Summer Health care

Kalam Daily
3.9K views
2 months ago
ఎండలో బయటకి వెళ్ళే ముందు ఇవి చేయండి Beat the Heat: Expert Summer Tips to Keep Your Body Cool and Safe During Intense Sun #SummerTips #HydrationTips  #SummerCare #BeatTheHeat  #Kalam #KalamDaily #KalamTelugu #ఎండాకాలం చర్మ సంరక్షణ #summer care #Summer Health care #viral #trending
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.1K views
3 months ago
వేసవిలో పిల్లలు ఎన్ని నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...! ఈ వయసు పిల్లలు ఇన్ని నీళ్లు తాగాలని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే శరీరానికి నీటి అవసరం వయసు, ఆటలు, వాతావరణం, చెమట, అనారోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. అందరూ ఒకే విధమైన జీవన శైలి, అలవాట్లను కలిగి ఉండరు. కాబట్టి అందరూ ఇంత పరిమాణంలో నీళ్లు తాగాలని చెప్పలేం. సాధారణంగా ఒకటి నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలు రోజుకు 1 లీటరు నీళ్లు తాగాలి. అయిదు నుంచి తొమ్మిదేళ్ల లోపు పిల్లలు రోజుకు 1.5 లీటర్ల నీళ్లు తాగాలి. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలు 2 లీటర్ల నీళ్లు తాగాలి. వేడి వాతావరణం, ఆటలను బట్టి దప్పిక వేస్తే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది కొంతమంది పిల్లలు నీళ్లు తాగరు. ఫ్రూట్‌ జ్యూస్‌ ఇస్తే శరీర నీటి అవసరం తీరుతుందని మార్కెట్లో ఉన్న బేవరేజ్‌ డ్రింక్స్‌ కొంటున్నారు. అవి వంద శాతం ఫ్రూట్‌ జ్యూస్‌ అంటారు. కానీ, అందులో నాన్‌ షుగర్‌ స్వీట్‌నెస్‌, యాడెడ్‌ షుగర్స్‌, రంగులు, నిల్వ రసాయనాలు కలుపుతారు. వీటితో ఆరోగ్య సమస్యలు వస్తాయి. షుగర్‌ వల్ల దంత సమస్యలు, ఒబెసిటీ వచ్చే ప్రమాదం ఉంది. వాటికి బదులుగా ఇంట్లోనే పండ్లతో జ్యూస్‌ తయారు చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. దీని నుంచి శరీరానికి కావాల్సిన నీటితోపాటు ఎనర్జీ, ఖనిజ లవణాలు కూడా అందుతాయి. తొమ్మిది నుంచి పదమూడేళ్లలోపు పిల్లలకు 180 మిల్లీ లీటర్లు జ్యూస్‌ ఇవ్వొచ్చు. 13 ఏళ్లు పైబడిన వాళ్లు 250 మిల్లీ లీటర్ల జ్యూస్‌ తాగొచ్చు. అలాగే పుచ్చకాయ, ఖర్బూజ, స్ట్రాబెర్రీ, నారింజ పండ్లు తినమని ఇవ్వాలి. పండ్ల రసాలు బయట కొన్నా రంగులు, నిల్వ రసాయనాలు, షుగర్‌ లేనివి కొనివ్వాలి. పిల్లలకు కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ అసలే కొనొద్దు. వీటిలో చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. కెఫిన్‌ కూడా ఉంటుంది. దీని వల్ల దాహం పెరుగుతుంది. పిల్లలు ఆటలు ఆడేప్పుడు నీళ్లు తాగరు. దాహమని చెప్పరు. కాబట్టి పెద్దలు గంట, అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలని పిల్లలకు చెప్పాలి. తాగకపోతే పెద్దలే తాగించాలి. #తెలుసుకుందాం #summer care #Summer Health care
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.8K views
3 months ago
