పురాణ గాథలు/కథలు

S.HariBlr (Bangalore)
3.7K views
5 days ago
#పురాణ గాథలు/కథలు #హిందూ పురాణ కథలు 🌺🍃🌺 🍃🌺🍃 🌺🍃🌺 *🌹 \!/🌾 గోపిక భక్తి 🌾\!/ 🌹* *🌺ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా, నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ, ఆరోజు మాత్రం, ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు.* *🌺రుక్మిణి వచ్చి "స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు?" అని అడిగింది. “నాకు తల నొప్పిగా ఉంది", అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించడంలో కూడా సమర్ధుడు.* *🌺"వైద్యుని పిలిపించండి", అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు, ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు."ఇవన్నీ నాకు పని* *చేయవు", అన్నాడు కృష్ణుడు. "మరి ఇంకేం చేద్దాం", అడిగారు జనం. ఆపాటికి చాలా మంది జనం వచ్చిచేరారు. సత్యభామ వచ్చింది. నారదుడు వచ్చాడు. "ఏమైంది? ఏం జరిగింది?". ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. "కృష్ణుడికి తలనొప్పిగా ఉంది. మనమేం చేయాలి?" అని.* *🌺"నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు, ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తలమీద రుద్దండి. నొప్పి తగ్గిపోతుంది" అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ "ఏమిటీ అర్థం లేని మాటలు ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టటం మాత్రం చేయను. అలాంటివి చేయ తగని పనులు" అని అంది. ఇక రుక్మిణి కూడా "ఇది ఎలా చేయగలం? మహా పాపం... ఇది మనం చేయలేము" అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా "నేను కూడా ఇలాంటి పని చేయ దలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తూ భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగివున్నకుట్ర ఏంటో తెలీదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను" అని నారదుడు వెనుదిరిగాడు.* *🌺ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరు భయపడ్డారు "మేము ఇలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే గానీ, ఇలాంటి పని చేసి నరకానికి పోలేము"అని. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తోంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు.* *🌺ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిటచెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్లు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి "దీన్ని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టండి" అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తలచుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది!* *🌺గోపికల భక్తిలో ఎలాంటి స్వార్థం లేదు. తమకు పాపం వస్తుందా లేదా తాము నరకానికి పోతామా అనే స్వంత ఆలోచనల కంటే, కృష్ణుడి బాధ తగ్గడమే వారికి ముఖ్యం. భగవంతుడిపై ఉండే ప్రేమలో అహాన్ని, స్వార్థాన్ని వదిలేయడమే నిజమైన భక్తి.* *🌺ఆయన ఎప్పుడూ తన విశ్వాస భక్తులకే విలువ ఇస్తారని స్పష్టం అవుతుంది. ❀꧁జై శ్రీ కృష్ణ꧂❀ 🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3K views
1 months ago
దశావతారాలు - మూడో రోజు: శ్రీ వరాహ అవతారం 🐗 విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారమైన వరాహ స్వామి, భూదేవిని విశ్వ సముద్రం నుండి రక్షించడానికి ఒక అడవి పంది రూపం ధరించాడు. శాపం: ఈ కథ వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ, విజయులతో మొదలవుతుంది. కుమారులు అని పిలువబడే మునులను అడ్డుకోవడంలో వారి అహంకారం కారణంగా, వారు భూమిపై అసురులుగా జన్మించమని శపించబడ్డారు. వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా అవతరించారు. అపహరణ: హిరణ్యాక్షుడు అపారమైన శక్తిని పొందడానికి కఠోర తపస్సు చేసి, తదనంతరం స్వర్గాన్ని జయించాడు. తన అహంకారంతో, అతను భూదేవిని రసాతలం అనే విశ్వ సముద్రం అడుగుకు లాక్కెళ్లాడు. విశ్వ వరాహం: భూమి కుంగిపోతుండగా, బ్రహ్మదేవుడు మరియు భూదేవి మోక్షం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు బ్రహ్మ ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న వరాహం రూపంలో ఉద్భవించాడు, అది త్వరలోనే ఒక భారీ, విశ్వమంత పరిమాణానికి పెరిగింది. యుద్ధం మరియు రక్షణ: భూమిని తిరిగి తీసుకురావడానికి వరాహుడు ఆదిమ జలాల్లోకి ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు అతడిని సవాలు చేయగా, వెయ్యి సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు వరాహుడు ఆ రాక్షసుడిని ఓడించి, భూమిని తన దంతాలపై సమతుల్యం చేసి, తిరిగి దాని యథాస్థానానికి చేర్చాడు. ప్రాముఖ్యత: 1. తిరుమల ఆది వరాహ క్షేత్రం: తిరుమల కొండలపై శ్రీవారి కంటే ముందు నుంచే వరాహ స్వామి ఉన్నాడు. శ్రీవారు స్థలం అడిగితే వరాహ స్వామే ఇచ్చాడు. అందుకే మొదటి దర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహ స్వామికే. తిరుమల యాత్ర వరాహ దర్శనంతోనే పూర్తవుతుంది. 2. భూమాత రక్షకుడు: మనం ఎంత కష్టాల్లో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినా వరాహ స్వామి కోరలే మనకు ఆధారం. ఈ కథ చదివిన మీ ఇంట్లో భూమి, ఇల్లు, పొలం, ఆస్తి సమస్యలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆది వరాహాయ నమః 🙏 #🙏విష్ణుమూర్తి దశావతారాలు 🙏# #విష్ణుమూర్తి దశావతారాలు ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4.9K views
1 months ago
అసలు స్వామివారిని గోవిందా అని ఎందుకు పిలుస్తారు ఆ పేరు ఎలా వచ్చింది గోవిందా అని భక్తుల చేత పిలిపించుకోవడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కొండ దిగి వచ్చారని మీరు నమ్మగలరా ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని దగ్గరకు వెళ్తారు అగస్యముని తో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్య ముని తో అడుగుతారు ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అప్పుడు స్వామి సరే అని వెళ్ళిపోతారు ఒక్కరోజు అగస్త్య ముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీసమేతంగా ఆశ్రమానికి వస్తారు ఆశ్రమంలో శిష్యుని అడుగుతారు మీ గురువుగారు సతీసమేతంగా వచ్చి గోవును స్వీకరించండి అన్నారు మాకు గోవునిస్తారు చెప్పారు అప్పుడు శిష్యుడు మా గురువుగారు లేరు ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమి చేయలేను మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకొని పోండు అని శిష్యుడు పలుకుతాడు దాంతో స్వామి వారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన ఉత్తాంతం వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును తీసుకొని శిష్యుల్ని మరి కొంతమందిని వెంటపెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు స్వామివారు కాస్త దూరంలో కనిపించక అతను స్వామి "గో ఇంద"గట్టిగా అరవ సాగారు స్వామి వినిపించకుండా వెళ్ళిపోతా ఉన్నారు శిష్యులందరూ గట్టిగా మరి గట్టిగా స్వామి గో ఇంద గో అంటే ఆవు ఇంద అంటే ఇదిగో అలా శిష్యులందరూ గో ఇంద గో ఇంద గోవింద గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామి వారి అదృశ్యం అవుతారు స్వామివారికి గోవిందా అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవిందా అని పిలిపించుకోవడానికి స్వామి వారే కొండ దిగి వస్తారు గోవిందా గోవిందా #🙏శ్రీనివాస గోవింద🙏శ్రీవేంకటేశ గోవిందా 🙏 ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #గోవిందా గోవిందా #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
15K views
1 months ago
🔱 ఉల్లిపాయ, వెల్లుల్లి రహస్యం – శాస్త్రాలలో ఎందుకు నిషేధించబడ్డాయి? 🔱 హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మంథనం సమయంలో రాహువు నోటినుండి భూమిపై పడిన అమృతపు చుక్కల నుండి ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉద్భవించాయని చెబుతారు. అందువల్ల వీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాక్షస సంబంధం కారణంగా దేవతలకు సమర్పించే నైవేద్యాలలో వీటిని ఉపయోగించరు. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇవి మనస్సులో తామసిక గుణాలను పెంచి ధ్యానం, భక్తి, ఏకాగ్రతను తగ్గిస్తాయని విశ్వసిస్తారు. అందుకే అనేక వైష్ణవ మరియు సాత్విక ఆహార విధానాలలో ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించే ఆచారం ఉంది. 🕉️ సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏 ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం