ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత

PSV APPARAO
548 views
14 hours ago
#శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు అధ్యాత్మిక విశిష్ఠత కామిక ఏకాదశి / అజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత 🕉️ నారాయణ తే నమో నమః 🙏 #కామిక ఏకాదశి *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి...* భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును. ⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. ⚜️ మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ⚜️ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. ⚜️ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. ⚜️ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. ⚜️ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ⚜️ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ⚜️ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు. ⚜️ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ...... ⚜️ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది... పారాయణం అనంతరం మీ పేరు, చిరునామా ఫోన్ నంబర్ మా వాట్సాప్ నెంబర్ +919700722711 కు మెసేజ్ చేయగలరు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
P.Venkateswara Rao
607 views
7 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి *🕉️🌺 సంకటహర చతుర్థి విశిష్టత 🌺🕉️* 🙏 సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్ష చతుర్థి రోజున ఆచరిస్తారు. ఈ రోజు శ్రీ గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అన్ని విఘ్నాలు, కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రాలు 🌺 🕉️🙏 సంకటహర చతుర్థి పూజ విధానం 🙏🕉️ 🌺 సంకటహర చతుర్థి రోజున శ్రీ గణపతి స్వామిని ఈ విధంగా పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 🌅 ఉదయం 🛁 స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. 🪔 పూజా స్థలాన్ని శుభ్రపరచి గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి. 🌼 దీపం వెలిగించి ధూపం సమర్పించండి. 🌺 పూజకు కావలసిన సామగ్రి 🍃 దూర్వ (గరిక) 🌺 ఎర్ర పూలు లేదా జపా పుష్పాలు 🍌 అరటిపండ్లు 🥥 కొబ్బరికాయ 🍬 మోదకాలు లేదా ఉండ్రాళ్లు 🍎 పండ్లు 🪔 కర్పూరం, ధూపం, దీపం 💧 అక్షింతలు, గంధం, కుంకుమ 🙏 పూజ చేసే విధానం 🔸 గణపతికి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. 🔸 గరిక (దూర్వ) సమర్పించండి. 🔸 ఎర్ర పూలతో అర్చన చేయండి. 🔸 మోదకాలు లేదా ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టండి. 🔸 "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని 21, 54 లేదా 108 సార్లు జపించండి. 🔸 సంకటనాశన గణేశ స్తోత్రం లేదా గణేశ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. 🌙 చంద్రోదయం తర్వాత 🌕 చంద్రునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. 🙏 గణపతికి కర్పూర హారతి ఇవ్వండి. 🍌 నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో ప్రసాదంగా స్వీకరించండి. 🌼 ఈ రోజు పాటించాల్సినవి ✅ సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండండి. ✅ కోపం, అబద్ధం, చెడు మాటలు నివారించండి. ✅ గోవులకు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయండి. ✅ గణపతి నామస్మరణతో రోజంతా గడపండి. 🌺 పూజ ఫలితాలు ✨ విఘ్నాలు తొలగుతాయి 💰 ధన, ఐశ్వర్యాలు కలుగుతాయి 📚 విద్యలో, ఉద్యోగంలో విజయం లభిస్తుంది 👨‍👩‍👧 కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది 🙏 మనసుకు ప్రశాంతత, గణపతి స్వామి అనుగ్రహం లభిస్తుంది. 🌺 శ్రీ గణేశాయ నమః 🐘🙏 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా॥ 🕉️🌸 1శ్లోకం🌺ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ । భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ॥ 📖 అర్థం: 🙏 గౌరీదేవి కుమారుడైన వినాయకుడికి నమస్కరిస్తూ, ఆయన్ను ప్రతిరోజూ స్మరిస్తే దీర్ఘాయుష్షు, కోరికలు, ధర్మ–అర్థ–కామ ఫలితాలు లభిస్తాయి. 🌺 శ్లోకం 2 య్కప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం । తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం ॥ 📖 అర్థం: 🐘 గణపతి స్వామి వివిధ దివ్యరూపాలను స్మరించడం ద్వారా విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి. 🌺 శ్లోకం 3 లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ । సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 📖 అర్థం: 🌺 గణపతి నామాలను భక్తితో జపిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి. 