మట్టితో మమేకమైన బ్రతుకులు మట్టి సువాసనని వదులుకోలేకపోతున్నాయి.. రిఫ్రిజిరేటర్లో పెట్టిన మంచినీళ్లు తాగి చాలా ఏళ్లయిపోయింది.. ఎవరింటికైనా వెళితే ఎంతో గౌరవంగా చల్లటి నీళ్ల బాటిల్ చేతికందిస్తుంటారు.. నేను అంతే మర్యాదగా ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగనని చెప్పేస్తుంటాను.. కుండలో నీళ్ళివ్వండి అంటే కుండలో నీళ్ళా?? ఈరోజుల్లో కుండలెవరు వాడుతున్నారు?? ఈ మాటలు వింటుంటే నాకు భలే నవ్వొస్తుంది.. నవ్వి ఊరుకోవడం తప్ప బదులివ్వలేను మరి!! ఇక ఈ కుండ విషయానికి వస్తే నిన్న ఊరిలోకి ఒక తాతగారు వస్తే 200పెట్టి కొన్నది మా అమ్మ.. ఆయన ఎండలో తిరుగుతున్నారు.. బేరం ఆడొద్దని ముందే చెప్పా.. అయినా సరే 230 ఇవ్వమంటే 200ఇచ్చి వచ్చింది.. పైగా నీకేం తెలీదు ఊరుకో అంటుంది!! ఇల్లు కడుతుంటే కొత్త కుండ కొనకూడదని చెప్పారట ఎవరో సాంప్రదాయ శాస్త్రవేత్తలు!! దానితో పోయిన సంవత్సరం బిందెలోని నీళ్లే తాగాము కానీ కూలింగ్ నీళ్ళ జోలికి మాత్రం పోలేదు.. నేనే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్రిడ్జ్ లో నీళ్లు నిషిద్ధం.. ఇది నేను 10ఏళ్ళ క్రితం పెట్టిన రూల్.. ఏదైనా ఫంక్షన్లకి వెళ్లినా నేను మ్యాగ్జిమం కూలింగ్ నీళ్లు తాగను.. తప్పని పరిస్థితి అయితే తప్ప!!! మా వాళ్ళు మాత్రం నిక్షేపంగా తాగేస్తారు.. అయినా ఆ నీళ్ళేందుకో చప్పగా అనిపిస్తాయి.. మట్టికుండలోని నీళ్లు మాత్రం చల్లదనంతో పాటు ఒక ప్రత్యేకమైన రుచిని అదనంగా అందిస్తాయి.. ఆరోగ్యంతో పాటు రుచిని అందించే మట్టిలోని మమకారపు మాధుర్యాన్ని ఎలా వదులుకోగలము.. వీలైతే మీరు కూడా మట్టికుండలోని నీళ్ళు తాగి ఆరోగ్యంతో పాటు మట్టి మాధుర్యాన్ని ఆస్వాదించండి..🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #Summer Health care #summer care #🩺ఆరోగ్య జాగ్రత్తలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.5K views
3 months ago
వేసవిలో మీ జేబులో / హ్యాండ్ బ్యాగ్ లో ఇవి రెండు ప్యాకెట్స్ పెట్టుకోండి, బాగా dehydration అయితే కూల్ డ్రింక్స్ తాగకండి, మజ్జిగ, కొబ్బరి బొండం లేకపోతె అన్నిటికన్నా best ఒక శాచెట్ 5 రూపాయలు ఉంటుంది , ఒక గ్లాస్ నీళ్ళల్లో లేదా మజ్జిగలో కలుపుకుని తాగండి ...! వడదెబ్బ తగలకుండా ఉంటుంది 🙏 #తెలుసుకుందాం #🩺ఆరోగ్య జాగ్రత్తలు #Summer Health care #summer care
🧿 శ్రీ లలితా పరమేశ్వరి మాత 🧿🙏
3.1K views
4 months ago
🌿💐🙏 హెచ్చరిక 🙏💐🌿 __________________________________________ ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45 o C నుండి 55 డిగ్రీ C వరకు పెరగవచ్చు. .శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే వారు జాగ్రత్త గా ఉండాలి వేడిగాలులు వీచే అవకాశం ఉంది. 🌿💐🙏 ముఖ్యంగా కార్లు ఉన్నవారు లోపల గ్యాస్ , లైటర్లు , కార్బోనేటేడ్ పానీయాలు , సుగంధద్రవ్యాలు మరియు బ్యాటరీ లు ఉంచకండి. గాలి ప్రసరణ కోసం కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచండి. కారు ఇంధన ట్యాంక్ ను పూర్తిగా నింపకండి. సాయంత్రం సమయంలో కారు లో ఇంధనం నింపండి. ఉదయం సమయంలో ప్రయాణం నివారించండి. ప్రయాణ సమయంలో టైర్ లలో అధిక గాలి నింపకండి. 🙏💐🌿🌹👍🤣 ఈ వేసవిలో ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలి . ఎక్కువగా నీరు మరియు ద్రవాలు త్రాగండి. గ్యాస్ సిలిండర్ ను ఎండలో ఉంచవద్దు. మీటర్ లపై అధిక లోడ్ వేయవద్దు. అవసరమైన గదుల్లో A.C లు ఉపయోగించండి. A.C ల కు ప్రతి 2-3 గంటలకు కనీసం 30 నిముషాలు విశ్రాంతి ఇవ్వండి. బయట ఉష్ణోగ్రత 45 - 47 డిగ్రీలు ఉన్నప్పుడు ఇంట్లో AC లు 24 - 25 డిగ్రీ ల వద్ద ఉంచండి. ----------------------------------------------------------------------- HARI BABU.G __________________________________________ #☀️వేసవి స్టేటస్🌴 #🌡️ఎండదెబ్బ నివారణ చిట్కాలు☀️ #🧴సమ్మర్ స్కిన్ కేర్☀️ #🧴సమ్మర్ స్కిన్ కేర్☀️ #🏖️సమ్మర్ ట్రిప్స్🌞 #🏖️సమ్మర్ ట్రిప్స్🌞 #🏖️సమ్మర్ ట్రిప్స్🌞 #Summer Health care
