న్యాయం

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
590 views
22 days ago
లాకప్ డేత్ కేసులో బాధితులకు ఎట్టకేలకు న్యాయం చేకూరింది! లేదా మదురై కోర్టు తీర్పు ముమ్మాటికీ హర్షణీయం! తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుడి లాకప్ డేత్ కేసులో మదురై కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఎంతైనా హర్షణీయం.ముఖ్యంగా ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారుడిని ఆతి క్రూరంగా హింసించి చంపిన తీరు అత్యంత కిరాతకమైనది.అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని మదురై కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఎంతైనా సహేతుకమైన,న్యాయబద్ధమైన విషయమే.ఇక ఈ కేసు పూర్వపరాల విషయానికి వస్తే తండ్రీ కుమారుడు అయిన జయరాజ్,బెన్నిక్స్ లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు.కోవిడ్ సమయంలో వీరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి తీవ్రంగా వేధించి కొట్టడంతో వారు ఆ దెబ్బలు తట్టుకోలేక జూన్ 22,23 తేదీల్లో వారిరువురు కూడా మృత్యువాత పడ్డారు.అయితే ఆ తరువాత సీబీఐ వారు నిర్వహించిన దర్యాప్తులో ఇది అవాస్తవమని తేలింది.అదేవిధంగా వీరురువురిని 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్ కులం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ముఖ్యంగా ఈ అత్యంత క్రూరమైన ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10మంది పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.అన్నింటికి మించి ఈ లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు మరణశిక్ష వేయడం దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.అంతేకాదు మద్రాసు హైకోర్టుకు అందిన సమాచారం ప్రకారం మృతులు జయరాజ్,బిన్నిక్స్ లపై పోలుసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చడంతో పాటు ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఎంతో కీలకంగా మారింది.తండ్రీ కుమారుడిని పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని,లాఠీలపై,బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐ వారికి వెల్లడించారు. అంతేందుకు ఈ కిరాతక ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్ లు, ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినారని సీబీఐ దర్యాప్తులో తేలింది.ఈ అత్యంత బలమైన ఆధారాలన్నింటితోనే కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి,సుదీర్ఘ విచారణ జరిపి మదురై కోర్టు ఎట్టకేలకు ఆరేళ్ళ తరువాత ఈ పెను సంచలన తీర్పు వెల్లడించింది. ఏదిఏమైన చట్టం దృష్టిలో అందరూ సమానమే, తప్పు ఎంతటి వారు చేసిన రుజువు అయ్యితే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అనే నిగూడ వాస్తవం మరోసారి రుజువైంది.దీన్నిబట్టి ఎంతటివారైనా చట్టంతో చెలగాట మాడితే,చట్టం తమ చుట్టంగా భావిస్తే ఇలాంటి చేదు ఫలితాలను చవిచూడటమే కాదు, తీవ్ర కఠినమైన శిక్షలకు సైతం గురికావాల్సి రావడం తథ్యం.ఏమైనా ఇలాంటి స్ఫూర్తిదాయక తీర్పు అధికార దర్పం,అహంభావంతో కళ్ళు మూసుకుపోయి #న్యాయం సామాన్యులపై జూలూమ్ చలాయిస్తూ తాము ఏమి చేసిన చెల్లుతుంది అనే దుర్మార్గపు శైలితో ఏదో తెలిసో తెలియకో చేసిన తప్పు మూలాన వారిపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించే కొంతమంది పోలీసు వారికి మదురై కోర్టు ఇచ్చిన ఈ అత్యంత సాహాసోపేతమైన తీర్పు ఓ చెంపపెట్టు,కనువిప్పు వంటిది కూడా.న్యాయం మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి.నిర్దోషులకు ఎలాంటి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు.⚖️⚖️⚖️⚖️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
