గౌరవ జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి IPS గారి ఆదేశాల మేరకు...,
మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సద్దలగుండు ఏరియాలో గల మైనారిటీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో "సురక్ష పోలీసు కళాబృందం" వారి సామాజిక అవగాహనా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 2 టౌన్ ఎస్సై ఆచారి గారు మాట్లాడుతూ...
బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి, విలువలతో కూడిన జీవన విధానంతో, క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల బారిన పడి ఎంతోమంది యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని, కొంతమంది యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను(Drugs) విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి నేరస్తులతో పాటు, మత్తు పదార్థాలను వినియోగించే వ్యక్తులకు చట్టపరమైన శిక్షలు తప్పవని, సమాజంలోని మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్.పి. శ్రీమతి డి.జానకి గారి సంకల్పాన్ని తెలియజేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు అమ్మకాల సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్ కు గానీ, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712659360 కి గానీ లేదా 1908 మరియు drugfreembnr.police@gmail.com మెయిల్ కి సమాచారం ఇవ్వగలరని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు.
అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్ లో లోన్ వచ్చిందని లేదా మీకు QR కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన యెడల నమ్మకండి. అది సైబర్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నంబర్ గానీ బ్యాంక్ కార్డ్స్ నంబర్ గానీ ఎవరికీ పంపవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి లేదా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360 కి లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు తమ ఆట పాటలతో విద్యార్థులను చైతన్యపరుస్తూ...
బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరగుతున్నాయని, ఎవరూ బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఎవరైనా అలా చేయాలని ప్రయత్నించినచో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్-1098, 112 కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే యువత సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ...,
మైనర్లు, లైసెన్సు లేనివారు, మద్యం తాగినవారు ఎలాంటి వాహనం నడపకూడదని, రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని మనందరం నివారించేందుకు కృషి చేద్దామని తెలిపారు.
రకరకాల పద్దతులలో మాయమాటలు చెప్పి పిల్లలను, అమ్మాయిలను, యువతను, మహిళలను అక్రమ రవాణా చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానితులు ఉంటే వెంటనే సంబంధిత పోలీసులకు 8712680066 కు డయల్-100 లేదా SHE TEAM NO; 8712659365 కు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు.
మన జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చి, ప్రజలు ముఖ్యంగా యువత, విద్యార్థులు, బాలబాలికలు గొప్పగా ఎదగాలన్న జిల్లా ఎస్.పి. శ్రీమతి డి.జానకి IPS గారి సంకల్పాన్ని, సందేశాన్ని పోలీసులు విద్యార్థులకు వినిపించారు.
కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఏ ఎస్సైలు పోశెట్టి, శ్రీనివాసులు గౌడ్, పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు,
సురక్ష పోలీసు కళా బృందం సభ్యులు డి. రాములు(HC), డి. జగదీష్ (PC), బాల్ రాజ్(HG) మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice
#📰 వార్తలు