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4K views
4 months ago
అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది…* *ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు,* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు (ప్రత్యేకంగా బహిరంగ ప్రదేశాలకు) వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. *ఈ సమయంలో భూమి మీద నేరుగా 70% అతినీలలోహిత సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.* ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా అస్వస్థత కలిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచండి. మొబైల్ వినియోగాన్ని తగ్గించండి, అధిక వేడి కారణంగా మొబైల్ పేలే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులకు తెలియజేయండి. పెరుగు, మజ్జిగ, నిమ్మ పండు రసం వంటి చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోండి. *చాలా ముఖ్యమైన సమాచారం:* *పౌర రక్షణ విభాగం ప్రజలు మరియు నివాసితులకు క్రింది సూచనలు చేస్తోంది.* రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47°C నుండి 55°C వరకు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే వేడి గాలులు ఉండే అవకాశం ఉంది. *కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి:* *కార్లలో ఉంచకూడని వస్తువులు:* గ్యాస్ పదార్థాలు లైటర్లు కార్బోనేటెడ్ పానీయాలు సుగంధ ద్రవ్యాలు మరియు బ్యాటరీలు గాలి ప్రసరణ కోసం కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచండి కారు ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపకండి సాయంత్రం సమయంలో మాత్రమే కారులో ఇంధనం నింపండి ఉదయం ఈ సమయంలో కారులో ప్రయాణం చేయడం నివారించండి ప్రయాణ సమయంలో టైర్లలో అధిక గాలి నింపకండి *ఇతర జాగ్రత్తలు:* తేళ్లు మరియు పాములు చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోకి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా నీరు మరియు ద్రవాలు తాగండి గ్యాస్ సిలిండర్‌ను ఎండలో ఉంచవద్దు విద్యుత్ మీటర్లపై అధిక లోడ్ వేయవద్దు అవసరమైన గదుల్లో మాత్రమే ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి ప్రతి 2–3 గంటలకు కనీసం 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి బయట ఉష్ణోగ్రత 45–47°C ఉన్నప్పుడు, ఇంట్లో ACని 24–25°C వద్ద ఉంచండి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా సూర్యకాంతిని తప్పించండి *చివరిగా:* *ఈ సమాచారాన్ని తప్పనిసరిగా ఇతరులతో పంచుకోండి. చాలా మందికి ఇది తెలియకపోవచ్చు.* *మీరు మొదటిసారి చదువుతున్నవారిలో ఒకరై ఉండవచ్చు.* *ఇట్లు* *సివిల్ రక్షణ విభాగం* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #summer #summer care #Summer Health care
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
753 views
5 months ago
భూలోకంలో* అమృతం మజ్జిగ* 💥💥💥💥💥💥💥💥💥 సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్‌! తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే! సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్‌ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్‌ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం . పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది.. అదే మజ్జిగ. మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. అన్నంలో