ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత

PSV APPARAO
822 views
14 days ago
#గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సంకష్టహర చతుర్థి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺 *అంగరక చతుర్థి* 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. "ఓం గం గణపతయే నమః" పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
587 views
14 days ago
#శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి *సంకటహర చతుర్థి శుభాకాంక్షలు* *సంకటనాశన గణేష్ స్తోత్రం* ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్. జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
574 views
17 days ago
#🎉హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏 #హనుమాన్ జయంతి 🔱 హనుమాన్ విజయోత్సవం 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🕉️శ్రీ ఆంజనేయం #హనుమాన్ విజయోత్సవం సందర్భంగా స్వామి వారి దివ్య మంగళ నిరాజన దర్శనం 🪔🔱🕉️🙏🏻 2nd April 2026 *హనుమద్విజయోత్సవం* : ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి. దానినే మనవారు హనుమద్విజయోత్సవం అంటారు. ఒరియా ప్రజలు మేష సంక్రాంతినాడు హనుమజ్జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మార్గశిరంలోనే శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమద్ర్వతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠమాసంలో సువర్చలా హనుమంతుల కల్యాణం నిర్వహిస్తారు. హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు. ఓటమి లేదు. లక్ష్యసాధనలో తనకంటూ ఒక నిర్దుష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు. అమేయ బలపరాక్రమ సంపన్నుడైనా అంతా రామనామ మహిమ అనే ఒక్కమాటతో అచంచలమైన స్వామిభక్తిని ప్రకటించే దాసానుదాసుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం. చైత్రపౌర్ణమికి భక్తులు హనుమద్దీక్షా స్వీకారం చేస్తారు. హనుమద్దీక్షా పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షాస్వీకారానికి అర్హులే.
PSV APPARAO
555 views
17 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమాన్ జయంతి 🔱 హనుమాన్ విజయోత్సవం 🕉️🙏 #శ్రీ హనుమదష్టకం 🔱 శ్రీమద్దనుమదష్టకమ్ 🕉️🙏 #🎉హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏 #హనుమాన్ విజయోత్సవం సందర్భంగా స్వామి వారి దివ్య మంగళ నిరాజన దర్శనం 🪔🔱🕉️🙏🏻 2nd April 2026 *హనుమద్విజయోత్సవం* : ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి. దానినే మనవారు హనుమద్విజయోత్సవం అంటారు. ఒరియా ప్రజలు మేష సంక్రాంతినాడు హనుమజ్జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మార్గశిరంలోనే శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమద్ర్వతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠమాసంలో సువర్చలా హనుమంతుల కల్యాణం నిర్వహిస్తారు. హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు. ఓటమి లేదు. లక్ష్యసాధనలో తనకంటూ ఒక నిర్దుష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు. అమేయ బలపరాక్రమ సంపన్నుడైనా అంతా రామనామ మహిమ అనే ఒక్కమాటతో అచంచలమైన స్వామిభక్తిని ప్రకటించే దాసానుదాసుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం. చైత్రపౌర్ణమికి భక్తులు హనుమద్దీక్షా స్వీకారం చేస్తారు. హనుమద్దీక్షా పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షాస్వీకారానికి అర్హులే.
