🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳

12 Posts • 383K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
558 views 27 days ago
శని దోషాలను హరించే తిరునల్లారులో... దాగివున్న మహా నిధి "మరకత లింగం" ​హృదయంలో ఈశ్వరుడి ధ్యానంతో... ​పుదుచ్చేరి, కారైకాల్ సమీపంలో ఉన్న తిరునల్లారు దర్భారణ్యేశ్వర స్వామి దేవాలయం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శనీశ్వర భగవానుడే. కానీ, ఈ ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ అయిన దర్భారణ్యేశ్వరుని సన్నిధికి సమీపంలో, ముచుకుంద చక్రవర్తిచే ప్రతిష్ఠించబడిన ఒక అరుదైన "మరకత లింగం" (త్యాగరాజ సన్నిధి) ఉందనే విషయం చాలామందికి తెలియదు. ​ఈ లింగానికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలు ఇవిగో. ​ఇంద్రుడు ఇచ్చిన కానుక: దేవేంద్రునిచే పూజించబడి, ఆ తర్వాత ముచుకుంద చక్రవర్తికి బహుకరించబడిన అత్యంత పవిత్రమైన విడంగ లింగాలలో (స్వయంభూ లింగాలు) ఇది ఒకటి. ​అభిషేక అద్భుతం: ఈ మరకత లింగానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా, ఈ లింగానికి చేసే 'పన్నీటి అభిషేకం' ఎంతో ప్రసిద్ధి చెందింది. మరకత శిలపై పన్నీరు జారి పడేటప్పుడు కలిగే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ (కంపనాలు) మానసిక ఒత్తిడిని, ఆందోళనలను దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ​ప్రదోష పూజ మహిమ: ప్రదోష రోజుల్లో ఈ మరకత లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని చెబుతారు. ఏల్నాటి శని, అష్టమ శని వంటి శని దోషాల తీవ్రతను తగ్గించి, శుభప్రదమైన జీవితాన్ని ప్రసాదించే శక్తి ఈ పూజకు ఉంది. ​బుధ-శని కలయిక ఫలితం: తిరునల్లారు ప్రధానంగా శని క్షేత్రం అయినప్పటికీ, బుధునికి సంబంధించిన రత్నమైన మరకత (పచ్చ) లింగం ఇక్కడ కొలువై ఉండటం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక. ఈ లింగాన్ని పూజించడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగి, భారీ లాభాలు చేకూరుతాయని, అలాగే బుద్ధి కుశలత (తెలివితేటలు) పెరుగుతాయని నమ్మకం. ​తిరునల్లారు వెళ్లే భక్తులు కేవలం శని భగవానుడిని మాత్రమే దర్శించుకుని తిరిగి రాకుండా, గర్భగుడిలో కొలువై ఉన్న ఈ దివ్యమైన మరకత లింగాన్ని కూడా దర్శించుకుని, స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి! #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
13 likes
11 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views 3 months ago
கும்பகோணத்தில் எந்தெந்த கோயிலுக்குச் சென்றால் என்னென்ன பலன்கள் கிடைக்கும் என தகவல்கள்... கும்பகோணத்தை சுற்றினால் வாழ்க்கையில் அனைத்து செல்வங்களும் கிட்டும் என்பது ஐதீகம். கோவில் என்றாலே அனைவருக்கும் முதலில் நினைவுக்கு வருவது கும்பகோணம் தான். தமிழகத்தில் அதிகப்படியான கோயில்களை கொண்ட ஒரு மாநகரம் என்றால் அது கும்பகோணம் தான். இங்கு பல்வேறு விதமான கோவில்கள் உள்ளன. அதிலும் நவக்கிரகங்கள் கொண்ட கோவில்கள் மிகவும் அதிகம். அதிகப்படியானோர் இந்த பகுதிக்கு தோஷங்களை நீக்க மற்றும் திருமண தடைக்கு இலக்கு வேண்டி வருகின்றனர். இதனால் தான் இது கோவில் நகரம் என்று அழைக்கப்படுகிறது. இந்நிலையில் எந்த கோவிலுக்கு சென்றால் என்ன பலன் 🌹கும்பகோணம் திருக்கோயில்கள் "கருமுதல் சதாபிஷேகம்" வரை பலனடைய இந்த கோவில்களை மட்டும் வழிபட்டால் போதும்.* 🌹கரு உருவாக (புத்திரபாக்கியம்) - கருவளர்ச்சேரி. 🌹 கரு பாதுகாத்து சுகப்பிரசவம் பெற - திருக்கருக்காவூர். 🌹நோயற்ற வாழ்வு பெறுவதற்கு - வைத்தீஸ்வரன் கோவில். 🌹ஞானம் பெற - சுவாமிமலை. 🌹கல்வி மற்றும் கலைகள் வளர்ச்சிக்கு - கூத்தனூர். 🌹எடுத்த காரியம் வெற்றி மற்றும் மனதைரியம் கிடைக்க - பட்டீஸ்வரம். 🌹உயர் பதவியை அடைய - கும்பகோணம் பிரம்மன் கோயில். 🌹 செல்வம் பெறுவதற்கு - ஒப்பிலியப்பன் கோவில். 🌹கடன் நிவர்த்தி பெற - திருச்சேறை சரபரமேஸ்வரர். 🌹இழந்த செல்வத்தை மீண்டும் பெற - திருவிடைமருதூர் மகாலிங்கசுவாமி. 🌹பெண்கள் ருது ஆவதற்கும், ருது பிரச்சினைகள் தீர - கும்பகோணம் காசி விஸ்வநாதர் (நவ கன்னிகை). 🌹 திருமணத்தடைகள் நீங்க - திருமணஞ்சேரி. 🌹 நல்ல கணவனை அடைய - கும்பகோணம் ஆதி கும்பேஸ்வரர் மங்களாம்பிகை. 🌹 மனைவி, கணவன் ஒற்றுமை பெற - திருச்சத்திமுற்றம் குழந்தைபாக்கியத்திற்கு.இரட்டை லிங்கேஸ்வரர்.சென்னியமங்கலம்.திப்பிராஜபுரம் 🌹பில்லி சூனியம் செய்வினை நீக்க - அய்யாவாடி ஸ்ரீ பிரத்தியங்கிர தேவி. 🌹கோர்ட்டு வழக்குகளில் நியாயம் வெற்றியடைய - திருபுவனம் சரபேஸ்வரர். • பாவங்கள் அகல - கும்பகோணம் மகாமகத் திருக்குளத்தில் நீராடல். • எம பயம் நீங்க - ஸ்ரீ வாஞ்சியம். • நீண்ட ஆயுள் பெற - திருக்கடையூர். #తెలుసుకుందాం #అరుణాచల శివ 🙏 #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు
18 likes
17 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
734 views 5 months ago
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా శని శింగనాపూర్ ని చూద్దాం.🛕🚩 మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. యాగంటి..🛕🚩 ఆంధ్రప్రదేశ్ లోఇది ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు.. లేపాక్షి..🛕🚩 ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో లేపాక్షి వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు.. తంజావూరులో మిస్టరీ..🛕🚩 తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. పూరీజగన్నాథ్ ఆలయం..🛕🚩 పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు.. షోలాపూర్..🛕🚩 మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ.. అమ్రోహా..🛕🚩 ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు!! అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్ధం కాలేదు. ఇప్పటికి అవి మిస్టరీగానే ఉండిపోయాయి.... 🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #hindu temples
6 likes
7 shares