More like this
- 🧿 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🧿🙏*🌅 ఉదయం నిద్రలేవగానే అరచేతులను దర్శించడం శుభప్రదం🙏✨* శాస్త్రాల ప్రకారం, ప్రాతఃకాలంలో నిద్రలేవగానే మంచం మీద నుంచే ముందుగా రెండు చేతుల అరచేతులను (కరతలాలను) దర్శించాలనే విధానం సూచించబడింది. ఆ సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి— > *కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ।* > *కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం॥* *అర్థం:* అరచేతి ముందుభాగంలో శ్రీమహాలక్ష్మీదేవి నివసిస్తుంది. మధ్యభాగంలో విద్యకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీదేవి నివసిస్తుంది. అరచేతి మూలభాగంలో శ్రీగోవిందుడు నివసిస్తాడు. అందువల్ల ప్రాతఃకాలంలో నా అరచేతుల్లో ఈ దివ్య స్వరూపాలను నేను దర్శిస్తున్నాను. ఈ శ్లోకంలో ధనానికి అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మీదేవిని, విద్యకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీదేవిని, శక్తికి మూలమైన, సద్గుణాలను ప్రసాదించే, సమస్త జీవులను పోషించే పరమేశ్వరుడైన శ్రీగోవిందుడిని స్తుతించారు. దీనివల్ల ధనం, విద్య, భగవదనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. ప్రభాత సమయంలో అరచేతులను దర్శించే ఆచారం వెనుక ఒక ఆచరణాత్మక కారణం కూడా ఉంది. నిద్రలేవగానే మన కళ్లకు ఇంకా మత్తు ఉంటుంది. అలాంటి సమయంలో దూరంలోని వస్తువులపై లేదా తీవ్రమైన వెలుగుపై చూపు పడితే కళ్లపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు. అందుకే ముందుగా సమీపంలో ఉన్న అరచేతులను చూడమని ఈ విధానం సూచించబడింది. దీనివల్ల క్రమంగా చూపు స్థిరపడుతుంది. మహర్షి వేదవ్యాసుడు చేతుల ద్వారా లభించే సామర్థ్యాన్ని మానవునికి అత్యంత మేలుకరమైనదిగా పేర్కొన్నారు. అరచేతులను దర్శించే మరో అంతరార్థం ఏమిటంటే, మన చేతుల్లోనే దైవస్వరూపాన్ని దర్శించడం ద్వారా మన ఆలోచనలు భగవంతుని ధ్యానంపట్ల మళ్లుతాయి. దీని వల్ల శుద్ధమైన, సాత్వికమైన కార్యాలను చేయాలనే ప్రేరణ కలుగుతుంది. అలాగే ఇతరులపై ఆధారపడకుండా, స్వీయ శ్రమతో, వివేకంతో జీవనోపాధిని సంపాదించాలనే భావన కూడా ఏర్పడుతుంది. మనం చేసే ప్రతి కార్యానికి మూలం భగవదనుగ్రహమే అని అంగీకరించడమే ఈ ఆచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. డైలీ విష్ ఆధ్యాత్మిక ఆనందం ద్వారా మీరు సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక విశేషాలు, పండుగల ప్రాముఖ్యత, వ్రతాలు, పూజా విధానాలు, దేవతల మహిమలు మరియు జీవితాన్ని సన్మార్గంలో నడిపించే ధార్మిక సందేశాలను తెలుసుకుంటున్నారు. ఈ దివ్య జ్ఞానం మీలో భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందించుగాక. ___________________________________________ HARI ✍🏻 ___________________________________________ #😃మంచి మాటలు #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #🙏🕉️వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు🎉 #తెలుసుకుందాం2832
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*నామస్మరణ మహత్యం* 🌹🌹🌹🌹🌹🌹🌹 ii * మనం వెలకట్టలేని సంపదలు రెండే రెండు * *ఒకటి మనశ్శాంతి. రెండోది సంతృప్తి.* * ఈ రెండింటిని సంపాదించుకున్నవాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కష్టపడఖ్ఖర్లేదు సంపాదించుకునేందుకు. *’కులదైవ (ఇలువేలుపు)’ నామ స్మరణ* చేస్తే చాలు. ఆ వెలకట్టలేని రెండు సంపదలూ లభిస్తాయి. *’ఆధ్యాత్మికత’ అనే సరస్సులో ‘నామం’ అనే రాయి వేస్తే శబ్ద తరంగాలు వెలువడతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి.*_ ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామమే *'ఆధ్యాత్మిక శబ్ద తరంగం.'* ”బెల్లం బెల్లం” అంటే బెల్లం రుచి మనకు తెలియదు. "తేనె తేనె” అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా…! బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మన అనుభవంలోకి వస్తుంది. నిజానికి దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే ఆయన మన దగ్గరుంటాడు. ఇది అనుభవైకవేద్యం. నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు. ’ఎంతకాలం నిరీక్షించాలి. ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడు’ అని సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారెవరైనా. మనం నిలబడాల్సింది ఇక్కడే. *దైవం ఒక అనుభవం.* ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది. *నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగాచేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి, ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.* *భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి వెల్లడించారు.* *పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుక్కావల్సింది సాధనయే.* *పూజ కోసం సామగ్రి కొనాలి. ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకూ, నోములకూ ఐతే కఠోరమైన నియమాలుంటాయి. యజ్ఞాలకూ, క్రతువులకూ శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోషరహితంగా చెయ్యాలి.* *కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందూ, పనులు చేస్తూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.* *భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో తేనెను పాలల్లో కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.* *నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామ స్మరణ చేయవచ్చు. విధివిధానాలూ, నిషేధాలూ లేనేలేవు..* #తెలుసుకుందాం #😃మంచి మాటలు #🚩జై శ్రీరామ 🕉️ #🚩🌺జై హనుమాన్🌺🚩 #🕉️🚩జై హనుమాన్🕉️🚩1414
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣* సకలశుభాల కొరకు శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతో లక్ష్మీపూజ * శ్రావణమాసంలో సకల శుభాలను కలిగించే పసుపు కొమ్ములతో శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి పూజ.... శ్రావణ మాసంలో ప్రతి రోజు పూజ ఇంట్లో చేసుకునే మహాలక్ష్మిఅమ్మవారి పూజకు ముందుగా మీరు ఏ కోరికతో చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి.. ఈ పసుపు కొమ్ముల పూజను శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుండి ప్రారంభించాలి. మాసం మొత్తం చేయాలి. ప్రతి రోజు ఉదయం ఇల్లు వాకిట్లో శుభ్రం చేసి ఈ నెల రోజులు గడపకు పసుపు కుంకుమా పెట్టాలి... అమ్మవారి విగ్రహం ఉన్న వారు అయితే అమ్మవారికి పసుపు నీటితో అబీషేకం చేయాలి, చేస్తున్న సమయంలో శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనుకుంటూ చేయాలి... విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటో ని అలంకరించిన చాలు, విగ్రహం ఉన్నవారు అభేషేకం ఐయ్యాక అమ్మవారికి అలంకారం చేసి, పూజకు కావాల్సిన వి సిద్ధం చేసుకుని దీపాలు అన్ని పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవాలి. కొన్ని పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి దండలాగా కట్టాలి ఈ దండను రోజు కట్టాల్సిన పని లేదు మొదటి రోజు కట్టిన పసుపుకొమ్ముల దండను నెల రోజులు వేయవచ్చు, తర్వాత మీ కోరిక ను అమ్మవారికి చెప్పుకుని యదా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించు కుని, 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి లక్ష్మిఅష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పసుపుకోమ్ము అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి నెల రోజులు ప్రతి రోజూ అష్టోత్తరం చదవాలి.. అర్చన ఐయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి.. ఈ నెల రోజులు పూజ ప్రారంభంలోనే చిన్న గిన్నెలో పానకం పెట్టాలి పూజ ఐయ్యాక ఆ పానకం తీర్థo లాగా సేవించాలి. వారంలో ఒక్కసారి అయినా తీపి అన్నం, పులిహోర వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం శుభాన్ని కలిగిస్తుంది. ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలి... మరుసటి రోజు మళ్ళీ పూజ సమయంలో శుభ్రం చేసే టప్పుడు ఆ పసుపుకొమ్ముల పక్కకు తీసి పెట్టి ,అవే పసుపు కొమ్ములు మళ్ళి అర్చనకు వాడాలి, అలా నెల రోజులు అదే పసుపుకొమ్ములు వాడాలి.. ఆఖరి రోజు అమ్మవారికి, పంచామృతము అభేషేకం చేసి 11 మంది ముత్తైదువులకు.. తాంబూలం ఇవ్వాలి ఏదైనా తీపి వండి మహా నివేదన చేసి ఆ ముత్తదువులకు తాంబూలంలో పండు తో పాటు ఒక పసుపుకొమ్ము, చిల్లర, పువ్వులు, మీరు వండిన ప్రసాదం వారికి ఇవ్వాలి..