ముద్రగడ పద్మనాభం గారు 💐💐

P.Venkateswara Rao
581 వీక్షించారు
16 రోజుల క్రితం
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *టీడీపీకి వైసీపీ మ‌రో ప‌రీక్ష‌❗ *29.07.2026🎯 తెలుగుదేశం పార్టీకి రాజ‌కీయంగా వైసీపీ మ‌రో ప‌రీక్ష పెట్ట‌నుంది. ఈ మేర‌కు టైమ్‌ను వైసీపీ ఖ‌రారు చేయ‌డం విశేషం. దివంగ‌త ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంస్మ‌ర‌ణ స‌భల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌లో బొండా ఉమా, అంబ‌టి రాంబాబు స‌న్నిహితంగా మెల‌గ‌డం, అలాగే కాపుల ఇబ్బందుల‌పై టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపాయి. చివ‌రికి బొండా ఉమా కామెంట్స్‌, అలాగే అంబ‌టితో క‌లిసి వేదిక పంచుకోవ‌డంపై త్రీమెన్ క‌మిటీకి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఇక‌పై వైసీపీతో క‌లిసి వేదిక పంచుకోన‌ని బొండా ఉమా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 1న ముద్ర‌గ‌డ్డ స్వ‌స్థ‌లం కిర్లంపూడిలో సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్టు జ‌గ్గంపేట వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోట న‌ర‌సింహం తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, అంద‌రూ త‌ర‌లి రావాల‌ని నిర్వాహ‌కులు కోరారు. బొండా వివాదం ర‌చ్చ ఇప్పుడిప్పుడే స‌ర్దుకుంటోంది. ఈ త‌రుణంలో ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు సంస్మ‌ర‌ణ స‌భ‌కు వెళ్ల‌డానికి ధైర్యం చేస్తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ముద్ర‌గ‌డ‌పై వ్య‌క్తిగ‌తంగా ఇష్టం ఉన్న‌ప్ప‌టికీ, రాజ‌కీయంగా ఇబ్బంది ఎదుర‌వుతుందంటే, ఎవ‌రైనా ఆచితూచి అడుగు వేయాల్సి వుంటుంది. అయితే టీడీపీకి వైసీపీ నేత‌లు పెడుతున్న ప‌రీక్షంగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు మీడియా ముందుకొచ్చి ఎవ‌రైనా పార్టీ లైన్ దాటితే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ముఖ్యంగా ముద్ర‌గ‌డ సంస్మ‌ర‌ణ స‌భ‌లు, అలాగే వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డాన్ని దృష్టిలో పెట్టుకుని ప‌ల్లా హెచ్చ‌రించార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. అందుకే కిర్లంపూడిలో ముద్ర‌గ‌డ సంస్మ‌ర‌ణ స‌భ‌కు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వెళ్ల‌డంపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
P.Venkateswara Rao
547 వీక్షించారు
29 రోజుల క్రితం
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముద్రగడ తనయులు లేఖ..✍🏻
P.Venkateswara Rao
745 వీక్షించారు
1 నెలల క్రితం
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 *గవర్నర్ గా వెళ్లాల్సిన ముద్రగడ...అసలేమి జరిగింది ⁉️* ముద్రగడ పద్మనాభం సీనియర్ మోస్ట్ నాయకుడు అన్నది అందరికీ తెలిసిందే. దాదాపుగా యాభై ఏళ్ళ రాజకీయ జీవితం చూసిన వారు ఆయన. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అదే వరుసలో నాలుగు సార్లు గెలిచారు రెండుసార్లు మంత్రిగా కూడా అయ్యారు. ఇక ఎంపీగా కూడా అయిదేళ్ల పాటు పనిచేశారు. ముద్రగడ. ముద్రగడ రాజకీయ జీవితంలో చూస్తే ఎక్కువగా పోరాటాలే కనిపిస్తాయి. ఆయన ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది లేదు. ఆయన పేరు పక్కనే రాజీనామా అన్న పదం కూడా ఉంటుంది అని చెప్పుకునే వారు. అంతలా ఆత్మ గౌరవంతో జీవించిన ముద్రగడ తన రాజకీయ ప్రయాణంలో ఎక్కడా ఎవరికీ ఏ పదవీ అడిగిన సందర్భం అయితే లేదు అని కూడా గుర్తు చేసుకుంటారు. జనసేనలో ముద్రగడ అంటూ : ఇక 2024 లో ముద్రగడ పుట్టిన రోజు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులను పిలిచి ఇక మీదట రాజకీయంగా తాము చురుకైన పాత్ర పోషిస్తామని చెప్పారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ముద్రగడ జనసేనలో చేరుతారు అని కూడా గట్టిగానే ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ ముద్రగడ భేటీ అని కూడా అప్పట్లో కధనాలు వెలువడ్డాయి. మరి ముద్రగడ చూస్తే చివరికి వైసీపీలో చేరిపోయారు. ఆయన ఎందుకు వైసీపీలో చేరారు, జనసేనలో ఎందుకు చేరలేదు అన్నది చూస్తే అది ఒక చర్చగానే ఉంటుంది. పార్టీ ఆహ్వానించింది అంటూ : దీని మీద ముద్రగడ మరణించాక ఆయనకు సంతాపం తెలియచేస్తూ జనసేన సీనియర్ నాయకుడు, మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదికలో మాట్లాడారు. ముద్రగడ జనసేనలో చేరాల్సి ఉంది అని ఆయన చెప్పడం విశేషం. 2024 ఎన్నికలకు ముందు జనసేన తరఫున కొందరు పెద్దలు జనసేనలో ముద్రగడ చేరాలని ఆహ్వానించారు అని నాదెండ్ల చెప్పారు. ఆయన పార్టీలోకి వస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని కూడా పెద్దలు అంతా చర్చించారు అని గుర్తు చేసుకున్నారు. గవర్నర్ గా చేయాలని : అంతే కాదు ముద్రగడ కనుక జనసేనలో చేరితే ఆయనకు కూటమి ప్రభుత్వంలో గవర్నర్ గా పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పారని కూడా నాదెండ్ల ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేశారు. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరం అని ఆయన అన్నారు ఇవన్నీ పక్కన పెడితే ముద్రగడ జనసేనలో చేరితే ఆయన రాజకీయం వేరే విధంగా ఉండేదా అన్న చర్చ ఇపుడు జరుగుతోంది. నిజానికి జనసేనలో ముద్రగడ ఎందుకు చేరలేదు, వైసీపీ వైపు ఎందుకు మళ్ళారు అంటే అది ఒక శేష ప్రశ్నగానే ఉంటుంది. దీని మీద ఎవరి వాదనలు వారికి ఉన్నా కూడా ముద్రగడ అయితే పెదవి విప్పి చెప్పలేదు. అందువల్ల అది అలాగే ఉండిపోయింది. ఆ తరువాత ఏకంగా జనసేన అధినేత పవన్ ని సవాల్ చేస్తూ ముద్రగడ పిఠాపురంలో ఆయన్ని ఓడిస్తాను అని శపధం చేయడం, తన పేరు మార్చుకుంటాను అని చెప్పడం ఇలా జరిగిపోయాయి. పవన్ గెలిచాక ముద్రగడ తన పేరుని పద్మనాభరెడ్డి గా మార్చుకున్నారు. ఇలా ముద్రగడ రాజకీయ ప్రయాణం రాజీలేని బాటగానే సాగి అలా ముగిసింది అని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
P.Venkateswara Rao
672 వీక్షించారు
1 నెలల క్రితం
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 *'కులం కోసం నేను’ అనే నేత ఇక లేరు, రారు..