ఆచారాలు - సాంప్రదాయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
565 views
12 days ago
#తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు మంగళసూత్రంలో పగడం, ముత్యం ప్రాముఖ్యత మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు? ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు. కుజగ్రహ కారకత్వము: అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని,విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!! ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభపలితాలు సమకూర్చగలవు. మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు. ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
879 views
4 months ago
*ధనుర్మాసంలో ఇంటి ముందు* *వేసే ముగ్గులు, గొబ్బెమ్మల* *అంతరార్థం, ప్రయోజనాలు* *ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ‘ధనుర్వాయువు’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే.* *గోదాదేవి ఆరాధన: ధనుర్మాసంలో గోదాదేవి శ్రీమహావిష్ణువును పతిగా పొందాలని ‘తిరుప్పావై’ వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామి వారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసే వారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధనా భావనతోనే భక్తులు ముగ్గులు వేస్తారు.* *గొబ్బెమ్మల విశిష్టత : ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్తూ మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.* *భూత దయ (జీవ కారుణ్యం): ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం (భూత యజ్ఞం) ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను మరియు జీవ కారుణ్యాన్ని తెలియజేస్తుంది.* *ధనుర్మాస ముగ్గులు కేవలం సంప్రదాయమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.* *ధనుర్వాయువు పీల్చడం: ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ‘ధనుర్వాయువు’ లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది.* *ఏకాగ్రత మరియు మెదడు పనితీరు: చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది.* *ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ, లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం.* #తెలుసుకుందాం #ఆచారాలు సాంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
783 views
4 months ago
ఉర్ధ్వ పుండ్రదారణ శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి..........!! రోజూ స్నానం చేశాక, శుచిగా వస్త్రధారణ చేసి, భగవంతుని సన్నిధిలో ఆసీనులై ముఖాన, ఇతర శరీర భాగాల్లోను తెల్ల నిలువు బొట్టు, వాటి మధ్యలో ఎర్రని శ్రీ చూర్ణం ధరించడాన్ని శాస్త్రం విధిస్తున్నది. ఈ ఊర్ధ్వ పుండ్రధారణ ప్రాశస్త్యం, నియమాలు కాత్యాయనోపనిషత్తులోను, వరాహోపనిషత్తులోను వివరించబడి ఉన్నాయి. బ్రహ్మ కాత్యాయనుడికి ఉపదేశించిన ఉపనిషత్తులో ఇలా తెలుపబడింది... భగవానుడే శ్వేత మృత్తికా స్వరూపుడై ఉన్న శ్రీరంగం మొదలైన విష్ణు క్షేత్రాల్లో లభించే శ్వేత మృత్తిక(తెల్లని మన్ను)ను తెచ్చి, ఆ తిరుమణిని ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ శుద్ధ జలంతో అరగదీయాలి. కేశవాది విభవ నామాలను ఉచ్ఛరిస్తూ ప్రతిదినం ఊర్ధ్వ పుండాన్ని ధరించాలి. నాసిక నుంచి ముఖం పై కేశాల వరకు ఉన్నది గాను, నిలిచి ఉండే విష్ణువు రెండు పాదాల వంటి రూపాన్ని కలిగినది గాను నిలువు బొట్టు పెట్టుకోవాలి. శ్రీ పాదాలనే వృక్షానికి మూలం(పాదం)గా ఒక అంగుళం మేరకు ఉండాలి. దాని నుంచి పుట్టే రెండు శాఖల మధ్య ఒక్క అంగుళం అంతరం ఉండాలి. అది శ్రీదేవిని నిలిపే హరిద్రా చూర్ణం (హరిని ఆశపడేటట్లు చేసేది)ధరించడానికి ఉన్నది. సూర్యుని వంటి వర్ణాన్ని కలిగిన ఆ శ్రీ చూర్ణాన్ని బిల్వ ఫలంలో(ఎండిన మారేడు కాయ)ఉంచుకొని, శ్రీ బీజ మంత్రాన్ని చెపుతూ, నీటితో కలిపి సన్నని రేఖలు జీవాత్మ పరమాత్మలకు అధి దేవతలు. ఇక, వరహస్వామి సనత్కుమారుడికి చెప్పిన ఉపనిషత్తులో ఊర్ధ్వ పుండ్రాలు 12శరీరంలో ఎక్కడెక్కడ ధరించాలో చెప్పబడింది. లలాటం(నుదురు), నాభి, వక్షం, కంఠం ముందు భాగం, నాభికి కుడివైపు, కుడి భుజం, కుడి బాహువు, నాభికి ఎడమ వైపు, ఎడమ భుజం, ఎడమ బాహువు, నడుము వెనుక, కంఠం వెనక, మిగిలిన దాన్ని శిరస్సుపైన ధరించాలి. ఈవిధంగా సుషుమ్నా నాడిని అనుసరించి ద్వాదశోర్థ్వ పుండ్రాలు ధరించేవారు ముక్తి పదాన్ని పొందుతారు. గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద సర్వేజన సుఖినోభావంత్ #తెలుసుకుందాం #ఆచారాలు సాంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #గోవిందా గోవిందా
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
824 views
4 months ago
పూజ..ఎవరు చేయాలి.............!! యజమాని ఉత్తరీయం..గోచీపోసి పంచె..కట్టుకోవాలి. సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ..ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి. అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి. ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా.. ఆడపిల్ల అయితే లంగా వోణీ, వివాహిత అయితే చీర కట్టుకోవాలి. అమ్మవారికి అవే కదా ప్రధానం. మరి పురుషుల విషయనికి వస్తే, పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది. "వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది. కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని "కచ్ఛము" అంటారు. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి. ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే, ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే యజమాని యందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి, ఎందుకంటే యజమానికి అయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే. కాబట్టి చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. దేవాలయంలో వెళ్తే ఎదో చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పించుకోకుండ మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మనశరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. అలా చెయ్యకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్ధం. అందువలన పురుషులు(యజమాని)పూజ చేసెపుడు ఉత్తరీయం వేసుకోవాలి, గోచీపోసి పంచె కట్టుకోవాలి..! #ఆచారాలు - సాంప్రదాయాలు #ఆచారాలు సాంప్రదాయాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views
4 months ago
పెళ్ళికి సంబంధించిన ఆచారాలూ సంప్రదాయాలూ అన్ని చోట్లా వున్నాయి. వాటిలో కొన్ని చాలా సరదాగా ఉంటే, మరికొన్ని వధూవరులకు నిజంగానే ఇబ్బందులు కలిగించేలా ఉంటాయి. శారీరక కష్టం, మానసిక ఒత్తిడి లేదా వింతైన సవాళ్లతో కూడిన కొన్ని వివాహ ఆచారాలు ఎన్నో ఉన్నాయి: 1. 'చోరీ' సమస్య - బూట్ల దొంగతనం ఉత్తర భారతదేశంలో ఇది మనందరికీ తెలిసిందే, కానీ విదేశీయులకు ఇది పెద్ద 'ట్రబుల్' లా అనిపిస్తుంది. పెళ్ళి పీటల మీద వరుడు కూర్చున్నప్పుడు వధువు తరపు చెల్లెళ్లు వరుడి బూట్లను దొంగిలిస్తారు. ఆ బూట్లు తిరిగి కావాలంటే వరుడు వారికి అడిగినంత డబ్బు ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు ఈ బేరసారాలు గంటల తరబడి సాగి, గొడవలకు కూడా దారితీస్తుంటాయి. 2. కిడ్నాప్ వివాహం (కిర్గిజిస్తాన్ - Bride Kidnapping) దీనిని 'అలా కచ్చు' (Ala Kachuu) అంటారు. ఇక్కడ అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయిని తన స్నేహితులతో కలిసి బలవంతంగా కిడ్నాప్ చేస్తాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్ళి, పెళ్ళికి ఒప్పించే వరకు అక్కడే ఉంచుతారు. ఇది ఒక నేరమైనప్పటికీ, అక్కడ ఒక సంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది వధువుకు నిజంగానే పెద్ద ట్రబుల్. 3. నోరు విప్పకూడదు (బాలి, ఇండోనేషియా) బాలిలో జరిగే కొన్ని సాంప్రదాయ వివాహాల్లో వధూవరులు పెళ్ళి వేడుక ముగిసే వరకు చాలా తక్కువగా మాట్లాడాలి లేదా అసలు మాట్లాడకూడదు. అంతేకాదు, పెళ్ళికి ముందు వధూవరుల పళ్లను కొంచెం ఫైల్ (File) చేస్తారు. పళ్ళను సమానం చేయడం వల్ల వారిలోని కోపం, అసూయ వంటి చెడు గుణాలు పోతాయని వారి నమ్మకం. ఆ నొప్పిని భరించడం ఒక పెద్ద సవాలే. 4. ఆహారం కోసం పోరాటం (స్విట్జర్లాండ్) కొన్ని స్విస్ సంప్రదాయాల్లో పెళ్ళికి ముందు వధువును ఆమె స్నేహితులు నల్లటి పదార్థాలతో ముంచెత్తడమే కాకుండా, పెళ్ళి రోజున వరుడు ఒక చెక్క మొద్దును (Log) గొడ్డలితో సగానికి నరకాలి. వధువు ఆ మొద్దు కదలకుండా పట్టుకోవాలి. అతిథులందరి ముందు ఆ కష్టమైన పనిని త్వరగా పూర్తి చేయకపోతే వరుడిని ఎగతాళి చేస్తారు. 5. గంభీరంగా ఉండాలి (కాంగో) మనం పెళ్ళిలో నవ్వుతూ ఫోటోలు దిగుతాం. కానీ కాంగోలోని కొన్ని ప్రాంతాల్లో వధూవరులు పెళ్ళి వేడుక మొత్తం నవ్వకూడదు. వారు సీరియస్‌గా ఉంటేనే ఈ పెళ్ళిని వారు సీరియస్‌గా తీసుకుంటున్నారని అర్థం. ఒకవేళ నవ్వితే వారికి పెళ్ళి ఇష్టం లేదని లేదా క్రమశిక్షణ లేదని భావిస్తారు. నవ్వు ఆపుకోవడం అక్కడ పెద్ద ట్రబుల్! 6. వంటల పరీక్ష (జపాన్) జపాన్‌లోని కొన్ని పాత ఆచారాల ప్రకారం, వధువు పెళ్ళి రోజున తెల్లటి మేకప్ వేసుకోవడమే కాకుండా, తలపై ఒక పెద్ద టోపీ (Tsunokakushi) ధరించాలి. ఇది ఆమెలోని 'అసూయ కొమ్ములు' కనబడకుండా ఉండటానికట. అంటే పెళ్ళి తర్వాత ఆమె అత్తమామలతో, భర్తతో చాలా అణకువగా ఉండాలని సూచించే ఒక రకమైన మానసిక ఒత్తిడి. 7. వెక్కిరింతల పాటలు (భారతదేశం - కొన్ని గ్రామీణ ప్రాంతాలు) ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 'గాలి' (Gaali) పాడే ఆచారం ఉంది. వధువు తరపు మహిళలు వరుడిని, అతని తండ్రిని, బంధువులను ఉద్దేశించి బూతులు లేదా వెక్కిరింతలతో కూడిన పాటలు పాడతారు. వరుడి తరపు వారు వీటిని భరిస్తూ నవ్వుతూ ఉండాలి తప్ప కోప్పడకూడదు. ముగింపు: ఈ ఆచారాలన్నీ చూస్తుంటే పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు, వారి ఓపికకు పెట్టే పరీక్ష అనిపిస్తుంది కదూ #తెలుసుకుందాం #wedding #ఆచారాలు - సాంప్రదాయాలు #ఆచారాలు సాంప్రదాయాలు #marriage
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
628 views
4 months ago
*🌹🕉️🙏 నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం!🙏🕉️🌹* శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి. పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు. రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది. 🙏 #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
685 views
5 months ago
దేవతా వృక్షాలలో నారికేళ వృక్షం ఒకటి... శివుడికై బ్రహ్మ సృష్టి... 🌹🙏🌹 కొబ్బరి చెట్టు ఆవిర్భవించడం వెనుక బ్రహ్మ పరమేశ్వరుల తో ముడిపడిన ఒక గాధ ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మధనం చేసిన సమయంలో అందులో నుంచి ముందుగా హాలాహలం జన్మించింది పద్నాలుగు లోకాలను దహించివేసింది లోకాలను కాపాడటానికి పరమేశ్వరుడు దాన్ని సేవించి కంఠంలోనే నిలిపాడు అప్పుడు ఆయన శరీరంలో ఉష్ణోగ్రత అధికమై ఆ వేడిని తగ్గించేందుకు దేవతలు అనేక ప్రయత్నాలు చేసి చివరకు బ్రహ్మ ఒక చెట్టును సృష్టించాడు ఆ వృక్ష ఫల నీ(సా)రంతోఅనగా కొబ్బరినీళ్ళతో శివునికి అభిషేకం చేసి ఆయనను చల్లబరిచారు అందుకే పరమేశ్వరునికి కొబ్బరి నీటితో అభిషేకము చాలా ప్రత్యేకత సంతరించుకుంది అలా నారికేళవృక్షం ఆవిర్భవించింది. ఆధ్యాత్మికంగా: ఈ వృక్షం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేయడం నమస్కరిం చడం మంచిది ప్రధానంగా కొబ్బరి చెట్టుకు కుంకుమ గంధం అలంకరించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి నమస్కరించటం వల్ల కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది పూజా సమయంలో కొబ్బరికాయను కొట్టి నివేదించడం కొబ్బరి నీటిని తీర్థంగా స్వీకరించడం కొబ్బరి నీటిని అభిషేకములు ఉపయోగించుటం. కొబ్బరి ఆకు తో చేసిన విసనకర్ర తీసుకొని పూజా సమయములో ఉపయోగించటం వల్ల సకల దేవతల కరుణ కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది వివిధ వ్రతాల సమయములో ఏర్పాటు చేసుకునే కలశానికి కొబ్బరికాయను అలంకరించి అందులోకి ఆయా దేవతలను ఆవాహనం చేయడం ఆచారం ఇలా కొబ్బరికాయ లేని ఏ పూజ అయిన పరిసమాప్తి అవ్వదు .. 🌹🕉️🌹....ఓం నమఃశివాయ... 🌹🕉️🌹 🌹🕉️🌹...హర హర మహదేవ శంభో శంకర...🌹🕉️🌹 #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు #ఆచారాలు సాంప్రదాయాలు #ఓం శివోహం... సర్వం శివమయం