🌺 శ్లోకం 4 నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ । ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ॥ 📖 అర్థం: 🌸 ఈ పవిత్ర నామాలను స్మరించిన వారికి శుభం, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి. 🌺 శ్లోకం 5 ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః । న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥ 📖 అర్థం: 🙏 ఈ పన్నెండు నామాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జపించిన వారికి విఘ్నాలు ఉండవు. అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది. 🌺 జపించడం వల్ల కలిగే ఫలితాలు 🌼 విఘ్నాలు తొలగుతాయి 💰 ధనలాభం కలుగుతుంది 📚 విద్యలో విజయం 💼 ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి 👨‍👩‍👧 కుటుంబ సుఖశాంతి 🕉️ మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి 🌺🙏
PSV APPARAO
629 views
7 days ago
#శ్రీ కృష్ణుడు కుచేలుడి స్నేహం #నిజమైన స్నేహితులు #నిజమైన స్నేహితులు మీరే #నిజమైన స్నేహబంధం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *చిన్న వయసులో వేద పాఠశాలలో శ్రీ కృష్ణుడు కుచేలుడు అత్యంత స్నేహితులు గా మెలిగారు వారికి తెలియదు ఒకరు రాజు మరొకరు పేద అని, విద్యా కాలం మొత్తం పూర్తి అయ్యింది ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు, ఒకనాడు స్నేహితుడైన శ్రీకృషుడ్ని కలవడానికి కటిక పేద బ్రహ్మణుడు కుచేలుడు వచ్చాడు భటులు అంతః పురంలోనికి ప్రవేశపెట్టలేదు, దివ్యశక్తి గల కృష్ణుడు ఆ విషయాన్ని గ్రహించి తానే స్వయంగా కుచేలుడ్ని భుజం మీద చేయి వేసుకుని లోపలకు తీసుకు వెళ్ళాడు, రాజ భవనం లోపలకు వెళ్లాక అర్ధం అయ్యింది శ్రీకృష్ణుడు ఎంత గొప్ప వాడో అని నాలాంటి పేద వాడికి లోపలకు ప్రవేశించే అర్హత లేదు అని వెనుదిరగ బోయాడు కుచేలుడు, మిత్రమా లోపలకు రమ్ము అని చేయి పట్టుకుని తీసుకు వెళ్ళి ఆసనం వేసి కూర్చోబెట్టి పాదాలు కడిగి అతిధి మర్యాదలు చేసి నాకోసం ఏమి తెచ్చావు మిత్రమా అని శ్రీకృష్ణుడు అడిగినపుడు తన చిరిగిన వస్త్రంలో కొంగుకు ముడి వేసి తెచ్చిన అటుకులు ఇచ్చాడు, అమ్మకండగా తిని స్నేహితునికి గొప్ప వరాన్ని ఇచ్చాడు, ఆనాటి నుండి స్నేహితుల దినోత్సవ వైభవం వెలుగులోకి వచ్చింది... నన్ను నన్నుగా అభిమానించే ప్రియమైన మిత్రులకు శ్రేయోభిలాషులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!* *మీ పొలిమేర శివ వెంకట అప్పారావు!* P S V APPPARAO (Gopalapatnam🇮🇳Visakhapatnam) 💐🤝💐🤝💐🤝💐🤝💐🤝💐
PSV APPARAO
836 views
15 days ago
#అలా పండరిపురంలో "వార్కరీ ఉత్సవం" జయ జయ పాండురంగ విఠలా! #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 *పండరీపురం పాండురంగ ఉత్సవం* *పండరీపురం పాండురంగ ఉత్సవం* > ఓం నమో పాండురంగాయ > ఓం నమో పుండరీక వర్మయా > ఓం నమో నారాయణాయ > ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు. పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
439 views
15 days ago
#ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) సమాచారం ప్రతి రోజు మీకోసం #ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) భక్తిసమాచారం ప్రతి రోజు మీకోసం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత _*🚩ఈరోజు తొలి ఏకాదశి , శయన ఏకాదశి🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?* హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి – విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. *తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు* మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు. *ఉపవాస ఫలితాలు:* ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. *ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.* ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. *తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..* ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు. *ప్రాశస్త్యం* ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. *_🙏🙏🙏🙏🙏🙏_*
PSV APPARAO
514 views
15 days ago
#ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) భక్తిసమాచారం ప్రతి రోజు మీకోసం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ధర్మ ద్వజం #ధర్మద్వజం #తొలి ఏకాదశి _*🚩ఈరోజు తొలి ఏకాదశి , శయన ఏకాదశి🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?* హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి – విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. *తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు* మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు. *ఉపవాస ఫలితాలు:* ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. *ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.* ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. *తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..* ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు. *ప్రాశస్త్యం* ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. *_🙏🙏🙏🙏🙏🙏_*
PSV APPARAO
625 views
22 days ago
#మధురై మీనాక్షి వైభవం 🕉️🔱🕉️ మధురై క్షేత్రంలో ఉత్సవాలు 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత ##మధురై మీనాక్షి🙏 #మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్, మధురై #మధురై మీనాక్షి #మధురై మీనాక్షి మంగళ్య పూజ 🔱🕉️🙏 *మధురై మీనాక్షి మాంగళ్య పూజ :* మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నిర్వహించే "మాంగళ్య పూజ" వివాహిత మహిళలకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సేవ. ఈ పూజలో పాల్గొనే మహిళలు తమ భర్తలకు ఆయురారోగ్యాలు, కుటుంబానికి సుఖశాంతులు చేకూరాలని, తమ మాంగళ్య బంధం చిరకాలం సుస్థిరంగా ఉండాలని శ్రీ మీనాక్షి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తారు. పూజా విధానంలో భాగంగా పసుపు, కుంకుమ, మంగళసూత్రం, గాజులు, చీర వంటి సౌభాగ్య ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, అనంతరం వాటిని పరమ పవిత్రమైన ప్రసాదంగా స్వీకరించి ధరిస్తారు. ఈ పూజను ఆచరించడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి వర్ధిల్లుతాయని, అలాగే వివాహం ఆలస్యమవుతున్న అమ్మాయిలకు శీఘ్రంగా శుభ వివాహ యోగం కలుగుతుందని భక్తుల బలమైన విశ్వాసం.
PSV APPARAO
704 views
1 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: యోగిని ఏకాదశి - ప్రాముఖ్యత 🙏🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🕉️🙏యోగిని ఏకాదశి విశిష్టత 🌺☪️👩‍👩‍👧‍👦🌧️ #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #డైలీ విష్ #వైష్ణవ యోగిని ఏకాదశి *యోగినీ ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు?* ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని యోగినీ ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో ఈ ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త పాపాలు తొలగి, జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. 2026 సంవత్సరంలో యోగినీ ఏకాదశి వ్రతం జూలై 10, శుక్రవారం ఆచరించబడుతుంది. శుభ ముహూర్తాలు ఏకాదశి తిథి ప్రారంభం: 2026 జూలై 10, శుక్రవారం ఉదయం 8:16 గంటలకు ఏకాదశి తిథి ముగింపు: 2026 జూలై 11, శనివారం ఉదయం 5:22 గంటలకు పారణ సమయం: 2026 జూలై 11 మధ్యాహ్నం 1:50 గంటల నుంచి సాయంత్రం 4:56 గంటల వరకు వ్రత తేదీ విషయంలో అయోమయం వద్దు జూలై 11న సూర్యోదయం అనంతరం కొద్దిసేపటికే ఏకాదశి తిథి ముగియనున్నందున, శాస్త్ర నియమాల ప్రకారం గృహస్థులు జూలై 10, శుక్రవారం ఉపవాసం చేయాలి. అయితే వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తులు జూలై 11న వ్రతాన్ని ఆచరించవచ్చు. యోగినీ ఏకాదశి మహిమ పద్మ పురాణం ప్రకారం, యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. తెలిసి–తెలియక చేసిన పాపాల ప్రభావం తొలగిపోతుంది. పురాణ కథనం ప్రకారం, కుబేరుని సేవకుడు హేమమాలి శివుని శాపం వల్ల కుష్ఠురోగానికి గురయ్యాడు. అనంతరం మార్కండేయ మహర్షి సూచనతో యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించగా, అతను పూర్తిగా రోగ విముక్తుడై, అందమైన రూపాన్ని తిరిగి పొందాడు. అందువల్ల శారీరక బాధలు, వ్యాధుల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని అత్యంత ఫలప్రదమైనదిగా భావిస్తారు. యోగినీ ఏకాదశి పూజా విధానం యోగినీ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవిని కలిసి పూజించాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. చేతిలో నీరు తీసుకుని వ్రత సంకల్పం చేయాలి. ఇంటి పూజామందిరంలో విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పసుపు పూలు, పండ్లు, అక్షతలు, గంధం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో తులసీదళం తప్పనిసరిగా ఉంచాలి, ఎందుకంటే తులసి లేకుండా శ్రీమహావిష్ణువు నైవేద్యాన్ని స్వీకరించరని శాస్త్రం చెబుతోంది. పూజ సమయంలో యోగినీ ఏకాదశి వ్రతకథను చదవాలి లేదా వినాలి. చివరగా "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని జపిస్తూ శ్రీమహావిష్ణువుకు హారతి ఇవ్వాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
