గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ

Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
701 views
4 months ago
#అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు హరికృష్ణ హరే రామ 🙏🙏🙏🙏 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #గీతా జయంతి శుభాకాంక్షలు డిసెంబరు ఒకటి #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 *🙏🌷ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🌷* *భగవద్భక్తులు అందరికీ ముందుగా గీత జయంతి శుభాకాంక్షలు🌹.* పుణ్య మార్గశిర మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున వ్యాసదేవుల వారు మానవాళికి శ్రీమధ్భగవద్గీతను అందజేశారు. అదే గీత జయంతి రోజు. ఇంతటి పరమపవిత్రమైన గీత జయంతి పండుగ ఈరోజే కావడం ఎంతో విశేషం. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీమద్భగవద్గీత ఎక్కడైతే ఎవరి గృహంలో అయితే ఆరాధింపబడుతుందో ఆచరించబడుతుందో అక్కడ సకల దేవతలు, సకల తీర్థాలు, యోగులు, మహర్షులు, మహాత్ములు, గంగా, గోవు మొదలైనవన్నీ అక్కడ కొలువై ఉంటాయి అని గీతా మహత్యంలో స్వయంగా భగవంతుడు తెలియజేయడం జరిగింది. *మాసానాం మార్గశీర్షో అహం.* మాసాలలో మార్గశిరమాసం నేనే అని భగవంతుడు స్వయంగా చెబుతున్నారు. అంతటి పుణ్య మార్గశిర మాసంలో పరమ పవిత్రమైన, సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను అష్టోత్తరశతనామావళితో ఆరాధించుకోని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వుదాము. సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను ఆరాధించుకోని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో నిండైన జీవితం గడపాలని కోరుకుంటూ మీ భవఘ్ని సభ్యులు.🙏
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
1.5K views
4 months ago
#గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #గీతా జయంతి శుభాకాంక్షలు డిసెంబరు ఒకటి #అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు హరికృష్ణ హరే రామ 🙏🙏🙏🙏 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 *🙏🌷ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🌷* *భగవద్భక్తులు అందరికీ ముందుగా గీత జయంతి శుభాకాంక్షలు🌹.* పుణ్య మార్గశిర మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున వ్యాసదేవుల వారు మానవాళికి శ్రీమధ్భగవద్గీతను అందజేశారు. అదే గీత జయంతి రోజు. ఇంతటి పరమపవిత్రమైన గీత జయంతి పండుగ ఈరోజే కావడం ఎంతో విశేషం. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీమద్భగవద్గీత ఎక్కడైతే ఎవరి గృహంలో అయితే ఆరాధింపబడుతుందో ఆచరించబడుతుందో అక్కడ సకల దేవతలు, సకల తీర్థాలు, యోగులు, మహర్షులు, మహాత్ములు, గంగా, గోవు మొదలైనవన్నీ అక్కడ కొలువై ఉంటాయి అని గీతా మహత్యంలో స్వయంగా భగవంతుడు తెలియజేయడం జరిగింది. *మాసానాం మార్గశీర్షో అహం.* మాసాలలో మార్గశిరమాసం నేనే అని భగవంతుడు స్వయంగా చెబుతున్నారు. అంతటి పుణ్య మార్గశిర మాసంలో పరమ పవిత్రమైన, సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను అష్టోత్తరశతనామావళితో ఆరాధించుకోని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వుదాము. సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను ఆరాధించుకోని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో నిండైన జీవితం గడపాలని కోరుకుంటూ మీ భవఘ్ని సభ్యులు.🙏
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
698 views
4 months ago
#అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు హరికృష్ణ హరే రామ 🙏🙏🙏🙏 #గీతా జయంతి శుభాకాంక్షలు డిసెంబరు ఒకటి #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 *🙏🌷ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🌷* *భగవద్భక్తులు అందరికీ ముందుగా గీత జయంతి శుభాకాంక్షలు🌹.* పుణ్య మార్గశిర మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున వ్యాసదేవుల వారు మానవాళికి శ్రీమధ్భగవద్గీతను అందజేశారు. అదే గీత జయంతి రోజు. ఇంతటి పరమపవిత్రమైన గీత జయంతి పండుగ ఈరోజే కావడం ఎంతో విశేషం. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీమద్భగవద్గీత ఎక్కడైతే ఎవరి గృహంలో అయితే ఆరాధింపబడుతుందో ఆచరించబడుతుందో అక్కడ సకల దేవతలు, సకల తీర్థాలు, యోగులు, మహర్షులు, మహాత్ములు, గంగా, గోవు మొదలైనవన్నీ అక్కడ కొలువై ఉంటాయి అని గీతా మహత్యంలో స్వయంగా భగవంతుడు తెలియజేయడం జరిగింది. *మాసానాం మార్గశీర్షో అహం.* మాసాలలో మార్గశిరమాసం నేనే అని భగవంతుడు స్వయంగా చెబుతున్నారు. అంతటి పుణ్య మార్గశిర మాసంలో పరమ పవిత్రమైన, సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను అష్టోత్తరశతనామావళితో ఆరాధించుకోని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వుదాము. సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను ఆరాధించుకోని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో నిండైన జీవితం గడపాలని కోరుకుంటూ మీ భవఘ్ని సభ్యులు.🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
879 views
4 months ago
భగవద్గీత అంటే ఏమిటి?* జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? అది కేవలం హిందువులదా? పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’ సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి.. భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని. సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి. అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.. *భగవాన్ ఉవాచ....* రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు ‘కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసా / కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయ!’... చెప్పినదంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిందా? అని అర్జునుడిని అడిగాడు. ఫలానా పని చెయ్యమని గానీ, వద్దని గానీ చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఏది మంచో, ఏది చెడో విడమరిచి చెప్పాడంతే. ‘చెప్పాల్సిందంతా చెప్పాను... ఇక నీ ఇష్టం’ అన్నాడు. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడవుతాడు. జ్ఞానం... సాధనతోనే సాకారమవుతుంది. భగవానుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, ఆదేశాలుగా భావించి పాటిస్తే జీవితం ధన్యమవుతుంది. దానికోసం మరో ముహూర్తమెందుకు?ఈ రోజే మొదలుపెడితే సరి.. ఆదిశంకరాచార్యులు తన భజగోవిందంలో ‘గేయం గీతా నామ సహస్రం’; ’భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా...’ గీతా శ్లోకం ఒక్కటి పారాయణ చేసినా గంగా జలాన్ని తాగినంత పుణ్యం వస్తుందంటూ కొనియాడారు. ‘యే యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహమ్‌’ (కర్మ సన్యాసయోగం). ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తారో వారికి అలాగే కనిపిస్తానంటాడు పరమాత్మ. జరుగుతున్న సంఘటనలపై నీ దృష్టికోణం మార్చుకోమంటుంది భగవద్గీత. జరిగిన సంఘటన నేరుగా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. నీ మనసు చేసే మాయాజాలమే ఆనందం, విచారాలు. అందుకే జరిగినదాన్ని ఓ పాఠంగా భావించు. మంచి మాత్రమే స్వీకరించు. ‘ఆశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే/ గతాసూనగతాంసూశ్చ నాను శోచంతి పండితాః’ (సాంఖ్యయోగం) అనవసరమైన ఆలోచనలు మన బుద్ధిలో వేగాన్ని మందగింపజేస్తాయి. సరైన ఆలోచనల్ని అడ్డుకుంటాయి. గతాన్ని తలచుకుంటూ బాధపడటం మానేసేి భవిష్యత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో. ‘ధూమేనావ్రియతో వహ్ని ర్యథాదర్శోమలేన చ’ (కర్మయోగం) అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది. మన మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయ పొరలు మనసును కమ్మితే ఇక చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాం. ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. లేదంటే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు.. భవిష్యత్తు కూడా. ‘అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ’ (భక్తియోగం) సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా ప్రవర్తించాలని గీత బోధిస్తుంది. సమాజం నుంచి తాను ఏం కావాలని కోరుకుంటాడో సమాజానికి తాను కూడా దాన్ని అందించాలి. ప్రకృతికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఓర్పు, దయ, శాంతి, సహనం, క్షమతోనే అద్భుతమైన జీవితం సాధ్యమవుతుంది. ‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌... స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే’ (శ్రద్ధాత్రయ విభాగయోగం) ఇతరులకు బాధ కలిగించకుండా వారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేలా మాత్రమే మాట్లాడాలి. ఇది కూడా తపస్సే అవుతుంది. ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించేవారెవ్వరూ ఉండరు. అంతిమంగా మనకు ఏవిధమైన అశాంతి కలగదు. ‘ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిదీయతే’ ‘క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత’ (క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం) దేహాన్నే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకున్నవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఎన్నో నియమాలు పాటిస్తూ, జీవితకాలమంతా తపస్సు చేసి, ఏ భగవంతుడిని దర్శించటానికైతే మనస్సు తహతహలాడిపోతుందో ఆ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించి, సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరతత్త్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు. ‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ (కర్మ సన్యాసయోగం) అభ్యాసం జీవితకాల ప్రక్రియ.నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి.. నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్లాలి. శరీరం, మనస్సు, బుద్ధి... మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి. గురువును శరణాగతి పొంది జ్ఞానాన్ని ఆర్జించాలి. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప’ (సాంఖ్యయోగం) మనిషి విజయానికి మనసే మూల కారణం.ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నాన్ని చెయ్యలేదు. ఏ విజయాన్ని సాధించలేదు. అన్యాయాన్ని ఎదుర్కోలేదు. అందుకే పరమాత్మ బోధించినట్లు మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలి. సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి. వరాహ పురాణంలో గీతామహాత్మ్యాం విస్తృతంగా వర్ణించారు. దీంతోపాటు గీతకు ప్రత్యేకంగా 18 పేర్లను ఈ పురాణం సూచిస్తుంది. అవి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్త్వార్థ జ్ఞానమంజరి..* సుఖజీవన గీత భగవద్గీత.... గీత జయంతి సందర్భంగా... సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు. "గీతా శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను' అని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. భగవద్గీతకు (1.8 అధ్యాయాలున్నట్లే) 18 పేర్లున్నాయి. అది 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి. గీత అంటే...: సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు. గీత అనే వదంలో '' అంటే త్యాగం, 'తే' అంటే తత్త్వ జ్ఞానం. అంటే త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజం పై ఉన్న ఆంజనేయుడు. గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది. ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ, జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి లాంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం. ఎలాగో వివరించిన గ్రంథం ఇది. కాబట్టి దీన్ని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు. మనిషిలోని కోరికలనూ, బాధలనూ నశింపజేయడానికీ, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికీ గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా, ఔషధగుళికగా వాడుకోవచ్చు. యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్దాలు పుట్టుకొస్తుంటాయి. మనం తెలిసి కానీ, తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల తక్షణమే. నశించిపోతాయి. గీతా మకరందాన్ని సేవించడమే కాదు, అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి సుఖాల. తీరానికి చేరుద్దాం..* గీత చదువుకో... నీ రాత మార్చుకో..... #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏 #గీతా జయంతి శుభాకాంక్షలు #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #గీతా జయంతి శుభాకాంక్షలు💐 #భగవద్గీత🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
759 views
4 months ago
ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు... శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు. “ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు.ఆడంబరాలకు ప్రాధాన్యత నిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో’... కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో.ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి.శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.. 🌹🕉️🌹 #గీతా జయంతి శుభాకాంక్షలు💐 #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #గీతా జయంతి శుభాకాంక్షలు #హరే కృష్ణ #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
713 views
4 months ago
🌿🌼శ్రీ గీతా జయంతి శుభాకాంక్షలు🌼🌿 అందరం తప్పకుండా తెలుసుకోవలసినవి విషయాలు, భగవధ్గీతలో ఏముంది? భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేతఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది. శ్లోకం:-పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్ అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ 1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ? జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది. 2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు? జ. గీతలో 700 శ్లోకములు కలవు. 3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ? జ. గీతలో 18 అధ్యాయములు కలవు. 4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది? జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు. 5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది? జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది. 6. గీత ఎందుకు చెప్పబడినది? జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది. 7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది? జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది. 8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి? జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి. 9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు? జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను. 10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు? జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి. 11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి? జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము 12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను? జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు. 13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి? జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు. 2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు. 4) అనసూయ - అసూయ లేనివాడు. 5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు. 6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు. 7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు. 8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు. 9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు. 10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు . 14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి? బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్ బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత: ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్ ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు. 15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది? జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము. 16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి? జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: " శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము "యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర: శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ " చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత. 17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు? జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని 1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు. 2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ ప్రార్దించువారు అర్దార్దులు. 3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో, సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును. 4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును. 18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది? జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం 6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ 17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము 24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస. ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను. 19. యోగమనగా నేమి? జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము యోగమనగా ఆనందం సమత్వమే యోగము చిత్త వృత్తిని విరోధించునదే యోగము 20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి? జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు. 21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి? జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం. 22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి? జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము. 23. "యోగం" అంటే అర్థం ఏమిటి? జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) . 24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది? జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా , శక్తి వంచన లేకుండా చేయడమే యోగం. "యోగ: చిత్త వృత్తి నిరోద:" అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి - బుద్దిని,మనస్సును నిలిపి వుంచేదే యోగం. 'సమత్వం యోగముచ్యతే" - అనగా అన్ని సమయాలలోనూ సమత్వ భావనను కలిగియుండటం యోగం. 25. భగవద్గీతలో ప్రధానమైన యోగములు ఏవి? జ. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము , రాజ యోగము. 26. కర్మ యోగము అంటే ఏమిటి? జ. కర్మ యోగము అంటే ప్రతి వ్యక్తీ తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థముగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్దిగా చేయుట. 27. కర్మ, వికర్మ , అకర్మలను స్వామి ఏవిదంగా విశదీకరించారు? జ. స్వామి కర్మ, వికర్మ, అకర్మల గూర్చి చెపుతూ " దీపం వుంది. అది నిలకడగా వెలుగుతుంది - ఇది కర్మ. వికర్మ అంటే - ఆ దీపం నిలకడగా వుండక పరిసర ప్రభావాలకు లోనై వూగిసలడటం. ఇకపోతే అకర్మ - నిలకడగా వున్నా, లేక పోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం . 28. "కర్మణ్యే వ్యాధి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ: మాతే సంగోస్త్వ కర్మణి" శ్లోకార్థాన్ని తెలుపుము? జ. "కర్మలాచరించుటకు మాత్రమే స్వాతంత్ర్యము కలదు. కానీ ఆ కర్మలవల్ల లభించే ఫలములందు నీకేమియూ జోక్యము లేదు. అట్లాగని నీ కర్మలాచరించుటకు మానరాదు. పనిచేయుట యే నీధర్మం. ఫలము ఈశ్వరాధీనము ఫలాపేక్ష లేని వాడ వై కర్తవ్యమును ఆచరింపుము. 29. భక్తియోగము అంటే ఏమిటి? జ. భక్తి యోగము అంటే "భగవంతునితో తనను తాను నిశ్చల, అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్షతో భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల, నిర్మల మనస్సుతో భగవంతుని సేవిస్తూ మనసా, వాచా, కర్మణా భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము. 30. నిజమైన భక్తునికి వుండవలసిన లక్షణములు ఏమిటి? జ. నిజమైన భక్తుడు సర్వప్రాణులయందు సమత్వం కలిగివుండటం మిత్రత్వము, దయార్ద్రహృదయము, అహంకార రహితము, సుఖ దుఖాలు యందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి వుంటాడు. అంతే కాకుండా సహనశీలత్వం సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై వుండటం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకొనువాడై నిజమైన భక్తుడు. 31. ఎట్టివాడు భగవత్ప్రేమకు పాత్రుడు కాగలడు ? జ. అనా పేక్ష: శుచి: దక్ష: ఉదాసీనోగతవ్యధ: సర్వా రమ్న పరిత్యాగి యోమద్భక్త: సమేప్రియ: ఎట్టి ఆపేక్షలు (కోరికలు) లేనివాడు. అంతర్ , బహిర్ శుద్ది (పవిత్రత) కలవాడు. ఫలాపేక్ష రహితుడై కర్మల నాచరించేవాడు, గతమును గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రమూ విచారించనివాడు, ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచి పెట్టినవాడు నాకు యిష్టుడైన భక్తుడు" అని గీతాచార్యుడు పలికాడు. 32. జ్ఞానయోగము అంటే ఏమిటి? జ. జ్ఞానయోగమంటే "నేనెవరిని? నేనెక్కడ నుండి వచ్చాను? నేను ఎక్కడికి పోతాను? " అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే ప్రతీదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే తెలుసుకునే నేర్పు ఆత్మ సంబంధమైన వాస్తవం. 33. జ్ఞానము ఎన్ని రకములు? జ. జ్ఞానము - లౌకికము (భౌతికము) , ఆధ్యాత్మికము (దైవిక సంబంధమైన) అని రెండు రకములు. 34. జ్ఞానము ఏవిధంగా పొందగలము? జ. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలిసింది శ్రద్ధ మరియు అచంచల ఆత్మ విశ్వాసము. అసక్తి, స్థిరత్వము , నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటే. 35. "రాజ యోగ" మనగా ఏమిటి? జ. ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది రాజయోగము. 36. కర్మ, భక్తి , జ్ఞాన యోగముల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధములను స్వామి ఏవిధంగా విశదీకరించారు? జ. కర్మ అనేది చెట్టుకు పూచే పూవు వంటిదనీ, భక్తి ఆ పూవు నుండి ఉద్భవించే కాయవంటిదనీ , జ్ఞానము పండిన పండు వంటిదనీ స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతాయి. 37. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించాలనుకునే వారికి ఏది అడ్డుపడుతూ వుంటుంది? జ. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించు కోవాలనుకునే వారికి సర్వదా మనస్సు అడ్డంకులు కలిగిస్తూ వుంటుంది. 38. మనస్సు అనగా ఏమిటి? జ. సంకల్ప వికల్పములతో , కోరికలతో కూడినది మనస్సు. 39. మనస్సును ఎందుకు అదుపులో నుంచుకోవాలి? జ. మనస్సు మానవుని బంధమునకు ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో వుంచుకోవలెను. 40. మనస్సును ఎలా నియంత్రించగలం? జ. ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ది ఉండాలి. బుద్దిని అనుసరించాలి మనస్సు. మానవుడు మనస్సును ఆధీనలో పెట్టుకుని వ్యవహరిస్తే అంత మంచి జరుగుతుంది. జై శ్రీకృష్ణా జై శ్రీకృష్ణా జై శ్రీకృష్ణా జై శ్రీకృష్ణా జై శ్రీకృష్ణా జై శ్రీకృష్ణా #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏 #గీతా జయంతి శుభాకాంక్షలు #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #గీతా జయంతి శుభాకాంక్షలు💐 #హరే కృష్ణ