నేడు కుప్పంలో చంద్రబాబు.jpg

P.Venkateswara Rao
585 views
6 days ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు *బాబుపై ప్రజలకెంత కోపం వుండాలో❗* JUNE 8, 2026🎯 టీడీపీ, జనసేనలో రాజ్యసభ సీట్ల రచ్చ ఓ రేంజ్లో వుంది. అయితే అసంతృప్తవాదులంతా కడప టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి మాదిరిగా బయట పడడం లేదు. ఎందుకంటే, ఇంకా కూటమి అధికారం మూడేళ్ల పాటు వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నష్టపోయిన దాని కంటే, మూడేళ్లలో మరింత పోగొట్టుకోవాల్సి వస్తుందనే భయం……… అసంతృప్తి నోటికి కళ్లెం వేసింది. ఇదే సందర్భంలో నాణేనికి రెండో వైపు కూడా టీడీపీ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. కడప లాంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకున్న చోట వైసీపీకి ఎదురొడ్డి నిలిచానని, ఆర్థికంగా, ఇతరత్రా కూడా ఎంతో వెచ్చించానని, మాట ఇచ్చి తప్పారని, తన జీవితంలో అత్యంత బాధాకరమని శ్రీనివాన్రెడ్డి ఆవేదనంతా వెళ్లగక్కారు. ఇక్కడ హామీ లేదా మాట ఇచ్చి తప్పడాన్ని నాయకుల్లో ఎంత ఆవేదన, ఆగ్రహం సృష్టించిందో చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్ గమనించాలి. ఇదే రీతిలో ప్రజలు కూడా ఆలోచిస్తుంటారని ముగ్గురు ముఖ్య నాయకులు గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల ముందు సామాన్య ప్రజలకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవ్వని హామీ అంటూ లేదు. ఆకాశం నుంచి చంద్రుడిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతామని కూటమి నేతలు ఎన్నికల ముందు నమ్మబలికారు. అయితే కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వాటిలో ఎన్ని హామీలను నెరవేర్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత పాలకులపై వుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్రంగా రగిలిపోతున్నారు. పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవ్స్, డీఏలు, ప్రభుత్వం బకాయి పడ్డ సొమ్ము తదితర సమస్యలపై ఉద్యమ బాట పట్టేందుకు ఉద్యోగులు తాజాగా హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగులు చాలా కోపంగా ఉన్న వాస్తవాన్ని సంబంధిత నాయకులు బయట పెట్టారు. అలాగే నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3 వేలు చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియదు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ అమలు చేస్తామన్న హామీ సగం మాత్రమే నెరవేరుతోంది. సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్న 11వ తరగతి విద్యార్థులకు పథకం అందడం లేదు. అలాగే 18-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా రూ. 1500 ఇస్తామన్న హామీ అటకెక్కింది. ఇక పింఛన్ల కోసం రెండేళ్లుగా ఎదురు చూపే తప్ప, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే పింఛన్లు తొలగింపు మాత్రం సక్సెస్ఫుల్గా సాగింది. ఇలా అనేక హామీల్ని ప్రభుత్వం నెరవేర్చలేదు. తమ నాయకులకు పదవుల హామీ ఎలాగో, ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇతరత్రా భరోసా కూడా అలాంటిదే అని పాలకులు గుర్తించుకోవాలి. పదవులు దక్కకపోతే నాయకులు ఏ రకంగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురి అవుతారో, ప్రజలు కూడా తాము మోసపోయామని భావిస్తే, బుద్ధి చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందులో రెండో మాటకే చోటు వుండదు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఆకాశమే హద్దుగా హామీలిచ్చి, ఓట్లు వేయించుకుని, గద్దెనెక్కి పబ్బం గడుపుకున్నారని ఇప్పుడిప్పుడే ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇది ఇంతింతై అన్నట్టు, మరో మూడేళ్లు గడిచే సరికి తీవ్ర కోపంగా మారే ప్రమాదం వుంది. అందుకే హామీల విషయంలో ఇప్పటికైనా కూటమి పాలకులు సీరియస్గా ఆలోచించాలి. మాట నిలబెట్టుకోకపోతే, సొంత నాయకులైనా, ప్రజలైనా ఆగ్రహిస్తారనే చేదు నిజాన్ని గమనంలో పెట్టుకోవాలి. రాజకీయ అవసరం గడిచిందని, ఇక వారితో పనిలేదని పాలకులు అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితర వర్గాల కోపాగ్నికి ప్రభుత్వం గురైంది. అది పెరిగి పెద్దదైతే, చావు దెబ్బతినడం ఖాయం. ఇక సామాన్య ప్రజలకు ఆశ చూపి, చివరికి అడియాస మిగిల్చిన వైనాన్ని పాలకులు తమ సౌకర్యం కొద్ది మరిచిపోయి వుండొచ్చు. కానీ తమ కడుపు కొట్టారని పేదలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. అదొక్కటీ గమనంలో పెట్టుకుంటే, ఇప్పటికైనా సరైన నిర్ణయాలు పాలకులు తీసుకుంటారు.
