ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత

PSV APPARAO
593 వీక్షించారు
13 రోజుల క్రితం
#శని..శని..శని అని పిలువకూడదు... శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వైశాఖ మాసం వైభవం (మాధవ మాసం వైశాఖం) #శనిజయంతి *ఐశ్వర్యప్రదాత శనీశ్వర* శని నవగ్రహాలలో ఏడవ గ్రహం. శనీశ్వరుడని, ధర్మానుజు డని లోకంలో పిలుస్తారు. అసలు పేరు శనైశ్చరుడు. శనైః చరతీతి శనైశ్చరః మెల్లమెల్లగా నడిచేవాడు అని అర్థం. అందువల్లనే శనిని మందుడు అని కూడా పిలుస్తారు. శనివారా నికి శని అధిపతి. శని మందుడైన వలన ఆ వారానికి మంద వాసరమని, స్థిరవాసరమని పేరు వచ్చింది. శని పుట్టుపూర్వోత్తరాలను మత్స్యమహాపురాణం, ఇతర పురాణాలు కూడా వివరిం చాయి. ఛాయ, సూర్యదేవులు శనికి తల్లిదండ్రులు. యముడు అన్న. యమున అక్క ఛాయకే సంజ్ఞ అని మరోపేరు. ఉషా పద్మినిలు కూడా సూర్యుని భార్య లుగా ప్రసిద్ధి, సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుని వల్ల యముణ్ణి, యమునను పొందింది. నానాటికీ సూర్య తాపం పెరుగుతున్నందువల్ల సంజ్ఞాదేవి తట్టుకోలేకపోయింది. ఒకరోజున తన తండ్రి ఇంటికి వెళ్ళింది. భర్తకు తెలియకుండా, ముందుగా తండ్రి అనుమతి లేకుండా వచ్చినందుకు తండ్రి మందలించాడు. అప్పుడు సంజ్ఞాదేవి ఆలో చించి తననీడతో ఛాయ అనే స్త్రీమూర్తిని సృష్టించింది. ఛాయ సంజ్ఞవలెనే ఉంది. సూర్యుడు కూడా ఛాయను గుర్తు పట్టలేకపోయాడు. సూర్యతాపాన్ని తట్టుకునే శక్తిని సంపాదించటం కోసం సంజ్ఞ తపస్సు చేసుకోవటానికి వెళ్ళింది. ఛాయ సంజ్ఞ చెప్పినట్లుగా ఆమె సంతానాన్ని ప్రేమతో పరిపాలిస్తూ సూర్యునితో అన్యోన్యంగా కాలం గడుపుతున్నది. ఛాయకు సూర్యుని వల్ల గర్భోత్పత్తి జరిగింది. 'ఛాయ' అంటే నీడ కనుక ఆ నీడకు పుట్టినందువల్ల శని నీలం నలుపురంగులు కలిసి నట్లుగా జన్మించాడు. శని నల్లగా ఉండటానికి మరొక కారణాన్ని ఇలా చెపుతున్నారు. ఛాయాదేవి గర్భంలో శని ఉన్న సమయంలో ఛాయాదేవి పరమేశ్వరుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ ప్రభావం వల్ల శనికి నల్లనివర్ణం వచ్చింది. శివుడు సర్వజ్ఞుడైనందు వల్ల పుట్టుకతోనే ఆధ్యాత్మిక జ్ఞానసంపద కూడా శనికి లభించింది. శని ఛాయాసూర్యదేవుల సంతానమైనందు వల్లనే శనిని ప్రార్థిం చేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ | శని గ్రహాలలో ప్రధానగ్రహం. చాలామంది శనిమహర్దశ వస్తున్నదని తెలిస్తే ముందుగానే భయపడతారు. 'నిజానికి శని కర్మఫలప్రదాత. కర్మసాక్షి కుమా రుడైనందువల్ల మానవులు చేసిన పుణ్యఫలాలను అనుభవింప చేస్తాడు. తానుగా ఎవ్వరినీ కష్టపెట్టడు. పాపం చేసిన వాళ్ళకి ఆ పాపఫలాన్ని అనుభవింపచేస్తాడు. పాపఫలం కష్టరూపంగా ఉంటుంది. కనుక శని కష్టపెడుతున్నాడని భావిస్తున్నారు. పుణ్యం చేసుకున్న వాళ్ళకి సుఖరూపమైన ఫలాన్నిస్తాడు'. ఇది గ్రహ అనుకూలతను సూచిస్తుందని కొందరు పండితులు చెపుతున్నారు. శని కుండలిలో ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఈ స్థితి శనికే కాదు. గ్రహాలన్నింటికి ఉండేదే. గ్రహాలకు కూడా స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు అని ఉంటాయి. స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు అనుకూల్య ప్రభావం చేత చక్కటి లాభదాయకంగా, సంతోషదాయకంగా జీవితం సాగుతుంది. క్షేత్రం మారితే ఆ ప్రభావం కూడా తీవ్రంగా ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. రాహుకేతువులు సంపూర్ణశరీరులు కారు. ఇక మిగిలిన ఏడు గ్రహాలలో శని ఏడవగ్రహం. అందువల్ల ఏడవవారమైన శని వారానికి శని అధిపతి. శనివారంరోజున కొందరు శనికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. శనిని నువ్వులతో అర్చిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శనికి నువ్వులనూనె అంటే ప్రీతి కనుక నువ్వులనూనెతో అభిషేకం చెయ్యాలి. త్రయోదశి తిథి రోజున (ప్రతినెల కాకుండా) శనిత్రయోదశి అనే విశేషసమయం వస్తుంది. ఆ రోజున కూడా శనికి విశేష పూజలు నిర్వహిస్తారు. శని నల్లగా ఉంటాడు కనుక నల్లని రంగు వస్త్రం ఇష్టం. నల్లని ధాన్యమైన నువ్వులు ఇష్టం. నువ్వులనుండి వచ్చిన తైలం ఇష్టం. నల్లనిపక్షి అయిన కాకి అంటే ఇష్టం కనుక కాకి వాహనం. శనిమహర్దశ అన్ని గ్రహదశల వలెనే నడుస్తున్నా చాలా మెల్లగా నడుస్తున్నట్లుగా ఉంటుంది. శనికి నీలం (రత్నం) అంటే ఇష్టం. నీలాలలో సముద్రనీలం, ఆకాశనీలం, కాకినీలం, మయూరనీలం, ఇంద్రనీలం అని అనేక రకాలున్నాయి. వారివారి స్థితిగతులను పట్టి, అవసరాన్ని బట్టి సిద్ధాంతిని సంప్రదించి వారి సూచన మేరకు ఆ రత్నాన్ని ధరించాలి. శనికి తరతమ భేదం లేదు. స్వజన, పరజన భేదం లేదు. తన ధర్మం తాను నిర్వహించటమే శనిలో ఉన్న ప్రధానలక్షణం. శని ఈశ్వరుణ్ణి కూడా బాధించాడని లోకంలో వృత్తాంతం ఉన్నది. ఒకసారి నారదుడు కైలాసంలో పరమేశ్వరుని దగ్గర శని గ్రహాన్ని గురించి ఎంతగానో ప్రశంసిస్తాడు. ఈశ్వరుడికి కొంచెం బాధ కలుగుతుంది. శని అంతటి గొప్పవాడైతే నాకె దురుపడి బాధించమని చెప్పు అని నారదుణ్ణి ఆదేశించాడు. నారదుడు శనికి ఈ వార్తను చేరవేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి హెచ్చరించి వెళతాడు. పరమేశ్వరుడు శనికి తానుదొరికితేనే కదా బాధపెట్టేది. దొరకకుండా ఉండాలని కైలాసాన్ని వదిలి తన పరివారాన్ని విడిచి ఒక అడవిలో ప్రవేశించి అక్కడ ఉన్న మర్రిచెట్టుతొర్రలో దాగి ఉంటాడు. మరునాడు ఉదయం శని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈశ్వరా! చూశారా? మీరు నా ప్రభావాన్ని, హాయిగా ప్రమథగణాల మధ్య కైలాసంలో సేవలందుకోవలసిన మీరు ఈచెట్టు తొర్రలో దాగి ఉన్నారు అని నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు ఒక్కక్షణం ఆలోచించి ఓశనీ! నీ ప్రభావం అమోఘం. ఈనాటి నుండీ నీవు కూడా ఈశ్వరపదంతో ప్రసి ద్ధిని పొందుతావు. నిన్ను శనీశ్వరుడని పిలుస్తారు అని అను గ్రహించాడు. శని ఆనాటి నుండి శనీశ్వరుడుగా పేరు పొందాడు. అందు వల్లనే శనిగ్రహ దేవాలయాలు మనకు దర్శనమిస్తున్నాయి. శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయాలు కూడా ఉన్నాయి. మంగనూరులో కూడా ఒక శనీశ్వరదేవాలయం ఉంది. ఇది నిర్ణీత సమయంలోనే తెరచి ఉంటుంది. మనరాష్ట్రంలోని మంద పల్లిలోని శనీశ్వరాలయం సుప్రసిద్ధం. మహారాష్ట్రలోని శని శింగణాపూర్ చాలా విలక్షణక్షేత్రం. ఆరు బయటే ఉంటుంది. ఇక్కడ వాకిళ్ళకు తలుపులు కూడా ఉండవు. దొంగతనాలు జరుగవు. అక్కడ ఎవరైనా దొంగతనానికి పాలుపడితే వాళ్ళు పొలిమేర దాటరు. ఇప్పటికీ శనీశ్వరప్రభావాన్ని ఇది చాటు చున్నట్లే కదా! మరొక మహిమాన్వితమైన పాగడ (పావగడ) క్షేత్రం అనే పేరుతో ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులలో ఉన్నటు వంటి శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధమైనది. గొప్పశక్తి కలిగిన శనీశ్వరుడికి పరమేశ్వరుడు లోబడినా పరమేశ్వరాంశతో అవ తరించిన హనుమంతుడు మాత్రం శనికి లోబడలేదు. శని అనుకూలంగా లేని వాళ్ళు ఆ దోపం తొలిగిపోవటానికి హనుమకి పూజలు, సుందరాకాండ పారాయణలు చేయిస్తారు. శనికి మందగమనుడు అనే పేరు రావటానికి కారణాన్ని పురాణాలు ఇలా చెపుతున్నాయి. సంజ్ఞాదేవి తపస్సు పూర్తిచేసు కొని వచ్చేసరికి ఛాయ సూర్యుని వల్ల శనిని కన్నది. తాను సృష్టించిన స్త్రీయే, తన ఛాయే అయినా ఆ కుమారుణ్ణి చూడ గానే సంజ్ఞకు తన సవతికుమారుడనే భావం కొద్దిపాటి ఈర్ష్య కలిగాయి. తన దగ్గరకు వస్తున్న ఆ చిన్నారి శనిని అసూయతో సంజ్ఞాదేవి నీవు కుంటివాని వలె మెల్లగా నడుస్తావు. నీ మంద గమనం వల్ల నిన్ను మందుడని పిలుస్తారు. అని శపించింది. ఆ కారణంగా శని మందు డు, శనైశ్చరుడు అయినాడు. మీనరాశిలో శని ఉంటే కరువుకాటకాలు వస్తాయి. అయోధ్యానగరాన్ని దశరథ మహా రాజుగారు పరిపాలిస్తున్న సమయంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు అనేకకష్టాలతో బాధ పడుతున్నారు. ఇందుకు కారణం శనే అని జ్యోతిష్యుల వల్ల తెలుసుకున్న దశరథుడు శని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఓడి పోయిన దశరథమహారాజు చివరికి చేసేది లేక శనిని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం. *ప్రసాదం కురు మే సౌరే వరదో యది మే స్థితః* *అధ్య ప్రభతి మే రాష్ట్ర పీడా కార్యా న కస్యచిత్ |* అని ప్రారంభమై ఇరవైఐదు శ్లోకాలతో పూర్తవుతుంది. ఇది అత్యద్భుతమైన స్తోత్రం. ఓ శనీ! ఇకనుండీ నా దేశంలో ప్రతి పన్నెండుసంవత్సరాలకు వచ్చే దుర్భిక్షం రాకూడదు అని కోర గానే శని వెంటనే వరమిచ్చాడు. ఈ వరాన్ని పొంది దశరథ మహారాజు కృతకృత్యుడైనట్లు భావించి రథంపై ధనుర్బాణాల నుంచి చేతులు జోడించి నమస్కరిస్తూ సరస్వతీదేవిని, గణపతిని ధ్యానించి శనిని ఈవిధంగా స్తోత్రం చెయ్యటం మొదలు పెట్టాడు. *నమః కృష్ణాయ నీలాయ శిఖికంఠనిభాయ చ* *నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ...* అంటూ స్తోత్రం చేశాడు. శని సంతుష్టుడైతే అప్ల్యైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆగ్రహిస్తే అష్టకష్టాలపాలు చేస్తాడు. దేవతలు, రాక్ష సులు, మనుష్యులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు అందరూ కూడా శని అనుగ్రహదృష్టి లేకపోతే అష్టకష్టాల పాలౌతారు. కేవలం వీళ్ళేకాదు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్తర్షులు కూడా తమ తేజస్సులను కోల్పోయి దీనులౌతారు. మహా రాజులు రాజ్యభ్రష్టులౌతారు. దశరథ మహారాజు చేసిన స్తోత్రం విని ఓ మహారాజా! నీ స్తోత్రానికి నేను ప్రీతుణ్ణయ్యాను. ఇవ్వకూడనిదే అయినా నీకు నేను వరాన్నిస్తాను. నీవు చేసిన ఈ స్తోత్రాన్ని మానవుడు ఒక సారి కాని, రెండుసార్లుకాని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మృత్యుముఖం నుండి కూడా రక్షణ పొందుతాడు. ఎవడైతే లోహంతో నా ప్రతిమను చేయించి జమ్మిపూలతో పూజించి మినుములతో వండిన అన్నాన్ని నువ్వులతో కలిపి నివేదించి నల్లని ఆవుని, గేదెను, వస్త్రాన్ని దానం చేస్తాడో, శనివారం రోజున ఈ స్తోత్రంతో పూజచేస్తాడో వాడికి నేనేవిధమైన బాధని కలిగించను. గోచారంలో కాని, జన్మలగ్నంలో కాని, దశలో కాని, అంత ర్దశలో కాని ఇతర గ్రహాల వల్ల కూడా బాధ కలుగకుండా రక్షిస్తాను. అని మరొక వరాన్నిచ్చాడు. ఈ విధంగా దశరథుడు రెండు వరాలను పొంది కృతార్థుడైనాడు. *ఇంతకంటే సులభతరంగా షోడశనామావళి ఉంది.