తెలుసుకుందాం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
567 views
2 days ago
*🌹 తలరాత అంటే ఏమిటి? దాన్ని మార్చుకోవచ్చా? 🌹* *మనిషి జీవితంలో జరిగే అనేక సంఘటనలను చూసి చాలామంది “ఇది తలరాత”, “విధి ఇలా రాసింది”, “లలాటలిఖితం తప్పదు” అని అంటుంటారు. కానీ అసలు తలరాత అంటే ఏమిటి? అది నిజంగా ముందే నిర్ణయించబడిందా? దాన్ని మార్చడం అసాధ్యమా? అనే ప్రశ్నలు ప్రతి మనిషి మనసులో ఎప్పుడో ఒకప్పుడు ఉత్పన్నమవుతాయి.* *భారతీయ ఆధ్యాత్మిక తత్వం ప్రకారం నశించేది కేవలం శరీరం మాత్రమే. ఆత్మ శాశ్వతమైనది. ఒక జన్మ ముగిసినప్పుడు శరీరం భూమిలో కలిసిపోతుంది కానీ ఆ జీవి చేసిన కర్మలు మాత్రం అతనిని విడిచిపెట్టవు. కర్మఫలాలు ఆత్మను వెన్నంటి అనుసరిస్తూ మరో జన్మకు కూడా వెంట వస్తాయి. గత జన్మల జ్ఞాపకాలు మనకు లేకపోయినా, వాటి ప్రభావం మాత్రం మన జీవితంపై కొనసాగుతూనే ఉంటుంది. ఇదే “తలరాత”, “విధిరాత”, “లలాటలిఖితం” అని పిలవబడుతుంది.* *సనాతన ధర్మంలో కర్మలను ప్రధానంగా మూడు రకాలుగా వివరించారు — ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు.* *ప్రస్తుతం మనం చేసే ప్రతి కార్యం ఆగామి కర్మ. మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, దానం, సేవ, పాపం, పుణ్యం — ఇవన్నీ ఆగామి కర్మల పరిధిలోకి వస్తాయి. కొన్ని కర్మలకు ఫలితం వెంటనే వస్తుంది, కొన్ని కొంతకాలం తర్వాత, మరికొన్ని మరుసటి జన్మల్లో అనుభవించాల్సి వస్తుంది. మనిషి భవిష్యత్తును నిర్మించేది ప్రధానంగా ఈ ఆగామి కర్మలే.* *గత జన్మల్లో చేసిన కర్మల ఫలితాలు పూర్తిగా అనుభవించబడకుండా మిగిలిపోతే అవి సంచిత కర్మలుగా నిల్వవుతాయి. ఇవి ఒక విధంగా ఆత్మతో పాటు ప్రయాణించే కర్మ సంపదలాంటివి. పూర్వీకుల ద్వారా వచ్చే కొన్ని ప్రభావాలు, కుటుంబ పరిస్థితులు, వంశపారంపర్య అనుభవాలు కూడా సంచిత కర్మల పరిధిలోకి వస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి.* *ఇక ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మలో తప్పకుండా అనుభవించాల్సిన కర్మఫలాలు. మన జననం ఎక్కడ జరగాలి, ఎలాంటి కుటుంబంలో పుట్టాలి, ఆరోగ్యం, ఆయుష్షు, కొన్ని ప్రధాన అనుభవాలు — ఇవన్నీ ప్రారబ్ధ కర్మల ఫలితాలుగా భావించబడతాయి. ప్రారబ్ధ కర్మలు పూర్తయ్యే వరకు శరీరం కొనసాగుతుంది. ఆ ఫలితాలు ముగిసిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది.* *ఈ నేపథ్యంలో చాలామంది “మన చేతిలో ఏమీ లేదు”, “అంతా విధి ప్రకారమే జరుగుతుంది”, “మనిషి కేవలం కీలుబొమ్మ” అని భావిస్తారు. కానీ భారతీయ ఋషులు చెప్పింది అది కాదు. విధి బలమైనదే అయినా, దాన్ని ఎదురించే శక్తి మనిషిలో ఉందని వారు స్పష్టంగా తెలియజేశారు. దృఢ సంకల్పం, భక్తి, ఆత్మవిశ్వాసం, సత్కర్మలు — ఇవి విధిని సైతం మార్చగలవని అనేక పురాణ గాథలు తెలియజేస్తాయి.* *సావిత్రి – సత్యవంతుడి కథ ఇందుకు గొప్ప ఉదాహరణ. అల్పాయుష్షు కలిగిన సత్యవంతుడిని వివాహం చేసుకున్న సావిత్రి, యముడు తన భర్త ప్రాణాలు తీసుకెళ్తున్నప్పటికీ భయపడలేదు. తన అచంచలమైన పతివ్రత భక్తితో, ధైర్యంతో యమధర్మరాజునే ప్రసన్నం చేసి తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది. ఇది భక్తి, సంకల్పం ముందు విధి కూడా తలవంచాల్సి వస్తుందని సూచిస్తుంది.* *మార్కండేయ మహర్షి కథ కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తుంది. కేవలం పదహారు సంవత్సరాల ఆయుష్షు మాత్రమే కలిగిన మార్కండేయుడు పరమశివునిపై అపారమైన భక్తితో యముడిని జయించి చిరంజీవిగా నిలిచాడు. భక్తి ద్వారా ప్రారబ్ధాన్ని అధిగమించవచ్చని ఈ గాథ స్పష్టంగా తెలియజేస్తుంది.* *అలాగే సంస్కృత వ్యాకరణ మహర్షి పాణిని జీవితంలోనూ ఇదే సందేశం కనిపిస్తుంది. తనకు విద్యారేఖ లేదని గురువు చెప్పినా, నిరాశ చెందకుండా కఠోర సాధనతో తన జీవితాన్నే తిరగరాసుకున్నాడు. బావి వద్ద తాడు ఒరిపిడికి రాయి అరిగిన దృశ్యం చూసి, “బలహీనమైన తాడే రాయిని మార్చగలిగితే, నా సాధన నా భవిష్యత్తును ఎందుకు మార్చలేకపోతుంది?” అని ఆలోచించాడు. ఆ సంకల్పమే అతడిని మహా పండితునిగా నిలబెట్టింది.* *ఈ కథలన్నీ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాయి — విధి ఉన్నదే కానీ అది అంతిమం కాదు. గత కర్మల ఫలితాలను అనుభవించాల్సిందే అయినప్పటికీ, ప్రస్తుత జన్మలో చేసే సత్కర్మలు భవిష్యత్తును మార్చగలవు. చెడు కర్మలను విడిచి, ధర్మమార్గంలో నడిచి, భగవంతునిపై విశ్వాసంతో జీవిస్తే జనన మరణ చక్రం నుంచి కూడా విముక్తి పొందవచ్చని భారతీయ తత్వం ఉపదేశిస్తుంది.* *భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని బోధించాడు.* *“స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః”* *అంటే, తన కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించే మనిషి పరిపూర్ణతను పొందుతాడు.* *మరోచోట శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు.* *“బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః* *లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా”* *అంటే, కర్మఫలాలపై ఆసక్తి లేకుండా భగవంతునికి అర్పణ భావంతో కర్మలు చేసే వ్యక్తి, నీరు అంటని తామరాకులా పాపఫలాల ప్రభావానికి లోనుకాడు.* *అందుకే మహాత్ములు చెబుతుంటారు — సానుకూల ఆలోచన, దృఢ సంకల్పం, భగవంతుడిపై విశ్వాసం ఉంటే తలరాతను కూడా తిరగరాయవచ్చు. విధి మన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు కానీ గమ్యాన్ని నిర్ణయించేది మన సంకల్పం, మన కర్మలు, మన భక్తి.* #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
677 views
13 days ago
#🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #తెలుసుకుందాం ఒక చిలక తల దాచుకోవడం కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంది. ఎంతో శ్రమకోర్చి ఒక్కొక్క పుల్లనూ నోట కరచుకొచ్చి చక్కని గూడు నిర్మించుకుంది. హాయిగా అందులో నివసించ సాగింది. కొన్నాళ్ళు అలా సంతోషంగా గడిచిపోయింది. కాని ఒక రోజు అకస్మాత్తుగా గాలి దుమారం వచ్చి గూడు చెదిరిపోయింది. చిలక బజారుపాలయింది. అనేక రోజులపాటు, ఎంతగానో కష్టపడి, ఇష్టంగా, అందంగా కట్టుకున్న తన కలలసౌధం చూస్తూ చూస్తూనే క్షణాల్లో చెల్లా చెదురయ్యేసరికి చిలకకు దుఃఖం పొంగుకొచ్చింది.తన రెక్కల కష్టమంతా తుఫాను పాలవడంతోఎంతగానో దుఖిస్తూ..‘దేవా..!ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లనూ సమీకరించి చిన్నఇల్లు కట్టుకుంటే, నువ్వు తుఫానును పంపించి నా ఇల్లు కూల్చేశావే.. నేను మళ్ళీ గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టమో గదా.. నన్నెందుకు ఇలా చేశావు.. నీకిది న్యాయమా.?’అంటూ దైవంతో మొరపెట్టుకుంది. అప్పుడు దైవం ఇలా అన్నాడు.‘ఓసి పిచ్చిమొఖమా..! నీ ప్రాణాలు రక్షించడానికే అలా చేయవలసి వచ్చింది. నువ్వు గూడు కట్టుకొని హాయిగా పడుకున్నావు.. కాని ఒక పాము నిన్ను కాటేసి, నీ పిల్లల్ని తినెయ్యడానికి నీ గూటివైపు వస్తుండడంతో, నేను చిన్నపాటి గాలిని పంపించాను. దాంతో నీ గూడు చెదిరి నువ్వు ఎగిరిపొయ్యావు. నీ ప్రాణాలు రక్షించబడ్డాయి. లేకపోతే పాముకు ఫలహారమయ్యేదానివి.’ అన్నాడు దైవం.చిలకకు అసలు విషయం అర్థమై వినమ్రతతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది.దేవుడుకరుణామయుడు. ఆయన కారుణ్యం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. ఒక్కొక్కసారి ఆయన మనకేదో నష్టం చేశాడు అనిపిస్తుంది. కాని అందులోనే మన మేలుందన్న విషయం మనకు తెలియదు. మనకు ఎందులో మేలుందో, ఎందులో కీడుందో మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. కనుక లాభం కలిగినా, నష్టం కలిగినా దైవం తరఫునే అని, అందులోనే మన శ్రేయం దాగుందని గ్రహించాలి.