PSV APPARAO
561 views
17 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమాన్ జయంతి 🔱 హనుమాన్ విజయోత్సవం 🕉️🙏 #🕉️శ్రీ ఆంజనేయం #శ్రీ హనుమదష్టకం 🔱 శ్రీమద్దనుమదష్టకమ్ 🕉️🙏 #హనుమత్ విజయోత్సవం శ్రీ హనుమదష్టకం 🔱 శ్రీమద్దనుమదష్టకమ్ 🕉️🙏 శ్రీరఘురాజపదాబ్జనికేతన పంకజలోచన మంగళరాశే చండమహాభుజదండ సురారివిఖండనపండిత పాహి దయాళో । పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 1 ॥ సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః । కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుంజలవేన విభో వై త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 2 ॥ సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం ప్రాప్య సుదుఃఖసహస్రభుజంగవిషైకసమాకులసర్వతనోర్మే । ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 3 ॥ సంసృతిసింధువిశాలకరాలమహాబలకాలఝషగ్రసనార్తం వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుమ్ । కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీనమనన్యగతిం మాం త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 4 ॥ సంసృతిఘోరమహాగహనే చరతో మణిరంజితపుణ్యసుమూర్తేః మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసంధేః । మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథం చిదమేయం త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 5 ॥ సంసృతివృక్షమనేకశతాఘనిదానమనంతవికర్మసుశాఖం దుఃఖఫలం కరణాదిపలాశమనంగసుపుష్పమచింత్యసుమూలమ్ । తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 6 ॥ సంసృతిపన్నగవక్త్రభయంకరదంష్ట్రమహావిషదగ్ధశరీరం ప్రాణవినిర్గమభీతిసమాకులమందమనాథమతీవ విషణ్ణమ్ । మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేంద్రియకామం త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 7 ॥ ఇంద్రియనామకచోరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖండితకాయమ్ । త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాళో త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 8 ॥ బ్రహ్మమరుద్గణరుద్రమహేంద్రకిరీటసుకోటిలసత్పదపీఠం దాశరథిం జపతి క్షితిమండల ఏష నిధాయ సదైవ హృదబ్జే । తస్య హనూమత ఏవ శివంకరమష్టకమేతదనిష్టహరం వై యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసమ్ ॥ 9 ॥ ఇతి శ్రీ మధుసూదనాశ్రమ శిష్యాఽచ్యుతవిరచితం శ్రీమద్దనుమదష్టకమ్ । #namashivaya777 *నిరంతరం ఆధ్యాత్మికం* https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
PSV APPARAO
597 views
17 days ago
#హనుమాన్ జయంతి 🔱 హనుమాన్ విజయోత్సవం 🕉️🙏 #హనుమాన్ విజయోత్సవం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమత్ విజయోత్సవం #హనుమాన్ విజయోత్సవం💐🎂 *శ్రీ ఆంజనేయం* *హనుమత్ విజయోత్సవం* *మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం* *వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి* మనోవేగ వాయువేగములవంటి వేగముగలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానరజాతిలో ముఖ్యుడు, శ్రీరామదూత హనుమత్ విజయోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. హసుమంతుడు వాయుపుత్రుడు. అంజనా తనయుడు. పుంజికస్థల అనే అప్సరస శాపకారణంగా కుంజరుడనే వానరశ్రేష్ఠునికి కుమార్తెగా అంజనాదేవిగా జన్మించింది. ఆమెను కేసరి అనే వానరుడికిచ్చి వివాహం చేశారు. వారు చాలాకాలం సంసారం చేశాడు. సంసారంతో విసిగిపోయిన కేసరి తపస్సుకు వెళ్తూ వాయుదేవుడిని ఆరాధిస్తూ కాలం గడపమని చెప్పి వెళ్ళాడు. భర్త ఆజ్ఞమేరకు అంజనాదేవి వాయుదేవుడిని సేవిస్తూ ఉండేది. అంజన భక్తికి వాయుదేవుడు ప్రసన్నుడై తన గర్భమందున్న శివుడి తేజస్సు ఆమెకు యివ్వగా ఆమె గర్భం దాల్చింది. అలా ఆమెకు జన్మించిన కుమారుడే ఆంజనేయస్వామి! _చిరంజీవి హనుమ_ హనుమంతునికి చిరంజీవి అనే మరోపేరుంది. ఆయన చిరంజీవి కావడానికి, హనుమంతుడనే పేరు ఏర్పడడం వెనుక ఆసక్తికరమైన గాథ వుంది. ఆంజనేయుడు చిన్నతనంలో ఒకరోజు ఆకలిగా వున్న సమయంలో సూర్యుడిని పండుగా భావించి పట్టుకొనబోయాడు.. ఆ రోజు సూర్యగ్రహణం కనుక సూర్యభగవానుడిని మింగేందుకు రాహువు వచ్చి సిద్ధంగా వున్న సమయంలో ఆంజనేయుడు సూర్యుడిని పట్టుకొనబోవడంతో, ఈ విషయాన్ని ఇంద్రుడి వద్దకు వెళ్ళి రాహువు వివరించాడు. దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఆంజనేయుడి వద్దకు చేరి... తన చేతిలో వున్న వజ్రాయుధంతో ఆంజనేయుడి దవడపై కొట్టాడు. ఈ దెబ్బకు ఆంజనేయుడు స్పృహ తప్పిపోయాడు. తన కుమారుడు స్పృహతప్పడం చూసి ఆవేశానికిలోనైన వాయుదేవుడు వాయువును స్తంభింపజేశాడు. గాలి లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి. దేవతలందరు వాయుదేవుడి వద్దకు వచ్చి.. వాయుదేవుడి కోపానికి కారణం కనుక్కుని.. ఆంజనేయుడి వద్దకు చేరి అనేక వరాలను ప్రసాదించారు. ఈ వరాలవల్ల ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడు. అంతేకాకుండా రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లిన సమయంలో సంజీవినీ పర్వతం తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించినందుకు సంతోషించి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడిని చిరంజీవిగా ఆశీర్వదించినట్లు కథనం. కాగా, ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వల్ల ఆంజనేయస్వామి వారి దవడకు దెబ్బతగిలి. సొట్టపోయింది. దవడను హనువు అంటారు. హనువు దెబ్బతినడం వల్ల ఆంజనేయస్వామి వారికి హనుమంతుడు అనే పేరు ఏర్పడింది. _కీర్తిస్తే పొంగిపోయే హనుమ_ దేవతల నుంచి అనేక వరాలను పొందిన ఆంజనేయుడు వరబలం, బాల్యచేష్టలతో మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి అల్లరి పనులు చేయసాగాడు. దీనితో దేవతలు ప్రసాదించిన వరాలను గురించి తెలిసిన మహర్షులు ఆంజనేయుడిని ఏమీ అనేవారు కాదు. రానురానూ అల్లరి పనులు అధికం కావడంతో మహర్షులు - "ఏ బలంతో నీవు మమ్ములను బాధిస్తూవున్నవో... ఆ బలం నీకు తెలియకుండా పోతుంది. ఎదుటివారు చెబితే గానీ నీ బలం నీకు తెలియదు. నీ కీర్తి పొగిడే కొద్దీ నీ బలం వృద్ధి అవుతుంది" అని శపించారు. అందువల్ల ఆంజనేయుడు తన బలాన్ని తాను మర్చిపోయినట్లు కథనం. అందువల్లనే స్వామి వారిని కీర్తిస్తే ఆయన బలం వృద్ధి చెంది.. పొంగిపోయి సహాయం చేస్తాడు. _నవవ్యాకరణ పండితుడు_ శ్రీ ఆంజనేయస్వామి వారికి విద్య నేర్పిన గురువు సూర్యభగవానుడు! ఒకసారి ఆంజనేయుడు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి వద్దకు వెళ్ళి "నేను మీ వద్ద విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను" అని చెప్పాడు. దీనితో "నేను నిరంతరం సంచరిస్తుంటాను కదా! నా దగ్గర విద్యను ఏవిధంగా నేర్చుకుంటావు?" అని ప్రశ్నించాడు. సూర్యుడి మాటలను వింటూనే ఆంజనేయుడు శరీరాన్ని పెద్దది చేసి ఉదయాద్రిపై ఒక కాలుసు, అస్తాద్రిపై మరోకాలును వుంచి నిలబడ్డాడు. సూర్యుడు ఆంజనేయుడి శక్తిని చూసి ఆశ్చర్యపడి విద్య నేర్పడానికి అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుడి ముందు నడుస్తూ విద్యను నేర్చకున్నాడు. వేద వేదాంగాలు, సకలశాస్త్రాలను నేర్చుకుని నవవ్యాకరణ పండితుడుగా ఆంజనేయుడు పేరు పొందాడు. ఆయన భాషా పటిమను రామాయణంలో పలుచోట్ల చూడవచ్చు. _సిందూరప్రియుడు_ ఆంజనేయస్వామి సిందూరప్రియుడు. స్వామి వారి నుదుట సిందూరాన్ని ధరింపజేయడం, శరీరమంతా సిందూరం పూయడం హనుమదాలయాల్లో చూస్తుంటాం. సిందూరం అంటే ఆంజనేయుడికి ఇష్టం కావడానికి వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఒకటి వుంది. ఒకనాడు హనుమంతుడు. సీతాదేవి వద్దకు వెళ్ళి "నాకు ఆకలిగా వుంది ఏమైనా తినేందుకు పెట్టండి" అని సీతాదేవిని అడిగి వేచి ఉన్నాడు. స్నానం అనంతరం తిలకధారణలో భాగంగా, పాపిట. సిందూరమును ధరించి వచ్చిన సీతాదేవిని చూసిన ఆంజనేయుడు -"అమ్మా! నుదుట తిలకం ధరించారు కదా! ఇంకా పాపిటపై సిందూరం ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఈ విధంగా ధరించడం వల్ల నీ స్వామి వారికి ఆయుషు వృద్ధి చెందుతుంది" అని సమాధానం యిచ్చింది. మరునాడు ఆంజనేయుడు శిరస్సు నుండి పాదాల వరకూ శరీరమంతా సిందూరాన్ని ధరించి సభకు వచ్చాడు. ఆంజనేయుడి “వేషధారణ చూసి సభలోని వారందరూ నవ్వడం ప్రారంభించారు. దీనితో శ్రీరామచంద్రమూర్తి - ఆంజనేయుడు సిందూరంను శరీరమంతా పూసుకొనుటకు కారణం తెలుసుకుని సంతోషించి- "హనుమా! నీ వంటి అనన్యభక్తుడు మరొకడు వుండడు. ఈ రోజు మంగళవారం. మంగళవారం నాడు నిన్ను ఎవరైతే సిందూరంతో పూజిస్తారో... వారికి నేను. ప్రసన్నుడనై వారి కోరికలను నెరవేరుస్తాను" అని వరం ప్రసాదించారు. _తమలపాకులంటే ఇష్టం_ ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించడం ఆచారం. ఆంజనేయస్వామి వారికి తమలపాకులంటే ఇష్టం కలగడానికి వెనుక ఓ గాథ వుంది. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన కొంతకాలం తర్వాత ఒకనాడు ఆంజనేయుడు మధ్యాహ్న సమయంలో అంతఃపురంలోని శ్రీరామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో భోజనాంతరం సీతాదేవి శ్రీరాముడికి తమలపాకులు మడిచి అందిస్తూ వుంది. శ్రీరాముడు తాంబుల సేవనం చేస్తూ వున్నారు. శ్రీరాముల వారి నోరు ఎరుపుగా వుండడం చూసిన ఆంజనేయుడు- "స్వామీ! తమరి నోరు ఎరుపుగా వుంది. అందుకు కారణం ఏమిటి?" అని ప్రశ్నించాడు. దీనితో "ఇవి తమలపాకులు, వీటిలో పోకచెక్కలు, సున్నంవేసి భోజనానంతరం సేవించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది" అని సీతాదేవి సమాధానం ఇచ్చింది. ఈ మాటలను విన్న హనుమంతుడు. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత శరీరమంతా తమలపాకులను అలంకరించుకుని గంతులు వేస్తూ వచ్చాడు. దీనిని చూసిన రాముడు నవ్వుతూ-"ఎందుకు తమలపాకులను శరీరమంతా అలంకరించుకున్నావు?" అని హనుమంతుడిని ప్రశ్నించాడు. "నోటిలో కొన్ని ఆకులను వేసుకుంటేనే -మీ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది కదా.... మీ ఆరోగ్యం ఎంతో వృద్ధి చెందాలని నేను శరీరమంతా తమలపాకులను ధరించాను" అని హనుమంతుడు సమాధానం ఇచ్చాడు. ఈ మాటలను విని ఆంజనేయుడిని మెచ్చుకున్న శ్రీ సీతారాములు"నీకు తమలపాకులతో ఎవరైతే పూజలు చేస్తారో.... వారికి సకలసౌభాగ్యములు కలుగుగాక" అని వరం ప్రసాదించారు. ఆంజనేయస్వామి ఎంత మహిమాన్వితులో వారి వాలం కూడా అంతే పవిత్రం, హనుమంతునికి తోక పూజను నలభై రోజులపాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయస్వామి ప్రదక్షిణల ప్రియుడు. #namashivaya777 *నిరంతరం ఆధ్యాత్మికం* https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
PSV APPARAO
540 views
18 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్ర ఉత్సవం (ఉత్తర నక్షత్రం) సందర్భంగా శబరిమలలో స్వామి వారి సేవ 🙏 #అయ్యప్ప స్వామి వైభవం 🔱 శబరిమల ఉత్సవాలు 🔱🕉️🙏 #శబరిమల అయ్యప్పస్వామి ఆలయం #శబరిమల న్యూస్..📰!!! 🔔 *స్వామి శరణం* 🔔 *అయ్యప్పస్వామి జయంతి :* ,*శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి జన్మించినది సైతం పన్గుణి ఉతిరం రోజునే. అయ్యప్ప అంటే అందరికీ మకరజ్యోతి దర్శనమే గుర్తుకువస్తుంది కానీ.. పనుణి ఉత్తరం సందర్భంగా మణికంఠుని క్షేత్రంలో పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఒక్కరోజునే స్వామివారి ఉత్సవమూర్తిని పంబా నదికి తీసుకువస్తారు. పుణ్యస్నానాన్ని చేయిస్తారు. ఈ ఒక్కరోజునే మహిళలు సైతం కొండదిగివచ్చిన అయ్యప్పను దర్శించుకోవచ్చు. పన్గుణి ఉతిరంకు పదిరోజుల ముందుగా సన్నిధానంలో ధ్వజారోహణం జరుగుతుంది. తొమ్మిదోరోజున శరంకుత్తి వద్ద పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పదోరోజైన పనుణి ఉరంనాడు అయ్యప్ప ఉత్సవమూర్తిని ఏనుగు అంబారిపై ఊరేగింపుగా కొండ కిందికి తీసుకువస్తారు. పంబా నదిలో తీసుకెళ్లి పసుపుతో అభిషేకించి సుముహూర్తంలో మూడు మునకలు వేయిస్తారు. దీన్నే పంబా ఆరట్టు అంటారు. ఈ పదిరోజులపాటూ అయ్యప్ప* *సన్నిధానం తెరిచే ఉంటుంది.* 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
625 views
21 days ago
#ఏకాదశి వ్రత మహిమ.. 🙏 #ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #కామదా ఏకాదశి 🔱🕉️🔱 ఏకాదశీ వ్రత మహిమ 🙏 #కామద ఏకాదశి *కామద ఏకాదశి* *(మార్చ్ 29)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
PSV APPARAO
706 views
21 days ago
#కామదా ఏకాదశి 🔱🕉️🔱 ఏకాదశీ వ్రత మహిమ 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఏకాదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 *సకల పాప హరణం కామదా ఏకాదశి వ్రతం* *మార్చి 29 ఆదివారం కామదా ఏకాదశి సందర్భంగా...* _డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా ఈ శీర్షిక..._ ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే కామదా ఏకాదశి కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. కామదా ఏకాదశినే దమన ఏకాదశి అని వ్యవహరిస్తారు. పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత. కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి. ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ వచనం. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదా ఏకాదశి వ్రతం ఆదరించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తుంటారు. స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదా ఏకాదశి వ్రతం ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వేకువనే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజన ఉపవాసం, జాగరణ చేసి నియమనిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటింది. అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కామదా ఏకాదశికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణడు, యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు. అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రత కథను వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజుకు వినోదం పంచేవారు. ఒక రోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగ్గా ఇవ్వక, పరధ్యానంతో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు. ఆ శాపం కారణంగా అతని అందం, సృజనాత్మకత, కళా అంత నాశనమైపోతుంది. రాక్షసుని ఆకారంలోకి మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తను తీసుకొని వింధ్యాచల అడువుల్లోకి పయణమయింది. అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అక్కడ ఉన్న శ్రింగి మహర్షిని కలిసి తనకు జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్లబోసుకుంది. అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు. ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది. వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. ఇంతటి మహత్తువున్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా ప్రోతాయని పురాణాలు చెబుతున్నాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
666 views
1 months ago
#ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 #ఏకాదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పాపవిమోచని ఏకాదశి / పాప నాశని ఏకాదశి 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *పాపమోచనీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* పాపమోచనీ ఏకాదశీ మహిమ శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశీ మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇపుడు వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసింది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి పేరు పాపమోచనీ, దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశీ మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు. లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్యవసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస మునిమనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన మునిమనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితాసాంగత్యంలో మునిగిపోయాడు. అనేకసంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో "రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికిని అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈ సారి ముని ఆమెతో "రమణీ! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతః కాలవిధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు" అని అన్నాడు. అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి” అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ ఋషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేశాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేశావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్ఠిదానా! సిగ్గు సిగ్గు” అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేకసంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచనీ ఏకాదశి. అది సకలపాపహరం. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనఋషి అతిదుః ఖితుడై “అయ్యో! నీవెంత పనిచేశావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు" అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ "తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్సరససాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవనఋషి అపుడు మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశీ వ్రతపాలన వలన సమస్తపాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశీ వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమభాగ్యవంతుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశీ పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశీ వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రతమాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదానఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమపాతకం వంటి సకలపాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*