DUDEKULA DASTAGIRI
1.4K views
7 days ago
*"స్వచ్ఛ ఆంధ్ర - పరిశుభ్ర ఆంధ్ర" కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు* *గిద్దలూరు నియోజకవర్గం పట్టణంలోని గిద్దలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన "స్వచ్ఛ ఆంధ్ర - పరిశుభ్ర ఆంధ్ర" కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలు, వీధులు మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు.* *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - పరిశుభ్ర ఆంధ్ర" కార్యక్రమo పరిశుభ్రత వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.* *గిద్దలూరును ఆదర్శవంతమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పట్టణ ప్రజలు పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు.* #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్