అజ ఏకాదశి
7 Posts • 3K views
PSV APPARAO
506 views
#సర్వ శ్రేయస్కరం విష్ణు సహస్రనామ పఠనం #శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అన్నద ఏకాదశి / అజ ఏకాదశి (శ్రావణ మాసం కృష్ణ పక్షం) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అజ ఏకాదశి *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *అజ ఏకాదశి సందర్భంగా...* భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి... భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ...... జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది...
3 likes
5 shares
PSV APPARAO
827 views
#శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అన్నద ఏకాదశి / అజ ఏకాదశి (శ్రావణ మాసం కృష్ణ పక్షం) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అజ ఏకాదశి #అజ ఏకాదశి *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *అజ ఏకాదశి సందర్భంగా...* భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి... భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ...... జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది...
9 likes
5 shares
PSV APPARAO
706 views
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అన్నద ఏకాదశి / అజ ఏకాదశి (శ్రావణ మాసం కృష్ణ పక్షం) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #అజ ఏకాదశి *ఏకాదశీ వ్రత మహిమ* *అన్నద ఏకాదశి (అజ ఏకాదశి)* అన్నద ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మవైవర్తపురాణంలో వర్ణించబడింది. “కృష్ణా! శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించవలసినది" అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. "రాజా! నేను చెప్పేది సావధానంగా విను. మనిషియొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళమయమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన హృషీకేశుని అర్చించేవాడు సమస్తపాపకర్మల ఫలం నుండి ముక్తుడౌతాడు". పురాతనకాలంలో హరిశ్చంద్రుడినే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు. అతడు సత్యసంధుడు, నీతిమంతుడు. ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగాను, తన మాటను నిలబెట్టుకోవడం కొరకు గాను అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. చివరకు అతడు తనను, తన భార్యను, పుత్రుణ్ణి కూడ అమ్ముకోవాల్సి వచ్చింది. రాజా! ఆ పుణ్యచక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు. అయినప్పటికిని అతడు సత్యసంధతతో స్థిరమైన శ్రద్ధను కనబరచాడు. తన యజమాని ఆదేశంపై అతదు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసికోవడం మొదలుపెట్టాడు. అంతటి నీచమైన పనిలో నెలకొనినప్పటికిని అతడు తన సత్యసంధత నుండి, సక్రమ వర్తనం నుండి వైదొలగలేదు. ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి".. తరువాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదేపదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు కావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. ఆ తరువాత తన దీనగాథను అతడు గౌతమముని కి వివరించాడు. రాజుయొక్క దీనగాథను వినిన గౌతమముని ఆశ్చర్యంతో “రాజా! శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవడం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశిరోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చేయాలి. దాని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది. ఓ రాజోత్తమా! నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలిసికో!" అని అన్నాడు. హరిశ్చంద్రుని ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమముని అదృశ్యుడయ్యాడు. ఆ తరువాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాపదూరుడయ్యాడు. ఓ రాజసింహమా! ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేకానేకసంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడ దాని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశీ ప్రభావం వలననే హరిశ్చంద్రుడు తన భార్యను, మృతపుత్రుని తిరిగి పొందాడు. అపుడు దేవతలు దుందుభులు మ్రోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశీప్రభావం వలననే ఆ రాజు తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండ అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్రప్రజలతో పాటుగా భగవద్దామానికి వెళ్ళాడు. రాజా! ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్తపాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు" అని శ్రీకృష్ణుడు ముగించాడు. *ఈ ఏకాదశీ మహిమను వినినవాడు, చదివినవాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగల్గుతాడు.* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
11 likes
14 shares