P.Venkateswara Rao
636 views
17 days ago
#చంద్రబాబు #🟡తెలుగుదేశం పార్టీ #పొలిటికల్ సెటైర్స్ 😂 *30 ఏళ్లుగా అలుపెరగని మహానటన❗* MAY 29, 2026🎯 మన దేశంలో భారత రత్న అత్యున్నత పురస్కారం. ప్రతి మహానాడు సందర్భంలోనూ భారత రత్న పురస్కార అంశం చర్చకు వస్తుంటుంది. తెలుగు సమాజం ఏమైనా అనుకుంటుందనే వెరపు కూడా లేకుండా, ఎన్టీఆర్కు ఆ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని మహానాడులో తీర్మానిస్తుంటారు. వెండితెరపై ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఎన్టీఆర్కు భారత రత్న కోసం ప్రయత్నిస్తున్నామంటూ, ఆయన ఫొటోలు, విగ్రహాలతో రాజకీయాలు చేస్తున్న వారి నటన అమోఘం, అద్భుతమనే విమర్శలున్నాయి. సినిమాల్లో నటించడం మాత్రమే ఎన్టీఆర్కి తెలుసు. రాజకీయాల్లో నటించడం తెలియదు. అందుకే ఏ నాయకుడికి లేని చేదు అనుభవాలు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నాయి. ఒకే నాయకుడు రెండుసార్లు వెన్నుపోటుకు గురి కావడం బహుశా దేశ రాజకీయ చరిత్రలో వుండదేమో. కానీ ఎన్టీఆర్ రెండుసార్లు వంచనకు గురయ్యారు. తన అనుకున్న వాళ్లను ఎంతగా నమ్ముతారో, రెండుసార్లు వెన్నుపోటుకు గురి కావడమే నిదర్శనం. ఎక్కడైతే నమ్మకం, అంధ విశ్వాసం వుంటుందో, అక్కడే వంచన, దుర్మార్గం నీడలా వుంటాయి. అదును చూసి చావు దెబ్బ కొడుతుంటాయి. వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో మోసానికి గురైన వారిని తీసుకోండి. బాగా నమ్మినోళ్ల చేతుల్లోనే వంచనకు గురై వుంటారు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా వంచనకు గురవుతున్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన జయంతిని పురస్కరించుకుని మహానాడు నిర్వహిస్తుంటారు. ఆ సభల్లో చేసే తీర్మానాల్లో ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనేది తప్పనిసరిగా వుంటుంది ఇంతకూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సింది మన జాతీయ ప్రభుత్వమేనా? లేక ఇతర దేశాల ప్రభుత్వాలా? అనే అనుమానం వస్తుంది. భారత ప్రభుత్వమే భారత రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్ తదిరత అత్యున్నల పురస్కారాల్ని ప్రతి ఏడాది ప్రకటించి, అందజేస్తుంటాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఎవరి మద్దతుతో ఏర్పడిందో అందరికీ తెలుసు. టీడీపీ అత్యంత క్రియాశీలక భాగస్వామి. పురస్కారాల్ని ఇచ్చే అధికారాన్ని చేతిలో పెట్టుకుని, మహానాడులో డిమాండ్ చేస్తుండడం జనానికి విడ్డూరంగా తోస్తోంది. 30 ఏళ్లుగా ఒకే డిమాండ్పై అలుపెరగని నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తుండడం సామాన్య విషయం కాదు. వెండితెరపై ఎన్టీఆర్ నటనకు ముగ్ధులయ్యే సంగతిని కాసేపు పక్కన పెడదాం. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం పేరుతో రాజకీయ తెరపై అద్భుతంగా నటిస్తున్న వారికి నటించే వాళ్లకు ఏదైనా విశిష్టత బహుమతి ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది.
