Follow
Mahbubnagar Police
@mahbubnagarpolice
2,354
Posts
51,053
Followers
Mahbubnagar Police
587 views
10 days ago
పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి వారి సేవలను కొనియాడారు. పదవి విరమణ పొందిన అధికారులు భూపాల్ రెడ్డి, ఎస్‌ఐ-2, మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ – 37 సంవత్సరాల సేవ, సుదర్శన్ రెడ్డి, ఎస్‌ఐ (వి.ఆర్.) – 37 సంవత్సరాల సేవ, శ్రీనివాసులు, ఏఎస్‌ఐ, మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ – 35 సంవత్సరాల సేవ, ప్రభాకర్, పీసీ-563, మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్, 35 సంవత్సరాల సేవ చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన గొప్ప సేవ అని అన్నారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజానికి సేవ చేసే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. తమ విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన ఈ అధికారులు యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DSP రమణా రెడ్డి, AO రుక్మిణి భాయ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, RI అడ్మిన్ కృష్ణయ్య, RI HGs అశోక్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ లు మధు, అశోక్ శెట్టి, బాల్ రాజ్, అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
517 views
12 days ago
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బాలానగర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన బాలానగర్ SI నరేందర్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలానగర్ గ్రామంలో గ్రామస్థులకు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఎస్‌ఐ నరేందర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొని, ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతుల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, లోన్ యాప్‌ల ద్వారా జరిగే మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీలు, కేవైసీ అప్‌డేట్ పేరుతో జరిగే మోసాలు, సోషల్ మీడియా మరియు వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ మోసానికి గురైన వెంటనే గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, మొదటి గంటలోనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇలా వెంటనే స్పందించడం ద్వారా మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు లేదా పెట్టుబడి ఆఫర్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
466 views
16 days ago
వారం రోజుల ప్రత్యేక మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భారీగా ఎంవీ యాక్ట్ కేసులు నమోదు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలి – ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 19 జూలై 2026 నుండి 25 జూలై 2026 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వారం రోజులలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి: 1. సీట్ బెల్ట్ ధరించకపోవడం – 44 కేసులు – ₹8,800/- 2. మైనర్ డ్రైవింగ్ – 11 కేసులు – ₹5,500/- 3. డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) – 29 కేసులు – ₹75,000/- 4. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం – 61 కేసులు – ₹61,000/- 5. సౌండ్ పొల్యూషన్ / సైలెన్సర్ మార్పు – 9 కేసులు – ₹11,000/- 6. ట్రిపుల్ రైడింగ్ – 130 కేసులు – ₹1,56,000/- 7. హెల్మెట్ ధరించకపోవడం – 185 కేసులు – ₹31,700/- 8. రాంగ్ రూట్ డ్రైవింగ్ – 50 కేసులు – ₹60,000/- 9. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలపై 6 అవగాహన కార్యక్రమాలు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించరాదు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలు మీ భద్రత కోసమే. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా ప్రయాణించాలి." అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
514 views
18 days ago
498-ఏ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష – బాధిత మహిళకు న్యాయం చేసిన మహిళా పోలీసు స్టేషన్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్. మహబూబ్‌నగర్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో 2015లో నమోదు చేసిన సెక్షన్ 498-ఏ ఐపీసీ కేసులో నిందితులపై నేరం రుజువుకావడంతో బుధవారం మహబూబ్‌నగర్ గౌరవనీయ ప్రధాన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు శ్రీమతి కె.పావని వివాహం 11-12-2005న BC హాస్టల్, గొడ్లబండ, కొత్తకోట గ్రామము మరియు మండలం, వనపర్తి జిల్లా కి చెందిన కె.వెంకట్ రెడ్డితో జరిగింది. వివాహ సమయంలో రూ.1,50,000 నగదు కట్నంగా ఇచ్చినప్పటికీ, అనంతరం భర్త కె.వెంకట్ రెడ్డి, మామ కె.తిమ్మా రెడ్డి, అత్త వెంకటమ్మ కలిసి అదనపు కట్నం కోసం బాధితురాలిని శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు అక్రమ సంబంధం ఉందని ఆమెను అనుమానిస్తూ నిరంతరం హింసకు గురిచేశారు. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ, బాధితురాలి విద్యా సర్టిఫికెట్లను కూడా దహనం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ సభ్యులు కూడా బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించి, దుర్భాషలాడినట్లు విచారణలో తేలింది. ఈ వేధింపులను తట్టుకోలేక బాధితురాలు 16-06-2015న ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మహబూబ్‌నగర్ గౌరవనీయ ప్రధాన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి కె.మమతా రెడ్డి గారు నిందితులైన కె.వెంకట్ రెడ్డి మరియు కె.తిమ్మా రెడ్డిలను దోషులుగా నిర్ధారించి, ప్రతి ఒక్కరికీ ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష తో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఎస్.సైదయ్య, సీఐ (మహిళా పోలీస్ స్టేషన్), ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఎం.కృష్ణయ్య, APP శ్రీమతి జె.భార్గవి, కోర్టు డ్యూటీ అధికారి హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ముజీబ్ లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలపై గృహహింస, కట్న వేధింపులు వంటి నేరాలపై జిల్లా పోలీసులు రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులను శిక్షించే దిశగా కృషి కొనసాగిస్తామని తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
10.2K views
19 days ago
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం – యువతే సమాజానికి మార్గదర్శకులు: జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎస్‌వీఎస్ డెంటల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌వీఎస్ డెంటల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి అవగాహన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ప్రత్యేక అవగాహన వీడియోలను ప్రదర్శిస్తూ మాదకద్రవ్యాల బారిన పడిన వ్యక్తుల జీవితాలు ఎలా నాశనమవుతాయో, కుటుంబాలు, స్నేహితులు, సమాజంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో విద్యార్థులకు వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి గారు మాట్లాడుతూ యువత తమ భవిష్యత్తును నిర్మించుకునే కీలక దశలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా వ్యక్తి తన ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, విద్య, ఉపాధి అవకాశాలు, సమాజంలో గౌరవం వంటి అమూల్యమైన అంశాలను కోల్పోతాడని తెలిపారు. ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యతను స్వీకరించి, మరొకరికి కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా లేదా రవాణా చేస్తున్నా వెంటనే 1908 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారిని శిక్షించడం కాకుండా, అవసరమైతే డి-అడిక్షన్ సెంటర్లకు పంపించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే జూన్ 26, 2026న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఈగల్ ఫోర్స్ వారు నిర్వహించిన పోటీలలో పాల్గొన్న కళాశాల విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మరియు బ్రోన్జ్ మెడల్ అందజేయడమే కాకుండా ఈ పోటీలలో పాల్గొన్న మిగతా విద్యార్థినీ విద్యార్థులకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య ఐపీఎస్ గారి అప్రసియేషన్ లెటర్ మరియు యాంటీ డ్రగ్ సోల్జర్స్ సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎన్.బుచ్చయ్య, ఎస్‌వీఎస్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ దామోదర్ రెడ్డి, అధ్యాపకులు, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఈగల్ ఫోర్స్ సభ్యులు మరియు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
547 views
20 days ago
మోడిఫైడ్ సైలెన్సర్లు, మైనర్ల డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – మహబూబ్ నగర్ DSP వెంకటేశ్వర్లు హెచ్చరిక జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పట్టణం నందు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మరియు సిబ్బంది మంగళవారం మాడిఫైడ్ సైలెన్సర్లపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించుకుని అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టారు. అలాగే మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వీరందరినీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి DSP వెంకటేశ్వర్లు గారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా DSP వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని, ఇటువంటి వాహనాలను నడిపేవారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
479 views
23 days ago
5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎస్పీ కార్యాలయానికి పిలిపించి అభినందించిన జిల్లా ఎస్పీ "విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటడం అభినందనీయం" – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS ఇటీవల మల్కాజిగిరి కమిషనరేట్ నందు జరిగిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పతకాలు సాధించి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖకు విశిష్ట గుర్తింపు తీసుకువచ్చిన పోలీసు క్రీడాకారులను శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయానికి ప్రత్యేకంగా పిలిపించి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మహబూబ్‌నగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు. విధి నిర్వహణలో సమర్థతతో పాటు క్రీడల్లోనూ అంకితభావంతో రాణించడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందనలు తెలియజేసి, వారి విజయాలు ఇతర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ గారు అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు: - మహిళా పోలీస్ కానిస్టేబుల్ రాధిక WPC-2405 – ఆర్మ్ రెజ్లింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో మూడు బంగారు పతకాలు. - ఇమ్రాన్ ARHC-373 – బాడీ బిల్డింగ్ విభాగంలో రజత పతకం. - రాము PC-923, భూత్పూర్ పోలీస్ స్టేషన్ – యోగా విభాగంలో రజత పతకం. - షోయబుద్దీన్ PC-2366, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకం. వీరి విజయాలు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఎస్పీ గారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ NB రత్నం, AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DCRB డీఎస్పీ రమణా రెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. #📰 వార్తలు
Mahbubnagar Police
564 views
