sri padmavathi devi

PSV APPARAO
899 వీక్షించారు
13 రోజుల క్రితం
#తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వైభవం 🪔🕉️🙏🙏🙏 #తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం 🙏 #శుభ శ్రావణమాసం ... వరలక్ష్మీ వ్రతం ... వరలక్ష్మీ వ్రతకల్పం 🙏 #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #🙏 ఓం నమో శ్రీ పద్మావతి దేవియే నమః 🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 👆 *స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం* తిరుపతి, 2026 ఆగస్టు 21:: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. స్వర్ణరథోత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నాలుగు మాడ వీధుల్లో రథాన్ని లాగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
PSV APPARAO
450 వీక్షించారు
13 రోజుల క్రితం
#తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వైభవం 🪔🕉️🙏🙏🙏 #తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం 🙏 #శుభ శ్రావణమాసం ... వరలక్ష్మీ వ్రతం ... వరలక్ష్మీ వ్రతకల్పం 🙏 #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #🛕ప్రసిద్ధ లక్ష్మి అమ్మవారి దేవాలయాలు🔔 👆 *శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం* *భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు* *శోభాయమానంగా ముస్తాబైన అష్టలక్ష్మీ మండపం* *సాయంత్రం వైభవంగా స్వర్ణరథోత్సవం* తిరుపతి, 2026 ఆగస్టు 21:: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. *విశేష పూజలతో వరలక్ష్మీ వ్రతం* వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించుకుని భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు. *మహిళలకు మంగళప్రదమైన వరలక్ష్మీ వ్రతం* వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించినందున, అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు. *భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి జేఈవో శ్రీ ఏ. శరత్* టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. వ్రత కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. *పుష్ప సౌందర్యంతో కనువిందు చేసిన వ్రత మండపం* టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుమారు మూడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 14 రకాల 30 వేల కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ముసాంబి, పైనాపిల్ తదితర పండ్లు, వివిధ రకాల పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అష్టలక్ష్మి మూర్తులు, రంగురంగుల రోజాలు, తామరపూలతో ఆస్థాన మండపం శోభాయమానంగా అలంకరించారు. *7 ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష వీక్షణ* భక్తులందరూ వరలక్ష్మీ వ్రతాన్ని వీక్షించేందుకు ఆస్థాన మండపం, పుష్కరిణి, వాహన మండపం, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్, గేట్ నం.3 తదితర ప్రాంతాల్లో మొత్తం ఏడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. *స్వర్ణరథంపై అమ్మవారి దివ్య విహారం* వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ సురేష్ కుమార్, శ్రీమతి జానకి దేవి, శ్రీమతి రంగశ్రీ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.4K వీక్షించారు
1 నెలల క్రితం
