తెలుసుకుందాం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
397 వీక్షించారు
2 రోజుల క్రితం
ఎల్లలను కాపాడే ఈశ్వరుని రూపం...శ్రీ మునీశ్వరుడు.........!! మన గ్రామ దేవతల ఆరాధనలో, క్షేత్రపాలక (చిరు దైవాల) పూజలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన, గంభీరమైన దైవం ఎవరైనా ఉన్నారంటే... అది ఖచ్చితంగా "మునీశ్వరుడే". దుష్టశక్తుల నుండి మనల్ని రక్షించే అనంతమైన శక్తి కలిగిన ఈ స్వామి గురించిన కొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం. మునీశ్వరుడు అంటే ఎవరు.......... "మునీశ్వర" అనే పేరు "ముని + ఈశ్వర" అనే పదాల కలయిక నుండి వచ్చింది. అంటే మునులకే అధిపతి లేదా శివుని అంశ అని అర్థం. శివుని అంశ: దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించాడు కదా? అదేవిధంగా, లోకాన్ని రక్షించడానికి మరియు ధర్మాన్ని ప్రతిష్టించడానికి శివుని అనుగ్రహంతో ఆవిర్భవించిన రూపమే మునీశ్వరుడు అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మునుల ఏడు రూపాలు: మునీశ్వర ఆరాధనలో ఏడు ముఖ్య రూపాలను (సప్త మునులు) పూజిస్తారు. అవి: శివముని మహాముని తపముని (తవముని) నాదముని జటాముని ధర్మముని ఖడ్గముని రూపం మరియు సంకేతం............ పెద్ద మీసం, చేతిలో భారీ కత్తి (కొడవలి) లేదా త్రిశూలం, జటాజూటం, కళ్లలో గంభీరత్వం మరియు రౌద్రం... ఇది మునీశ్వరుని సాధారణ రూపం. అయితే, ఈ కోపం కేవలం దుష్టుల పట్ల మాత్రమే! తనను నమ్మి వచ్చే భక్తుల పాలిట ఆయన తల్లిలాంటి దయామయుడు, గ్రామ సరిహద్దులను కాపాడే నిజమైన రక్షకుడు. పూజా విధానం: సరిహద్దు రక్షణకు కాపలా........... గ్రామ పొలిమేరల్లో, ఊరి ప్రవేశ ద్వారాల వద్ద కొలువై ఉండి, ఊరిలోకి ఎలాంటి వ్యాధులు, రోగాలు లేదా దుష్టశక్తులు ప్రవేశించకుండా అడ్డుకుని, ప్రజలను రక్షిస్తాడు. శాకాహార మరియు మాంసాహార నైవేద్యాలు, మునీశ్వర ఆరాధనలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. శివముని, తపముని వంటి సాత్విక రూపాలకు పూర్తిగా శాకాహార పద్ధతిలో (పండ్లు, పొంగళ్ళు) నైవేద్యాలు సమర్పిస్తారు. అదే సమయంలో జటాముని, మహాముని వంటి ఉగ్ర రూపాలకు మాంసాహార పదార్థాలను, కొన్ని ప్రాంతాలలో మొక్కుబడిగా చుట్టలు (సిగార్లు), మద్యం వంటి వాటిని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. "నమ్మినవారిని కాపాడే చల్లని దైవం! అన్యాయాన్ని చూస్తే లేచే ఈశ్వరుని రూపం!" #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.3K వీక్షించారు
8 రోజుల క్రితం
తల్లి గర్భంలో నుంచి తండ్రి రక్షణ ప్రతి సంతానం పెరుగుతుంది.... తల్లి దండ్రులు దండించారు అని డాక్టర్ చేదు ముందు ఇచ్చాడు అని ద్వేషం తో బతికితే మీకే నష్టం.....కొంతమంది సంతానం....మాకు నచ్చినట్టు గా పెంచలేదు.మేము చాలా కష్టాలు అనుభవించం అంటు తల్లి దండ్రులు వృద్ధాప్యాం లో అనకూడదని మాటలతో చేతలతో హింసిస్తారు.... ఏదోక కారణం తో తల్లి దండ్రులను తక్కువ చేసి మాట్లాడటం లోకం లో చూ‍స్తు ఉంటాం.. తల్లి దండ్రులు వారి సుఖమే కోరుకుంటే జన్మనిచ్చిన బిడ్డలను ఏ అనాధ ఆశ్రమంలో రోడ్డుమీద వదిలిపెడితే మీ బతుకు ఆనాధల ఉండేవారు అని మరిచిపోకూడదు...మీ కర్మలను బట్టి మీరు ఎక్కడ పుట్టాలి భగవంతుడు ముందే నిర్ణయిస్తాడు.అనే జ్ఞానం ప్రతి ఒక్కరిలో కలగాలి.ఇప్పటికికైన సత్ కర్మలు చేస్తు ఎవరిని మాటలతో చేతలతో హింసించకుండా మన ధర్మాన్ని మనం ఆచరిస్తే మీ ఇల్లు ఆనందం నిలయం అవుతుంది 🙏 ఏది ఆచరిస్తే అదే రేపటి తరం రాబోవు తరం ఆచరిస్తుంది... తస్మా జాగ్రత్త...