🕉️ సనాతన హిందూ ధర్మం 🚩

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
573 views
3 days ago
#తెలుసుకుందాం #సనాతన హిందూ ధర్మం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతాన ధర్మం అరటిచెట్టు పుట్టుక - ప్రాముఖ్యత ‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ప్రాచీనకాలం నుండి ప్రస్తుతవరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో అరటాకుగాని, అరటిపళ్లుగాని, అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలో వివరించబడితే.. ఇదే అరటి ఆవిర్భావం గురించి భాగవతంలో వివరించబడింది. అరిటిని ‘కదళి’, ‘రంభా’ అనే పేర్లతో కూడా చాలామంది పిలుచుకుంటారు. ముఖ్యంగా ఇవి పల్లెటూళ్లలో జరిగే ప్రతిఒక్క కార్యక్రమంలోను ఉపయోగించుకుంటారు. దేవుళ్లకు సంబంధించిన పూజా కార్యక్రమాలలోను.. ముఖ్యంగా స్త్రీలు వ్రతాలు, నోములు నోచుకున్నప్పుడు తమ ఇష్టదేవతలకు పూజలు నిర్వహించుకునేటప్పుడు ఈ అరటి ఆకులను, పళ్లను ఉపయోగిస్తారు. ముత్తైదువులకు భోజనం పెట్టేటప్పుడు అరటి ఆకులను, దానం చేస్తున్నప్పుడు అరటిపళ్లను ఇస్తారు. అదేవిధంగా కొత్తగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఇంటి గుమ్మాలకు వీటిని తగిలిస్తారు. అలాగే పెళ్లి వంటి కార్యక్రమాలలో కూడా ఈ అరటి తనదైన ప్రాధాన్యతను కలిగి వుంటుంది. అరటి ఆవిర్భావం విరాట్ స్వరూపుడైన మహా విష్ణువు సృష్టి ఆవిర్భవింప చేసిన మొదట్లో లక్ష్మీ, దుర్గ, వాణి, రాధ,సావిత్రి అనే పంచ శక్తులను పుట్టించాడు. ఈ ఐదుగురిలోనూ రాధ, సావిత్రులు సమానంగా సౌందర్యాన్ని కలిగివుంటారు. అయితే సావిత్రి తన అందాన్ని చూసుకొని గర్వించుకోవడం మొదలుపెట్టింది. దాంతో విష్ణుమూర్తి ఆమెను ‘‘బీజం లేని చెట్టు’’గా భూలోకంలో జన్మించమని శపిస్తాడు. సావిత్రి తన తప్పును తెలుసుకుని ఎంత వేడుకున్నా.. చివరకు విధిలేక భూలోకంలో కదళీ అనే అరటిచెట్టుగా జన్మించింది. ఆమె తన శాపం నుంచి విముక్తి పొందడానికి ఐదువేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. కదళీ తపస్సు చూసి మెచ్చిన విరాట్స్వరూపుడైన విష్ణు మూర్తి ఆమె ముందు ప్రత్యక్షమై పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా... అంశరూపమైన కదళిని మానవ, మాధవసేవ చేయడానికి భూలోకంలోనే వుండమని ఆదేశించాడు. అలా ఆ విధంగా విష్ణు మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినాన్ని మాఘకృష్ణ చతుర్దశిగా పేర్కొంటారు. దీనినే అరటి చతుర్దశి అని అంటారు. అరటి ప్రాముఖ్యత అరటి ప్రాముఖ్యతను, పూజా కార్యక్రమాలలో దాని స్థానం గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు రామాయణంలో పేర్కొనబడింది. మార్ఘశిర చతుర్దశినాడు ఉదయాన్నే లేచి అభ్యంగన (అభిషేక) స్నానం చేసి, పెరటిలోవున్న అరటినిగానీ, అరటిపిలకనుగాని పూజ చేసుకోవాలి. పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేసుకోవాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులను పిలిచి.. వారికి భోజనం పెట్టి, అరటిదవ్వ లేదా ఐదు అరటిపళ్లను దానం చేయాలి. అయితే ఈ పూజను చేసేవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరువాత భోజనం చేసుకోవాలి. ఈ విధంగా అరటిపూజలను నిర్వహించుకున్నవారికి చక్కని సంతానం కలగడమే కాకుండా... ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది. పిల్లాపాపలతో వారు సంతోషంతో జీవనాన్ని కొనసాగిస్తారు. రామాయణoలో అరటికథ రామాయణంలో రావణుడిని రాముడు వధించిన తరువాత.. శ్రీరాముడు సీతసమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుని అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతుని రాక గురించి తెలియజేమని మారుతిని కోరుతాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ భోజన కార్యక్రమంలో కూర్చుంటారు. అయితే మారుతికి మాత్రం ఆకు కరువవుతుంది. అప్పుడు రాముడు హనుమంతుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి... తన కుడివైపున మారుతిని కూర్చోమని చెబుతాడు. భరద్వాజ మహర్షీ కూడా ఏమీ చేయలేక చివరికి ఆ అరటి ఆకులోనే హనుమంతుడికి భోజనాన్ని వడ్డిస్తాడు. భోజనం ముగిసిన తర్వాత అందరి సందేహాలను శ్రీరాముడు దూరం చేస్తూ.. ఈ విధంగా అంటాడు... ‘‘శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి’’.
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3K views
3 days ago
అదృశ్య శక్తులు గమనిస్తుంటాయి చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ... ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం. అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం. నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు. #తెలుసుకుందాం #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం #సనాతన ధర్మం.. దేవుళ్ళు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
17.3K views
3 days ago
దేవునికి అభిషేకo చేయటం ద్వారా మనం పొందే ఫలితాలేంటి మనము ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేయిస్తుంటాము. అలా అభిషేకాల ద్వారా ఆలయాల్లో శుద్ధి చేయడం పరిపాటి. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఆలయాల్లో వివిధపదార్థాల ద్వారా దేవునికి జరిగే అభిషేకాల వల్ల లభించే ఫలితాలేంటో తెలుసుకుందాం పదార్థాలు - ఫలితాలు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది. పంచదారలో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు. నేతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది శంఖువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు. చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది. మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది. స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి. పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు. చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది. చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది. నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది. ఏరోజున ఏదేవుడికి అభిషేకం చేయాలి రాముడు, సూర్యుడు, వినాయకుడు నవగ్రహాలకు- ఆదివారం శ్రీకృష్ణుడు,ఈశ్వరుడు - సోమవారం నృసింహస్వామి, ఆంజనేయస్వామి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి - మంగళవారం విష్ణుమూర్తి - బుధవారం త్రివిక్రమ స్వామి, హయగ్రీవ స్వామి - గురువారం అమ్మవారికి ( లక్ష్మీదేవి, పార్వతి దేవి, సరస్వతి దేవి - శుక్రవారం వెంకటేశ్వర స్వామి మరియు మహావిష్ణువు యొక్క దశావతారములు అన్నింటికీ - శనివారం అభిషేకాలు చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతాన ధర్మం #సనాతన హిందూ ధర్మం