#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు 📣 ఒక్క గుంటా పోనివ్వం 🎯
📌 శామీర్పేట్లో మహాధర్నా.. రేవంత్ సర్కార్కు హెచ్చరిక 💥
📢 మహాధర్నాలో బొమ్మరాశిపేట రైతులు, బీఆర్ఎస్ నాయకులు
🆘 నమ్మి ఓట్లేస్తే దొంగల్లా భూములు లూటీ చేస్తరా?
⚠️ రైతుల భూముల్ని 22ఏలో ఎందుకు చేర్చారు?
📌 70 ఏండ్ల రికార్డులు భూ భారతిలో ఎక్కవా?
బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు బనాయించినా గ్రామస్తుల నుంచి ఒక్క గుంట భూమిని పోనివ్వం అని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్మే చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ వచ్చిందంటే కబ్జా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నదంటేనే దోపిడీ జరుగుతుందన్న పేరును సార్థకం చేసుకొన్నదని విమర్శించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాశిపేటలోని 1,049 ఎకరాల భూమిని 22ఏ జాబితాలోకి రెవెన్యూ అధికారులు మార్చడాన్ని నిరసిస్తూ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రైతుల మహాధర్నాలో వారు పాల్గొని ప్రభుత్వ దుర్నీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.