పురాణ గాథలు/కథలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.1K views
1 months ago
దశావతారాలు - మూడో రోజు: శ్రీ వరాహ అవతారం 🐗 విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారమైన వరాహ స్వామి, భూదేవిని విశ్వ సముద్రం నుండి రక్షించడానికి ఒక అడవి పంది రూపం ధరించాడు. శాపం: ఈ కథ వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ, విజయులతో మొదలవుతుంది. కుమారులు అని పిలువబడే మునులను అడ్డుకోవడంలో వారి అహంకారం కారణంగా, వారు భూమిపై అసురులుగా జన్మించమని శపించబడ్డారు. వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా అవతరించారు. అపహరణ: హిరణ్యాక్షుడు అపారమైన శక్తిని పొందడానికి కఠోర తపస్సు చేసి, తదనంతరం స్వర్గాన్ని జయించాడు. తన అహంకారంతో, అతను భూదేవిని రసాతలం అనే విశ్వ సముద్రం అడుగుకు లాక్కెళ్లాడు. విశ్వ వరాహం: భూమి కుంగిపోతుండగా, బ్రహ్మదేవుడు మరియు భూదేవి మోక్షం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు బ్రహ్మ ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న వరాహం రూపంలో ఉద్భవించాడు, అది త్వరలోనే ఒక భారీ, విశ్వమంత పరిమాణానికి పెరిగింది. యుద్ధం మరియు రక్షణ: భూమిని తిరిగి తీసుకురావడానికి వరాహుడు ఆదిమ జలాల్లోకి ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు అతడిని సవాలు చేయగా, వెయ్యి సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు వరాహుడు ఆ రాక్షసుడిని ఓడించి, భూమిని తన దంతాలపై సమతుల్యం చేసి, తిరిగి దాని యథాస్థానానికి చేర్చాడు. ప్రాముఖ్యత: 1. తిరుమల ఆది వరాహ క్షేత్రం: తిరుమల కొండలపై శ్రీవారి కంటే ముందు నుంచే వరాహ స్వామి ఉన్నాడు. శ్రీవారు స్థలం అడిగితే వరాహ స్వామే ఇచ్చాడు. అందుకే మొదటి దర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహ స్వామికే. తిరుమల యాత్ర వరాహ దర్శనంతోనే పూర్తవుతుంది. 2. భూమాత రక్షకుడు: మనం ఎంత కష్టాల్లో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినా వరాహ స్వామి కోరలే మనకు ఆధారం. ఈ కథ చదివిన మీ ఇంట్లో భూమి, ఇల్లు, పొలం, ఆస్తి సమస్యలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆది వరాహాయ నమః 🙏 #🙏విష్ణుమూర్తి దశావతారాలు 🙏# #విష్ణుమూర్తి దశావతారాలు ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
15.9K views
1 months ago
🔱 ఉల్లిపాయ, వెల్లుల్లి రహస్యం – శాస్త్రాలలో ఎందుకు నిషేధించబడ్డాయి? 🔱 హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మంథనం సమయంలో రాహువు నోటినుండి భూమిపై పడిన అమృతపు చుక్కల నుండి ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉద్భవించాయని చెబుతారు. అందువల్ల వీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాక్షస సంబంధం కారణంగా దేవతలకు సమర్పించే నైవేద్యాలలో వీటిని ఉపయోగించరు. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇవి మనస్సులో తామసిక గుణాలను పెంచి ధ్యానం, భక్తి, ఏకాగ్రతను తగ్గిస్తాయని విశ్వసిస్తారు. అందుకే అనేక వైష్ణవ మరియు సాత్విక ఆహార విధానాలలో ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించే ఆచారం ఉంది. 🕉️ సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏 ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం
Anjaiah Soma
1.2K views
2 months ago
*శివార్పణం ………!!* ఇది నిజంగా జరిగిన కథ అని చెబుతారు…. ఇప్పటికీ ఆ ప్రదేశంలో జరిగే ఉత్సవాలు, వేడుకలు ఇందుకు నిదర్శనం….. పరమ శివునికి మహాభక్తుడైన ఓ జాలరి కథను తెలుసుకుందాం….. *“జాలరి కథ”……!!* తమిళనాడు దగ్గర సముద్రతీర ప్రాంతంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహా శివభక్తుడు…… ఈ జాలరివాడి దినచర్య అందరిలా కాకుండా కొంత ప్రత్యేకంగా ఉండేది….. ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు…. ఈ జాలరి అందరితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు…. అయితే ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని “శివార్పణం”అని సముద్రంలో వేసేవాడు….. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు….. ఈ విధంగా అతను భగవద్భక్తిని పాటిస్తూ కుటుంబ పోషణ చేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవాడు….. ఇతని బ్రతుకులో తెలిసినదంతా తనకు దొరికిన దానిలో మొదటిది “శివార్పణం” చేయడమే…… *“శివార్పణం”అంటే….!!* నిజానికి భక్తి అంటేనే “శివార్పణం”…..ఏ పని చేసినా భక్తితో మనసారా “శివార్పణం” అంటే చాలు ఎక్కడలేని ప్రశాంతత కలుగుతుంది….. అలా అనగలిగిన వారు నిజంగా ధన్యులు… నిజానికి శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది…. శివభక్తి….శివ ప్రేమ…”శివార్పణం” ఇలాంటి మాటలు. ఈ జాలరికి తెలిసిన ఒకే పదం “శివార్పణం”…. *ఒకే మాటగా ఒకే బాటగా….!!* ఈ జాలరి నాయకత్వంతో అందరూ సుఖంగా ఉండేవాళ్లు…. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్లు అదే పాటించేవారు….. ఒకే మాటగా ఒకే బాటగా వారంతా ఆనందంగా జీవనం సాగిస్తుండేవాడు…. జాలరి నాయకత్వంలో మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు…. *ముంచుకొచ్చిన ఆపద…!!* ఇలా కాలం ఆనందంగా సాగుతుండగా ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్లకి చేపలు పడలేదు….. ఎన్నాళ్లు సముద్రంలోకి ఎంత దూరం వెళ్లి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకీ, కుటుంబ పోషణకీ అయిపోయాయి….. చివరికి తిండికి కూడా కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఎవరి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు…… *వలలో బంగారు చేప…..!!* ఒకసారి అందరూ గుంపుగా వెళ్లి చేపల కోసం వల వేశారు….. జాలరి నాయకుడు వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది….. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది…. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు పొదిగిన చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది…. దానిని వీళ్లందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు….. ఈ చేపని కానీ తీసుకువెళ్లి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్లకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్మినా మరెన్నడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది….. *మరి శివార్పణం ఎలా…..!!* జాలరి నాయకునికి మొదట పడ్డ చేప శివార్పణంగా సముద్రంలోకి విసిరేయడం అలవాటు కదా…… పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప…. ఆందోళనలో జాలరులు అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న మిగిలిన వాళ్లందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్లందరికీ తెలుసు. మొదటి చేపను “శివార్పణం” అని వేయడం ఈయనకు అలవాటు… నాయకుడు కాబట్టి వద్దు అనలేరు…. తిండికి కూడా గడవని ఈ గడ్డు పరిస్థితిలో ఈయన ఇప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది….. మిగిలిన జాలరులు ప్రతిరోజూ తిండికి లేదని బాధ పడుతుంటే ఈ పెద్దమనిషి మాత్రం రోజూ “శివార్పణం” చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు. ఇక ఇప్పుడు ఈ బంగారు చేపను “శివార్పణం” చేస్తే ఇక మన గతి ఏంటి అని అందరూ ఆందోళన చెందసాగారు….. *అదీ భక్తి అంటే…..!!* ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది….. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్లంతా పులకించిపోయింది….. కళ్లవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. ఆ చేపని పైకి తీశాడు. మిగిలిన జాలరులు ఆ చేపను “శివార్పణం” చేయవద్దని ఆయన కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు…… “శివార్పణం” అయిన బంగారు చేప జాలరుల ప్రార్థనలు కానీ…. ఏడుపు కానీ ఆ నాయకునికేమి పట్టలేదు…… శివుడికి ఇవ్వడానికి బంగారు చేప దొరికిందన్న ఆనందంతో మైమరచిపోయి ఆ చేపను పైకెత్తి “శివార్పణం” అని సముద్రంలో వేశాడు….. *ప్రత్యక్షమైన పరమశివుడు…..!!* వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో…… మహా కాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యలో……”వృషభ వాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు”…. దర్శనమిచ్చి 'సంతోషించాను' అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్లకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు….. భక్తుని ఆశ్రయంతో భగవత్ దర్శనం ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుని పూజించకపోయినా భగవంతుని భక్తుడిని అంటిపెట్టుకున్న చాలు తరించిపోతాం అని చెప్పడం. ఆ జాలరి నాయకుడు తన అచంచలమైన భక్తి విశ్వాసాలతో తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు…… *ఇది నిజం…..!!* నాగపట్నంలో ఇప్పటికీ ఆ భక్తుడి పేరున ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న శివుడు ఉత్సవమూర్తిని తీసుకువచ్చి ఆ జాలరి వాళ్ల ఇంట్లో ఘనంగా ఉత్సవం చేస్తారు. *జీవిత సత్యం……!!* అర్పణకు సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి….. కనుక అర్పించేదే నీది…. దాచుకున్నది నీది కాదు….. తరువాత ఎవడిదో అవుతుంది….. ఇలాంటి కథలు వింటే స్వార్థ రాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి….. ఇలాంటి నిజ జీవిత గాథలు మన పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేసి వారిలో భగవత్ భక్తిని పెంచి, అర్పించడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేయాలి….. ఇలాంటి భగవత్ కథ వింటూ ఉంటే మనలో రజోగుణం తమోగుణం పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి….. *ఓం నమ:శివాయ….!!* ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి…….!! *అరుణాచల శివ*🙏 #పురాణ కథలు #పురాణ గాథలు/కథలు #📙🙏శివుని పురాణ కథలు #హిందూ పురాణ కథలు #పురాణ కథ