P.Venkateswara Rao
2.3K views
22 days ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు *బాబూ.. మీ పాలనపై నమ్మకం లేదా❓* MAY 24, 2026🎯 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కేవలం తిరస్కరించడానికి మాత్రమే జరుగుతున్నాయి. ఇందుకు గత రెండు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశు అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు భావించారు. ఆ మేరకు ఆయన నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అయితే ప్రజల అంచనాలకు తగ్గట్టు చంద్రబాబు పరిపాలన సాగించలేదు. దీంతో 2019లో చంద్రబాబును వద్దని జనం అనుకున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల జగన్ పాలనతో జనం విసుగెత్తారు. ఆ కారణంగా 2024 ఎన్నికల్లో జగన్ను జనం తిరస్కరించారు. దీంతో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారు. ప్రశాంత జీవితాన్ని గడపాలనేది ప్రతి మనిషి ప్రాథమిక కోరిక. పరిపాలన ఆధారంగా మళ్లీ అధికారం ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఆధారపడి వుంటుంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకోడానికి సిద్ధంగా వుంది. ప్రస్తుతానికి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో సానుకూలత లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ పడాలని అంటుంటారు. ఈ లెక్కన చూస్తే ప్రజాభిమానాన్ని చూరగొనడంలో చంద్రబాబు విఫలమయ్యారని చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు తరచుగా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సొంత మీడియాలో కథనాలు చూస్తుంటాం. అంటే కూటమి ప్రజాప్రతినిధుల తీరు బాగాలేదని ఆయన వార్నింగ్లో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్' అని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా శాశ్వతంగా తామే అధికారంలో వుండాలని కోరుకోవడంలో తప్పులేదు. అందువల్ల చంద్రబాబు మాటల్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే కోరిక ఉన్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు. అందుకు తగ్గట్టు పరిపాలన సాగించాల్సింది తానే అని చంద్రబాబు విస్మరించడం విమర్శలకు దారి తీస్తోంది. 'ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి అది హానికరం. ఆ పార్టీ రాకూడదని పూజలు చేయాలి. గొడ్డలి పార్టీకిసహకరించకండి' అని ఆయన కోరారు. తన ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతో మాత్రమే అధికారంలో కొనసాగాలన్న ఆశ చంద్రబాబు మాటల్లో కనిపించింది. అంతే తప్ప, తనకు అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారని, అందుకు తగ్గట్టు ప్రజలకు మంచి చేయాలన్న తలంపు చంద్రబాబులో మచ్చుకైనా కనిపించడంలేదు. తన పరిపాలన మళ్లీ అధికారం కట్టబెడుతుందనే నమ్మకం చంద్రబాబులో ఇసుమంతైనా లేదని స్పష్టమవుతోంది. ఇదిగో మీరు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చారని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫలానా మంచి పనులు చేస్తున్నానని ప్రజలకు చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా ఎంతకాలమని వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై వ్యతిరేకతతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివన్నీ తమ పాలనపై నమ్మకం లేని నాయకులు చేసే పనిగా నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి మించిపోయింది లేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించాలి. అలాగే ప్రత్యర్థులపై వ్యతిరేకత సృష్టించడం ద్వారా కాకుండా, పాజిటివ్ ఓట్తో తిరిగి అధికారంలోకి రావచ్చనే ఆలోచనతో బాబు అండ్ కో ముందుకు నడిస్తేనే భవిష్యత్ వుంటుందని నెటిజన్లు హితవు చెబుతున్నారు. ఐదేళ్ల పరిపాలనపై తీర్పు చెప్పే బాధ్యత ప్రజలపై వుంటుంది. ప్రజల మనసెరిగి పాలన చేస్తున్నామా? లేదా? అనేది చంద్రబాబు సమీక్షించుకోవాలి. అంతే తప్ప, గొడ్డలి పార్టీ, తల్లీచెల్లి అంటూ మాట్లాడ్డం ద్వారా ఓట్లు రాలుతాయని అనుకోవడమంత అజ్ఞానం మరొకటి వుండదని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా?
P.Venkateswara Rao
651 views
1 months ago
* #చంద్రబాబు : పరనిందకు మాత్రమే ప్రవచనాలు❗* APRIL 30, 2026🎯 అతి సర్వత్ర వర్జయేత్ అనే నీతిని మనం చిన్నప్పటినుంచి చదువుకునే ఉంటాం. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అలాంటి నీతినే ప్రవచిస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని ఆయన అంటున్నారు. అధికారం ఉన్నది గనుక ఈగోలకు పోతాం అని ఎవరైనా అనుకుంటే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని చంద్రబాబు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆయన హితవచనాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మాటలను గమనిస్తే.. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలన్నారో చివర్న చర్చించవచ్చు గానీ.. ఆయన ఇతరులకు చెప్పడానికి మాత్రమే ఈ నీతులు తయారుచేసుకుంటారా? అనే అనుమానం కార్యకర్తలకు కలుగుతోంది. అతి పనికి రాదని చంద్రబాబు చెప్పడం.. అన్యాపదేశంగా పిఠాపురం వర్మ వ్యవహారాన్ని ఉద్దేశించే అన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం ప్రమాణ స్వీకారం వంటి గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకుని.. మరీ ఇలాంటి చిల్లరగొడవల ప్రస్తావన తేవడం ఏమాత్రం గౌరవప్రదంగా లేదని కూడా కార్యకర్తలు అంటున్నారు. ఇక చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తున్న 'అతి' విషయానికి م వద్దాం. అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు అనేది ఆయన సూత్రీకరణ. మరి అనేక విషయాల్లో చంద్రబాబు చేస్తున్న తీరును ‘అతి' అనే కేటగిరీలోకి చేర్చవచ్చునో లేదో ఆయనే ఒకసారి సమీక్షించుకోవాలి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పటికి కూడా మైకు దొరికితే చాలు.. జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కడంలోనే చంద్రబాబునాయుడు తరించిపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మీద విషం కక్కడం అర్థం చేసుకోవచ్చు. కానీ రెండేళ్లుగా ప్రతి సందర్భంలోనూ మైకు దొరికితే చాలు.. జగన్ పాలనను ఆడిపోసుకుంటూ, జగన్ పాలన వల్ల రాష్ట్రం నాశనమైపోయిందనే పాచిపాట పాడడాన్ని చంద్రబాబు నిత్యకృత్యంగా మార్చుకున్నారు. కొత్త కార్యవర్గం పదవీస్వీకారంలో కూడా.. కొత్త దళం లక్ష్యాలు ఏమిటో ఆశావహ సానుకూల దృక్పథంతో ప్రసంగాలు సాగలేదు. జగన్ ను తిట్టడంలోని ప్రతికూల బుద్ధితోనే ప్రసంగాలు సాగాయి. ఇదంతా అతి అని ప్రజలు అనుకుంటారో లేదో చంద్రబాబు ఆలోచించుకోవాలి. అమరావతి రాజధాని కావొచ్చు, విశాఖ ఐటీ కేంద్రం కావడం గురించి కావొచ్చు.. ఉన్నదానికంటే సాధిస్తున్న కంటె అతిశయమైన అబద్ధాలను వండి వార్చడం మితిమీరుతున్నదని అతి అవుతున్న దని చంద్రబాబునాయుడు గుర్తించలేకపోతే ఆయన పారీకి తొలి ప్రమాదం పొంచి ఉంటుంది. అతి పనికిరాదని ఆయన చెబుతున్న మాట అక్షరసత్యం. కానీ ఎన్ని విషయాల్లో ఆయన ప్రవర్తన అతి అనే కోవకిందికి చేరుతున్నదో కూడా ఆయన గమనించుకుంటూ ఉంటేనే.. ఆ పార్టీకి మంచి జరుగుతుంది.