ఆధ్యాత్మిక #హైందవం#వైదికం#భారతీయత#వేదం#పఠనం#సంస్కారం#స్మార్తం#భక్తి#సంస్కృతిసంప్రదాయాలు#ఎడ్యుకేషన్

🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
611 వీక్షించారు
11 గంటల క్రితం
*🌹🙏తూ.గో జిల్లా వాడపల్లి🔅శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వాడపల్లి క్షేత్రం 🙏🌹* 💠 తిరుపతి, ద్వారకా తిరుమల క్షేత్రాల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన వేంకటేశ్వర స్వామి క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. 💠 కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున - లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలిచేవారు. అదే నేడు వాడపల్లి గా మారింది వాడపల్లి గ్రామాన్ని పూర్వం " నౌకాపురి " అని కూడా పిలిచేవారు. 💠 ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. 💠ఇక్కడ గోదారమ్మ రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ మరొకటి గౌతమి పాయలు గా పయనిస్తోంది. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూ వెలిసారు. 💠 తూర్పుగోదావరి జిల్లా కొనసీమలోని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్వయంభు స్వయంభు. కలియుగంలో 4 చోట్ల మాత్రమే వెంకన్న స్వయంభూగా వెలిశారు. ఒకటి తిరుమల తిరుపతి. రెండవది ద్వారకాతిరుమల. మూడు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని ఉపమాక . ఈ మూడు చోట్ల స్వామివారు రాతి విగ్రహ రూపంలో ఉంటారు. నాలుగవది వాడపల్లి ఇక్కడ స్వామివారి విగ్రహం ఎర్రచందనం లో ఉంటుంది . అందుకే స్వామివారికి పంచామృత అభిషేకంలు చేయరు. కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు.ఇది ఇక్కడ మరో మహత్యం . 💠నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని ‘‘వేం-కట’’ అని పేరు పెట్టిన పుణ్యక్షేత్రం ..వాడపల్లి . 💠నారదమహర్షి తన స్వహస్తాతో ఆ మూర్తికి ‘వేం' అంటే ‘పాపాలను' ‘కట' అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు. 💠గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అను వారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామి వారిని వేడుకున్నాడు. "స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను" అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకి చేరడంతో అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు. 💠ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలుమంగతయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు మనకి. 💠 2000 సంవత్సరం వరకు సామాన్యంగా భక్తులు వచ్చేవారు. వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే వారు. అయితే 2000 సంవత్సరంలో ప్రతి శనివారం వచ్చే ఓ భక్తుడును చూసి ఆలయంలో పనిచేసే సూపరిండెంట్ రాధాకృష్ణ అతడిని ప్రతివారం ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ సిద్ధాంతి ఉన్నారు...ఆయన దగ్గరికి వెడితే ఈతి బాధలు పోవడానికి కోనసీమలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారాలు దర్శించుకుని ,ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పారని దానితో తన బాధలు తీరి పోవడంతో ప్రతివారం వస్తున్నట్లు వెల్లడించారు. 💠 ఈ విషయం ఆ గ్రామస్తులు అందరికి తెలిసింది. గ్రామస్థులు కూడా ప్రతి శనివారం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకునేవారు. వారి కోరికలు నెరవేరాయి. దీంతో ఆనోటా ఈనోటా ప్రపంచవ్యాప్తంగా వాడపల్లి వెంకన్న మహత్యం అందరికీ తెలిసింది. 💠 తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ నిత్యాన్నదాన భవనం లో ఎలా అన్నదానం నిర్వహిస్తారో అదే స్థాయిలో ఇక్కడ ఒకేసారి 15వేల మందికి అన్నదానం జరపడం విశేషం. 