కూడా తినవచ్చు. పెరుగుని చిలికి, దానికి మూడు నుంచి ఎనిమిది రెట్లు నీళ్లు పోసి, రాత్రంతా ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటే ఉంచాలి. ఉదయాన్నే అందులో సైంధవ లవణం, జీలకర్ర, కాల్చిన శొంఠి దంచి, ఆ పొడి తగుపాళ్లలో కలిపి రోజూ తాగితే వాతం, పైత్యం, కఫ దోషాలు పోతాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాసు, మంట తగ్గుతాయి. మొలల వ్యాధి కూడా తగ్గుతుంది. అజీర్తి పోతుంది. షుగరు, బీపీ, స్థూలకాయం, కీళ్లవాతం, చర్మ వ్యాధులు. సైనసైటిస్‌, మైగ్రేన్‌ తలనొప్పికి మంచి ఔషధం. ఈ అద్భుత పానీయం ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉంది, పెరిగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ పేగు ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఎందుకంటే ఇంకా ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లకు మంచి మూలం, మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శొంఠి, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, కమలాపండు పైన తొక్కలను తగు పాళ్లలో తీసుకొని, దంచి, ఆ పొడిని చిలికిన మజ్జిగలో కలపాలి. ఇంగువ పొంగించిన నెయ్యితో తిరగమోత పెడితే ఆ మజ్జిగని ‘గౌరీ తక్రం’ అంటారు. దీన్ని పార్వతీదేవి శివుడి కోసం తయారు చేసిందన్నాడు క్షేమశర్మ. ఇది ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. సమస్త వ్యాధుల్లోనూ ఔషధం. దీని రుచి ‘దివ్యం’ అన్నాడు. పులిసిన మజ్జిగలో ఎనిమిది రెట్లు నీళ్లు కలిపి, ఔషధంగా మలుచుకోవచ్చు. వాత వ్యాధుల్లో సైంధవ లవణం (పింక్‌ సాల్ట్‌), పైత్య వ్యాధుల్లో చక్కెర, కఫ వ్యాధుల్లో శొంఠి, పిప్పలి, మిరియాల పొడి కలిపి తాగాలన్నాడు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం. ఈ పానీయం బాడీకి చేసే మేలు అంతా ఇంతా కాదు. కూల్‌ డ్రింక్స్‌ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. 1. వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి. 2. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 3. కాల్షియం లోపం ఉన్న‌వారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. 4. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. 5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది. పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు. 6.పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిన్నటి మజ్జిగ మిగిలిపోతే ఒక వస్త్రంలో పోసి, మూటగట్టి, వడగట్టండి. సైంధవ లవణం, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, ఇంగువ, ఆవాలు, మెంతులు దంచి, ఆ పొడిని తగినంత కలిపిన మజ్జిగని ‘అచ్చిక’ అంటారు. ఇది అన్ని దోషాల మీదా పని చేస్తుంది. ముఖ్యంగా అజీర్తిని పోగొడుతుంది. భోజనం చేసిన తరువాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా మజ్జిగని ఎంచుకుని, రోజూ తాగుతుంటే భుక్తాయాసం కలగదు. తీసుకున్న ఆహారం తేలికగా అరుగుతుంది. అన్నంలో విష దోషాలు పోతాయి. చర్మానికి మంచి కాంతి వస్తుంది. స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు ఉత్తేజం కలుగుతుంది. షుగరు రోగులు ఈ మజ్జిగని తాగితే షుగరు త్వరగా అదుపులోకి వస్తుంది... కన్నతల్లి ప్రేమ లాంటి💥 మజ్జిగ 💥 రోజూ పిల్లలు..పెద్దలు..తప్పనిసరిగా ఈ వేసవి కాలం తీసుకుందాం .చల్లగా ఆరోగ్యంగా ఉందాము.. #వేసవి పానీయాలు #summer drinks #summer drinks #Summer Health care