🐢 శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవది - కూర్మావతారం
దేవతలకు శక్తి నశించి, అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకాలి అనుకున్నారు. మందర పర్వతం కవ్వం, వాసుకి సర్పం తాడుగా చేసుకొని చిలుకుతుంటే పర్వతం సముద్రంలో మునిగిపోతుంది.
అప్పుడు శ్రీమన్నారాయణుడు కూర్మం అంటే తాబేలు రూపం ధరించాడు. తన గట్టి వీపుపై మందర పర్వతాన్ని నిలబెట్టాడు. దేవదానవులు ధైర్యంగా చిలికారు.
చిలుకుతుంటే మొదట హాలాహలం విషం పుట్టింది. పరమశివుడు దాన్ని తాగి నీలకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, చంద్రుడు, ధన్వంతరి అమృత కలశంతో వచ్చారు.
పరమార్థం: మన జీవితం అనే సముద్రాన్ని చిలికితే ముందు కష్టాలు అనే విషం వస్తుంది. ఓర్చుకుంటే చివరికి అమృతం అనే విజయం వస్తుంది. ఆ కష్ట సమయంలో భగవంతుడు తాబేలు లాగా మనకు ఆధారంగా నిలుస్తాడు.భారతదేశంలో కూర్మావతార దేవాలయాలు: 1. శ్రీ కూర్మనాథస్వామి ఆలయం శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా -ఆంధ్రప్రదేశ్ - ప్రపంచంలో ఏకైక ప్రధాన కూర్మ ఆలయం స్వామి పడమర ముఖంగా ఉంటాడు
2. కుర్మై వరదరాజస్వామి ఆలయం కుర్మై గ్రామం చిత్తూరు జిల్లా -ఆంధ్రప్రదేశ్
3. గవిరంగాపుర కూర్మ దేవాలయం చిత్రదుర్గ జిల్లా -కర్ణాటక
4. స్వరూప్ నారాయణ్ ఆలయం గోఘాట్ గ్రామం హుగ్లీ జిల్లా -పశ్చిమ బెంగాల్
5. ఆమామంగళం మహా విష్ణు ఆలయం కక్కూర్ కాలికట్ జిల్లా -కేరళ
#తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏విష్ణుమూర్తి దశావతారాలు 🙏# #విష్ణుమూర్తి దశావతారాలు