అక్షింతలు వేయించుకుంటే మంచిది.. మీరు 11 మందికి ఇచ్చే వారిలో ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి... ఇది చాలా విశేషమైన అర్చన, ఇంటిల్ల పాదికి సకల శుభాలు కలుగుతుంది, గ్రహ దోషం తో పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిస్కారం దొరుకుతుంది.. ఆటంకం వస్తే 7 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు. *నియమాలు* ఆటంకం రాకూడదు, ఆడవారికి అయితే మైలు స్నానం అయ్యాక 7 వ రోజు నుండి కొనసాగించాలి, ఈ నెల రోజులు మాంసాహరం తినకూడదు, పూజ పూర్తి అయ్యాక ఆహారం తినాలి కానీ ఉపవాసం చేయకూడదు మీరు ఎంత సంతోషంగా శ్రద్ధగా పూజ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.. వివాహితులు రోజూ తలస్నానమ్ చేయాలి (బ్రహ్మచర్య నియమం లేదు కనుక). అవివాహితులు మంగళ, శుక్ర, నాడు తల స్నానం చేస్తే సరిపోతుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం 9 లోపు పూజ ఐపోవాలి , ఈ పూజ అంతా అరగంట సమయం పడుతుంది అంతే ఆ కాసేపు అయినా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. ఈ నెల రోజులు రోజూ కూడా రోజంతా శ్రీ మహాలక్ష్మి దేవి నమః అనుకుంటూ ఉండటం చాలా మంచిది... ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్ళితే వచ్చాక మళ్ళీ మొదటి నుండి చేయాలి... ఇందులో ఏలాంటి మార్పు ఉండదు.. (మిగిలిన పసుపుకొమ్ములు వంటకు వాడుకోవచ్చు) #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🪔శ్రావణ మాసం610
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు అంటే ఎవరు?🙏📚 విద్య, జ్ఞానం, జ్ఞాపకశక్తి, వాక్పటుత్వానికి అధిదేవతగా ఆరాధించబడే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. శ్రీమహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం అత్యంత విశిష్టమైనది. గుర్రం ముఖం, మానవ శరీరంతో దివ్యరూపంలో దర్శనమిస్తూ, తన కరుణాకటాక్షంతో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 🌺 స్వామివారి విశిష్టత: పురాణాల ప్రకారం మధు–కైటభ రాక్షసులు అపహరించిన వేదాలను తిరిగి సంపాదించి బ్రహ్మదేవునికి అందించిన జ్ఞానస్వరూపుడు హయగ్రీవుడు. అందుకే ఆయనను సర్వవిద్యల ఆధారమూర్తిగా భావిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, పరిశోధకులు, కళాకారులు భక్తితో హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, విజయాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. 🕉️ 1. హయగ్రీవ ధ్యాన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ । ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 🌺 అర్థం: జ్ఞానం, ఆనందం స్వరూపుడై, నిర్మలమైన స్ఫటికంలా ప్రకాశించే, సమస్త విద్యలకు ఆధారమైన శ్రీ హయగ్రీవ స్వామిని నేను భక్తితో ఉపాసిస్తున్నాను. 🕉️ 2. విద్యా ప్రసాద శ్లోకం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ । తస్య నిస్సరతే వాణీ జాహ్ను కన్యా ప్రవాహవత్ ॥ 🌺 అర్థం: ఎవరు భక్తితో "హయగ్రీవ" నామాన్ని జపిస్తారో, వారి మాటలు గంగానది ప్రవాహంలా స్పష్టంగా, మధురంగా ప్రవహిస్తాయి. 🕉️ 3. విద్యా సిద్ధి శ్లోకం శ్రీమాన్ హయగ్రీవో మే సన్నిధత్తాం సదా హృది । విద్యాం బుద్ధిం బలం చైవ దేహి మే కరుణానిధే ॥ 🌺 అర్థం: ఓ కరుణాసాగరుడా! నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించి నాకు విద్య, బుద్ధి, బలం ప్రసాదించు. 🕉️ 4. జ్ఞాన ప్రాప్తి శ్లోకం విద్యానాం దేవతం వందే హయగ్రీవం దయానిధిమ్ । యస్య ప్రసాదాత్ సర్వజ్ఞం భవేత్ మానవ జీవనం ॥ 🌺 అర్థం: సమస్త విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవ స్వామిని నమస్కరిస్తున్నాను. ఆయన అనుగ్రహంతో జ్ఞానం, వివేకం, విజయాలు లభిస్తాయి. 🕉️ 5. ప్రార్థన ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః॥ 🌺 అర్థం: విద్య, జ్ఞానం, బుద్ధి ప్రసాదించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి నమస్కారం. 📖 పిల్లలు ప్రతిరోజూ ఉదయం లేదా చదువు ప్రారంభించే ముందు ఈ శ్లోకాలను భక్తితో చదివితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ధైర్యం, విద్యలో పురోగతి కలుగుతాయని విశ్వాసం. 🙏🌸 🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు 🙏 📍 స్వామివారు ఎక్కడ ఉంటారు? శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి: 📍 తిరువహీంద్రపురం (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి అత్యంత ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ ఊషధగిరి కొండపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 📍 నంగనల్లూరు, చెన్నై (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి ప్రసిద్ధ ఆలయం. 📍 బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (తెలంగాణ) – ఇక్కడ కూడా హయగ్రీవ స్వామివారిని విద్యాప్రదాతగా ఆరాధిస్తారు. #తెలుసుకుందాం #హయగ్రీవ స్వామి #లక్ష్మీ హయగ్రీవ స్వామి #🕉️ శ్రీ హయగ్రీవ 🙏 #హయగ్రీవ18178
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...........!! *1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.* *2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.* *3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము. *4. తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.* *5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.* *6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.* *7. సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.* *8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి బుధునకు, ఇనుము శని కి ఇష్టము.* *9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.* *10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.* *11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.* *12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.* *13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.* *14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.* *15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.* *16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.* *17. వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.* *18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.* *19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.* *20. కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.* *21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.* #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు1324
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣కొన్ని ఆలయాల గోడలపై మైథున శిల్పాలు ఎందుకు ఉంటాయి..... ఇది చాలా లోతైనా ప్రశ్న మరియు కొత్త గా మతం మారిన వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్న.. కాకపోతే వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అలాంటి మైథున శిల్పాలు అన్ని ఆలయాల పై ఉండవు కానీ తమ పూర్వ దర్మం పై నిందలు వేయడం లో ఉత్సహం కొద్ది 🐑🐑 లు ఈ ప్రశ్న కావాలనే మనల్ని అడుగు తారు. కాకపోతే ఇలాంటి లోతైన విషయాల పై అందరికి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వాటికి సమాధానం ఇవ్వలేరు. ఇప్పుడు ఆ సమాధానం నేను మీకు ఇస్తున్న. మన సనాతన ధర్మం లో 6 రకాల పూజా పద్ధతులు ఉన్నాయ్. ఆవి 1: దక్షిణా చారం 2: మధ్యమా చారం. 3: వామా చారము 4 : కౌలా చారం. 5: సమయాచారం. 6: సిద్ధాంతా చారం. విటీలో దక్షిణా చారం అనేది సాధారణం గ ప్రతి వారు చేసే పూజా విధి.ఈ ఆచారం ప్రకారం దేవతల ను సాత్విక పద్దతిలో పూజిస్తారు. ఈ విధానం అత్యుత్తమైనది. దేవతలు కూడ ఈ పూజా విధి నే ఇష్ట పడతారు. ఈ విధానం లో ఎలాంటి హింస ఉండదు. అసలు రక్తం అనే దానికి ఇందులో అవకాశం లేదు. ఇక మధ్యమా చారం అంటే ఇందులో కొంత వరకు బలులకు అనుమతి ఉంటుంది. అదికూడా కోడి,మేక,గొర్రె ఇంకా అరుదుగ దున్నపోతు ను బలి ఇస్తారు.ఇలాంటి వాటి వరకే ఈ పూజ లు సాధారణంగ గ్రామ దేవతలకు చేస్తారు. ఈ గ్రామ దేవతలను సాత్విక పూజల ద్వారా కూడ పూజించవచ్చు కానీ పామరులు తమ వద్ద ఉన్న వాటిలో శ్రేష్ఠ మైనవి తమను కాపాడే దేవతకు ఇవ్వాలి అనే ఉద్దేశం తో ఇచ్చేవే జంతు బలులు. బలి అనే పదానికి నిజమైన అర్థం జీవ హింస కాదు. దేవత కు అర్పించిన దానినే బలి అంటారు. అందుకే మనకు సాధారణ ఆలయాల్లో కూడ బలి పిఠాలు ఉంటాయి. వాటి పై భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని ఉంచుతారు. ఆ ప్రసాదాన్ని బలి అన్నము అంటారు. ఆ బలి అన్నం పక్షులు, కీటకాలు తినడం కోసం ఉంచుతారు. అందులోను దేవుని ప్రసాదాన్ని మొదట బలి పీఠం పై ఉంచిన తరువాత నే భక్తులకు ఇస్తారు. కాబట్టి మన పూజా విధానం లో పక్షులు, కీటకాలను కూడ గౌరవించే సంప్రదాయం మనది. ఇక చివరి రెండూ ఐన సమయాచారం, సిద్ధాంతాచారం అనేవి పూర్తిగా యోగులు, సిద్ధులు పాటించే పద్ధతులు. ఐతే మూడు, నాలుగు పద్ధతులు ఐన వామాచారం, కౌలాచారం అనేవి మాత్రం ఒకప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉండి ఇప్పుడు మరుగున పడిన ఆచారాలు. ఇవి పూర్తిగా తాంత్రిక పద్ధతులు ఇందులో దేవతలను పంచ మకారాలతో పూజిస్తారు. ఆ పంచ మకారాలు యేవో చూద్దాం. 1: మద్యం 2:మాంసం 3: మస్త్యం 4: ముద్ర 5:మైథునము. వీటిలో ప్రతిధి పవిత్రము గానే భావిస్తారు. మైథునం అనేది కూడ పూజా విధానం లో భాగం గానే చూస్తారు తప్ప కోరిక తో చెయ్యరు. ఇలాంటి అచారాలు 5 వ శతాబ్దం నుండి 10, 11 శతాబ్దముల మధ్య ఉచ్చ స్థితి లో ఉన్నాయ్. అందులో కూడ కౌలాచారం పద్ధతి లో పూజలు చేసే ఆలయాల గోడల పై మాత్రమే ఇలాంటి మైథున శిల్పాలు ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి పూజలకు కజురహో ఆలయం మూల కేంద్రంగా ఉండేది కాబట్టి ఆ ఆలయం లో మనకు మైథున శిల్పాలు కనిపిస్తాయి. ఈ పద్ధతులలో దశ మహా విద్యలలో నీ కొందరు తాంత్రిక దేవతలను మాత్రమే ఆరాధిస్తారు. తరువాత కాలం లో ఈ విధానం మరుగున పడిపోయింది కానీ బౌద్ధం లో కొన్ని శాఖ లు ఇప్పటికి ఈ పద్ధతులలో రహస్యం గ పూజలు చేస్తుంటారు. ఆ పద్ధతులలో పూజలు అందుకునే దేవతలు కూడ చాలా ఉగ్ర స్వరూపం కలిగి ఉంటారు. పూజలు లో చిన్న పొరపాటు జరిగిన కూడ తీవ్ర మైన శిక్ష లు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు హిందూ ధర్మం లో దక్షిణ, మధ్యమ అచారాలలో మాత్రమే పూజలు జరుగుతాయి. కాబట్టి అన్ని ఆలయాల గోడల పై ఇలాంటి మైథున శిల్పాలు ఉండవు.విటినీ మైథున శిల్పాలు అనాలి అదే సరైన పదం. శృంగార శిల్పాలు అనడం సరైన పదం కాదు అనేది నా అభిప్రాయం. ఇంకా కొన్ని గ్రామ దేవతలు లేద రాజసిక గుణం కలిగిన దేవతల ఆలయాల గోడల పై ఒక బొమ్మను మాత్రం పెడతారు. నిజానికి అది గుడి కీ వచ్చే భక్తుని చిత్తాన్ని పరీక్షించే ఉద్దేశం లో ఒక భాగం కూడ కావచ్చు. #తెలుసుకుందాం310
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#తెలుసుకుందాం1615
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#depression #mental health నా depression ప్రయాణం లో నేను కొందరిని అదే ప్రాబ్లెమ్ తో ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. first of all మీది డిప్రెషన్ నో కాదో తేల్చాల్సింది doctors . మీకు మీరే అనేసుకోవద్దు. అసలు ఆ dr దగ్గరికి వెళ్లాలో లేదో అనేది చెప్పాల్సింది జనరల్ ఫిజీషియన్స్ డైరెక్ట్ గా మీరే నిర్ణయించుకోకండి. ఆడ/ మగ లో dull గా మనసుబాలేక పోవడానికి చాలా reasons ఉంటాయి. చిన్న చిన్న వాటికి , మనసుబాలేకపోతే , డిప్రెషన్ అని అనేయడం ఈ మధ్య అందరికి పరిపాటి అయ్యింది. జనరల్ గా బాడీ లో డెఫిషియన్సీ లు ఉన్నా dull గా నిద్రపోతూ ఉంటారు. ఆడవాళ్ళకి గైనిక్ సంబంధించిన ,/ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల కూడా mood swings ఉంటాయి. చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కో శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. ఒకరికి ఎక్కువ ఉండచ్చు. ఒక్కోరికి చాలా ఎక్కువ ఇబ్బంది ఉండవచ్చు. ఆ మేమూ దాటివచ్చాం అనే చుట్టుపక్కల వాళ్ళ మాట చెవికి ఎక్కుంచుకోవద్దు. ముందు జనరల్ ఫిజిషియన్/ గైనకాలజిస్ట్ ని సంప్రదించి… వాళ్ళ సలహామేరకు మాత్రమే మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది మిత్రులు నేను వాడే మందులు ఒక స్ట్రిప్ పంపు.. వాడి చూస్తాను . నిద్ర ఉండటం లేదు అనేవాళ్ళు. అమ్మో. సైకియాట్రిస్టులు ప్రిస్కిప్షన్ లేనిదే ఆ మందులు షాప్ లో ఇవ్వరు. లెక్క ప్రకారం రెండు నెలల కి అంటే ఒక్క టాబ్లెట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. అవేం నిద్ర మాత్రలు కావు. చాలా రిస్క్ అలా వేసుకోవడం. అక్కడే అర్ధం అయ్యింది వాళ్లకి డిప్రెషన్ మీద అవగాహన శూన్యం అని. కొందరికి పరిస్థితులు చక్కదిద్దుకునే నార్మల్ అయిపోతారు. అది డిప్రెషన్ కానే కాదు. టెంపరరీ పెయిన్. ప్రతీ ఒక్కరి జీవితం లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని దాటక తప్పదు. మీ వల్ల కాకపోతే, కౌన్సిలింగ్స్ ఉపయోగపడతాయి max. మందులు కాదు. మీకు కౌన్సెలింగ్ చాలా/ మందుల అవసరం ఉందా అనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు. ఒక విషయం చెప్పనా ఫ్రాంక్ గా ………డిప్రెషన్ అనేది ఒక ఏడాది, నెల లో ఏర్పడేదే కాదు. ఆల్రెడీ దానికి పునాది ఎప్పుడో ఎన్నోసార్లు దెబ్బ మీద దెబ్బ పడే ఉంటుంది. #depression #తెలుసుకుందాం1114