💠 స్వామి వారి ఆలయం చెంతనే గోదావరి నది ఉంది. భక్తులు అక్కడ స్నానం చేసి ,మరి కొందరు అక్కడే తలనీలాలు సమర్పించి స్వామివారి ప్రదక్షిణ లో పాల్గొంటారు. ప్రదక్షిణలు పూర్తయ్యాక స్వామి దర్శనం చేసుకుని, అన్నదానం స్వీకరించి నిండుమనసుతో తిరిగి వెళతారు. కొందరైతే శుక్రవారం సాయంత్రానికి అక్కడకు చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రపోయి తెల్లవారుజామునే లేచి గోదావరి స్నాన మాచరించి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. 💠 ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ మార్మోగి పోవడంతో లక్షలాదిగా భక్తులు వాడపల్లికి వస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల గా ప్రసిద్ధి గాంచింది. 💠 ఆత్రేయపురం నుండి 6 కి.మీ దూరంలో ఉంటుంది ఈ గ్రామం __________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ✍🏻 ___________________________________________ #శనివారం శుభోదయం 🙏🙏భక్తి స్పెషల్ 🌴శ్రీనివాస గోవిందా గోవిందా #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
604 వీక్షించారు
4 రోజుల క్రితం
*హనుమాన్ ద్వాదశ నామాలు — చాలా శక్తివంతమైన నామావళి 🙏* *ఇప్పుడు ఎప్పుడు? ఎవరు? ఎక్కడ? ఎలా చదవాలి? పూర్తి విధానం ఇస్తున్నాము.* శ్రీ హనుమాన్ ద్వాదశ నామాలు ఓం హనూమతే నమః ఓం అంజనాసూనవే నమః ఓం వాయుపుత్రాయ నమః ఓం మహాబలాయ నమః ఓం రామేష్టాయ నమః ఓం ఫల్గునసఖాయ నమః ఓం పింగాక్షాయ నమః ఓం అమితవిక్రమాయ నమః ఓం ఉదధిక్రమణాయ నమః ఓం సీతాశోకవినాశకాయ నమః ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః ఓం దశగ్రీవస్యదర్పఘ్నే నమః 🕰️ ఎప్పుడు చదవాలి? ఈ 12 నామాలు ఎప్పుడైనా చదవవచ్చు, కానీ కొన్ని సమయాల్లో చదివితే అత్యంత ఫలప్రదం. అత్యుత్తమ సమయాలు: 🌅 ఉదయం బ్రహ్మముహూర్తం (4:30 – 6:00 AM) 🌇 సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 🗓️ మంగళవారం (Hanuman day) 🗓️ శనివారం (శని దోష నివారణకు) 🙏 ప్రయాణానికి బయలుదేరే ముందు 😰 భయం / సమస్యలు ఉన్నప్పుడు 😴 నిద్రకు ముందు (రక్షణ కోసం) ప్రత్యేకంగా: ప్రతి రోజు ఉదయం చదివితే “హనుమాన్ కవచం” లా రక్షణ ఇస్తుంది. 👨‍👩‍👧‍👦 ఎవరు చదవాలి? ఈ నామాలు అందరూ చదవవచ్చు — వయస్సు, లింగం, ఆచారం అనే పరిమితి లేదు. చదవాల్సిన వారు ముఖ్యంగా: విద్యార్థులు 📚 → concentration & memory ఉద్యోగులు 💼 → విజయము & ధైర్యం వ్యాపారులు 💰 → అడ్డంకుల తొలగింపు గర్భిణీలు 🤰 → శిశు రక్షణ పిల్లలు 👶 → భయం తగ్గుతుంది శని దోషం ఉన్నవారు 🪐 → ఉపశమనం 🛕 ఎక్కడ చదవాలి? మూడు స్థలాల్లో చదవచ్చు: 1️⃣ ఇంటి పూజా గది (best) 2️⃣ హనుమాన్ ఆలయం 3️⃣ ప్రయాణంలో / బయట (మనసులో జపం) 👉 ఇంట్లో హనుమాన్ ఫోటో ముందు చదవడం ఉత్తమం. 🪔 ఎలా చదవాలి? (పూర్తి విధానం) 🔸 Step 1: సిద్ధం అవ్వాలి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి హనుమాన్ ఫోటో ముందు దీపం వెలిగించాలి ఎర్ర పువ్వు లేదా బీటెల్ ఆకులు ఉంటే సమర్పించాలి 🔸 Step 2: ప్రారంభ ప్రార్థన 3 సార్లు జపించాలి: “ఓం శ్రీ హనుమతే నమః” 🔸 Step 3: ద్వాదశ నామాలు జపం మీరు ఇచ్చిన ఈ 12 నామాలు 👉 11 సార్లు / 21 సార్లు / 108 సార్లు జపించాలి. సులభ నియమం: రోజూ → 11 సార్లు మంగళ/శని → 21 సార్లు సమస్యల సమయంలో → 108 సార్లు 🔸 Step 4: ముగింపు ప్రార్థన చివర ఇలా చెప్పాలి: అంజనేయ స్వామి కృపతో నా కుటుంబం రక్షించబడాలి నా అడ్డంకులు తొలగాలి జయ శ్రీరామ్ జయ హనుమాన్ 🙏 ✨ చదివితే లభించే ఫలితాలు ఈ నామాల గురించి శాస్త్రాలు చెబుతున్నవి: భయం తొలగుతుంది 😌 దృష్టి దోషం తొలగుతుంది 🧿 శని దోషం తగ్గుతుంది 🪐 కోర్టు కేసులు తగ్గుతాయి ⚖️ ప్రయాణ రక్షణ ✈️ శత్రువులపై విజయం 🛡️ ధైర్యం & బలం పెరుగుతుంది 💪 👉 అందుకే దీన్ని హనుమాన్ రక్షా మంత్రం అంటారు. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #🕉️ హనుమాన్ జయంతి శభాకాంక్షలు #🙏హనుమాన్ జయంతి 💐 #🐒హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏
Sri divine talks
563 వీక్షించారు
9 రోజుల క్రితం
భార్యాభర్తల ప్రేమ & ఆకర్షణ కోసం శక్తివంతమైన మంత్రాలు | Dampatyam Telugu భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర ఆకర్షణ మరియు దాంపత్య అనురాగం కోసం చెప్పబడే బీజ మంత్రాలు, వాటి భావం మరియు జప విధానం ఈ వీడియోలో తెలుసుకోండి. #RelationshipMantra #LoveAndHarmony #Dampatyam #SpiritualTelugu #CoupleBonding #DivineMantras #SriDivineTalks #Love_Needs_Understanding #Sacred_Bond #Sacred_Energy #Harmony_Begins_in_the_Heart #fearless #indian #🇮🇳 మన దేశ సంస్కృతి #SRIDIVINETALKS #ఆధ్యాత్మికం
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
678 వీక్షించారు
12 రోజుల క్రితం
*ఆ ఆరు వికారాలూ లేనిదే.. శివ* శామ్యతి, పరమానందరూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' అంటుంది అమరకోశం, శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో సమస్తప్రా ణులకు, సమస్త జీవులకు ఆరు వికారాలుంటాయి. వాటిని షడ్వికారాలంటారు. కాలంలో ఏదైనా కొత్తగా వచ్చినట్ల యితే దానికి పుట్టినతేదీ అని ఒకటి ఉంటుంది. పుట్టినతేదీ ఉన్నదీ అంటే.. అది షడ్వికారాలకు లోనయిపోతుందన్న మాట. జీవుడు పుట్టడంతోనే వానికి జన్మము అనే తేదీ కాలంలో వచ్చింది. ఒక జన్మతేదీ ఏర్పడింది. అంతకు ముందు లేనిది ఇప్పుడు పుట్టింది. ఆ జీవి ఇప్పుడు భూమిపై ఉంది. తర్వాత ఆ జీవి పెరుగుతుంది. పెరిగి కొంతకాలానికి మళ్లీ తరగడం ప్రారంభిస్తుంది. కొంతకాలా నికి శరీరం వడిలిపోయి క్షీణించడం ప్రారంభిస్తుంది. ఇంకా కొంతకాలం గడిచేటప్పటికి ఆ శరీరం నశించిపో తుంది. అంత్యేష్టి సంస్కారం చేయబడుతుంది. ఈ ఆరు వికారాలూ సమస్త ప్రాణులకూ ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారాలూ లేనిది ఏదైనా ఉందా? ఉన్నది. అదే శివ. అది కాలంలో పుట్టలేదు. కాలంలో పెరగలేదు. కాలంలో ఉండలేదు. కాలంలో నశించదు. జీవి ఎవరి నుండి వచ్చిందో ఎవరి ఎందు పెరిగిందో ఎవరియందు లయిం చిందో.. వాడు మాత్రం అలాగే ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయినవాడు ఎవడు? వాడు పరబ్రహ్మం. వానికి కదలిక లేదు. వాడు ముందరా ఉన్నాడు. చివరా ఉన్నాడు. అలా ఉన్నవాడు ఎవడో వాడు నిర్వికారుడు. వానికి వికార ములు లేవు. కాబట్టి వాని జుట్టు తెల్లబడదు. వానికి ముసలితనం లేదు. వానిని కాలం లొంగదీయలేదు. కాబట్టి వాడునిత్యయౌవనుడు. అందుకే మనం శివుని గురించి చెప్పినా, అమ్మవారి గురించి చెప్పినా.. 'నమశ్శి వాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం' అంటాం. వారికి వార్ధక్యం రాదు. ఎందుచేత? మనం కాల మునకు వశులవడం చేత కాలమునందు మనకు మార్పు వస్తుంది. కాలస్వరూపంలో మనయందు మార్పులు తెచ్చే వాడు ఎవడున్నాడో వాడు మార్పునకు అతీతుడిగా సాక్షిగా ఉన్నాడు. కదిలే వస్తువుకు కదలని వస్తువు ఆధా రమై ఉంటుంది. వికారాలు కలిగిన జగత్తుకు.. ఏది వికారా లకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది. దానియందే ఈ సమస్త జగత్తూ పుట్టి పెరిగి లయిస్తున్నది. అటువం టిది ఏదో అది వికారాతీత స్థితి కలిగిన పరబ్రహ్మం. దానిని ఒక నామవాచకంతో పిలవాలని అనుకుంటే 'శివ' అని పిలువవచ్చు. కాబట్టి శివ శబ్దం పరబ్రహ్మం గురించి చెబుతోంది. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. అమరకోశంలో అమరసింహుడు ఆయన్ను 'పరమానంద రూపత్వ' అంటాడు. అంటే.. నిత్యానందాన్ని రాశీభూతం చేస్తే అదే 'శివ'. _________________________________________ HARI 🙏✍🏻 _________________________________________ #🌅శుభోదయం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం