ఎల్లో మీడియా.. 💥

P.Venkateswara Rao
605 views
2 days ago
జర్నలిజం ముసుగులో బ్రోకరిజం YSRCP హయాంలో అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక.. బాబు అప్పు చేస్తే రుణసమీకరణ.. *వారెవ్వా 💦💦💦 #ఎల్లో మీడియా.. 💥*
P.Venkateswara Rao
669 views
5 days ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఎల్లో మీడియా.. 💥 *బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..‼️* August 9, 2026🎯 ఒక విరుద్ధ దృశ్యం… భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభసభలో చంద్రబాబు మోదీని ఆకాశానికెత్తేశాడు… అఫ్‌కోర్స్, పవన్ కల్యాణ్ పొగిడినా సరే, తనవెప్పుడూ చంచల, అస్థిర భాషణలు, విధేయతలే కాబట్టి వదిలేస్తే… దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, దేశముదురు చంద్రబాబు పొగడ్తలే మరీ ‘అతి’గా అనిపించాయి చాలామందికి… సరే, ఎవరి బాష్యం వాళ్లు చెప్పుకున్నారు… మోదీ భార్యను కూడా ప్రస్తావించి ఎగతాళి చేసిన చంద్రబాబుకు తరువాత రోజుల్లో ‘తత్వం’ బోధపడి, దాదాపు కాళ్లబేరానికి వచ్చాడు… సరే, పొత్తు, ఫలించిన గెలుపు, మళ్లీ అధికారం, అదంతా వేరే కథ… వరుస దెబ్బలు, తలనొప్పులతో డీలాపడిన మోదీని ఆకాశానికెత్తడం ఎవరికో ఎందుకు..? సాక్షాత్తూ చంద్రబాబు వాయిస్ రాధాకృష్ణకే నచ్చడం లేదు పాపం… అందుకే నేటి తన తొలిపలుకు వ్యాసంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు… సరే, అంగారక గ్రహంలో జీవం ఉనికి అనే సబ్జెక్టు తీసుకున్నా సరే, తను అందులో కూడా జగన్‌ ప్రస్తావన తీసుకొచ్చి తిడతాడు కదా, ఇందులోనూ జగన్‌ను తీసుకొచ్చాడు… ఏమనీ అంటే..? ‘‘ప్రధాని మోదీ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటున్నాడనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి, అందుకని మోదీని చంద్రబాబు అతిగా పొగడటం జనానికి నచ్చడం లేదట… (రాధాకృష్ణకు నచ్చకపోతే ఏపీ ప్రజలకు నచ్చనట్టే లెక్క తన దృష్టిలో… దీన్నీ జెన్‌జీ భాషలో సంకుచితిజం అంటారు) … 2019 లో మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు తనతో సయోధ్యతో ఉన్నాడు సరే, ఇప్పుడు మోదీ బలహీనపడ్డాడు, ఇప్పుడు కూడా అదే సాగిలబాటు అవసరమాని తెలుగు ప్రజలు తెగ ఫీలయిపోతున్నారట… అంటే మోదీ బలంగా ఉంటే దోస్తీ, బలహీనపడితే దూరమా..? వావ్… రాధాకృష్ణ ‘అవకాశవాదం ఎలా వదిలేస్తావోయ్ బాబూ’ అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది… అంటే, చంద్రబాబూ, నీ ఒరిజినల్ వైఖరి వదిలేస్తున్నావా, ఎంత సిగ్గుచేటు, మన నిజతత్వం ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి..? అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలా ప్రశ్నిస్తున్నాడు… జగన్‌ మనిషిగా, పాలకుడిగా, పార్టీ అధినేతగా ఎలాంటివాడైనా సరే… తనకు ప్రాప్తకాలజ్ఞత ఉంది.., మోదీకి చంద్రబాబు నిజగుణం తెలుసు… అందుకే జగన్‌ను మోదీ దూరం చేసుకోడు… జగన్ మోదీ మీద తిరుగుబాటు జెండా ఎగరేయడు… ఇదే కదా, ఈమధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చింది… కాకపోతే దాన్ని జనసేన- ఢిల్లీ అమిత్ షా భేటీ అనే కల్పనాత్మక కథలో చెప్పడమే పెద్ద వివాదమై కూర్చుంది… చివరగా… కాక్రోచ్ పార్టీ రాజకీయాల్లోకి రావద్దనే నిర్ణయం భేష్ అంటాడు రాధాకృష్ణ… కేవలం విజిల్ బ్లోయర్‌లాగే ఉండాలట… జయప్రకాష్ నారాయణ, లక్ష్మినారాయణ దెబ్బతినడమే ఉదాహరణ అంటాడు… ఎందుకంటే..? ఏమో, జగన్, బాబు తప్ప వేరే ఆల్టర్నేట్ దిక్కులేని ఏపీలోకి కాక్రోచ్ పార్టీ జొరబడితే తన బాబుకే ప్రమాదం అనే భావన ఇది… అందుకే బొద్దింకలు సజీవంగా ఉండాలి, కానీ రాజకీయాల్లోకి రావద్దు..!!
