ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి

Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
455 views
6 hours ago
_*నేడు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు ?*_ 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. *శని త్రయోదశి అంటే* శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. *అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి , ఎలా చేయాలి ?* శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. *త్రయోదశి వ్రతం :-* శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి. *శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు* 🌹 ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. 🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు. 🌹 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. 🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు *నీలాంజన సమభాసం* *రవిపుత్రం యమాగ్రజం* *ఛాయా మార్తాండ సంభూతం* *తం నమామి శనైశ్చరం.* అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. 🌹 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. 🌹 అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. 🌹 ఎవరితోను వాదనలకు దిగరాదు. 🌹 ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. 🌹 ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. 🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి. 🌹 కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. 🌹 అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. 🌹 జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. 🌹 ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. 🌹 అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. 🌹 ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం. దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు. దశరథకృత శ్రీ శని స్తోత్రం* ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్ దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ *ఇతి శనిస్తోత్రమ్* #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి #🙏🕉️శని త్రయోదశి శుభాకాంక్షలు🕉️💐 #శని త్రయోదశి
PSV APPARAO
700 views
28 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: వైశాఖ అమావాస్య / ఐశ్వర్య ప్రదాత శనీశ్వర జయంతి / శనిదేవ్ జయంతి 🔱🙏 #🕉️శ్రీ శని భగవానుని జయంతి #🙏🏻శని జయంతి🙏🏻 #శని అమావాస్య #శని అమావాస్య.. *ఐశ్వర్యప్రదాత శనీశ్వర* శని నవగ్రహాలలో ఏడవ గ్రహం. శనీశ్వరుడని, ధర్మానుజు డని లోకంలో పిలుస్తారు. అసలు పేరు శనైశ్చరుడు. శనైః చరతీతి శనైశ్చరః మెల్లమెల్లగా నడిచేవాడు అని అర్థం. అందువల్లనే శనిని మందుడు అని కూడా పిలుస్తారు. శనివారా నికి శని అధిపతి. శని మందుడైన వలన ఆ వారానికి మంద వాసరమని, స్థిరవాసరమని పేరు వచ్చింది. శని పుట్టుపూర్వోత్తరాలను మత్స్యమహాపురాణం, ఇతర పురాణాలు కూడా వివరిం చాయి. ఛాయ, సూర్యదేవులు శనికి తల్లిదండ్రులు. యముడు అన్న. యమున అక్క ఛాయకే సంజ్ఞ అని మరోపేరు. ఉషా పద్మినిలు కూడా సూర్యుని భార్య లుగా ప్రసిద్ధి, సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుని వల్ల యముణ్ణి, యమునను పొందింది. నానాటికీ సూర్య తాపం పెరుగుతున్నందువల్ల సంజ్ఞాదేవి తట్టుకోలేకపోయింది. ఒకరోజున తన తండ్రి ఇంటికి వెళ్ళింది. భర్తకు తెలియకుండా, ముందుగా తండ్రి అనుమతి లేకుండా వచ్చినందుకు తండ్రి మందలించాడు. అప్పుడు సంజ్ఞాదేవి ఆలో చించి తననీడతో ఛాయ అనే స్త్రీమూర్తిని సృష్టించింది. ఛాయ సంజ్ఞవలెనే ఉంది. సూర్యుడు కూడా ఛాయను గుర్తు పట్టలేకపోయాడు. సూర్యతాపాన్ని తట్టుకునే శక్తిని సంపాదించటం కోసం సంజ్ఞ తపస్సు చేసుకోవటానికి వెళ్ళింది. ఛాయ సంజ్ఞ చెప్పినట్లుగా ఆమె సంతానాన్ని ప్రేమతో పరిపాలిస్తూ సూర్యునితో అన్యోన్యంగా కాలం గడుపుతున్నది. ఛాయకు సూర్యుని వల్ల గర్భోత్పత్తి జరిగింది. 'ఛాయ' అంటే నీడ కనుక ఆ నీడకు పుట్టినందువల్ల శని నీలం నలుపురంగులు కలిసి నట్లుగా జన్మించాడు. శని నల్లగా ఉండటానికి మరొక కారణాన్ని ఇలా చెపుతున్నారు. ఛాయాదేవి గర్భంలో శని ఉన్న సమయంలో ఛాయాదేవి పరమేశ్వరుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ ప్రభావం వల్ల శనికి నల్లనివర్ణం వచ్చింది. శివుడు సర్వజ్ఞుడైనందు వల్ల పుట్టుకతోనే ఆధ్యాత్మిక జ్ఞానసంపద కూడా శనికి లభించింది. శని ఛాయాసూర్యదేవుల సంతానమైనందు వల్లనే శనిని ప్రార్థిం చేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ | శని గ్రహాలలో ప్రధానగ్రహం. చాలామంది శనిమహర్దశ వస్తున్నదని తెలిస్తే ముందుగానే భయపడతారు. 'నిజానికి శని కర్మఫలప్రదాత. కర్మసాక్షి కుమా రుడైనందువల్ల మానవులు చేసిన పుణ్యఫలాలను అనుభవింప చేస్తాడు. తానుగా ఎవ్వరినీ కష్టపెట్టడు. పాపం చేసిన వాళ్ళకి ఆ పాపఫలాన్ని అనుభవింపచేస్తాడు. పాపఫలం కష్టరూపంగా ఉంటుంది. కనుక శని కష్టపెడుతున్నాడని భావిస్తున్నారు. పుణ్యం చేసుకున్న వాళ్ళకి సుఖరూపమైన ఫలాన్నిస్తాడు'. ఇది గ్రహ అనుకూలతను సూచిస్తుందని కొందరు పండితులు చెపుతున్నారు. శని కుండలిలో ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఈ స్థితి శనికే కాదు. గ్రహాలన్నింటికి ఉండేదే. గ్రహాలకు కూడా స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు అని ఉంటాయి. స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు అనుకూల్య ప్రభావం చేత చక్కటి లాభదాయకంగా, సంతోషదాయకంగా జీవితం సాగుతుంది. క్షేత్రం మారితే ఆ ప్రభావం కూడా తీవ్రంగా ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. రాహుకేతువులు సంపూర్ణశరీరులు కారు. ఇక మిగిలిన ఏడు గ్రహాలలో శని ఏడవగ్రహం. అందువల్ల ఏడవవారమైన శని వారానికి శని అధిపతి. శనివారంరోజున కొందరు శనికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. శనిని నువ్వులతో అర్చిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శనికి నువ్వులనూనె అంటే ప్రీతి కనుక నువ్వులనూనెతో అభిషేకం చెయ్యాలి. త్రయోదశి తిథి రోజున (ప్రతినెల కాకుండా) శనిత్రయోదశి అనే విశేషసమయం వస్తుంది. ఆ రోజున కూడా శనికి విశేష పూజలు నిర్వహిస్తారు. శని నల్లగా ఉంటాడు కనుక నల్లని రంగు వస్త్రం ఇష్టం. నల్లని ధాన్యమైన నువ్వులు ఇష్టం. నువ్వులనుండి వచ్చిన తైలం ఇష్టం. నల్లనిపక్షి అయిన కాకి అంటే ఇష్టం కనుక కాకి వాహనం. శనిమహర్దశ అన్ని గ్రహదశల వలెనే నడుస్తున్నా చాలా మెల్లగా నడుస్తున్నట్లుగా ఉంటుంది. శనికి నీలం (రత్నం) అంటే ఇష్టం. నీలాలలో