🇦 🇷 🇦 🇻 🇮 🇳 🇩  🇦 🇲 🇲 🇺
768 views
27 days ago
హిందూ పండుగలు అన్ని హిందువులందరూ కలిసి చేసుకుంటారు కానీ ఓట్లు వచ్చేంతవరకు మీ ఓట్లు ఎందుకు బిజెపి ఇప్పుడు కలిసి చేసుకుంటున్నారు హిందువులు పండుగలు కానీ రానున్న రోజుల్లో మీరు బిజెపికి ఓటు వెయ్యలేదా అప్పుడు అనుకుంటారు మనం ఓటు వేసి ఉంటే ఇప్పుడు పండుగ చేసుకునే వాళ్ళం కదా అని గుర్తుపెట్టుకో బిజెపి మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకీ జై శ్రీరామ్ #ధర్మం #బిజెపి #తెలుగు వాట్సాప్ స్టేటస్ 😍 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #జైశ్రీరామ్
సుధా కృష్ణా
956 views
1 months ago
#నిజాయితీ #great #హ్యాట్సాఫ్ 💼 జేబులో ₹25 మాత్రమే… కానీ ₹40 వేల వాలెట్‌ను తిరిగి ఇచ్చాడు! నిజాయితీతో మారిపోయిన నిరాశ్రయుడి జీవితం జీవితంలో డబ్బు లేకపోవచ్చు… కానీ విలువలు ఉంటే చాలు — ఒక రోజు అదే మన జీవితాన్ని మార్చేస్తుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ సంఘటన దానికి ప్రత్యక్ష ఉదాహరణ. థాయ్‌లాండ్‌కు చెందిన 44 ఏళ్ల Woralop రోడ్డుపై జీవనం సాగిస్తున్నాడు. తినడానికి సరైన ఆహారం కూడా లేని పరిస్థితి. అతని జేబులో ఉన్నది కేవలం 35 సెంట్లు మాత్రమే — అంటే భారతీయ కరెన్సీలో దాదాపు ₹20–₹25 రూపాయలు. 👜 ఆకలితో ఉన్న రోజు… జీవితాన్ని మార్చిన వాలెట్ ఒక రోజు రోడ్డుపై పడిపోయిన ఖరీదైన Hermes వాలెట్ అతని కంటపడింది. ఆ వాలెట్‌లో 20,000 బాత్‌లు (సుమారు ₹38,800 భారతీయ రూపాయలు), అలాగే సుమారు 760 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు ₹41,000 భారతీయ రూపాయలు) మరియు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆ సమయంలో అతను ఆకలితో ఉన్నాడు. ఆ డబ్బుతో తన జీవితం కొన్ని రోజులు సుఖంగా గడిపేయవచ్చు. కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. మంచి భోజనం చేయవచ్చు. కానీ అతను ఆలోచించినది ఒక్కటే — “ఇది నాది కాదు.” అతను వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాలెట్‌ను యథాతథంగా అప్పగించాడు. 😲 యజమానికి షాక్ ఆ వాలెట్ యజమాని 30 ఏళ్ల వ్యాపారవేత్త Niity Pongkriangyos. పోలీసులు ఫోన్ చేసి వాలెట్ దొరికిందని చెప్పే వరకు ఆయనకు అది పోయిందన్న విషయం కూడా తెలియదు. “నేను ఆ పరిస్థితిలో ఉంటే బహుశా డబ్బు ఉంచుకునేవాడినేమో. కానీ అతను అలా చేయలేదు. అతను నిజంగా గొప్ప మనిషి” అని నిటీ అన్నారు. 💰 బహుమతి కాదు… జీవితావకాశం మొదట 2,000 బాత్‌లు బహుమతిగా ఇవ్వాలని భావించిన నిటీ, తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వోరాలోప్‌ను తన బ్యాంకాక్‌లోని మెటల్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి ఆహ్వానించారు. నెలకు 11,000 బాత్‌లు జీతం (సుమారు ₹21,000 భారతీయ రూపాయలు). అంతేకాదు, ఉండడానికి ఉచిత ఫ్లాట్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డుపై నిద్రించే మనిషి… ఇప్పుడు గౌరవప్రదమైన ఉద్యోగం, స్వంత నివాసం కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. 🙏 “ఇది నా జీవితాన్ని మార్చేసింది” వోరాలోప్ భావోద్వేగంతో ఇలా అన్నారు: “ఇప్పుడు శుభ్రమైన మంచంపై నిద్రపోవడం నాకు ఆనందం. నా జీవితాన్ని మార్చే ఈ అవకాశం ఇచ్చిన వారికి జీవితాంతం కృతజ్ఞుడిని.” 🌟 ఈ కథ చెప్పే గొప్ప సత్యం జేబులో ₹25 మాత్రమే ఉన్న మనిషి… ₹40 వేలకుపైగా ఉన్న వాలెట్‌ను తిరిగి ఇచ్చాడు. నిజాయితీకి వెంటనే ఫలితం కనిపించకపోయినా… దాని విలువ ఎప్పటికైనా దక్కుతుంది. ఒక చిన్న మంచి పని… ఒక మనిషి జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. మంచితనం ఎప్పుడూ నష్టపెట్టదు. నిజాయితీ ఎప్పటికీ వృథా కాదు..