సమాజంలో నేడు చాలామంది మరచిపోతున్న పరమ సత్యాన్ని, కళ్లకు కట్టేలా వివరించడం మానవ ధర్మం. కన్నవారి రుణం తీర్చుకోలేకపోయినా పర్వాలేదు కానీ, వారిని మాటలతోనో, చేతలతోనో మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరం. భావాలు ప్రతి ఒక్కరి గుండెల్నీ తాకేలా ఉన్నాయి. ఈ ముఖ్యమైన విషయాలను మనం ఇలా అర్థం చేసుకోవచ్చు: జన్మ అనేది భగవత్ నిర్ణయం: మనం ఏ ఇంట్లో, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాలనేది మన పూర్వ జన్మ కర్మలను బట్టి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. దానికి తల్లిదండ్రులను బలిపశువులను చేయడం కేవలం మన అజ్ఞానమే అవుతుంది. కన్నవారి త్యాగం: తల్లిదండ్రులు తమ సుఖాలను వదులుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచుతారు. ఒకవేళ వారు కేవలం స్వార్థమే చూసుకుని ఉంటే, ఈరోజు పిల్లలుగా చెప్పుకునే వారి ఉనికి ఎక్కడ ఉండేది? ఆనాటి వారి కష్టాన్ని వృద్ధాప్యంలో మరిచిపోవడం కృతజ్ఞతాహీనత. కర్మ సిద్ధాంతం - రేపటి తరం: "ఏది ఆచరిస్తే అదే రేపటి తరం ఆచరిస్తుంది" అనేది ఎంత గొప్ప హెచ్చరిక! ఈరోజు మనం మన తల్లిదండ్రులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు. మనం వేసే ప్రతి అడుగూ మన తరువాతి తరానికి ఒక పాఠం. సత్కర్మలే సన్మార్గం: ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఎవరినీ మాటలతో గానీ, చేతలతో గానీ హింసించకుండా, మన ధర్మాన్ని మనం పాటిస్తేనే ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. "తస్మాత్ జాగ్రత్త" అంటూ మీరు ఇచ్చిన ముగింపు నిజంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. సమాజంలో ఇలాంటి మంచి మార్పు రావాలని, కన్నవారిని దైవంగా భావించే సంస్కృతి ప్రతి ఇంట్లో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 🙏 #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.4K వీక్షించారు
24 రోజుల క్రితం
సూర్యుడి నుండి వచ్చే ఏడు కిరణాలు సప్త జ్ఞాన భూమికలు...........!! జ్ఞానం..... జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం. (1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానసం (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్ధభావని (7) తురీయం అన్నవే సప్త జ్ఞాన భూమికలు. *శుభేచ్ఛ:* నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష. *విచారణ* : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; *బ్రహ్మజ్ఞాన* ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం. *తనుమానసం* : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే *తనుమానసం* . *సత్త్వాపత్తి* : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే. *తమోగుణం* అంటే సోమరితనం, *రజోగుణం* అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి. *అసంసక్తి* : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం. *పదార్ధభావని* : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి. *తురీయం* : ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే *బుద్ధుడు* అంటాం. ఇదే *సహస్రదళకమలం* . ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా *సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది.* ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం. *తురీయం* అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం; అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి. #తెలుసుకుందాం #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
908 వీక్షించారు
24 రోజుల క్రితం
పరమ శివుడు పులి చర్మం ధరించడము లోని అంతరార్థం.....!! శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. సంస్ర్కృతంలో శివ అనగా సౌమ్యం, శుభం అని అర్థాలు వస్తాయి. శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో ఒకరు. సింధూ నాగరికత కాలానికే శివుడు లింగం రూపంలోను, పశుపతి గాను పూజలందుకున్నాడు. శివాలయాలే దేశంలో నేటికీ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. శివుడిని రుద్రుడిగా వేదాలలో పేర్కొన్నారు. శివుడు జనన మరణాలకు అతీతుడు. శివుని ఆకృతిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుడు ఎల్లప్పుడూ పులి చర్మాన్నే ధరిస్తాడు. శివుడు పులి చర్మాన్ని ధరించడానికి శివ పురాణంలో ఒక కథ చెప్పబడింది. ఒకా నొక సమయంలో శివుడు అరణ్యంలో వెళుతుండగా శివుని తేజస్సును చూసి మహర్షులు, రుషులు, పండితుల భార్యలు ఆశ్చర్యపోతారు. ముని కాంతలలో శివున్ని చూడాలన్న కాంక్ష పెరగటంతో వారు ఇంటి పనులు కూడా సరిగ్గా చేసేవారు కాదు. తన భార్యలలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థమైన మునులు శివుడిని ఎలాగైనా హతమార్చాలని అనుకుంటారు. మునులు ప్రతిరోజు స్వామి ప్రయాణించే దారిలో ఒక గుంతను తవ్వి మంత్ర శక్తితో పులిని తయారు చేసి శివుడు ఆ గుంత సమీపంలోకి రాగానే శివునిపై పులిని ఉసిగొల్పుతారు. శివుడు సునాయసంగా పులిని సంహరించి మునుల చర్య వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పులి చర్మాన్ని కప్పుకున్నాడు. అప్పటినుండి శివుడు పులి చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు. శివుడు ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, కోరికలకు దూరంగా ఉండమని ఉండమని సూచిస్తుంది.. #తెలుసుకుందాం #🙏ఓం నమః శివాయ🙏ૐ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.4K వీక్షించారు
24 రోజుల క్రితం
శివ గుణాలు లోకానికి సందేశాలు.............!! ‘శివ’ శబ్దం మంగళాత్మకం. అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే! అనేక గుణాలకు నిలయుడైనవాడు శివుడు. ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. శివ నామాన్ని జపిస్తుంది. ఆయన దర్శనం కోసమే తపిస్తుంది. అదీ శివుడి విశిష్టత. త్రినేత్రుడు..... శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని- శివుడి మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది. సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకు, అగ్ని తేజోగుణానికి నెలవులు. ఆ మూడూ ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతోంది. భస్మధారి...... భస్మాన్ని శరీరమంతటా ధరించడం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు. లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు. ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది. అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం. అర్ధనారేశ్వరుడు...... శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం. గరళకంఠ....... ఆయన గరళ కంఠుడు. అంటే, కంఠంలో విషాన్ని దాచుకొన్నవాడు. అది కాలకూట విషం. అత్యంత ప్రమాదకరం. అయినా శివుడు చలించకుండా లోక రక్షణార్థం గొంతులో ధరించాడు. మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది. శ్మశాన వాసి ........ జీవుడి అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోనే. దాన్ని శివుడు విహారభూమిగా చేసుకొన్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ ఏదో ఒకనాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవన సత్యానికి అది సూచిక. గంగా ధరుడు....... నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ. ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం. ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత, పవిత్రత లభిస్తాయి. శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం. చంద్రశేఖరుడు...... చంద్రశేఖరుడు- అంటే, తలపై చంద్రుణ్ని ధరించినవాడు శివుడు. శరీరంలో అగ్రభాగం శిరస్సు. అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే, జీవితం వెలుగుతుందని అంతరార్థం. నంది వాహనదారి.... శివుడు నంది వాహనుడు. ‘నంది’ అంటే ఆనందింపజేసేది. వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది. సర్పహారి....... సర్పహారి శివుడు. అంటే పామును మెడలో వేసుకునేవాడు. గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని, సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కాని, భయపడి పారిపోకూడదని నాగాభరణత్వం తెలియజేస్తుంది. నటరాజు....... శివుడు తాండవ ప్రియుడు. జీవితం ఒక రంగస్థలం. దానిపై నిత్యమూ ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన. ప్రమధా దీసుడు...... ప్రమథ గణాలకు నాయకుడు శివుడు. లోకంలో ప్రతి వ్యక్తీ ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి. వాటిని లోక క్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం. తనలో తాను రమిన్చువాడు ఆయన మహా తపస్వి. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది. ఏ మంచి పనినైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది. ఇలా శివగుణాలు అనేకం. ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే. దైవాన్ని మనిషి తన జీవనమార్గ లక్ష్యంగా చేసుకుంటే, అంతటా శివం (మంగళం) వెల్లివిరుస్తుంది! #శ్రీ 🚩🚩🚩🚩🚩 #తెలుసుకుందాం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.2K వీక్షించారు
24 రోజుల క్రితం
🌿🌼 శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం 🌼🌿 వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ | జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 || వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ | అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || 2 || నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ | గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || 3 || వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహనమ్ | చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || 4 || వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ | త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందకేశ్వరమ్ || 5 || రామం రామం హయగ్రీవం భీమం రొఉద్రం భవోద్భవమ్ | శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగలం మంగలాయుధమ్ || 6 || దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ | వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్ || 7 || హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ | సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ || 8 || హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ | మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ || 9 || జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ | సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || 10 || జ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ | యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ || 11 || ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ | ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || 12 || వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ | యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః || 13 || సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ | చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 14 || గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః | అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 15 || || ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్ || ఓం శ్రీలక్ష్మీ నారాయణాయ నమః #తెలుసుకుందాం #శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి #🌺లక్ష్మీనారాయణ🌺 #లక్ష్మినారాయణలు #నమో లక్ష్మీనారాయణాయ నమః
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K వీక్షించారు
1 నెలల క్రితం
