గుర్తింపుగా నిలుస్తాయి. అప్పుడు ఈ పోలికలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వాళ్లకే అర్థమవుతుంది #jai amaravati #one state, one capital, jai amaravati #andhra pradesh #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
548 views
3 days ago
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #🏛️రాజకీయాలు #👉నేరాలు - ఘోరాలు🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #Amaravati ఈ రోజు ఈనాడు మెయిన్ పేజీ లో రాజధాని రోడ్ల పనులకు స్పీడ్ బ్రేకర్ లు పేరుతో ఒక వార్త వచ్చింది. రాజధానిలో అతి ముఖ్యమైన ప్రధాన రోడ్ల కు అక్కడక్కడా అడ్డంగా వున్న ఇంకా సమీకరణ కి ఇవ్వని దాదాపు 200 ఎకరాల భూముల కారణంగా ప్రధాన రోడ్ల పనులకు ఎలా ఆటంకం కలుగుతుందో (ఫోటోల తోసహా), ఏ ఏ గ్రామాల్లో ఎంత భూమి రైతులు భూములు సమీకరణకు ఇవ్వని కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంది అనే వివరాలు వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఉండవల్లి 31 ఎకరాలు పెనుమాక 47 ఎకరాలు, నిడమర్రు 40 ఎకరాలు, నవులూరు 25 ఎకరాలు, రాయపూడి లో 19 ఎకరాలు వున్నాయి. ఇలాంటి రైతులే మొన్న జగన్ రెడ్డి ని కలిసిన 27 మంది రైతుల్లో ఎక్కువ మంది. దాంట్లో 20 మంది ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు ఎందుకు కలిశారు అంటే ప్రభుత్వం ఇలాంటి భూములు కి భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి. ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ భూములు భూసమీకరణ కింద తీసుకోడానికి సిద్దంగా వుంది. ప్రభుత్వం రాజధానికి భూములు తీసుకునే విషయంలో ఎంత ఓపిక గా, సంయమనం తో, చట్టబద్ధం గా ఆచితూచి రైతులతో వ్యవహరిస్తుందో 12 ఏళ్ల తరువాత కూడా ప్రధాన రోడ్లకు అడ్డంగా వున్న ఈ భూములే నిదర్శనం. జగన్‌ ను కలిసిన ఒకరిద్దరు రైతులు ఆరోపణలు చేసినట్లు నిజంగా ప్రభుత్వం దౌర్జన్యంగా , కక్షపూరితంగా వ్యవహరిస్తే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా రోడ్ల కి అడ్డంగా ఆ భూములు అలా వుండేవా ? కోర్టులు కూడా ప్రధాన రోడ్ల కు అడ్డంగా వున్న ఇలాంటి భూములు ప్రభుత్వం భూసేకరణలో తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పే అవకాశం లేదు.. విచిత్రంగా కొన్ని YouTube channels, కొందరు ముసుగు మేధావులు, paytm జర్నలిస్ట్ లు అమరావతి రైతులకు చంద్రబాబు అన్యాయం చేసినట్టు వాళ్లు న్యాయం కోసం జగన్ రెడ్డి దగ్గరకు వెళ్లినట్టు విచిత్రమైన ప్రచారం చేస్తుంటే నవ్వు వస్తుంది. 2015 నుంచి అమరావతి కి భూములు ఇవ్వని 2 శాతం మంది రైతుల్లో ఒక పాతిక మంది రైతులు ఇప్పుడు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భూములు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఏమి చేయాలో అర్థం కాక జగన్ దగ్గర కి వెళ్ళారు కానీ రాజధాని కి భూములు ఇచ్చిన 98 శాతం రైతుల్లో ఏ ఒక్క రైతు జగన్ ను కలవలేదు . కలిసే అవకాశం కూడా లేదు. అధికారంలో వున్న ఐదేళ్లు చిత్రహింసలు పెట్టి, భూములు ఇచ్చిన రైతుల మీద అన్యాయం గా వందల కేసులు పెట్టి, జైలు కి పంపించి, అక్కడ రాజధాని లేకుండా చెయ్యాలి అని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి విఫలమై , ఇప్పటికి కూడా అమరావతి మీద విషం చిమ్ముతూ, సిగ్గు లేకుండా మావిగన్ అని మతి లేని మాటలు మాట్లాడే మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి దగ్గరకు బుద్ధి,జ్ఞానం వున్న వాళ్లు ఎవరైనా వెళ్తారా?
Sunburn Studios
8.6K views
18 days ago
ఒక్క పంచాయతీ ఏకగ్రీవమైన సహించను! మాజీ సీఎం ఘాటు వ్యాఖ్యలు #YS Jagan #andhra pradesh
svd suryajyothy
1.6K views
21 days ago
38 msme పార్కుకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు #chandrababunaidu #msme #appolitics #news #svdsuryajyothy #nara chandra babu naidu #appolitics #andhra pradesh #svdsuryajyothy #news
svd suryajyothy
1.2K views
27 days ago
ఎందుకు ఈమెను చించి ఆడ పడేయండి #foodcommission #vijayprathapreddy #apgovernment #svdsuryajyothy #news #apgovernment #andhra pradesh #appolitics #svdsuryajyothy #news
svd suryajyothy
1.5K views
1 months ago
అప్పుడు కియా..ఇప్పుడు యుద్ధ విమానాలు/Then Kia..now fighter jets #fighterjet #naralokesh #svdsuryajyothy #andhrapradesh #Puttaparthi #andhrapradesh ##Nara Lokesh #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు #svdsuryajyothy
svd suryajyothy
32.4K views
1 months ago
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్#ycpmlc #arrest #appolitics #news #svdsuryajyothytelugu #shorts #news #svdsuryajyothytelugu #telugu #andhra pradesh #virel