41 సంవత్సరాల సుదీర్ఘ పోలీసు సేవలకు ఘన సన్మానం
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్.
పోలీసు శాఖలో 41 సంవత్సరాల పాటు నిర్విరామంగా సేవలు అందించి శనివారం పదవీ విరమణ పొందుతున్న శివయ్య, సబ్ ఇన్స్పెక్టర్ – సిసిఎస్, మహబూబ్నగర్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో కానిస్టేబుల్గా సేవా ప్రయాణాన్ని ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగి 41 సంవత్సరాల సుదీర్ఘ సేవలను నిబద్ధత, క్రమశిక్షణతో పూర్తి చేయడం అత్యంత అభినందనీయమని కొనియాడారు.
ప్రజా సేవే ధ్యేయంగా, శాఖ పట్ల అంకితభావంతో పనిచేసిన శివయ్య గారి సేవలు యువ పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకుని ప్రతిరోజూ యోగ, ధ్యానం (మెడిటేషన్) వంటి అలవాట్లను పాటిస్తూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు.
పోలీసు శాఖలో సంపాదించిన అనుభవం, విలువలు జీవితాంతం దోహదపడతాయని పేర్కొంటూ, శివయ్య గారికి మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఈ క్రమంలో DTC DSP గిరి బాబు, AO రుక్మిణి భాయి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బాలరాజ, RI అడ్మిన్ కృష్ణయ్య, CC రామ్ రెడ్డి, ఆఫీస్ సూపెడెంట్స్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice
#📰 వార్తలు