ఫాలో అవ్వండి
Mahbubnagar Police
@mahbubnagarpolice
2,317
పోస్ట్
51,019
ఫాలోవర్స్
Mahbubnagar Police
404 వీక్షించారు
10 రోజుల క్రితం
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా హన్వాడ మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహణ – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ పాల్గొన్నారు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని గురువారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజా భద్రత, నేర నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని పేర్కొంటూ, గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రేస్ డ్రైవింగ్, ఓవర్ లోడ్, రాంగ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) ప్రమాదకరమని హెచ్చరిస్తూ, డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలు మరియు మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహ, స్థానిక ఎంఆర్వో కిష్టయ్య నాయక్, హన్వాడ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, డిప్యూటీ ఎంఆర్వో వెంకటేశ్వర్లు, హన్వాడ గ్రామ సర్పంచ్ సుధాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, , గ్రామ కార్యదర్శి, పాలక వర్గ సభ్యులు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. #MahabubnagarPolice #ArriveAlive #📰 వార్తలు
Mahbubnagar Police
538 వీక్షించారు
12 రోజుల క్రితం
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ – రోడ్డు భద్రతపై కీలక సూచనలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు హాజరై ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఆటోలకు ట్రాఫిక్ నంబర్లు వేయించుకోవడం వల్ల డ్రైవర్లకు మరియు పోలీసులకు గుర్తింపు సులభమవుతుందని, ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులను సులభంగా గుర్తించి తిరిగి అందించవచ్చని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ వినియోగం చూపుపై ప్రభావం చూపి ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అధిక వేగంతో వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలను PPT ద్వారా వివరించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలని సూచించారు. అలాగే పార్కింగ్ మరియు బస్ స్టాండ్ ల వద్ద వాహనాలను సింగిల్ లైన్‌లో పార్క్ చేయాలని సూచించారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన ఆటో డ్రైవర్లకు కళ్లజోళ్లు త్వరలోనే కంటి పరీక్షలు రాగానే పంపిణీ చేయడం జారుతుంది. ఆటో డ్రైవర్లు మంచి పేరు సంపాదించుకుని, ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఎస్పీ గారు కోరారు. రోడ్డు భద్రత – మనందరి బాధ్యత సురక్షితంగా ప్రయాణిద్దాం - సురక్షితంగా గమ్యాన్ని చేరుదాం ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిబ్బందికి రెండు నెలల పాటు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు ముందుకు వచ్చిన “మునాఫ్ మిల్క్ పాయింట్” (విఎన్ఆర్ డెయిరీ) యజమాని మొహమ్మద్ మునాఫ్ గారిని జిల్లా ఎస్పీ గారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, బాల్య నాయక్,  100 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మరియు ఇతర ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. #📰 వార్తలు
Mahbubnagar Police
1.3K వీక్షించారు
17 రోజుల క్రితం
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు #MahabubnagarPolice #SriRamaNavami #📰 వార్తలు
Mahbubnagar Police
579 వీక్షించారు
17 రోజుల క్రితం
పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం పై దృష్టి – ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ప్రతి కేసు స్థితిగతులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో వేగం పెంచడంతో పాటు నాణ్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నితమైన ఎస్సీ/ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. నేరాల నివారణలో భాగంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి రోడ్డు భద్రతను కాపాడాలని ఎస్హెచ్‌వోలకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధుల్లో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డయల్-100 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని వారికి అండగా నిలవాలని సూచించారు. ప్రజల విశ్వాసం పెంపొందించే విధంగా పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (NB) రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణా రెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ, ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
442 వీక్షించారు
23 రోజుల క్రితం
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు #📰 వార్తలు