*అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది*
09.06.2026 – మంగళవారం
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు మరియు దిశా కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారు, అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ జారె ఆదినారాయణ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు కలిసి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆదివాసీ కొండరెడ్డి గిరిజన గ్రామాలైన పూసుగూడెం, కట్కూరులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం పట్వారిగూడెం నుంచి పాకలగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
స్థానిక రైతు వేదికలో రాచూరుపల్లి, మల్లారం గ్రామాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేశారు. పట్వారిగూడెంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తదుపరి మొద్దులగూడెం గ్రామంలో రైతులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రెడ్యాలపాడు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.
అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పర్యటించి కొమరం భీం అర్బన్ ఎకో పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” నిర్మాణ పనులను ప్రారంభించారు.
కొత్తమామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేసి, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ సుంకవల్లి వీరభద్రరావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి వాసం రాణి గారు, అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జూపల్లి శశికళ రమేష్ గారు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
#🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్ @followrs