PSV APPARAO
1.2K views
1 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #గణపతి ఆరాధన #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కృష్ణపింగళ సంకష్టి చతుర్థి / గణేశారాధన 🙏 *కృష్ణపింగళ సంకష్టి చతుర్థి* కృష్ణపింగళ సంకష్టి చతుర్థి రోజును శ్రీ గణేశుని ఆరాధనకు అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. హిందూ ధర్మంలో సంకష్టి చతుర్థికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాస కృష్ణపక్ష చతుర్థిని కృష్ణపింగళ సంకష్టి చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ గణేశుని కృష్ణపింగళ స్వరూపాన్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని ఎంతటి పెద్ద కష్టాలైనా తొలగిపోతాయని, నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తవుతాయని విశ్వాసం. మీరు కూడా ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలనుకుంటే, పూజ ప్రారంభించే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, చేయవలసినవి, చేయకూడనివి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. _కృష్ణపింగళ సంకష్టి చతుర్థి_ పంచాంగం ప్రకారం, 2026 జూలై 3వ తేదీ ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై, జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆధారంగా కృష్ణపింగళ సంకష్టి చతుర్థి వ్రతాన్ని 2026 జూలై 3వ తేదీన ఆచరిస్తారు. 📿🙏📿 కృష్ణపింగళ సంకష్టి చతుర్థి రోజున ఏమి చేయాలి?📿🙏📿 ఈ రోజున ఉదయాన్నే త్వరగా నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించి శ్రీ గణేశుని ధ్యానించాలి. పూజా స్థలాన్ని పరిశుభ్రంగా శుభ్రపరచి, అక్కడ శ్రీ గణేశుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. ఆయనకు దూర్వా గడ్డి, ఎర్రని పుష్పాలు, సింధూరం, మోదకాలు, లడ్డూలు మరియు పండ్లు సమర్పించాలి. అనంతరం గణేశ చాలీసా పారాయణం చేయడం లేదా "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. వ్రతాన్ని ఆచరిస్తున్నవారు రోజంతా ఇంద్రియనిగ్రహంతో, సాత్విక జీవనాన్ని పాటించాలి. సాయంత్రం మరల శ్రీ గణేశునికి పూజ నిర్వహించి, చంద్రుని దర్శనం అనంతరం చంద్రునికి అర్ఘ్యం సమర్పించి వ్రతాన్ని విరమించాలి. తమ శక్తి మేరకు అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం లేదా ధనదానం చేయడం కూడా ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 📿🙏📿 కృష్ణపింగళ సంకష్టి చతుర్థి రోజున ఏమి చేయకూడదు?📿🙏📿 ఈ రోజున మాంసం, చేపలు, మద్యం వంటి తామసిక ఆహారాలతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా సేవించకూడదు. వ్రత సమయంలో కోపం, అసత్యం, పరుషవాక్యాలు మాట్లాడటం, ఇతరులను అవమానించడం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి. ధార్మిక సంప్రదాయం ప్రకారం శ్రీ గణేశుని పూజలో తులసీ దళాలను సమర్పించరాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇంటిలో అనవసరమైన వాగ్వివాదాలు, కలహాలు జరగకుండా చూసుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు మనసులో స్థానం ఇవ్వకుండా, ప్రశాంతతతో, భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించడం అత్యంత మంగళకరంగా భావించబడుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
PSV APPARAO
1K views
1 months ago
#శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి సందర్భంగా* _నారదమహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయి._ ఓం శ్రీ గణేశాయ నమః ఓం గం గణపతయే నమః #శ్రీ_సంకటనాశన_గణేశ_స్తోత్రం నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం | భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 | ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం | తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 | లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 | నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం | ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 | ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 | విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం | పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 | జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ | సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 | అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 | *|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||* *ఓం శాంతిః శాంతిః శాంతిః* *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_