* 1. కోణః, 2. శనైశ్చరః, 3. మందః, 4. ఛాయాహృదయ నందనః, 5. మార్తాండజః, 6. తథా సౌరి:, 7. పాతంగీ,8. గృహనాయకః, 9. అబ్రాహ్మణః, 10. క్రూరకర్మా, 11, నీల వస్త్రః, 12. అంజనద్యుతిః, 13. కృష్ణః, 14. ధర్మానుజః, 15. శాంతః, 16. శుష్కోదరవరప్రదః ఈ 16 నామాలను ప్రతిరోజు చదువుకుంటే విశేషమైన శుభఫలితాలు వస్తాయి. అత్యంత ప్రభావసంపన్నుడైన శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి మనం కూడా శనీశ్వరునిజయంతి రోజున ఆరాధించి అప్లైశ్వర్యాది అనేక శుభాలను పొందుదాం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
1.1K వీక్షించారు
13 రోజుల క్రితం
#వైశాఖ అమావాస్య #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అమావాస్య #వైశాఖ మాసం విశిష్టత *వైశాఖ అమావాస్య ప్రాముఖ్యత* హిందూ పంచాంగం ప్రకారం, హంసంవత్సరంలో రెండవ నెల అయిన వైశాఖ మాసానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలోని అమావాస్య తిథి చాలా పవిత్ర మైనదిగా పరిగణిస్తారు. శాస్త్ర ప్రకారం పౌర్ణమికే కాదు అమావాస్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధిస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం, అమావాస్య రోజున సూర్యుడిలో జాబిల్లి పూర్తిగా కలిసిపోతాడు. దీంతో ఈ రోజంతా చీకటిమయం అవతుంది. అందుకే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. ఏ కొత్త పనిని ప్రారంభించినా అవి విజయవంతంగా పూర్తి కావని చాలా మంది నమ్ముతారు. వైశాఖమాసం కృష్ణ పక్షం అమావాస్య తిథి కలిగిన 30వ రోజు వైశాఖ బహుళ అమావాస్య. హిందూ పంచాంగం ఖగోళ సానం ప్రకారం, చంద్రుడు 28 రోజులలో భూమి చుట్టూ ఒక పరిక్రమణ పూర్తి చేస్తాడు. 15 రోజుల తరువాత, చంద్రుడు భూమికి ఒక చివరన ఉంటాడు. చంద్రుడు భారతదేశానికి మరొక చివరన ఉన్నప్పుడు, అది కనిపించదు. వైశాఖ అమావాస్య రోజున రావి చెట్టును పూజించి, నీరు అర్పించడం వల్ల త్రిదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. పవిత్ర వైశాఖ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు. అలాగే ఈ రోజు పూర్వీకుల శాపాన్ని వదిలించు కోవడానికి తగినదిగా భావిస్తారు. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వైశాఖ అమావాస్య నాడు శ్రీమద్భాగవత కథను వినడం ద్వారా, ఎప్పటికీ అంతం కాని సద్గుణ ఫలితాలు పొందుతారు. ఈ రోజున ఉదయాన్నే నదిలో స్నానం ఆచరించి, ఇంట్లో పూజా గదిలో ఉన్న దేవుడి ఎదుట దీపం వెలిగించాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. ఈ రోజున గంగాజలాన్ని, నువ్వులను రావి చెట్టుకు సమర్పించాలి. శని దేవుడిని ఆరాధించాలి. శని భగవానుడికి నువ్వులు, ఆవ నూనె సమర్పించాలి. _దానం ప్రాముఖ్యత_ వైశాఖ అమావాస్య నాడు ఆహారం. నీటిని దానం చేయడం శ్రేష్ఠం. ఆహారం, నీటిని దానం చేయడం వలన తీర్థయాత్రకు వెళ్లినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఇలా చేయడం వలన భగవంతుని దయ భక్తులపై ఉంటుంది. పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయి. _ఉపవాసంతో కలిగే లాభాలు_ వైశాఖ అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఈరోజున ఉపవాసం ఉండటం వల్ల మన పూర్వీకుల కష్టాలను తీర్చడమే కాదు.. రాహువు దోషాలనుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు _వైశాఖ అమావాస్య కథ_ మత గ్రంథాలలో వైశాఖ అమావాస్యకు సంబంధించిన ఒక కథ ఉంది. దాని ప్రకారం, పూర్వకాలంలో ధర్మవర్ణ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ధార్మిక వ్యక్తి. ఋషులను బాగా గౌరవించేవాడు. ఒకసారి అతను ఒక ఋషి నుండి, కలియుగంలో విష్ణు నామాన్ని జపించడం కంటే పుణ్యఫలం ఇచ్చేది. పుణ్యకార్యం మరొకటి లేదని విన్నాడు. అతను ఆ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని, లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించి ప్రయాణం ప్రారంభించాడు. ఒకరోజు ప్రయాణంలో అతను పితృలోకానికి చేరుకున్నాడు. అక్కడ ధర్మవర్ణ పూర్వీకులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వారు అతనితో మీ సన్యాసం వలనే ఈ దుస్థితికి లోనయ్యాము. ఇప్పుడు మాకు పిండదానం చేసేవారు ఎవరూ లేరు. కానీ మీరు తిరిగి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రారంభించి, సంతానాన్ని కనగలిగితే, అప్పుడు మేము ఉపశమనం పొందగలం. అలాగే వైశాఖ అమావాస్య రోజున మాకు ఆచారబద్ధంగా పిండదానం చేయమని చెప్పారు. ధర్మవర్ల వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తానని వారికి వాగ్దానం చేశాడు. అందువల్ల, అతను మరొకసారి లౌకిక జీవితాన్ని స్వీకరించాడు. వైశాఖ అమావాస్య రోజున అతను పిండ దానానికి సంబంధించిన అన్ని క్రతువులను నిర్వహించి, తద్వారా తన పితృదేవతలకు ముక్తిని కలిగించాడు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
819 వీక్షించారు
17 రోజుల క్రితం
#హనుమాన్ జయంతి హనుమాన్ చాలీసా🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: హనుమజ్జయంతి / హనుమాన్ జయంతి / హనుమాన్ జన్మోత్సవం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమాన్ చాలీసా 🕉️ జై హనుమాన్ 🔯🚩 #🚩శ్రీ హనుమాన్ చాలీసా📿 🔔 *పరిజ్ఞానం* 🔔 *హనుమాన్ చాలీసా పై... 25 ప్రశ్నలు, సమాధానములు!* *1. చాలీసా" అంటే ఏమిటి?* ``` జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు(చాలిస్ అంటే హిందీ లో 40 అని.)``` *2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?*``` జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. ‘అజ్ఞానమును’ హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.``` *3. ఆంజనేయ - అర్థం?*``` జ. ఆంజనేయ అంటే... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం, జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.``` *4. తులసీదాస్ అస్సలు పేరు?*``` జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.``` *5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?*``` జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్యవల్ల వచ్చిన తేజో వర్చస్సు యే “సువర్చల”. ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.``` *6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి?*``` జ. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్’ హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.``` *7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?*``` జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.``` *8. హనుమంతుని పంచ ముఖములు ఏవి?*``` జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు, హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే...తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము. దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు. పశ్చిమం గరుడ ముఖం. అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు. ఉత్తరం వరాహ ముఖం. అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది. 9. “జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి? జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము. https://youtu.be/SqdYfa_Avg0 10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు? జ.126 సం.జీవించాడు. 11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే. 12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు? జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు. 13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ? జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో. 14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి? జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు. 15. కపీశ అంటే అర్థం ఏమిటి? జ. కపీశ అంటే... a) కపులకు ఈశుడు b) కపి రూపంలో ఉన్న ఈశుడు సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం. 16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏 17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ? జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే అగ్ని ముఖావై దేవాః. దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు. 18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ? జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం. 19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా? జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ. 20 . నామస్మరణ మహిమ ఏమిటి? జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం. 21. మహాత్ముడు అంటే ఎవరు ? జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 22 . ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి? జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి. 23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి? జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర. 24 . విక్రమ అంటే అర్థం ఏమిటి? జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు. 25. సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ? జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు . https://youtu.be/SqdYfa_Avg0 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
568 వీక్షించారు
17 రోజుల క్రితం
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: హనుమజ్జయంతి / హనుమాన్ జయంతి / హనుమాన్ జన్మోత్సవం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమజ్జయంతి #🕉️హనుమజ్జయంతి🙏🎊 #🕉️హనుమజ్జయంతి శుభాకాంక్షలు 🙏🎊 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
PSV APPARAO
738 వీక్షించారు
17 రోజుల క్రితం