P.Venkateswara Rao
590 views
10 days ago
#ఎల్లో మీడియా.. 💥 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *విశ్వ‌స‌నీయ‌త కోల్పోయిన టీడీపీ మీడియా…బాబుకు భారీ నష్టం❗* 04.08.2026🎯 మీడియా, టీడీపీని వేర్వేరుగా చూడ‌లేం. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు చేతిలోకి అధికారం, టీడీపీ వ‌చ్చాక…. మీడియాకు ప్రాధాన్యం పెరిగింది. మీడియాని అడ్డం పెట్టుకునే చంద్ర‌బాబు స‌గానికి పైగా ప‌నులు చ‌క్క‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. చంద్ర‌బాబు మ‌న‌సెరిగి, ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను మీడియానే టార్గెట్ చేస్తుంటుంది. అవి విప‌క్ష‌మైనా, స్వ‌ప‌క్ష‌మైనా స‌రే. అంతెందుకు, 1995లో ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి, అధికారాన్ని చంద్ర‌బాబు సొంతం చేసుకున్న త‌ర్వాత మీడియా తీరు ఏ రీతిలో సాగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్‌, ల‌క్ష్మిపార్వ‌తిపై నీచాతి నీచ రాత‌లు, కార్టూన్లు వేసిన ఘ‌న చ‌రిత్ర‌… ఇదే టీడీపీ మీడియాకు ద‌క్కుతుంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా పెద్ద‌న్న పాత్ర పోషించే, ఆ ప‌త్రిక ఎన్టీఆర్‌ను దిగంబ‌రంగా చిత్రీక‌రించ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తే, ఎన్టీఆర్ అయినా స‌రే వ‌దిలిపెట్టేది లేద‌ని స‌ద‌రు అనుకూల మీడియా అనేక సంద‌ర్భాల్లో నిరూపించుకుంది. ఎన్టీఆర్ చ‌నిపోయాక‌, రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా, ఆయ‌న విగ్ర‌హానికి, చిత్ర‌ప‌టానికి పూల దండ‌లు వేస్తూ, పూజ‌లు చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటుంది. అయితే సోష‌ల్ మీడియా రావ‌డం, అలాగే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాని ఎదుర్కొని రాజ‌కీయాలు చేయాలంటే, మ‌న‌కు ఒక మీడియా వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మ‌ని దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భావించారు. ఆ ఆలోచ‌న‌, రాజ‌కీయ అవ‌సరాల నుంచి “సాక్షి” పుట్టింది. ఆ ప‌త్రిక‌, చానెల్ ఏ మేర‌కు జ‌గ‌న్ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌నేది వేరే చ‌ర్చ‌. సోష‌ల్ మీడియా విస్తృతి పుణ్య‌మా అని టీడీపీ అనుకూల మీడియా విశ్వ‌స‌నీయత గాలిలో కొట్టుకుపోయింది. టీడీపీ మీడియా రాత‌ల వెనుక దురుద్దేశాల్ని ఎండ‌గ‌ట్ట‌డంలో సోష‌ల్ మీడియా పైచేయి సాధించింది. అలాగే ఆ ప‌త్రిక‌ల విశ్వ‌స‌నీయ‌త‌ను సోష‌ల్ మీడియా పూర్తిగా దెబ్బ‌కొట్టింద‌నేందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకుందాం. భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ ప‌త్రిక చేప‌ల‌కంచేరుకు చెందిన మైలిప‌ల్లి ఎల్లాజీ పేరుతో ఒక అభిప్రాయాన్ని ప్ర‌చురించింది. అయితే స‌ద‌రు వ్య‌క్తి మూడేళ్ల క్రితం చ‌నిపోయాడ‌ని, ఆయ‌న‌కు జ‌న‌సేన ఎమ్మెల్యే లోకం మాధ‌వి నివాళుల‌ర్పించే ఫొటోతో స‌హా సోష‌ల్ మీడియా బ‌య‌ట పెట్టింది. జీవించి లేని వ్య‌క్తి అభిప్రాయాన్ని కూడా టీడీపీ ప‌త్రిక ప్ర‌చురించ‌డాన్ని బ‌య‌ట పెట్ట‌డం ద్వారా, ఆ ప‌త్రిక పాఠ‌కులు సైతం అస‌హ్యించుకునే ప‌రిస్థితి. ఇదే ప‌త్రిక క‌ర్నూలు జిల్లా చిప్ప‌గిరి మండ‌లం నేమ‌క‌ల్లులో టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగితే, ఒక మ‌హిళ వ‌స్త్రాల‌ను ప్రతిప‌క్ష పార్టీ వారు చించేసి, దుశ్శాస‌న ప‌ర్వానికి తెర‌లేపారంటూ గ‌గ్గోలు పెడుతూ రాసింది. కానీ నిజ‌మేంటో సోష‌ల్ మీడియా బ‌య‌ట పెట్టి, టీడీపీ ప‌త్రిక రాత‌ల్లోని డొల్ల‌త‌నాన్ని, ప్ర‌తిప‌క్ష పార్టీని బ‌ద్నాం చేయాల‌న్న కుట్ర‌ను బ‌య‌ట‌పెట్ట‌డం గ‌మ‌నార్హం. టీడీపీ కార్య‌క‌ర్త నాగ‌రాజు …పోలీసులు చూస్తుండ‌గానే త‌న భార్య నైటీని చించేశాడు. ఆ నింద‌ను వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, అలాగే కార్య‌క‌ర్త‌ల‌పై వేసి, రాజ‌కీయంగా బ‌ద్నాం చేసేందుకు కుట్ర‌ప‌న్నాడ‌ని … వీడియో సాక్షిగా వాస్త‌వం బ‌య‌ట ప‌డింది. ఇప్పుడు ఏమీ తెలియ‌న‌ట్టు ఆ ప‌త్రిక మిన్న‌కుండిపోయింది. కానీ సోష‌ల్ మీడియాలో స‌ద‌రు వీడియోని షేర్ చేస్తూ, త‌ప్పుడు రాత‌లు, అలాగే అక్ర‌మ కేసు బ‌నాయించ‌డాన్ని తూర్పార‌ప‌డుతున్నారు. గుంటూరులో ఒక మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి, తీవ్రంగా కొట్టి, తిట్టి…గ‌తంలో ఎప్పుడూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌ని దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. కానీ ఇదే టీడీపీ గెజిట్ ప‌త్రిక‌గా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌త్రిక లోపలి పేజీల్లో చిన్న వార్త‌ను ప్ర‌చురించింది. జ‌నానికి తెలియ‌కూడ‌ద‌ని జాగ్ర‌త్త ప‌డింది. దీనికి కార‌ణం… దుశ్శాస‌న ప‌ర్వానికి పాల్ప‌డింది టీడీపీ నాయ‌కుడు కావ‌డ‌మే. మ‌రో అనుకూల ప‌త్రిక అస‌లు ఆ సంఘ‌ట‌నే జ‌ర‌గ‌న‌ట్టు ఎలాంటి వార్త రాయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కువ‌గా బ‌ద్నాం అయ్యిందెవ‌రంటే, టీడీపీ మీడియానే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆరాధించే నాయ‌కుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం 50 శాతం ప‌ని చేసినా, క‌నీసం ప్ర‌జ‌ల త‌ర‌పున మీడియా మిగిలిన 50 శాతం ప‌ని చేస్తుంటే, ఇవాళ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చేది కాదు. జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల్ని పూర్తిగా వ‌దిలేసి, కేవ‌లం టీడీపీ, చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, ప్ర‌జ‌ల గోడు ప‌ట్ట‌ద‌నే రీతిలో స‌ద‌రు మీడియా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకు ఎన్నైనా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పొచ్చు. ఇటీవ‌ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, పీవీ సునీల్‌కుమార్‌లు… టీడీపీ అనుకూల మీడియా వికృత ధోర‌ణుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వారి ఎక్స్ ఖాతాల్లో పోస్టులు, వీడియోల‌ను చూస్తే, క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్ప‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హీరోయిన్ల‌తో సంబంధాలు అంట‌క‌ట్టి, డిబేట్ల‌ను నిర్వ‌హించిన నీచ చ‌రిత్ర టీడీపీ మీడియాకే ద‌క్కుతుంది. అందుకే వాటిని మీడియా హౌస్‌లుగా కాకుండా, కలేబ రాల నీ కేంద్రాల‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి అభివ‌ర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మెడిక‌ల్ క‌ళాశాల‌ల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ, వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, క‌నీసం చిన్న ఫొటో, సింగిల్ కాల‌మ్ వార్త‌ను క్యారీ చేయ‌డానికి కూడా మ‌న‌సురాలేదు. టీడీపీ మీడియా ధోర‌ణి చూస్తే, ఒక విష‌యం గుర్తుకొస్తుంది. వెనుక‌టికి ఒక కోడి పుంజు, తాను కూత కూయందే తెల్ల‌వార‌ద‌ని అనుకునేద‌ట‌. టీడీపీ మీడియా తీరు కూడా అట్లే వుంది. తాను రాయ‌క‌పోతే , స‌మాజానికి ఏ స‌మాచారం తెలియ‌ద‌నే భ్ర‌మ‌లో వుంది. అలాగే తాను రాసిందే వార్త అనే మ‌త్తులో వుంది. అలాంటి అభిప్రాయాల‌కు కాలం చెల్లింద‌ని ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే, అంత మంచిది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మీడియా ఒంటెత్తు పోక‌డ‌ల‌తో జ‌నం విసిగి పోయారు. తెలంగాణ‌లో నేరుగా ఆ మీడియాకు హెచ్చ‌రిక‌లు చేస్తుండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇటీవ‌ల ఢిల్లీలో జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద గోదీ మీడియాను జెన్ జీ త‌రం ఏ ర‌కంగా అవ‌హేళ‌న చేసిందో చూశాం. గోదీ మీడియాకి మించి, తెలుగు స‌మాజంలో టీడీపీ మీడియా వ్య‌వ‌హారాలున్నాయి. వైసీపీని గ‌ద్దె దించ‌డం టీడీపీ కంటే త‌మ‌పైనే ఎక్కువ బాధ్య‌త వున్న‌ట్టు ఆ పార్టీ మీడియా వికృత రాత‌లు రాస్తోంద‌న్న విమ‌ర్శ వుంది. చంద్ర‌బాబు వ్య‌తిరేకిస్తే, బీజేపీ, మోదీ, అమిత్‌షాల‌పై విషం క‌క్క‌డాన్ని 2019కి ముందు చూశాం. అయితే చంద్ర‌బాబుపై అంధ‌భ‌క్తితో విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయిన సంగ‌తిని టీడీపీ మీడియా విస్మ‌రించింది. ఇంకా సోష‌ల్ మీడియా రాక ముందు వ్య‌వ‌హారాల్నే కొన‌సాగిస్తోంది. అందుకే రోజురోజుకూ స‌ద‌రు మీడియా అభాసుపాల‌వుతోంది. ఈ కార‌ణంగానే జ‌నాలు ప‌ట్టించుకోని ప‌రిస్థితి. వ్య‌క్తిత్వం, గౌర‌వం లేని వారికి సమాజంలో విలువ ఉండ‌న‌ట్టే, విశ్వ‌స‌నీయ‌త కోల్పోయిన మీడియాగా త‌మ రాత‌ల‌కు అలాంటి స్థాన‌మే వుంటుంద‌ని గుర్తిస్తే మంచిది. ఇప్పుడీ మీడియా త‌ప్పుల‌న్నీ టీడీపీకి భారంగా మారాయనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.