❗* ముద్రగడ పద్మనాభం ఇక లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు కులస్తుల సంక్షేమం కోసమే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చరిత్రలో మిగిలిపోతారు. ఇదివరలో ఎందరు నాయకులైనా తమ తమ కులాల ఎదుగుదలకు పనిచేసి ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా కులాలను నమ్ముకునే రాజకీయ నాయకులు పుట్టవచ్చు.. కనుమరుగైపోవచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం తరహాలో.. కాపు కుల సంక్షేమం మినహా తనకు మరొక ఎజెండా లేదని బాహాటంగా చెప్పగల మరొక నాయకుడు వస్తారని మనం ఆశించలేం. ఆ రకంగా చూసినప్పుడు.. రాష్ట్రంలోనే కాపుకులానికి ముద్రగడ పద్మనాభం మరణం పెద్ద లోటు అని చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో కులరాజకీయాలు శాసిస్తూ ఉంటాయనేది అందరికీ తెలిసిన సత్యం. తమ తమ కులాల ఓటు బ్యాంకులను పదిలంగా కాపాడుకోవడానికి .. దాదాపుగా ప్రతి నాయకుడు కూడా నానా వ్యూహాలు, కుట్రలు పన్నుతుంటారు. అనేక వక్రమార్గాలు అనుసరిస్తుంటారు. తమ తమ కులాల్లోని కొందరు పెద్దలతో తమ కులస్తులందరితో రహస్య/ బహిరంగ భేటీలు నిర్వహింపజేస్తూ కులం మొత్తాన్ని తమ రాజకీయాలకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగిస్తుంటారు. పైకి చెప్పుకోవడానికి మాత్రం.. తమది సొంత కులానికి ప్రాధాన్యం ఇచ్చే రకం కాదని రంగు పులుముకోవడానికి వల్లించే నీతులు వేరే స్థాయిలో ఉంటాయి. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో ఈ కులం ప్రాధాన్యం చాలా ఎక్కువ. పార్టీని స్థాపించిన అగ్రనేత ఏ కులానికి చెందిన వాడైతే ఆ పార్టీ మీద కలకాలం ఆ కులం ముద్ర ఉండిపోతుంది. తెలుగుదేశం- కమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్- రెడ్డి, జనసేన- కాపు, భారత రాష్ట్ర సమితి- వెలమ పార్టీలు అని ప్రజలు ముద్రవేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పార్టీలు మాత్రం ‘తమకు అందరూ సమానమే’ అని సంకేతాలు ఇస్తున్నట్టుగా.. అన్ని కులాల ప్రతినిధుల్ని పార్టీ కమిటీలో పెట్టుకుంటూ.. లోలోపల కులరాజకీయాలు నడిపిస్తుంటారు. ఇది చాలా కామన్ గా మారిన సమాజం మనది. కానీ పైకి ఒక రకంగా, లోపల ఒకరకంగా వ్యవహరించకుండా.. తనకు కాపు కులం తప్ప మరొక ప్రాధాన్యం లేనే లేదని విస్పష్టంగా ప్రకటిస్తూ రాజకీయాలు చేసిన వ్యక్తి ముద్రగడ. కాపులకు బీసీ కేటగిరీ గుర్తింపు సాధించడానికి ఆయన సాధించిన సుదీర్ఘమైన పోరాటం ఫలించకుండానే ఆయన కన్నుమూశారు. కేవలం కాపు కులం తప్ప తనకు మరొకటి ఏదీ అనవసరం అనుకున్న ధోరణి వల్ల.. ఆయన విస్తృతంగా దక్కగల అనేక అవకాశాల్ని కూడా కోల్పోయారని చెప్పాలి. భవిష్యత్తులో ఒక్కో కులాల ప్రతినిధులుగా అనేకమంది నేతలు రావొచ్చు. కానీ.. నా కులమే నా ఏకైక ప్రయారిటీ అని ఓపెన్ గా చెప్పేంతటి నిజాయితీ గల నాయకులు మాత్రం రారు. ముద్రగడ మరణం పట్ల కాపు కులం మొత్తం సంతాపం తెలియజేస్తోంది.
neelapu chinnareddy
634 వీక్షించారు
1 నెలల క్రితం
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 #ముద్రగడ వైసీపీకి బలమా? #వైసీపీలో ముద్రగడ చేరేది అప్పుడే!! #కుమార్తెకు కౌంటర్ ఇచ్చిన ముద్రగడ #పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సంచలన లేఖ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు, పితృ సమానులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణవార్త హృదయాన్ని కలచివేసింది. ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజానికి అందించిన సేవలు, ఆయన వ్యక్తిత్వం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేను. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ఈ తీవ్రమైన విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి 🙏