23 days ago
గౌరవ జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి IPS గారి ఆదేశాల మేరకు..., మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సద్దలగుండు ఏరియాలో గల మైనారిటీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో "సురక్ష పోలీసు కళాబృందం" వారి సామాజిక అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 2 టౌన్ ఎస్సై ఆచారి గారు మాట్లాడుతూ... బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి, విలువలతో కూడిన జీవన విధానంతో, క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల బారిన పడి ఎంతోమంది యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని, కొంతమంది యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను(Drugs) విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి నేరస్తులతో పాటు, మత్తు పదార్థాలను వినియోగించే వ్యక్తులకు చట్టపరమైన శిక్షలు తప్పవని, సమాజంలోని మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్.పి. శ్రీమతి డి.జానకి గారి సంకల్పాన్ని తెలియజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు అమ్మకాల సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్ కు గానీ, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712659360 కి గానీ లేదా 1908 మరియు drugfreembnr.police@gmail.com మెయిల్ కి సమాచారం ఇవ్వగలరని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్ లో లోన్ వచ్చిందని లేదా మీకు QR కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన యెడల నమ్మకండి. అది సైబర్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నంబర్ గానీ బ్యాంక్ కార్డ్స్ నంబర్ గానీ ఎవరికీ పంపవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి లేదా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360 కి లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు తమ ఆట పాటలతో విద్యార్థులను చైతన్యపరుస్తూ... బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరగుతున్నాయని, ఎవరూ బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఎవరైనా అలా చేయాలని ప్రయత్నించినచో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్-1098, 112 కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే యువత సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ..., మైనర్లు, లైసెన్సు లేనివారు, మద్యం తాగినవారు ఎలాంటి వాహనం నడపకూడదని, రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని మనందరం నివారించేందుకు కృషి చేద్దామని తెలిపారు. రకరకాల పద్దతులలో మాయమాటలు చెప్పి పిల్లలను, అమ్మాయిలను, యువతను, మహిళలను అక్రమ రవాణా చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానితులు ఉంటే వెంటనే సంబంధిత పోలీసులకు 8712680066 కు డయల్-100 లేదా SHE TEAM NO; 8712659365 కు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు. మన జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చి, ప్రజలు ముఖ్యంగా యువత, విద్యార్థులు, బాలబాలికలు గొప్పగా ఎదగాలన్న జిల్లా ఎస్.పి. శ్రీమతి డి.జానకి IPS గారి సంకల్పాన్ని, సందేశాన్ని పోలీసులు విద్యార్థులకు వినిపించారు. కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఏ ఎస్సైలు పోశెట్టి, శ్రీనివాసులు గౌడ్, పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, సురక్ష పోలీసు కళా బృందం సభ్యులు డి. రాములు(HC), డి. జగదీష్ (PC), బాల్ రాజ్(HG) మరియు విద్యార్థులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
507 views
24 days ago
మద్యం మత్తులో ఆటో నడిపిన డ్రైవర్‌కు 3 రోజుల జైలు శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్‌పై రాజీ లేదు – ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మరియు సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి ఆటో నడుపుతున్న ఓ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని శుక్రవారం సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్.శశిధర్ న్యాయస్థానంలో హాజరుపరచగా, విచారణ అనంతరం న్యాయస్థానం అతనికి 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రయాణికులను తరలించే ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు వంటి ప్యాసింజర్ వాహనాలను మద్యం మత్తులో నడపడం అత్యంత నిర్లక్ష్యపూరితమైన, తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
372 views
1 months ago
నంబర్ ప్లేట్ లేని, నిబంధనలకు విరుద్ధమైన వాహనాలపై మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు – అట్టి వాహనాలపై చర్యలు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలను శుక్రవారం మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు లేకుండా లేదా అస్పష్టంగా, కొన్ని అంకెలు తొలగించి తిరుగుతున్న వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనదారులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం ఆయా వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడం లేదా చైన్ స్నాచింగ్‌లు, ఇతర నేరాలకు పాల్పడినప్పుడు గుర్తింపు తప్పించుకునే ఉద్దేశంతో నంబర్ ప్లేట్లు లేకుండా లేదా నంబర్లను మార్పులు చేసి వాహనాలను నడుపుతున్నట్లు గుర్తిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి వాహనదారు తమ వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా కనిపించే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. "ప్రజల భద్రతే మా ధ్యేయం – ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం... రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం." #MahabubnagarPolice #📰 వార్తలు