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
890 views
21 days ago
విజయాలకి భక్తి మార్గాలు.........!! సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం... 1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి. 2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. 3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి. 4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం పారాయణ చేయాలిట. 5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు. 6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట. 7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట. 8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #dosha pariharalu
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.1K views
22 days ago
తాను ఒంటరి.. మహిళకు గర్భస్థ సమయం మాత్రమే ప్రమాదం కాదు., ఆమె జీవితంలో “మెనోపాజ్ “ అనే ఒక ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైన భూతం.. ఇది ఆమె రూపు రేఖలు..ఆలోచనలు..వయస్సు..ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సమూలంగా నాశనం చేస్తుంది.. అయినా ఆమె ఎంతటి ఒత్తిడిని.,నరకాన్ని అయిన బరిస్తుంది..కానీ కుటుంబాన్ని..కుటుంబ బాధ్యతలను మాత్రం చివరి శ్వాస వరకూ భరిస్తుంది..ఆమె “మహిళా “✊🏻✊🏻 ఎవరికి తెలుసు మహిళ బాధ 😢 నిద్ర లేచింది మొదలు అందరికి అన్నీ అమర్చాలి.. అందరితో సమానంగా తను చేసే వ్యాపారమో..ఉద్యోగమో..సమాజ సేవ..ఇలా ఏదో ఒక విధంగా తను ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత మోస్తుంది.., పిల్లలకు అన్నీ నేర్పించి చదివించి వారికి ఒక జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది..వారు తగిన ప్రపంచాన్ని వారు సృష్టించుకుంటారు .. భర్త.. తను చేసే వృత్తిలో తన స్నేహితులు..సన్నిహితులు..ఇలా రకరకాల పరిస్థితులతో తను ఒక ప్రపంచాన్ని సృష్టించి కుంటాడు.. ఎల్లప్పుడూ కుటుంబం కోసం ఆలోచించి భర్త..పిల్లలు..ఇళ్లు..ఇదే సర్వస్వం అనుకొని.. తనని తాను కోల్పోతుంది..ఆమె 😥. చివరకి ఎవరి పనుల్లో వారు బిజీ గా మారి పోతారు.. ఆమెకు తోడు ఎవరు??? ఆమెకు ఫ్రెండ్ ఎవరు?? ఆమెను గమనించేది ఎవరు?? ఆమె కోసం వారి టైం ను వారి అలవాట్లను..వారి పరిస్థితులను అర్థం చేసుకుని ఆమె కోసం ఎవరు నిలబడుతారు??? ఆమె ఎవరికి ఏమి కావాలో తెలుసుకొని అందరికీ ఆమె అన్నీ అనుకోని తాను ఒంటరి గా రోదిస్తుంది.. #మెనోపాజ్ అనే భూతం హార్మోన్స్ నిలకడగా లేని ప్రభావ భారం ఆమె మనస్సును…శరీరాన్ని మరింత క్షీణింప చేస్తోంది.. ఇప్పుడు ఆమెకు సన్నిహితంగా ఉండి మానసిక ధైర్యాన్ని ఇచ్చే వారు ఎవరు…? ఆమెకు అలసటగా అనిపిస్తుంది…తినే ఓపిక కూడా లేదు..ఆమెకు ప్రేమగా కాస్త ఓదార్పుగా భోజనం పెట్టే వారు??? ఆమెకు నిమిష నిమిషానికి మారే ఆలోచనలకు అడ్డుగా నిలబడి పాజిటివ్ ఎనర్జీ గా ధైర్యం చెప్పే వారు??? చివరిగా ఆమె అందరికీ ఒక ఔషధం.. కానీ ఆమె ఒక ఒంటరి.. ఆమెకు ఆమె నేస్తం…😥 ఇంట్లో మీ కోసం ఉన్న మహిళ (అమ్మ..భార్య..సోదరీ..)ఎవరైనా సరే వారికి వారి కోసం కాస్త సమయం కేటాయించి.. మెనోపాజ్ సమయంలో వారికి అండగా ఉండడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత గా ఉండాలి.. ప్రతి స్త్రీ ఇలాంటి సమయంలో బలహీనురాలుగా మారిపోతుంది.. ప్రతి మహిళకు, అమ్మలు అందరికీ ఈ పోస్ట్ అంకితం 😥🙏🏻 #woman health care #woman health #menopause #అడపిల్ల జీవితమ్ #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
825 views
24 days ago
