BharatRashtraSamithi

Mohan
597 views
12 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party తెలంగాణ సమాజం మరియు సంస్కృతి ఎల్లప్పుడూ ప్రజా పోరాటాలు, సిద్ధాంతాలు, మరియు ప్రజా కవుల చుట్టూనే తిరిగింది. ఇక్కడ సినిమా నటులను గుడ్డిగా ఆరాధించే (Hero Worship) సంస్కృతి చాలా తక్కువ. దీనికి గల ముఖ్య కారణాలు మరియు నేపథ్యం క్రింది విధంగా ఉన్నాయి:🌟 సిద్ధాంతాలు మరియు పోరాటాల గడ్డపోరాటాల చరిత్ర: తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు ఇక్కడి ప్రజలు హక్కుల కోసం లడాయి చేశారు.సిద్ధాంతాలకే ప్రాధాన్యత: ప్రజలు వ్యక్తుల కంటే వ్యవస్థను, సిద్ధాంతాలను, మరియు ఆశయాలను ఎక్కువగా నమ్మారు.నిజజీవిత నాయకత్వం: చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ వంటి నిజమైన వీరులను సమాజం ఆరాధించింది.🎤 ప్రజా కవులు మరియు కళాకారుల ప్రభావంపాటల సంస్కృతి: ప్రజలను మేల్కొలిపిన గద్దర్, గోరటి వెంకన్న వంటి ప్రజా గాయకులకు ఇక్కడ దక్కిన గౌరవం విలక్షణమైనది.కళారూపాల ప్రాముఖ్యత: ఒగ్గుకథ, చిందు యక్షగానం వంటి జానపద కళలకు, వాటిని ప్రదర్శించే కళాకారులకు ప్రజలు దగ్గరయ్యారు.ధూంధాం వేదికలు: ఉద్యమ కాలంలో సాంస్కృతిక వేదికలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి కానీ గ్లామర్‌ను కాదు.🎬 సినిమా ఆరాధన లేకపోవడానికి కారణాలురాజకీయాల్లో సినిమా పాత్ర లేకపోవడం: పొరుగు రాష్ట్రాల్లో లాగా తెలంగాణలో సినిమా నటులు రాజకీయాలను శాసించే పరిస్థితి ఎప్పుడూ రాలేదు.తెలంగాణ అస్తిత్వం: ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు సినిమాల్లో తెలంగాణ యాసను, సంస్కృతిని అవహేళన చేయడం వల్ల ఇక్కడి ప్రజలు సినిమా హీరోలతో మానసికంగా కనెక్ట్ కాలేకపోయారు.ప్రశ్నించే తత్వం: ఇక్కడి సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఎక్కువ, ఎవరినో చూసి గుడ్డిగా జై కొట్టే అలవాటు తక్కువ
Mohan
2.8K views
14 days ago
#kcr #💪పాజిటీవ్ స్టోరీస్ #🌍నా తెలంగాణ #BRS party వచ్చేది మల్ల మన ప్రభుత్వమే నెక్స్ట్ కెసిఆర్ సీఎం అవడం ఖాయం 👀💥💪జై తెలంగాణ జై కేసీఆర్ జై కిసాన్ జై జవాన్ జై హింద్ జై తెలంగాణ ప్రజలు జై తెలంగాణ సమాజం.🌹🙏🌹
Mohan
3.9K views
20 days ago
#👉నేరాలు - ఘోరాలు🚨 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #BRS party బిజెపి వాళ్లకు ఒక విన్నతి మీకు రాముడు అంటే గౌరవమే కదా రాముడు రావణాసురుని చంపిన తర్వాత సీతమ్మ రాముడు అయోధ్యకు తీసుకొచ్చిన తర్వాత దేశ ప్రజలు సీతమ్మని అనుమానిస్తే శ్రీరాముడు ప్రజల మాటకు గౌరవించి సీతమ్మని అడవిలోకి పంపించాడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పొద్దున లేచి బిజెపిలో ఉండే నాయకులు జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటార మరి బిజెపి నాయకుడు కొడుకు మీద వచ్చిన ఆరోపానికి మొదట తన తండ్రి తీసుకువెళ్లి వాళ్ళ కొడుకుని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలి కానీ తన కొడుకుని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి మీరు జైశ్రీరామ్ వారసులు ఎలా అవుతారు🤯😠
Mohan
18.6K views
25 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party ఓరుగల్లులో నేడే రైతు సంగ్రామం ✊🏻 రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ సదస్సు 💥 🎯 కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైన రైతులు. దండుకట్టి తరలివచ్చేందుకు ఏర్పాట్లు 📣 హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ⚠️ 2022, మే 6న వరంగల్‌ వేదికగా రైతు డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌, గద్దెనెక్కి మొండిచెయ్యి చూపిన వైనం 👨🏻‍🌾 రేవంత్‌ సర్కార్‌పై రగులుతున్న కర్షకులు రైతు డిక్లరేషన్‌ పేరిట నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టేందుకు కర్షకలోకం సిద్ధమైంది. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో దర్జాగా బతికి.. కాంగ్రెస్‌ గద్దెనెక్కిన తర్వాత ఎవుసం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతులకు అండగా ఓరుగల్లులో బుధవారం బీఆర్‌ఎస్‌ ‘రైతు సంగ్రామ సదస్సు’ నిర్వహించనున్నది. 