నాగపంచమి

Sadhguru Telugu
29.9K వీక్షించారు
17 రోజుల క్రితం
గత 800 ఏళ్లలో మొట్టమొదటి నాగ ప్రతిష్ఠ The First Naga Consecration In 800 Years 2022 అక్టోబర్ 9న బెంగళూరులోని సద్గురు సన్నిధిలో జరిగిన నాగ ప్రతిష్ఠ నుండి దృశ్యాలు. ప్రతిష్ఠాపన 2022 అక్టోబర్ 9న ఆశ్వయుజ పౌర్ణమి రాత్రి జరిగింది. సద్గురు: 800 సంవత్సరాలకు పైగా సరైన నాగ ప్రతిష్ట ఎక్కడా జరగలేదు. ఎందుకు నాగా? దురదృష్టవశాత్తు, నాగా లేదా సర్పం అంటే, దాన్ని కేవలం పాకే జీవిగా చూస్తున్నారు. నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పాములను దుష్టశక్తులుగా కూడా పరిగణిస్తున్నారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మినహాయింపు లేకుండా - ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెసపొటోమియా, గ్రీస్, క్రీట్, మధ్య ఆసియా, చైనా ఇంకా నిస్సందేహంగా భారత్ మరియు ఆసియాలోని మిగిలిన ప్రాంతాలలో - సర్పం లేదా నాగ ఆరాధన వేల సంవత్సరాలుగా నాగరికత అభివృద్ధిలో విడదీయరాని భాగంగా ఉంది. కానీ గత 1500 సంవత్సరాలలో, ఈ నాగ ఆరాధన నిర్మూలనకు గురైంది. నాగ అనేది కేవలం ఆరాధన గురించి కాదు, ఇది కొత్త సంభావ్యతలను అందుబాటులోకి తేవడం గురించి. పాము, ముఖ్యంగా నాగుపాము యొక్క ప్రధాన లక్షణం దాని గ్రహణశక్తి. ఇది పాకే జీవి అని ప్రజలు భావించవచ్చు, కానీ శివుడు దానిని తన పాదాల వద్ద కాకుండా తన తల పక్కన పెట్టుకున్నాడు. అతను నాగాను తనతో సమానంగా చూస్తాడు. తద్వారా ఏం చెప్తున్నాడంటే, "గ్రహణశక్తి మరియు జ్ఞానంలో, అది నాతో సమానం" అని చెప్తున్నాడు. మరొక అంశం ఏమిటంటే, ఆధునిక విజ్ఞానం మానవ మెదడులో సరీసృప మెదడు ఉనికిని గుర్తించింది. ఈ సరీసృప మెదడు మన మనుగడ ప్రవృత్తులకు పునాది. ఈ ప్రపంచంలో మనం జీవించగలిగే సామర్థ్యం ప్రాథమికంగా ఈ సరీసృప మెదడు వల్లనే. నాగ మీ ఉనికి యొక్క ఆ కోణానికి సంబంధించినది, ఆ అంశాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా మీ మనుగడ ప్రక్రియ ఒక ఆట అవుతుంది. ప్రస్తుతం మానవ జీవితంలోని అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే, ప్రజలు కేవలం మనుగడ సాగించడానికే తమ మొత్తం జీవిత కాలాన్ని వెచ్చిస్తున్నారు. మానవ జీవితం జీవనోపాధి సంపాదించడం గురించి కాదు; దీని నుండి జీవితాన్ని నిర్మించుకోవడం గురించి. మీ మెదడులో వెయ్యో వంతు భాగం మెదడు ఉన్న పురుగులు మరియు కీటకాలు మనుగడ సాగించగలుగుతున్నాయి. అయితే, ఎంతో మేధస్సు, గ్రహణశక్తి మరియు అనుభవాల లోతు కలిగిన మనుషులు, దురదృష్టవశాత్తు తమ మొత్తం జీవితం జీవనోపాధి సంపాదించడం గురించే అని నమ్మేలా నూరిపోశారు. నాగా యొక్క ఉద్దేశ్యం జీవనోపాధి సంపాదించడం లేదా మనుగడ ప్రక్రియను చాలా సరళంగా, ఉత్సాహభరితంగా చేయడం, తద్వారా మీ మేధస్సును మీ ఆధ్యాత్మిక ఉన్నతికై వెచ్చించవచ్చు - ప్రస్తుతం మనకున్న పరిమితులను దాటి ముందుకెళ్ళేలా చేయడం. బెంగళూరులోని సద్గురు సన్నిధిలో నాగా యొక్క శక్తివంతమైన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందండి. నాగా అనుగ్రహాన్ని పొందటానికి, నాగ దోషాన్ని నివారించడానికి అలాగే పరిపూర్ణమైన శ్రేయస్సును పెంపొందించడానికి వివిధ అర్పణలు అందుబాటులో ఉన్నాయి. #sadhguru #SadhguruTelugu #life #nagpanchami #consecration
నా ప్రతి శ్వాస
573 వీక్షించారు
19 రోజుల క్రితం
నాగ పంచమి సందర్భంగా నాగేంద్రునికి ప్రత్యేక అలంకరణ నాగ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగేంద్ర స్వామివారిని పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాగేం ద్రుని దర్శనంతో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. ##నాగ పంచమి #భక్తి వార్తలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🪔శ్రావణ మాసం
PSV APPARAO
562 వీక్షించారు
20 రోజుల క్రితం
#సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #నాగ పంచమి *సర్ప రక్షకురాలు మానసాదేవి* త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి.. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తు న్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది. అందుకనే కాలసర్పదోష నివరణకు ఆ మాతను ప్రార్ధించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంప దలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. సర్ప రక్షకురాలు మాతా మానసాదేవి అన్న వాసుకి, ఆమెను జరత్కారువు అనే మహర్షి కిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు ఆస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమేజయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీ క్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. ఋత్వికుల మంత్ర పఠనంతో భూమండలంమీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠు డైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ. తండ్రి" బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపి వేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగల డని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన ఆస్తీకునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపి వేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్ప సంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణ మిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగి పోతాయి. సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది. బిల్వ పర్వతంపై ఆలయం హరిద్వార్ లోని బిల్వ పర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, సుందర దృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్ని ధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడు కోవాలి. అమ్మవారి అభీష్ఠంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*