సముద్రనీలం, ఆకాశనీలం, కాకినీలం, మయూరనీలం, ఇంద్రనీలం అని అనేక రకాలున్నాయి. వారివారి స్థితిగతులను పట్టి, అవసరాన్ని బట్టి సిద్ధాంతిని సంప్రదించి వారి సూచన మేరకు ఆ రత్నాన్ని ధరించాలి. శనికి తరతమ భేదం లేదు. స్వజన, పరజన భేదం లేదు. తన ధర్మం తాను నిర్వహించటమే శనిలో ఉన్న ప్రధానలక్షణం. శని ఈశ్వరుణ్ణి కూడా బాధించాడని లోకంలో వృత్తాంతం ఉన్నది. ఒకసారి నారదుడు కైలాసంలో పరమేశ్వరుని దగ్గర శని గ్రహాన్ని గురించి ఎంతగానో ప్రశంసిస్తాడు. ఈశ్వరుడికి కొంచెం బాధ కలుగుతుంది. శని అంతటి గొప్పవాడైతే నాకె దురుపడి బాధించమని చెప్పు అని నారదుణ్ణి ఆదేశించాడు. నారదుడు శనికి ఈ వార్తను చేరవేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి హెచ్చరించి వెళతాడు. పరమేశ్వరుడు శనికి తానుదొరికితేనే కదా బాధపెట్టేది. దొరకకుండా ఉండాలని కైలాసాన్ని వదిలి తన పరివారాన్ని విడిచి ఒక అడవిలో ప్రవేశించి అక్కడ ఉన్న మర్రిచెట్టుతొర్రలో దాగి ఉంటాడు. మరునాడు ఉదయం శని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈశ్వరా! చూశారా? మీరు నా ప్రభావాన్ని, హాయిగా ప్రమథగణాల మధ్య కైలాసంలో సేవలందుకోవలసిన మీరు ఈచెట్టు తొర్రలో దాగి ఉన్నారు అని నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు ఒక్కక్షణం ఆలోచించి ఓశనీ! నీ ప్రభావం అమోఘం. ఈనాటి నుండీ నీవు కూడా ఈశ్వరపదంతో ప్రసి ద్ధిని పొందుతావు. నిన్ను శనీశ్వరుడని పిలుస్తారు అని అను గ్రహించాడు. శని ఆనాటి నుండి శనీశ్వరుడుగా పేరు పొందాడు. అందు వల్లనే శనిగ్రహ దేవాలయాలు మనకు దర్శనమిస్తున్నాయి. శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయాలు కూడా ఉన్నాయి. మంగనూరులో కూడా ఒక శనీశ్వరదేవాలయం ఉంది. ఇది నిర్ణీత సమయంలోనే తెరచి ఉంటుంది. మనరాష్ట్రంలోని మంద పల్లిలోని శనీశ్వరాలయం సుప్రసిద్ధం. మహారాష్ట్రలోని శని శింగణాపూర్ చాలా విలక్షణక్షేత్రం. ఆరు బయటే ఉంటుంది. ఇక్కడ వాకిళ్ళకు తలుపులు కూడా ఉండవు. దొంగతనాలు జరుగవు. అక్కడ ఎవరైనా దొంగతనానికి పాలుపడితే వాళ్ళు పొలిమేర దాటరు. ఇప్పటికీ శనీశ్వరప్రభావాన్ని ఇది చాటు చున్నట్లే కదా! మరొక మహిమాన్వితమైన పాగడ (పావగడ) క్షేత్రం అనే పేరుతో ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులలో ఉన్నటు వంటి శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధమైనది. గొప్పశక్తి కలిగిన శనీశ్వరుడికి పరమేశ్వరుడు లోబడినా పరమేశ్వరాంశతో అవ తరించిన హనుమంతుడు మాత్రం శనికి లోబడలేదు. శని అనుకూలంగా లేని వాళ్ళు ఆ దోపం తొలిగిపోవటానికి హనుమకి పూజలు, సుందరాకాండ పారాయణలు చేయిస్తారు. శనికి మందగమనుడు అనే పేరు రావటానికి కారణాన్ని పురాణాలు ఇలా చెపుతున్నాయి. సంజ్ఞాదేవి తపస్సు పూర్తిచేసు కొని వచ్చేసరికి ఛాయ సూర్యుని వల్ల శనిని కన్నది. తాను సృష్టించిన స్త్రీయే, తన ఛాయే అయినా ఆ కుమారుణ్ణి చూడ గానే సంజ్ఞకు తన సవతికుమారుడనే భావం కొద్దిపాటి ఈర్ష్య కలిగాయి. తన దగ్గరకు వస్తున్న ఆ చిన్నారి శనిని అసూయతో సంజ్ఞాదేవి నీవు కుంటివాని వలె మెల్లగా నడుస్తావు. నీ మంద గమనం వల్ల నిన్ను మందుడని పిలుస్తారు. అని శపించింది. ఆ కారణంగా శని మందు డు, శనైశ్చరుడు అయినాడు. మీనరాశిలో శని ఉంటే కరువుకాటకాలు వస్తాయి. అయోధ్యానగరాన్ని దశరథ మహా రాజుగారు పరిపాలిస్తున్న సమయంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు అనేకకష్టాలతో బాధ పడుతున్నారు. ఇందుకు కారణం శనే అని జ్యోతిష్యుల వల్ల తెలుసుకున్న దశరథుడు శని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఓడి పోయిన దశరథమహారాజు చివరికి చేసేది లేక శనిని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం. *ప్రసాదం కురు మే సౌరే వరదో యది మే స్థితః* *అధ్య ప్రభతి మే రాష్ట్ర పీడా కార్యా న కస్యచిత్ |* అని ప్రారంభమై ఇరవైఐదు శ్లోకాలతో పూర్తవుతుంది. ఇది అత్యద్భుతమైన స్తోత్రం. ఓ శనీ! ఇకనుండీ నా దేశంలో ప్రతి పన్నెండుసంవత్సరాలకు వచ్చే దుర్భిక్షం రాకూడదు అని కోర గానే శని వెంటనే వరమిచ్చాడు. ఈ వరాన్ని పొంది దశరథ మహారాజు కృతకృత్యుడైనట్లు భావించి రథంపై ధనుర్బాణాల నుంచి చేతులు జోడించి నమస్కరిస్తూ సరస్వతీదేవిని, గణపతిని ధ్యానించి శనిని ఈవిధంగా స్తోత్రం చెయ్యటం మొదలు పెట్టాడు. *నమః కృష్ణాయ నీలాయ శిఖికంఠనిభాయ చ* *నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ...* అంటూ స్తోత్రం చేశాడు. శని సంతుష్టుడైతే అప్ల్యైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆగ్రహిస్తే అష్టకష్టాలపాలు చేస్తాడు. దేవతలు, రాక్ష సులు, మనుష్యులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు అందరూ కూడా శని అనుగ్రహదృష్టి లేకపోతే అష్టకష్టాల పాలౌతారు. కేవలం వీళ్ళేకాదు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్తర్షులు కూడా తమ తేజస్సులను కోల్పోయి దీనులౌతారు. మహా రాజులు రాజ్యభ్రష్టులౌతారు. దశరథ మహారాజు చేసిన స్తోత్రం విని ఓ మహారాజా! నీ స్తోత్రానికి నేను ప్రీతుణ్ణయ్యాను. ఇవ్వకూడనిదే అయినా నీకు నేను వరాన్నిస్తాను. నీవు చేసిన ఈ స్తోత్రాన్ని మానవుడు ఒక సారి కాని, రెండుసార్లుకాని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మృత్యుముఖం నుండి కూడా రక్షణ పొందుతాడు. ఎవడైతే లోహంతో నా ప్రతిమను చేయించి జమ్మిపూలతో పూజించి మినుములతో వండిన అన్నాన్ని నువ్వులతో కలిపి నివేదించి నల్లని ఆవుని, గేదెను, వస్త్రాన్ని దానం చేస్తాడో, శనివారం రోజున ఈ స్తోత్రంతో పూజచేస్తాడో వాడికి నేనేవిధమైన బాధని కలిగించను. గోచారంలో కాని, జన్మలగ్నంలో కాని, దశలో కాని, అంత ర్దశలో కాని ఇతర గ్రహాల వల్ల కూడా బాధ కలుగకుండా రక్షిస్తాను. అని మరొక వరాన్నిచ్చాడు. ఈ విధంగా దశరథుడు రెండు వరాలను పొంది కృతార్థుడైనాడు. *ఇంతకంటే సులభతరంగా షోడశనామావళి ఉంది.* 1. కోణః, 2. శనైశ్చరః, 3. మందః, 4. ఛాయాహృదయ నందనః, 5. మార్తాండజః, 6. తథా సౌరి:, 7. పాతంగీ,8. గృహనాయకః, 9. అబ్రాహ్మణః, 10. క్రూరకర్మా, 11, నీల వస్త్రః, 12. అంజనద్యుతిః, 13. కృష్ణః, 14. ధర్మానుజః, 15. శాంతః, 16. శుష్కోదరవరప్రదః ఈ 16 నామాలను ప్రతిరోజు చదువుకుంటే విశేషమైన శుభఫలితాలు వస్తాయి. అత్యంత ప్రభావసంపన్నుడైన శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి మనం కూడా శనీశ్వరునిజయంతి రోజున ఆరాధించి అప్లైశ్వర్యాది అనేక శుభాలను పొందుదాం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
1.5K views
1 months ago
#సంకట హర చతుర్థి వ్రతం ఎందుకు చేయాలి? #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺#అంగరక_చతుర్థి 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. _"ఓం గం గణపతయే నమః"_ పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*