2022, మే 6న వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, అప్పటి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించి నేటికి నాలుగేండ్లు పూర్తయినా.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంపై రాష్ట్ర రైతాంగం రగిలిపోతున్నది. అదునుకు యూరియా అందించకపోవడం, రైతు భరోసా వేయకపోవడమే కాకుండా పండించిన పంటను కూడా కొనకుండా మొండికేస్తున్న రేవంత్‌ సర్కార్‌పై అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సంగ్రామ సదస్సుతో బీఆర్‌ఎస్‌ భరోసా కల్పించనున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో దగాపడ్డ రైతుల తరఫున ‘ఏదీ నీ రైతు డిక్లరేషన్‌?’ అని సర్కార్‌ను నిగ్గదీసి అడుగనున్నది.
Mohan
25.3K views
29 days ago
#kcr #BRS party #🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 వరంగల్ గడ్డపై కాంగ్రెస్ వంచనను ఎండగడదాం! ✊ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ నమ్మకద్రోహంపై బీఆర్ఎస్ సమర శంఖం. మే 6న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేద్దాం. జై తెలంగాణ జై కేసీఆర్ సార్ 🔥🔥❤️❤️
Mohan
21.8K views
1 months ago
#kcr #💪పాజిటీవ్ స్టోరీస్ #🌍నా తెలంగాణ #BRS party మే 6న వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సభ డిక్లరేషన్ల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్.. డిక్లరేషన్లు ప్రకటించిన చోటే బీఆర్‌ఎస్‌ సమర శంఖం🔥 రైతు డిక్లరేషన్‌ పేరిట రైతులకు అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు డిక్లరేషన్‌ ప్రకటించిన వరంగల్‌లోనే రైతు సభ.
Mohan
11.8K views
1 months ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party #ktr #ktrtrs KCR | కేసీఆర్‌ హయాంలో అప్పు 3.17 లక్షల కోట్లు.. కాంగ్రెస్‌ దుష్ప్రచారం 7 లక్షల కోట్లు! KCR | కేసీఆర్ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. ఇదీ రిజర్వ్‌ బ్యాంక్‌ నిగ్గు తేల్చిన నిజం రేవంత్‌.. ఆర్బీఐ నివేదికపై ఇప్పుడేమంటారు? సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం 72,658 కోట్లు తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్‌ హయాంలో3 లక్షలకోట్లు అన్నీ కలిపితే 3.87 లక్షల కోట్లు కూడా దాటని మొత్తం అప్పు ఆ రుణంతో 30 లక్షల కోట్ల సంపద సృష్టించిన కేసీఆర్‌ సర్కార్‌ పదేండ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయం అన్ని రంగాలకు జవసత్వాలు.. పెరిగిన ప్రజా జీవన ప్రమాణాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యాండ్‌బుక్‌-2024లో తేటతెల్లం ఏడాదిలోనే రూ.80 వేల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు.. కొత్త పథకం అమలు చేయలేదు సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటేసిన రేవంత్‌ సర్కార్‌ KCR | కేసీఆర్‌ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా.. సెక్రటేరియట్‌ నుంచి కలెక్టరేట్ల దాకా.. అడుగడుగునా రుణ సద్వినియోగం కనపడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి, అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్‌ కౌశలం కండ్లకు కడుతున్నది మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ పన్నెండు నెలల్లో రేవంత్‌ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా 80 వేల కోట్లు! ఇది 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ. మరి ఈ అప్పుతో చేపట్టిన కొత్త ప్రాజెక్టు ఏది? మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది? కూలగొట్టుడే తప్ప.. కొత్తగా తట్టెడు మట్టి కూడా తీయని సర్కారు.. 