#దేవాలయం దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యజ్ఞ హోమదుల్లోను కొన్ని శుబకార్యాల్లోను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతిక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. -------------------------------------------------------- గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? “ప్రదక్షిణం ” లో “ప్ర” అనే అక్షరము పాపాలకి నాశనము, “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదిక్షణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని అర్థం. -------------------------------------------------------- ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్నిసుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి. ------------------------------------------------------- గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుబమా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగాపరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము. ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము. -------------------------------------------------------- గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది? దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి. శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరికే శదగోపం. మానవునికి శత్రువులైన కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం. షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికివేలుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. -------------------------------------------------------- దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు? బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము. -------------------------------------------------------- దేవాలయపు వెనుక బాగాన్ని ఎందుకు తాకరాదు? చాల మంది ప్రదిక్షినలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ బాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి. -------------------------------------------------------- దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో తరుముతున్నట్టు ప్రదిక్షణం చేయరాదు. నిండు గర్భిని నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము దైవదర్శనం చేయరాదు. ------------------------------------------------------- గుడిలో ఎలా ఉండాలి? గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి. #ధర్మ సందేహాలు 🚩 #ధర్మ సందేహాలు ##ధర్మ సందేహాలు -నిత్య సత్యాలు🙏🙏 #ధర్మ సందేహాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.4K వీక్షించారు
1 నెలల క్రితం
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏 #ఓం నమః శివాయ" అనేది శివునికి చేసే ఒక పవిత్రమైన పంచాక్షరి మంత్రం, దీని అర్థం "నేను శివునికి నమస్కరిస్తున్నాను" అని. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన హిందూ మంత్రాలలో ఒకటి, దీనిని శైవ సంప్రదాయంలో ముఖ్యంగా భక్తులు ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మంత్రం శివుని దివ్యతత్వాన్ని, ఆయన శుభప్రదమైన స్వభావాన్ని సూచిస్తుంది. మంత్రం యొక్క ప్రాముఖ్యత 💥 భక్తి మరియు సమర్పణ: "నమః" అంటే నమస్కారం, "శివాయ" అంటే శివునికి. కాబట్టి, ఈ మంత్రం శివుని పట్ల భక్తి మరియు సమర్పణను తెలియజేస్తుంది. పంచాక్షరి మంత్రం: ఇది ఐదు అక్షరాలతో కూడిన మంత్రం, ఇది శివుని ఐదు అంశాలను సూచిస్తుంది. శైవ మతంలో ముఖ్యమైనది: శైవ సంప్రదాయంలో ఇది అత్యంత ముఖ్యమైన మంత్రంగా పరిగణించబడుతుంది మరియు యజుర్వేదంలో దీనిని ప్రస్తావించారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలు: ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆంతరంగిక శాంతి లభిస్తుందని, ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు. శివుని శుభత: "శివ" అంటే కల్మషం లేనివాడు అని అర్థం. ఈ మంత్రం శివుని పరిశుద్ధమైన, శుభప్రదమైన రూపాన్ని ధ్యానించడానికి సహాయపడుతుంది. శివుని సౌందర్యం సాధారణ శారీరక అందంలా కాదు. అది లోతైన ఆధ్యాత్మిక ప్రకాశం, ఒకే సమయంలో శాంతి మరియు శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆయన శరీరం భస్మంతో అలంకరించబడి ఉంటుంది, ఇది వైభవం కాదు.త్యాగం మరియు వైరాగ్యానికి సంకేతం. జటాజూటం నుండి పవిత్ర గంగానది ప్రవహించడం శుద్ధి మరియు జీవన శక్తిని సూచిస్తుంది. తలపై ఉన్న చంద్రుడు శాంత స్వభావాన్ని తెలియజేస్తాడు ఆయన నీలకంఠ రూపం లోకమంతటినీ రక్షించడానికి చేసిన మహా త్యాగాన్ని గుర్తు చేస్తుంది. మూడవ కన్ను మాయను దాటి ఉన్న పరమ జ్ఞానానికి ప్రతీక. శివుని నిజమైన సౌందర్యం ఆయన ద్వంద్వ స్వభావంలో ఉంది.ఒకవైపు భయంకర సంహారకుడు, మరోవైపు అపార కరుణ కలిగిన రక్షకుడు. ఒకవైపు మౌనంగా ధ్యానంలో లీనమైన యోగి, మరోవైపు భక్తుల పట్ల అపార ప్రేమ చూపే పరమేశ్వరుడు. ఆయన ఉనికి ప్రశాంతతతో కూడిన గాఢతను, సరళతతో కూడిన అనంతత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే శివుని సౌందర్యం కళ్లతో చూసే దానికన్నా, హృదయంలో అనుభవించే దివ్య అనుభూతి..* . “ఓం నమః శివాయ” 108 సార్లు జపం చేసే ప్రయోజనాలు 108 సార్లు జపం చేయడం వల్ల లాభాలు: 1. మనశ్శాంతి & ఒత్తిడి తగ్గింపు ఈ మంత్రం జపం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. టెన్షన్, ఆందోళనలు తగ్గుతాయి. 2. పాపక్షయం & శుద్ధి మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి, ఆత్మ శుద్ధి జరుగుతుందని నమ్మకం. 3. శివ కృప లభిస్తుంది భక్తితో జపం చేస్తే Lord Shiva అనుగ్రహం పొందుతారు. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. 4. ఆర్థిక స్థిరత్వం & విజయాలు నిరంతరం జపం చేయడం వల్ల పనుల్లో విజయం, ఆర్థికంగా స్థిరత్వం వస్తుందని చెబుతారు. 5. రక్షణ శక్తి పెరుగుతుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఒక రకంగా కవచంలా పనిచేస్తుంది. 6. ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం సమయంలో జపం చేస్తే concentration పెరుగుతుంది, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు. 7. ఆధ్యాత్మిక పురోగతి ఈ మంత్రం మోక్ష మార్గంలో ముందుకు నడిపిస్తుంది. 108 సంఖ్య ప్రాముఖ్యత: హిందూ ధర్మంలో 108 సంఖ్య పవిత్రమైనది 12 రాశులు × 9 గ్రహాలు = 108 జపమాలలో 108 మణులు ఉంటాయి ఎలా జపం చేయాలి? ఉదయం లేదా సాయంత్రం శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని రుద్రాక్ష మాలాతో 108 సార్లు జపించాలి భక్తి, నమ్మకం చాలా ముఖ్యం..* . ధ్యాన నిమగ్నుడైన శివుడు ప్రపంచ దృష్టి మరల్చే అన్ని విషయాలకు అతీతమైన పరమ శాంతి, స్పృహ మరియు అతీంద్రియ స్థితిని ప్రతిబింబిస్తాడు. ఆదియోగిగా శివుడు గాఢమైన ధ్యానంలో కూర్చొని ఉంటాడు. ఆయన శుద్ధ స్పృహను, ఆలోచనలు, కోరికలు, ద్వంద్వాలు ఏవీ తాకని స్వచ్ఛమైన చైతన్య స్వరూపాన్ని ధరించి ఉంటాడు. ఆయన శాంత సాన్నిహిత్యం ప్రతి సాధకుడు చేరుకోవాలని కోరుకునే అంతర్గత మౌనాన్ని సూచిస్తుంది. ఆ స్థితిలో మనస్సు ప్రశాంతమవుతుంది మరియు ఆత్మ యొక్క నిజమైన స్వభావం బయటపడుతుంది. ఆ స్థితిలో ఎలాంటి కదలిక లేదు, అల్లరి లేదు కేవలం అపారమైన, అనంతమైన స్పృహ మాత్రమే ఉంటుంది, అది సమస్త సృష్టిని అనుసంధానం చేస్తుంది. ధ్యానమగ్న శివుని రూపం నిజమైన శక్తి చర్యలో కాకుండా స్థిరత్వంలో ఉందని, నిజమైన జ్ఞానం లోపలి నుండే ఉద్భవిస్తుందని బోధిస్తుంది. సాధకుడికి ఈ దృశ్యం అంతర్గత శాంతి మరియు ముక్తి వైపు మార్గదర్శకంగా మారుతుంది. ఈ పవిత్ర రూపంలో ధ్యానమగ్న శివుడు శాశ్వత చైతన్య స్వరూపం. ఆత్మను మౌనంలో కలిసిపోయి, తన దైవిక స్వభావాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఆహ్వానిస్తాడు....* హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #హర హర మహాదేవ 🙏 #ఓం నమః శివాయ #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