P.Venkateswara Rao
627 views • 4 months ago
#అమరావతి
*రెడ్డి కాదు ,కమ్మ కాదు ,కాపు కాదు*
మరి ఎవరీ రిటైర్డ్ IAS శివరామకృష్ణన్
సీమాంధ్ర రాజధాని ఎంపికకు
కేంద్ర హోం శాఖ మార్చి 28, 2014న
5 గురు నిపుణులతో 'తమిళనాడు ' కు చెందిన
రిటైర్డ్ IAS శివరామకృష్ణన్ అధ్యక్షతన
కమిటీని ఏర్పాటుచేసింది.
శివరామకృష్ణన్ నిపుణుల కమిటీ సభ్యుల వివరాలు
1)ప్రొఫెసర్ కె.శివరామకృష్ణన్
ప్రొఫెసర్ కె.శివరామకృష్ణన్ 1958 ఐఏఎస్ బ్యాచ్ అధికారి.
గతంలో
కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కార్యదర్శి,
సీఈవోగా పనిచేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగానూ సేవలందించారు.
పదవీవిరమణ తర్వాత
ప్రపంచబ్యాంకులో అర్బన్ మేనేజ్మెంట్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా పనిచేశారు.
ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు.
73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి పట్టణ, గ్రామపంచాయితీల
విధివిధానాల రూపకల్పనలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.
2)ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్
న్యూఢిల్లీలోని
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో
అర్బన్ డిజైనింగ్ విభాగానికి హెచ్.వో.డీగా
బాద్యతలు నిర్వహిస్తున్నారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్
అర్బన్ డిజైనింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు.
గ్రీన్ ఫీల్డ్ సిటీస్ నిర్మాణంలో
ఆయనకు విశేష నైపుణ్యం ఉంది.
ఢిల్లీ పట్టణీకరణ కమిషన్ చైర్మన్గా పనిచేశారు.
యునైటెడ్ నేషన్స్ కేపిటల్ మాస్టర్ ప్లాన్
అడ్వైసరీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
3)ప్రొఫెసర్ జగన్ షా
ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
అర్బన్ అఫైర్స్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
సిన్సినాటీ కొలంబియా
విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసకులు.
4)అరోమర్ రేవి
ఢిల్లీ ఐఐటీ పట్టభద్రుడు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్
సెటిల్మెంట్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
పట్టణీకరణలో తలెత్తే సవాళ్ళ అధ్యయనానికి
దేశంలో తొలిసారిగా ఏర్పాటైన సంస్థ ఇది.
5) రతిన్ రాయ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్
అండ్ పాలసీ రిసెర్చ్ డైరెక్టర్గాసేవలు అందిస్తున్నారు.
ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో
అర్ధశాస్త్రంలో పీ.హెచ్.డీ చేశారు.
ఆయన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
(యూ.ఎన్.డీ.పీ)లో ప్రాంతీయ మేనేజర్ గా, 13వ
ఆర్థిక సంఘం సలహాదారుగా పనిచేశారు.
ఈ కమిటీ 3 నెలల పాటు
AP లో తిరిగి విజయవాడ గుంటూరు మధ్య
రాజధాని వద్దు అని చెప్పింది.
జగన్ హయాములో
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ,
GN రావు కమిటీ కూడా
ఇదే చెప్పాయి
ఇప్పుడు చెప్పండి కరెక్ట్ బాబా లేక జగనా
అన్ని ప్రాంతాలు
సమంగా డెవలప్ కావాలని కోరుకున్నాడు దార్శనికుడు జగన్
అంతే కానీ అమరావతికో ఇంకో ప్రాంతానికో వ్యతిరేకం కాదు.
12 likes
10 shares