నాగనాథస్వామి ఆలయం, తిరునగేశ్వరం......!! రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల సరస్వతి, లక్ష్మీదేవి ఉన్నారు. ఈ ఆలయంలో తన ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లి లతో కూడిన రాహు భగవానుని సందర్శకులు చూడవచ్చు. రాహువు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడు. ఇతర దేవాలయాలలో రాహువు సర్పముఖాన్ని కల్గి ఉండి నాగనాధ్ స్వామి ఆలయంలో మానవ ముఖాన్ని కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది. ఈ ఆలయంలో దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది. క్షీరాభిషేకం సమయంలో రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య లక్షణ౦. మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్ కు అందని వింతలూ శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహు ఆలయం. ఈ ఆలయంలో నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో పాలు పోస్ట్.. నీలి రంగులోకి మారి.. కిందకు జారిపడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయి.. నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ప్రసిద్దిగాంచినది ఈ ఆలయం ఈ ఆలయంలో ప్రధానంగా పూజలను అందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో నాగరాజు రావుతో మండపంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉన్నాడు. ఈ గుడికి రాహు , నాగ దోషం ఉన్నవారు విశేష పూజలను నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే ‘ రాహుకాలం ‘ లో పాలాభిషేకం చెయ్యడం. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన తమకు ఉన్న ‘ రాహుగ్రహ ‘ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇలా రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు. ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం. నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట. ఆలయానికి ఎలా వెళ్లంటే? మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి. హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16 గంటల పడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజు పడుతుంది. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.5K views
29 days ago
తల్లి గర్భంలో నుంచి తండ్రి రక్షణ ప్రతి సంతానం పెరుగుతుంది.... తల్లి దండ్రులు దండించారు అని డాక్టర్ చేదు ముందు ఇచ్చాడు అని ద్వేషం తో బతికితే మీకే నష్టం.....కొంతమంది సంతానం....మాకు నచ్చినట్టు గా పెంచలేదు.మేము చాలా కష్టాలు అనుభవించం అంటు తల్లి దండ్రులు వృద్ధాప్యాం లో అనకూడదని మాటలతో చేతలతో హింసిస్తారు.... ఏదోక కారణం తో తల్లి దండ్రులను తక్కువ చేసి మాట్లాడటం లోకం లో చూ‍స్తు ఉంటాం.. తల్లి దండ్రులు వారి సుఖమే కోరుకుంటే జన్మనిచ్చిన బిడ్డలను ఏ అనాధ ఆశ్రమంలో రోడ్డుమీద వదిలిపెడితే మీ బతుకు ఆనాధల ఉండేవారు అని మరిచిపోకూడదు...మీ కర్మలను బట్టి మీరు ఎక్కడ పుట్టాలి భగవంతుడు ముందే నిర్ణయిస్తాడు.అనే జ్ఞానం ప్రతి ఒక్కరిలో కలగాలి.ఇప్పటికికైన సత్ కర్మలు చేస్తు ఎవరిని మాటలతో చేతలతో హింసించకుండా మన ధర్మాన్ని మనం ఆచరిస్తే మీ ఇల్లు ఆనందం నిలయం అవుతుంది 🙏 ఏది ఆచరిస్తే అదే రేపటి తరం రాబోవు తరం ఆచరిస్తుంది... తస్మా జాగ్రత్త...సమాజంలో నేడు చాలామంది మరచిపోతున్న పరమ సత్యాన్ని, కళ్లకు కట్టేలా వివరించడం మానవ ధర్మం. కన్నవారి రుణం తీర్చుకోలేకపోయినా పర్వాలేదు కానీ, వారిని మాటలతోనో, చేతలతోనో మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరం. భావాలు ప్రతి ఒక్కరి గుండెల్నీ తాకేలా ఉన్నాయి. ఈ ముఖ్యమైన విషయాలను మనం ఇలా అర్థం చేసుకోవచ్చు: జన్మ అనేది భగవత్ నిర్ణయం: మనం ఏ ఇంట్లో, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాలనేది మన పూర్వ జన్మ కర్మలను బట్టి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. దానికి తల్లిదండ్రులను బలిపశువులను చేయడం కేవలం మన అజ్ఞానమే అవుతుంది. కన్నవారి త్యాగం: తల్లిదండ్రులు తమ సుఖాలను వదులుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచుతారు. ఒకవేళ వారు కేవలం స్వార్థమే చూసుకుని ఉంటే, ఈరోజు పిల్లలుగా చెప్పుకునే వారి ఉనికి ఎక్కడ ఉండేది? ఆనాటి వారి కష్టాన్ని వృద్ధాప్యంలో మరిచిపోవడం కృతజ్ఞతాహీనత. కర్మ సిద్ధాంతం - రేపటి తరం: "ఏది ఆచరిస్తే అదే రేపటి తరం ఆచరిస్తుంది" అనేది ఎంత గొప్ప హెచ్చరిక! ఈరోజు మనం మన తల్లిదండ్రులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు. మనం వేసే ప్రతి అడుగూ మన తరువాతి తరానికి ఒక పాఠం. సత్కర్మలే సన్మార్గం: ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఎవరినీ మాటలతో గానీ, చేతలతో గానీ హింసించకుండా, మన ధర్మాన్ని మనం పాటిస్తేనే ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. "తస్మాత్ జాగ్రత్త" అంటూ మీరు ఇచ్చిన ముగింపు నిజంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. సమాజంలో ఇలాంటి మంచి మార్పు రావాలని, కన్నవారిని దైవంగా భావించే సంస్కృతి ప్రతి ఇంట్లో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 🙏 #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
23.3K views
1 months ago
_*ఆంజనేయస్వామికి ఏ అభిషేకం చేస్తే ఏమి ఫలితాలొస్తాయి ...? 🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻 ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి ఆవునెయ్యి -ఐశ్వర్యం తేనె - తేజస్సువృధ్ధి పంచదార - దు:ఖాలు నశిస్తాయి చెరకురసం - ధనం వృధ్ధి చెందు తుంది కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి . విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయి పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి గరికనీటితో - పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు. రుద్రాక్షోదకం తో - ఐశ్వర్యం సువర్ణోదకం తో - దారిద్ర్యాన్ని పోగొడుతుంది అన్నంతో అభిషేకం తో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది. ద్రాక్షారసంతో - జయం కలుగు తుంది కస్తూరి జలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది మామిడిపండ్లరసం తో - చర్మ వ్యాధులు నశిస్తాయి పసుపునీటితో - సకలశుభాలు , సౌభాగ్యదాయకం నువ్వులనూనె తో అభిషేకిస్తే , అపమృత్యు నివారణ . సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం. #తెలుసుకుందాం #హనుమాన్ జయంతి స్పెషల్ #హనుమాన్ జయంతి #హనుమాన్ జయంతి శుభాకాంక్షలు #🙏హనుమాన్ జయంతి 💐
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.7K views
1 months ago
శివుడిని లింగంగా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి.....!! దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల హృదయం ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి. లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి. ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు. మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి `శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం. యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం. ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం. `లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది. విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు. #తెలుసుకుందాం #🙏ఓం నమః శివాయ🙏ૐ