80 వేలకోట్లు అప్పు తెచ్చి చేసిందేంది? సాధించిందేంది? ఒక్కో విషపుచుక్క ప్రోదిచేసి కాంగ్రెస్‌ సృష్టించిన అభాండాల భాండం బద్ధలైంది. అప్పులపై తప్పుడు కూతలకుచెంపచెళ్లుమనే సమాధానం దొరికింది. పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పటాపంచలైంది. అభివృద్ధిని చిన్నగాచూపి, అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది. అధికార యావలో కాంగ్రెస్‌ ఇన్నాళ్లు సాగించిన ‘అప్పుల కుప్ప’ప్రాపగాండాను రిజర్వ్‌బ్యాంక్‌ తాజా నివేదిక నిట్టనిలువునా చీల్చిపారేసింది. వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు.. కాంగ్రెస్‌ కత్తిగట్టి సాగించిన ‘మిత్తి’మీరిన ప్రచారాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. కేసీఆర్‌ పట్టించుకోలేదని అందామంటే.. పదేండ్ల పసికూన రాష్ట్రం అన్ని సూచీల్లో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. అభివృద్ధే చేయలేదని అందామంటే.. కండ్లముందు తెలంగాణ ప్రగతి ప్రదీప్తి మిరుమిట్లుగొల్పుతున్నది. సంపదకు లోటులేదు.. సంక్షేమానికి కొరత రాలేదు. దీంతో కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బురదచల్లింది. ధనిక రాష్ట్రంగా ఎదిగిన తీరును దాచి.. బాకా చానళ్లతో, భజంత్రీ పత్రికలతో తప్పుడు కథనాలను వండివార్చింది. అధికార పీఠంపై కూర్చున్నప్పటికీ కాంగ్రెస్‌ తీరు మారలేదు. పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్నే ప్రభుత్వ వేదికలపైనా కొనసాగించింది. పదేండ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారావు మాటల్ని పట్టుకుని సీఎం రేవంత్‌ సైతం అధికారిక సమావేశాల్లో ఆరోపణలకు దిగారు. నిజాలే నివ్వెరపోయేలా శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలకు సున్నంవేశారు. ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో కాంగ్రెస్‌ ఇన్నాళ్లూ సాగించిన అబద్ధపు ప్రచారం శుద్ధ తప్పేనని తేలిపోయింది. పదేండ్లలో తెలంగాణ చేసిన అప్పు 3.17 లక్షల కోట్లేనని ఆధారాలతో, అంకెలతో ఆర్బీఐ సుస్పష్టం చేసింది. సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం మరో రూ.72 వేల కోట్లని వెల్లడించింది. అన్నీ కలిసినా తెలంగాణ అప్పు 3.87 లక్షల కోట్లేనని కుండబద్ధలు కొట్టింది. ఆర్బీఐ లెక్కల తర్వాత కాంగ్రెస్‌ నేతల నోట మాట పడిపోయింది. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్‌ కొన్నేండ్లుగా తీవ్ర దుష్ప్రచారం చేసింది. కేసీఆర్‌ హయాంలో రూ.6.71 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకొని.. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. కానీ.. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమే. అందులోనూ సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం 72వేల కోట్లు. అంటే పదేండ్ల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 3.17 లక్షల కోట్లే!. ఇదెవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే.. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల జమాఖర్చులు చూసే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెప్పిన మాట. పూర్తి ఆధారాలతో, అంకెలతో.. అధికారికంగా ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ 2023-24’లో స్పష్టంచేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72 వేల కోట్ల రుణభారం ఉంటే.. 2023 నాటికి మొత్తం అప్పు రూ.3.89 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.3.17 లక్షల కోట్లు మాత్రమే తెచ్చిందన్నది తేటతెల్లం. మరి ఇన్నాళ్లూ అప్పును రెట్టింపు చేసి రూ.7లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసి.. ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆర్బీఐ నివేదిక చూస్తే స్పష్టమవుతున్నది. తెచ్చిన నిధులు స్వరాష్ట్ర నిర్మాణనికే.. ‘అప్పును భారంగా చూడకుండా.. పెట్టుబడిగా భావించాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే దానికి సార్థకత చేకూరుతుంది. అప్పుకు మించిన ఆదాయం, అంతకుమించిన ప్రయోజనాలు కనిపిస్తాయి’ అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ నియమాన్ని పాటించింది. రుణాల రూపంలో సేకరించిన అప్పులను మూలధన వ్యయంగా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసింది. సంపదను సృష్టించింది. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసింది. నదులకు నడకలు నేర్పి రిజర్వాయర్లకు మళ్లించింది. ఎండిన పొలాలను నదీజలాలతో తడిపి వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచింది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపింది.