భోగ భాగ్యలిచ్చే భోగి
2 Posts • 204 views
PSV APPARAO
573 views 9 days ago
#భోగ భాగ్యలిచ్చే భోగి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గోదాదేవి #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు) #ధనుర్మాసం విశిష్టత *గోదా భోగమే భోగి* గోదా అంటే వాక్కును, వస్త్రములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పరమాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పించుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. భోగి పండగ సందడి తెలుగు లోగిళ్లలో ప్రవేశించింది. ఈ పండగకు భోగి అనే పేరు ఎందుకు వచ్చిందనే సందేహం రావచ్చు. దీనికి రకరకాల కారణాలను తెలుపుతారు. వ్యవ సాయదారులు పంటలను ఇళ్లకు చేర్చుకుని విశ్రాంతితో భోగం అనుభవిస్తారు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే విజ్ఞులు దీనికి మరో కారణాన్ని, అంతరార్థాన్ని, ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. గోదాదేవి నెల రోజులు వ్రతం చేసి రంగనాథుడిని వివాహ మాడి ఆ స్వామి చెంతకు చేరి భోగము అనుభవించిన రోజు భోగి అంటారు. నూటికి తొంభై మంది భోగి మంటలు చలి తీవ్ర తను తట్టుకోలేక వేసుకునేవి అనుకుంటారు. ఆ మంటలలో ఇంట్లోని పాత వస్తువులను ముఖ్యంగా కలపను వేయడం ఆచారం. అందులోని ఆంతర్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్ని అంటే జ్ఞానమని పండితుల నిర్వచనం. కలప అంటే అజ్ఞానం. అనగా జ్ఞానంలో అజ్ఞానాన్ని తగులబెట్టడం భోగి మంట. అజ్ఞానం, ఆరాటం, ఆశ, తుచ్చ అనుభవం, విపరీత ప్రవృత్తి, భ్రమ ఇవి మనలో ఉన్న కలపలు, వీటన్నింటిని జ్ఞానరూపమైన భగవంతునిలో దహింప చేయడమే భోగిమంట చెప్పే సందేశం. ప్రస్తుతం ఉన్న అజ్ఞానం తరువాత కలుగబోయే అజ్ఞానపు ఆలోచనలు అన్నీ కూడా దహింప చేయవలసినవే. ఇందులోని పరమార్థం స్వార్థాన్ని దహింప చేయడమే ఇతరుల ఇళ్ళల్లోని కలపను కూడా భోగి మంటల్లో వేసే ఆచారం ఉంది. అనగా వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారి అజ్ఞానాన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేయాలి, అప డు స్వార్థానికి తావుండదు. భోగి పండుగ రోజు ఐదు సంవత్సరాల లోప పిల్లలకు రేగి పళ్లు, చెరుకు గడలు, కొత్త పంటగా వచ్చిన బియ్యం, నాణేలు, బెల్లం ఇవ్వన్నీ కలిపి భోగి పళ్లుగా వారి శిరస్సున పోసే ఆచారం ఉంది. మన సంపదను పది మందికి పంచిపెట్టే దాత్రుత్వ బుద్ది పిల్లలకు అలవర్చాలని, ఉన్నది, తిన్నది మనది కాదని పది మందికి పంచినదే మనదనే ఉపనిషత్తు వాక్యసారం ఈ ఆచారంలో ఇమిడి ఉంది. ఇక గోదా కల్యాణంలోను అంతరార్థాలు దాగి ఉన్నాయి. ఇక గోదా దేవి విషయానికి వస్తే... శ్రీమన్నారాయణుడు సంసారంలోని జీవులను తరింప చేసే విధానాన్ని ఆలోచిస్తుండగా అమ్మ అతని అనుమతితో విష్ణుచిత్త పుత్రికగా పుట్టి యుక్త వయస్సు రాగానే పరమాత్మను మాత్రమే భర్తగా పొందగోరింది. ద్వాపర యుగంలో గోపికలు చేసిన మాస వ్రతాన్ని తాను ఆచరించి, పరమాత్మను ప్రసన్నుడిని చేసుకుని వివాహమాడింది. గోదా అంటే వాక్కును, వస్త్ర ములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పర మాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పిం చుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. తాను ఆచరించిన వ్రతం, తాను పొందిన ఫ లితం తనలోనే దాచుకొనక పది మందికి వ్రత విధానాన్ని బోధించడానికి తిరుప్పావై అను ముప్పె పాశురాల ప్రబంధాన్ని మృదుమధురంగా లోకానికి అందించింది. గోదాదేవి. ఆర్తి ఉన్నవారు అందరూ భగవంతుని పొందడానికి అర్హులే. కులం,మతం,జాతి వంటి భేదాలు భగ వంతుని పొందే విషయంలో లేవని విశ్వ మానవ కళ్యాణాన్ని వేనోళ్లచాటిన దయా మయురాలు గోదమ్మ. తాను ఒక్కతే కాక పది మంది గోపికలను లేపి వారితో కలిసి పరమాత్మ దగ్గరకు వెళ్లడం ద్వారా రుచి కరమైన పదార్థాన్ని ఒక్కరే భుజించక పది మందికి పంచాలనే ఉపదేశాన్ని తెలియ జేస్తుంది. భగవంతుని చేరాలంటే ఆహార నియ మం, వ్యవహార నియమం తప్పక పాటించాలని, మనం చేసుకునే అన్ని అలంకారాలు భగవంతుని కోసమే అని చెప్పడమే ఈ వ్రతోద్దేశ్యం. ఏ వ్రతమైనా నియమాలను ఆచరించడం తప్పనిసరి. శరీరాన్ని శోషింప చేస్తే మనసు పోషింపబడుతుంది, మనసు పోషించ బడితే స్వార్థం సమూ లంగా నశిస్తుంది. పరార్థం, పరమార్థం వికసిస్తాయి అనే ఉపదేశం గోదా కళ్యాణంలో ఇమిడి ఉంది.
13 likes
10 shares
S.HariBlr (Bangalore)
1K views 11 days ago
#😇My Status #భోగి శుభాకాంక్షలు #భోగ భాగ్యలిచ్చే భోగి *భోగ భాగ్యలిచ్చే 'భోగి'..!* *రేపే భోగి 13-01-2026* తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు 'భోగి'తో ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో, హేమంత రుతువులో, శీతగాలులు వీస్తూ.. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి. సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు.'భోగి' రోజున కొన్ని రకాల కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగి రోజే గొచ్చి గౌరీవ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటివి వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళ హారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు.ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగో రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను 4 వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయడం కూడా ఆచారం. 'భోగి' రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.'భోగి' మంటలు'భోగి' జనవరి 13 న వస్తుంది. ఈ రోజు తెల్లవారక ముందే.. 3.30 నుంచి 4.00 మధ్య సమయంలో 'భోగి' మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో చలిని ప్రాలదోలడమే కాకుండా, ఇంకో సందర్భముగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు , విరిగిపోయిన బల్లలు వగైరా మొత్తం పోగు చేసి వీటితో బోగి మంటను వెలిగిస్తారు. దీని ద్వారా కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజు 'భోగి' మంటలు వెలిగిస్తారు.కొందరి ఇళ్లలో 'భోగి' రోజు సాయంత్రం పూట చిన్న పిల్లల బొమ్మలు కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మలు కొలువులో పిల్లల వివిధ రకాల ఆట వస్తువులని ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. మరికొంత మంది భోగి పళ్ళ పేరంటం చేస్తారు. ఇక్కడ పేరంటాళు మరియు బంధువులు సమావేశమై , రేగి పళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ..
5 likes
6 shares