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣""సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా ... అని చాలా మంది స్త్రీలకు కలిగే అనుమానం."" గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి. ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, దండకములు చెప్పించాలి. ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు. “దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం! బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!! శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్! జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!! సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!.. ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము. కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు. దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు - పత్తివత్తుల దీపారాధన:- దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. అరటినార వత్తుల దీపారాధన:- కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. - తామరతూడు వత్తుల దీపారాధన: - ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. - జిల్లేడు వత్తుల దీపారాధన :- విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. - పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తుల దీపారాధన: అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది. - lకుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన :- దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది. - పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి...స్వస్తీ.. #తెలుసుకుందాం610
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣నీలోని మనసు గుడికి 18 మెట్లు సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన– ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం. *1 . సంస్కారబలం ఉండాలి* సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది. *2 . మోహాన్ని పోగొట్టుకోవాలి* మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు. *3.తప్పొప్పుల కూడిక* ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు? *4. మాట వినడమన్నది తెలుసుకోవాలి* మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు. *5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు* తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు చదవండి. *6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే* జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం. *7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి* ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది. *8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి* నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి. *9. కోపాన్ని తగ్గించుకోవాలి* మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు. *10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి* అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి. *11. వినండి, వినడం నేర్చుకోండి* ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది. *12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి* నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి. *13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి* పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. *14. నిరాశను దరిచేరనివ్వకండి* అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు. *15. మంచి మంచి పుస్తకాలు చదవండి* ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి. *16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి* ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. *17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి* మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి. *18. పొగడ్తకు పొంగిపోకండి* ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి. #తెలుసుకుందాం #😃మంచి మాటలు1214