P.Venkateswara Rao
618 views
2 months ago
#ఎల్లో మీడియా.. 💥 *బాబును ఏమీ అనలేడు- పవన్‌ ను తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…💥* June 7, 2026✍🏻 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంత పాతవిషయాల్ని తన కొత్త పలుకులో రాసుకొచ్చినా సరే… ప్రపంచంలోని ఏ విషయాన్నయినా సరే తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తుంటాడు… అఫ్‌కోర్స్, సాక్షిలో వర్దెల్లి మురళి కూడా ప్రతి దాన్నీ చంద్రబాబు దగ్గరకు తీసుకొస్తుంటాడు… సరే, ఇద్దరివీ రాజకీయ ప్రేరిత వ్యాసాలే కదా… నిష్పాక్షికతను ఆశించలేం, చూడలేం, ఉండవు కూడా… ఈరోజు రాధాకృష్ణ ఇటీవల నాగేశ్వర్- పవన్ కల్యాణ్ వివాదంలోకి జగన్‌ను తీసుకొచ్చాడు… నిజానికి పవన్ కల్యాణ్‌, చంద్రబాబు తెలంగాణ వనరుల్ని దోచుకోలేదనీ, అలా దోచుకున్న వైఎస్‌ను, జగన్‌ను మాత్రం తెలంగాణవాదులు ఏమీ అనడం లేదని బాధపడిపోయాడు పాపం… ఇక్కడ తనకు ఓ క్లారిటీ కావాలి, ఉంది, ఈ వ్యాసంలోనూ అది కనిపించింది, కానీ మళ్లీ ఏదోరకంగా జగన్ మీద వ్యతిరేకతను, తన కూటమే కాబట్టి చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను ఏమీ అనడు… పవన్ కల్యాణ్ భాష ‘ఎవడబ్బ జాగీరు’ ప్రస్తావన ఏది వ్యాసంలో..? తెలంగాణవాదం ఆది నుంచీ ఆంధ్రుల దోపిడీ మీద మాత్రమే కాదు… స్వరాష్ట్ర సాధన, స్వపరిపాలన కోసం… ఎవరు హైదరాబాదు, తెలంగాణల్లో బతికినా తెలంగాణ భూమిపుత్రులకు వ్యతిరేకత లేదు, ఆహ్వానిస్తారు, అక్కున చేర్చుకుంటారు… ఎటొచ్చీ ఒక చంద్రబాబు, ఒక పవన్ కల్యాణ్ రాష్ట్రం విడిపోయి పుష్కరమైనా ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాలి, పోటీచేయాలి, గెలవాలి, మళ్లీ తెలంగాణ మీద పెత్తనం రావాలని కోరుకోవడంతోనే వస్తోంది సమస్య… రాధాకృష్ణకు అది తెలుసు… అందుకే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండండి అని హితవు పలికాడు… కానీ ఇటీవల వివాదంలో తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం విశ్లేషించలేకపోయాడు… ఎందుకంటే, ఇందులో క్రెడిబులిటీ కోల్పోయి, తీవ్ర విమర్శల పాలైన నాగేశ్వర్‌ది ఎంత తప్పుందో పవన్ కల్యాణ్‌ది అంతకన్నా ఎక్కువ తప్పుంది…అభిప్రాయాలు ఆయనేదో రాశాడు, ఏపీలో కేసులు పడ్డయ్, నాగేశ్వర్‌కు అనుకూలంగా తెలంగాణవాదులు కొందరు నిలబడ్డారు… దాంతో పవన్ కల్యాణ్‌కు కోపమొచ్చింది… సరిగ్గా రాష్ట్ర అవతరణ దినంరోజే మీటింగు తలపెట్టాడు, తప్పు… ప్రభుత్వం, పోలీసులు, చివరకు కోర్టు కూడా వద్దంది… కానీ ఎలాగోలా గోకాలని ప్రెస్ మీట్ పెట్టాడు… ఎవడబ్బ జాగీరు, వస్తా, ఎన్నికల్లో పోటీచేస్తా, తిరుగుతా అని ఏదేదో మాట్లాడాడు… అక్కడొచ్చింది సమస్య… మళ్లీ ఈ ఆంధ్రుడి రాజకీయం, పెత్తనం ఏమిటనే ఏవగింపు, వ్యతిరేకత తెలంగాణలో ప్రబలింది… పైగా పవన్ కల్యాణ్ గతంలో కూడా పోటీచేశాడు, భంగపడ్డాడు, ఐనా ఏదో సాధిస్తాడట, ఉద్దరిస్తాడట… అందుకే ఈ వ్యతిరేకత… ఇవేమీ రాధాకృష్ణ రాయడు, రాయలేదు… కారణం, చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి కాబట్టి..! పైగా ఈ వివాదంతో సంబంధం లేని ‘ప్రత్యక్ష’ సంబంధం లేని జగన్‌ను ఇందులోకి లాక్కొచ్చాడు… ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యానిస్తున్నట్టు పవన్ కల్యాణ్ కూతల వెనుక వ్యూహాల్లేవు, ఎవరూ లేరు… అది తన మూర్ఖ వ్యవహారమే… అది తనకూ తెలిసొచ్చింది తరువాత… తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పెరిగితే బీఆర్‌ఎస్‌కు లాభం అంటాడు రాధాకృష్ణ… ఆరోజులు పోయాయి మాస్టారూ… తెలంగాణ జోలికొస్తే తెలంగాణ తిరగబడుతుంది, రాజకీయాలు- ఎన్నికలు వచ్చేసరికి పార్టీల నడుమ పోరు సమీకరణాలు వేరుగానే ఉంటాయి… బీజేపీ- బీఆర్ఎస్- కాంగ్రెస్… ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్లస్‌లో ఉంది, బీఆర్ఎస్ ఇంకా పాత పరాభవాల నుంచి తేరుకోలేకపోతోంది… బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఎదగలేకపోతోంది… సో, రేవంత్ రెడ్డి అంటే పడని కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తివాదులు, వ్యతిరేకులు కావాలనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి, మరింత గోకారనే రాధాకృష్ణ విశ్లేషణ అంతగా కన్విన్సింగుగా లేదు, ఐతే అది కాంగ్రెస్… అంతర్గత కుమ్ములాటలు సహజం… ఐనా బీఆర్ఎస్‌కు తెలంగాణ సెంటిమెంట్ నిజంగా కలిసొచ్చే పక్షంలో అది పొన్నం ప్రభాకర్‌కు కూడా నష్టమే కదా, ఆమాత్రం తెలియదా తనకు..? తెలుసనే విషయం రాధాకృష్ణకు తెలియదా..?! ఎవడబ్బ జాగీరు వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమనేసరికి… పవన్ కల్యాణ్‌కు తత్వం బోధపడి, ప్చ్, మా ఏపీలో కులకొట్లాటలు తప్ప ఈ చైతన్యం, ఈ సంఘీభావం, ఈ ఉద్వేగాలు లేవు అని బాధపడ్డాడు… ఐనా తనలోని అసలు పవన్ కల్యాణ్ ఊరుకోడు కదా… తెలంగాణ భూమిపుత్రుల్నే పోటీలో పెడతాను అని మరో వెటకారం… ఆంధ్రా పెత్తందారు చంకలో చేరిన భూమిపుత్రులను కూడా తెలంగాణ సమాజం సహించదు. అదొక్కటీ పవన్ కల్యాణ్‌కు అర్థం కావాల్సిన అసలు తత్వం… కాళోజీ అంటాడు… “దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణం తోనే పాతర వేస్తం” అందుకే రాధాకృష్ణ వ్యాసం తన రాజకీయ అనుకూల వాసనలకు లోబడి, జగన్ వ్యతిరేక భావనలకు లోబడి, ఏమాత్రం లోతు లేకుండా… పెరిఫెరల్‌గా… ఆత్మ లేకుండా తోకపటాకులాగా తుస్సుమంది…
P.Venkateswara Rao
576 views
3 months ago
#ఎల్లో మీడియా.. 💥 రామోజీ ప్రతిష్టను కాపాడిన తమిళనాడు , బెంగాల్ ఎన్నికలు...‼️ అది ఎలా అంటారా..? మార్గదర్శి కి సంబంధించి... న్యాయస్థానంలో వాదనల సందర్భంగా ...రామోజీ మరణించారు కాబట్టి ఈ కేసులో తదుపరి విచారణ ఆపాలని మార్గదర్శి తరపున న్యాయవాదులు వాదించగా... అలా అయితే రామోజీ ఆస్తులను అటాచ్ చేసి ప్రజలకు పంచి పెడతాం ..అని గౌరవ న్యాయస్థానం అదిరిపోయే సమాధానం ఇచ్చింది.. దీంతో మార్గదర్శి తరపున వాదించిన న్యాయవాదులతో పాటుగా మార్గదర్శి యాజమాన్యం కూడా బిత్తర పోయింది అయితే.... తమిళనాడు , బెంగాల్ ఎన్నికల ఫలితాలపై , వాటి విశ్లేషణలపై అందరూ దృష్టి కేంద్రీకరించడం తో "మార్గదర్శికి గట్టిగా న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడిన విషయం".... పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు ..! ఈ విధంగా... తమిళనాడు బెంగాల్ ఎన్నికలు.... మార్గదర్శి పరువును కాపాడాయని చెప్పవచ్చు..! ఈ ఎన్నికల లు జరగకపోయి ఉంటే... కొన్ని దశాబ్దాల తరబడి రామోజీ... తన మీడియా ద్వారా వైయస్సార్ పైన , ఆయన తనయుడు పైన , ఆయన కుటుంబం పైన పదేపదే బురద జల్లుతూ వికృతంగా వార్తలను రాసినందుకు.... బదులుగా ఇప్పుడు మార్గదర్శికి ముట్టికాయలు పడిన సందర్భాన్ని .. ఒక పెద్ద అస్త్రంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు ఉపయోగించుకొని.... రామోజీ అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడేవని పలువురు అంటున్నారు...! #MargadarsiScam
P.Venkateswara Rao
626 views
3 months ago
#ఎల్లో మీడియా.. 💥 *ఏబీఎన్ రాధాకృష్ణకు సూటి ప్రశ్న...* మొన్నటికి మొన్న మంత్రుల విదేశీ పర్యటనలపై మీరు రాసిన వార్త ఇది.. "అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేశాం. అప్పు పుట్టకపోతే బండి ఆగిపోతుంది! దుబారాలు తగ్గించాలి. ఒక్కో రూపాయి ఆచితూచి ఖర్చుపెట్టాలి! మొత్తంగా చూస్తే... మింగ మెతుకు లేదు! కానీ... మంత్రులకు సింగపూర్ ట్రిప్పు! ఎందు కయ్యా సామీ అంటే... అక్కడ వాళ్లు వారంరోజులు శిక్షణ పొంది... ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తారట! అంటే... ట్రైనర్స్ టు ట్రైనర్స్! ఏమయ్యా దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం అంటే... పెద్ద ప్రశ్నార్థకమే సమాధానం " అని మీరు చక్కగా రాశారు... ఇప్పుడు... అమరావతిలో కొన్ని భవనాలకు అద్దాల కోసం...2,500 కోట్లను కేటాయించారట.. దీనిపై మీరు ఒక వార్త రాయగలరా..? "ఒకవైపు ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేసాం ...మరొకవైపున నాడు నేడు పనులు ఆగిపోయాయి , మెడికల్ కాలేజీ ల నిర్మాణం ఆగిపోయింది , ఆరోగ్యశ్రీ ,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు , ఇటువంటి సమయంలో అమరావతిలో అద్దాల మేడలకు ఇంత భారీ వ్యయం పెట్టడం అవసరమా...? ప్రజలకు విద్య వైద్యం అందించకుండా.. ఎక్కడో అద్దాల మేడలు కడితే దాని వలన ఎవడికి ఉపయోగం..?" అని.... ఒక వార్త రాయగలరా...? Note :- మీకు దమ్ముంటే.... మీరు చేస్తున్నది జర్నలిజం అయితే..సుమీ....? శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
P.Venkateswara Rao
585 views
3 months ago
#ఎల్లో మీడియా.. 💥 MLA గా కూడా జగన్ విఫలం అని వైసీపీ ముఖ్య నేతలు ఆవేదన చెందుతున్నారు. -చంద్ర జ్యోతి Apr 26 2026 మరి ఒంటరిగా పోటీ చేయమని సలహా ఇవ్వకపోయావా మీ బాబుకు మీ పార్టీకి జనం మద్దతు లేకే కదా పొత్తులు పెట్టుకొంది బొంకరా బొంకరా పోలిగా అంటే ... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ABN బాధాకృష్ణ లాంటోడు తుపాకీ లేకపోయినా లపాకి కావాలన్నట్టుగా ఉంది ABN బాధాకృష్ణ తీరు (మనోడు మన పార్టీ అని ఇంత దిగజారి ఎర్నలిజం చేయాలా అని ABN లో ఇతర వర్గాలకు చెందిన కొంతమంది ముక్కులు చీదరించుకొంటున్నారు )
P.Venkateswara Rao
600 views
3 months ago
#ఎల్లో మీడియా.. 💥 రాధాకృష్ణ గారూ... ఏమయ్యింది మీకు...? మనవాళ్లు షికార్లకు వెళితే ఒప్పు.... వేరే వాళ్ళు షికార్లకు వెళితే తప్పా ...? గతంలో పెదబాబు , చినబాబులు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు వారికి... జాకీలు పెడుతూ వార్తలు రాశారు కదా...? అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు గుర్తు లేదా...? ఇప్పుడు మంత్రులు విదేశీ పర్యటనకు వెళితే ... దీనిని ఎందుకు తప్పుపడుతున్నారు...? అప్పట్లో కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా..? మరి... అప్పట్లో ఇలాంటి వార్తలు ఎందుకు రాయలేదు..? 1) మింగ మెతుకు లేదు.... కానీ... మంత్రులకు సింగపూర్ ట్రిప్పు..! ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఈ సమయంలో... మంత్రులు సింగపూర్ వెళ్లడం అవసరమా...? అక్కడకు వెళ్లి ఏమి నేర్చుకుంటారు..? దీని వలన ఏమి ఉపయోగం..? అంటూ ఆంధ్ర జ్యోతి యజమాని రాధాకృష్ణ తీవ్రంగా మంత్రుల యాత్రను తప్పుపట్టారు (ఏప్రిల్ 25 , 2026 ) 2) గడ్డకట్టించే చలిలో... దావోస్ లో ప్రస్తుతం మైనస్ 8. డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. ఆ గడ్డకట్టేంత చలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన సాగిస్తోంది. బందంలోని సభ్యులంతా నాలు గైదు అంచెల దుస్తులను ధరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం రెండంచెల దుస్తులే ధరిస్తున్నారు. పైన కోటు కూడా చేసుకోవడం లేదు... అని మురిసిపోతూ రాధాకృష్ణ రాశాడు (జనవరి 17 , 2017 ) అంటే.... చినబాబు , పెదబాబు అమరావతి మాస్టర్ ప్లాన్లు , డిజైన్ల కోసం ప్రత్యేక విమానాల్లో సంవత్సరాల తరబడి ప్రజాధనాన్ని దుబారా చేస్తూ ...ఊరేగితే అప్పుడు నీకు కమ్మగా ఉందా..? ఇప్పుడు ....అనితమ్మ , అచ్చన్న , సత్య కుమార్ వంటి ఇతర వర్గాలకు చెందిన మంత్రులు విదేశీ పర్యటనకు వెళితే మీకు నచ్చలేదా...? అప్పుడు గుర్తుకు రాని దుబారా , రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... ఇప్పుడే మీకు గుర్తుకు వచ్చిందా..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మీకు నిజంగానే ఆందోళన ఉంటే... ఒకవైపు ఆరోగ్య శ్రీ కి నిధులు లేక , మరొకవైపు ఫీజు రీయంబర్స్మెంట్ కి నిధులు లేక , మెడికల్ కాలేజీలను కట్టడానికి డబ్బులు లేక సతమతమవుతున్న ఈ సమయంలో .... మనకు లక్ష ఎకరాలలో ... కొన్ని లక్షల కోట్లు తగలబెట్టి రాజధానిని కట్టడం అవసరమా ....? అని ఎందుకు మీరు వార్తలు రాయలేకపోతున్నారు..? శ్రీనివాస్ ఉత్తరాంధ్ర