తిరుమలకు వెళ్లే ముందు తిరుచానూరు ఎందుకు వెళ్లాలి? లక్ష్మీదేవే స్వయంగా తామర పువ్వులో పద్మావతిగా వెలసిన క్షేత్రం తిరుచానూరు. ఆకాశరాజు యజ్ఞ భూమిలో దొరికిన ఆ తల్లి కోసమే శ్రీనివాసుడు 12 ఏళ్లు తపస్సు చేశాడు. అమ్మను చూడకుండా అయ్యను చూస్తే ఫలం లేదు! ఓం శ్రీ పద్మావత్యై నమః 🙏 తిరుచానూరు - అలమేలుమంగాపురం పేరు ఎలా వచ్చింది? అమ్మవారు బంగారు తామర పువ్వు మీద వెలిసింది కాబట్టి ఈ ఊరికి అలర్ మేల్ మంగాపురం అని పేరు వచ్చింది. అలర్ అంటే తామర, మేల్ అంటే పైన, మంగ అంటే దేవి. ఇదే తిరుచానూరు. తిరుమలకు వెళ్లే ప్రతి యాత్రికుడు ముందుగా ఇక్కడ పద్మావతి అమ్మను దర్శించుకుంటేనే యాత్ర ఫలిస్తుందని నమ్మకం. ఈ పురాణానికి 2 పెద్ద కథలు ఉన్నాయి బ్రో: కథ 1: ఆకాశరాజు యజ్ఞభూమిలో దొరికిన బిడ్డ పూర్వం పుండరీక అనే బ్రాహ్మణుడికి కొడుకు మాధవుడు పుట్టి, దారి తప్పి పాపాలు చేసి, తిరుమల కొండల్లో సుదర్శన సరస్సులో స్నానం చేయగానే పాపాలు పోయి, తొండమండల రాజు మిత్రవర్మకు ఆకాశరాజు గా జన్మించాడు. ఆకాశరాజు పెరిగి ధరణీదేవిని పెళ్లాడి సంతానం లేక బాధపడుతూ, పూజారి చెప్పగా యజ్ఞం కోసం భూమి దున్నుతుండగా, నాగేటి చాలులో వెయ్యి రేకుల బంగారు కమలంలో ఒక పసిపాప దొరికింది. "ఈ బిడ్డను ప్రేమతో పెంచండి" అని ఆకాశవాణి వినిపించింది. పద్మం (తామర) లో దొరికింది కాబట్టి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. ఆమె పెద్దయ్యాక శ్రీనివాసుడిని వెతుక్కుంటూ వచ్చి వైభవంగా కళ్యాణం చేసుకున్నాడు. కథ 2: భృగు మహర్షి వల్ల లక్ష్మీదేవి అలిగి రావడం ఒకసారి త్రిమూర్తులలో గొప్పవారెవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి వైకుంఠం వెళ్లి, విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. విష్ణువు కోపగించకపోగా అతని కాలు పట్టుకున్నాడు. ఇది చూసి నా నివాసమైన వక్షస్థలాన్ని తన్నినా ఊరుకున్నారని లక్ష్మీదేవికి కోపం వచ్చి, వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చి స్వర్ణముఖి నది ఒడ్డున పద్మసరోవరం తవ్వి 12 ఏళ్లు తపస్సు చేసింది. 13వ ఏట కార్తీక మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి రోజున ఆ సరోవరం మధ్యలో ఉన్న బంగారు కమలం నుండి శ్రీ పద్మావతిగా తిరిగి అవతరించింది. అందుకే అక్కడి కోనేటిని పద్మసరోవరం అంటారు. ఆమెను లక్ష్మీ అనుమతితోనే శ్రీనివాసుడు పెళ్లాడాడు. ఆ సరోవరం మధ్యలో బంగారు కమలంపై మహాలక్ష్మిగా ఉద్భవించింది కాబట్టే ఈ ప్రదేశం పవిత్రమైంది. గుడిలో అమ్మ ఎలా ఉంటుంది? గర్భగుడిలో అమ్మ పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. నాలుగు చేతులు, రెండు చేతుల్లో పద్మాలు, రెండు చేతులు వరద, అభయ ముద్రలతో ఉంటుంది. అందుకే ఆమెను అలమేలు మంగ అంటారు అలివేలు మంగమ్మా - అలరిన నవ్వులమ్మా పల్లవి: అలివేలు మంగమ్మా.. అలరిన నవ్వులమ్మా పద్మసరోవరములో పుట్టిన పద్మమ్మా తిరుచానూరులో వెలసిన తల్లీ మా ఇలవేల్పా నీ చూపు సోకితే చాలు కరుణ కురిపే అమ్మా చరణం 1: బంగారు తామరలో బాలగా దొరికినావే ఆకాశరాజు ఇంట ఆనందమైనావే నాగేటి చాలులోన నవ్వులు చిందినావే సిరులిచ్చు దేవతవై సిరివెలుగైనావే పల్లవి: అలివేలు మంగమ్మా.. అలరిన నవ్వులమ్మా చరణం 2: భృగుముని కోపమునకు అలిగి వచ్చినావే స్వర్ణముఖి తీరమున తపము చేసినావే పంచమి నాడు వచ్చి పద్మమై పూసినావే శ్రీనివాసుని మనసు దోచిన రాణివమ్మా చరణం 3: నీ కనుల కాంతిలో కరుణే ఉన్నదమ్మా నీ కరము చాపితేనే కష్టాలు తీరునమ్మా అప్పుల బాధలన్నీ తీర్చే అమ్మవమ్మా అలమేలు మంగమ్మా మా ఇంట నిలువమ్మా ముగింపు: తిరుమల స్వామి కన్నా ముందు నిన్ను చూస్తే చాలు జన్మ జన్మ పుణ్యమంతా ఒకటై చేరునమ్మా ఓం శ్రీ పద్మావతీ.. అలివేలు మంగమ్మా మా గుండెల్లో కొలువై ఉండిపో అమ్మా ఓం శ్రీ పద్మావతియే నమః 🪷🙏🏻🪷 #తిరుచానూరు #అలివేలుమంగమ్మ #పద్మావతిఅమ్మవారు #తెలుసుకుందాం #శ్రీ అలివేలు మంగమ్మ 🚩 #అలివేలు మంగమ్మ అందాలు గోవిందా శ్రీ గోవిందా #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #పద్మావతి అమ్మవారు