#హనుమంతుడు ... తమలపాకులు అర్చన #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ ఆంజనేయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏మంగళవారం భక్తి స్పెషల్🙏 🕉️*ఆంజనేయుడు.. తమలపాకులు*🕉️ 🕉️ఓసారి సీతారాములు తమలపాకులు సేవిస్తున్నారట. అమ్మ సీతమ్మ చిలుకలు చుట్టి రాముని నోటికి అందిస్తుంటే రాముని నోరు ఎర్రగా అవుతూ చూడడానికి మనోహరంగా కనిపించాడట. అక్కడే ఉన్న ఆంజనేయుడు అమ్మా పచ్చని ఆకులు ఇస్తున్నావు. రాముని నోరు మాత్రం ఎర్రని పండులాగా తయారు అవుతోంది ఏమిటి అని అడిగాడట. రామునికి తమలపాకులంటే ఇష్టం అందుకే రాముని నోట్లో కి వెళ్లగానే అవి అన్నీ పండ్లు అయిపోతున్నాయి అందట సీతమ్మ. అంతే రాముల వారికి తమలపాకులంటే అంత ఇష్టమా నేనా తమలపాకులనే చుట్టుకుంటా అని నాగవల్లిని తన శరీరమంతా పేర్చుకుని రామునికి కనిపించాడట పవనపుత్రుడు. అపుడు రాముడే నీకు ఎవరైతే తమలపాకులతో పూజ చేస్తారో వారికి తీరని కోరికలంటూ ఏమీ ఉండవు ఆంజనేయ ఆన్నాడట. 🕉️ కలియుగంలో నీవే నా భక్తుల కోరికలను తీర్చుము అని కరువలిపట్టికి ఆజ్ఞ ఇచ్చాడట రాముడు. అందుకే హనుమన్నకు తమలపాకులతో పూజ, సంసారంలో ప్రశాంతతను కోరేవారు ఆంజనేయుని తమలపాకు దండ వేస్తే వారికి శాంతి లభ్యమవుతుంది. 🕉️ గౌరవహీనంగా తమ బతుకులున్నాయనుకొనేవారు. కూడా నాగవల్లిని అంజన్నకు సమర్పిస్తేచాలు వారికి గౌరవ మర్యాదలు లభ్యమవుతాయి. హనుమంతునికి తమలపాకులను సమర్పించిన వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. సుందరకాండ పారాయణ చేసి తమలపాకుల దండ హనుమన్నకు వేస్తే అన్నింటా విజయం లభిస్తుంది.
PSV APPARAO
887 వీక్షించారు
25 రోజుల క్రితం
#అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా #అంగారక చతుర్థి #అంగారక సంకటహర చతుర్థి💐🎂 #🌺💐🙏అంగారక సంకటహర చతుర్థి🌺💐🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺#అంగరక_చతుర్థి 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. _"ఓం గం గణపతయే నమః"_ పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
1.4K వీక్షించారు
25 రోజుల క్రితం
#సంకట హర చతుర్థి వ్రతం ఎందుకు చేయాలి? #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺#అంగరక_చతుర్థి 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. _"ఓం గం గణపతయే నమః"_ పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
688 వీక్షించారు
28 రోజుల క్రితం
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ / బుద్ధ పూర్ణిమ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #బుద్ధ పూర్ణిమ #బుద్ధ పూర్ణిమ స్పెషల్ *ఆచరణే ఆరాధన* _ఆచరణే ఆరాధన_ మనం పురాణ పురుషుల, మహనీయుల జయంతులు వంటి వాటిని ఘనంగా జరుపుకుంటాం గాని వారు చెప్పిన బోధనలు పాటించటంలో వెనుకబడి ఉంటుంటామని ఇంతకు ముందే తెలుసు కున్నాం. ఆయా బోధనలు చేసిన మహాత్ములను మనం ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. కలిసి మాట్లాడి ఉండక పోవచ్చు. ఒక్క పైసా ఇచ్చి ఉండక పోవచ్చు. వారి బోధనలను ఆచరణలో పెట్టటమే వారి పట్ల మనం గౌరవాన్ని, భక్తి, శ్రద్ధలను కనబరచినట్లు అవుతుంది. ఆ విషయాన్నే తెలుపుతుంది మహాభారతంలోని ఏకలవ్యుని కథ. ఎదురుగా గురువు లేకున్నా, ఆయనను మనసులో నిలుపుకుని సాధన చేసి విలువిద్యలో అద్భుత నైపుణ్యాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఇటువంటి సంఘటనే బుద్ధ భగవానుని జీవితంలోను జరిగింది. బుద్ధ భగవానుడు దేశాటనలో భాగంగా ఒక రాత్రి వేళ కుమ్మరి శాలకు చేరుకున్నాడు. ఆ శాలకు ఆయన కన్న ముందే ఒక యువ పరి వ్రాజకుడు వచ్చి ఉన్నాడు. వారికి పూర్వ పరిచయం లేదు. ఆ యువ పరివ్రాజకుని మాట, ప్రవర్తన బాగా నచ్చాయి బుద్ధ భగవానునికి. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఓ భిక్షూ! నీవెవరి పేరున ప్రవ్రుజిడవైనావు లేక నీ శాస్త ఎవరు? ఎవరి ధర్మాన్ని ఇష్టపడతావు? అని ఆ యువకుని ప్రశ్నించాడు. అతడు సమాధానమిస్తూ, 'మిత్రమా! శాక్య పుత్రుడైన శ్రవణ గౌతము డున్నాడు. అతడు భగవంతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు. అతనే నా శాస్త్ర, నేనతని ధర్మాన్నే ఇష్టపడతాను అన్నాడు. దానితో బుద్దుడు ఒకింత ఆశ్చర్యంతో 'ఆ సమ్యక్ సంబుద్ధుడు ఇప్పుడెక్కడున్నాడు. నీవు ఆయనను ఎపుడైనా చూశావా? చూస్తే గుర్తించగలవా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ సన్యాసి చెబుతున్న సమ్యక్ సంబుద్ధుడు తానే. ఆ యువ సన్యాసికి తానెప్పుడూ ఏదీ ప్రత్యక్షంగా బోధించలేదు. దానికా యువ సన్యాసి 'నేను భగవంతుని ఏ నాడూ చూడలేదు. అందువల్ల చూసినా గుర్తించలేను అన్నాడు. పరో క్షంగా తన బోధనలు విని భక్తి శ్రద్ధలతో వాటిని ఆచ రిస్తున్న ఆ యువ సన్యాసికి బుద్ధుడు తానెవరో తెలిపి ధర్మాన్ని వివ రిస్తూ ఇంకెన్నో విషయాలను తెలి యజేశాడు. ఆనందం హృద యంలో పొంగి పొరలగా, రెండు కళ్ళలో నీరు ఉబ కగా, ఆ యువ సన్యాసి బుద్ధ భగ వానుని పాద పద్మాలపై తల ఉంచాడు. రెండు చేతులూ జోడించి, 'భగవాన్! నేను మిమ్మల్ని మిత్రమా అన్నందుకు నన్ను క్షమించండి. నా పేరు పుష్కర స్వాతి. నాకు ప్రవ్రాజ్య ఉప సంపద బ్రిక్టు సంఘంలో సదస్యత్ర ఇవ్వండి' అని ప్రార్థించాడు. భక్తి, శ్రద్ధ అంటే అవి. ఏ మహనీయుని విషయంలోనైనా మనకు ఆరాధనా భావముంటే వారి బోధను ఆచరించాలి గాని పాదపూజలతో, పూలహారాలతో, హారతి అర్చనలతో సరిపెట్టు కోరాదు. అవి ఉద్ధరించవు. సనాతన ధర్మం మనం ఆరు రుణాలతో పుడ తామని చెబుతుంది. అవి భూత రుణం, పితృరుణం, మాతృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం. ఇవి తీర్చుకోవాలంటారు. వాటికి విధా నాలున్నాయి. వాటిలో ఋషి రుణాన్ని తీర్చుకోవడం ఎలా గంటే వారు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని వారు చేసిన రచ నలు చదివి ఆచరించడం ద్వారానేనని చెబుతారు. అంటే నిజమైన ఆరాధన ఆయా మహనీయుల బోధనలు ఆచరించడమేనని తెలుస్తుంది. లోకోపకారమే ఆ మహ నీయుల ఉద్దేశం. వారి బోధ నలు ఆచరించడం ద్వారా మన జీవితాలు, సమాజం బాగు పడతాయి. అవి బాగుపడితే రాష్ట్రం, దేశం ఇలా అన్నీ బాగుపడతాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
678 వీక్షించారు
28 రోజుల క్రితం
#అర్ధనారీశ్వర వ్రతం మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #వైశాఖ మాసం వైభవం (మాధవ మాసం వైశాఖం) #వైశాఖ పౌర్ణమి 🌕 *వైశాఖ పూర్ణిమ/ అర్ధనారీశ్వర వ్రతం* *మహా వైశాఖి* 🌛🌕🌔 *మహా వైశాఖి, వైశాఖ పూర్ణిమ* 🌔🌕🌜 మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు. వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. 🌊⚡🌀 *అర్ధనారీశ్వర వ్రతం* 🌀⚡🌊 పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి. లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*