తెలుసుకుందాం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
784 views
1 months ago
🌿 రావి చెట్టు: విశ్వాసం, ఆయుర్వేదం మరియు అస్తిత్వానికి ప్రతీక అయిన మహావృక్షం 🌿 రావి ఆకుల గలగల శబ్దంలో కేవలం గాలి శబ్దం మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి నాగరికత యొక్క గుసగుసలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇది కేవలం ఒక చెట్టు కాదు; ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక 'దైవ వరం', ఇది మనకు జీవితంలోనూ, తత్వశాస్త్రంలోనూ పాఠాలు నేర్పుతుంది. 🕉️ ధర్మం మరియు ఆధ్యాత్మికత యొక్క శిఖరం సనాతన ధర్మంలో, రావి చెట్టును 'దేవవృక్షం'గా పూజిస్తారు. స్కంద పురాణం ప్రకారం, దాని వేళ్ళలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి మరియు పై కొమ్మలలో (ఆకులలో) శివుడు కొలువై ఉంటారు. బోధి వృక్షం: ఈ పవిత్రమైన చెట్టు కిందనే సిద్ధార్థ రాకుమారుడు 'బుద్ధత్వాన్ని' పొందాడు, తద్వారా ఇది జ్ఞానోదయం మరియు నిర్వాణానికి ప్రపంచవ్యాప్త చిహ్నంగా మారింది. శాశ్వత శక్తి: పితృ దోషాలను (వంశపారంపర్య దోషాలను) తగ్గించి, ఆధ్యాత్మిక ప్రశాంతతను సాధించడానికి ఈ చెట్టును ఒక ప్రధాన కేంద్రంగా పరిగణిస్తారు. 🧬 విజ్ఞాన అద్భుతం సహజ ఆక్సిజన్ మొక్క: చాలా చెట్లు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుండగా, రావి చెట్టు 24 గంటలూ ఆక్సిజన్‌ను (ప్రాణవాయువును) అందించే అరుదైన జాతులలో ఒకటి. పర్యావరణ సంరక్షకుడు: దీని విశాలమైన, దట్టమైన పందిరి ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా, వాతావరణాన్ని శుద్ధి చేయడంలో కూడా ముందుంటుంది. విలక్షణమైన నిర్మాణం: దీని ఆకుల ప్రత్యేకమైన ఆకృతి వల్ల, అవి చిన్న గాలికి కూడా నిరంతరం కదులుతూ ఉంటాయి. దీనివల్ల చుట్టుపక్కల వాతావరణం ఎల్లప్పుడూ ఉత్సాహంగా, జీవంతో నిండినట్లుగా అనిపిస్తుంది. 🩺 ఔషధ గుణాల నిధి ఆయుర్వేదంలో, రావి చెట్టును 'విశ్వరూప' (సార్వత్రిక) నివారణగా పరిగణిస్తారు. దీని బెరడు, పండ్లు మరియు లేత ఆకులు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు రక్త సంబంధిత సమస్యలకు సర్వరోగ నివారిణిగా నిరూపించబడ్డాయి. "ఏ చెట్టు నీడలో బుద్ధుడు జ్ఞానోదయం పొందాడో; ఏ ఆకులలో దేవతలు కొలువుదీరారో; మరియు దేని శ్వాస నుండి ప్రాణదాత అయిన ఆక్సిజన్ నిరంతరం ప్రవహిస్తుందో—ఆ రావి వడే భారత భూమికి నిజమైన వైభవం." 🌳🌳🌳🌳🌳 #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.6K views
1 months ago
ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. *మత్స్యపురాణం* మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. *కూర్మపురాణం* కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. *వామన పురాణం* పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. *వరాహపురాణం* వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. *గరుడ పురాణం* గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది. *వాయుపురాణం* వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. *అగ్నిపురాణం* అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు. *స్కందపురాణం:* కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. *లింగపురాణం* లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. *నారద పురాణం* బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. *పద్మపురాణం* ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. *విష్ణుపురాణం* పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. *మార్కండేయ పురాణం* శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి. *బ్రహ్మపురాణం* బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. *భాగవత పురాణం* విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. *బ్రహ్మాండ పురాణం* బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. *భవిష్యపురాణం* సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. *బ్రహ్మావైపర్తపురాణము * ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి #తెలుసుకుందాం