ఏపీ అప్ డేట్స్..📖

P.Venkateswara Rao
616 views
4 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 💥 #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *బాబు ఫ్యాన్స్ లో జగన్ ఫోబియా.. "పలుకు" రివర్స్ అయ్యింది❗* 13.04.2026🎯 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు 'మావిగన్' అనేది అత్యంత కీలకమైన అంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతికి చట్టబద్ధత దక్కింది అనే కూటమి నేతల సంబరాల నడుమ జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ పైనా, దానివల్ల కలిగే ఎక్కువ ప్రయోజనాలపైనా, అమరావతి నిర్మాణంతో పోలిస్తే దానికి అయ్యే తక్కువ ఖర్చుపైనా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ పత్రికాధిపతి రాసిన కొన్ని "పలుకు"లను రివర్స్ లో చంద్రబాబు & కో కి అప్లై చేస్తున్నారు నెటిజన్లు! 'మావిగన్' పై ఇప్పటికే తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు సన్నిహితులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ప్రచారంలో ఉన్న పత్రికాధిపతులతో పాటు మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా… మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ తెరపైకి వచ్చారు. అమరావతి - మావిగన్ పై తమదైనశైలిలో చాలా మంది ఊహించినట్లుగా స్పందించారు. మావిగన్ వ్యవహారంపై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు… జగన్ మావిగన్ వ్యాఖ్యలతో పెట్టుబడుదారులు అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతారని.. ఈ తరహా హెచ్చరిక ఇప్పటికే పెట్టుబడిదారుల్లోకి వెళ్లిపోయిందని.. దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. కాసేపు అదే నిజమని అనుకుంటే… మరి తనను చూసే అమరావతికి పెట్టుబడులు వస్తాయంటూ చెప్పుకునే చంద్రబాబు మార్క్ బ్రాండ్ సంగతేంటి? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అంటే చంద్రబాబు తన గురించి తన బ్రాండ్ గురించి చెప్పుకున్నవి.. ఓ వర్గం మీడియా అచ్చేసినవి.. లోకేష్ లాంటి యువ నేతలు చెప్పుకొచ్చినవి అన్నీ అవాస్తవాలేనా..? అనే ప్రశ్నా ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే… "వైఎస్ జగన్ మళ్లీ వస్తే..?" అనే ప్రశ్నను ముందు పెట్టి… "ప్రస్తుతం ఉన్న చంద్రబాబు బ్రాండ్" ని బద్నాం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు ఏబీ వెంకటేశ్వర రావు అని అంటున్నారు కొంతమంది తమ్ముళ్లు! చంద్రబాబు చెప్పారనో.. భజన బృందం వాయించిందనో.. బాకా ఛానళ్లు ఉదాయనో.. కర పత్రాలు అచ్చేశాయనో కాకుండా… లక్ష ఎకరాల్లో తాము, తమవారు కొన్న భూముల మధ్యనే అమరావతి రాజధాని ఉండాలని.. అందుకు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం అయినా వృథా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే మాటలకు.. పెట్టుబడి దారులైనా, సామాన్యులైనా విలువ ఇస్తారా..? ఆ మాటలను అసలు పరిగణలోకి తీసుకుంటారా..? అందుకేగా అమరావతికి పెట్టుబడులు రానిది..? ఆఖరికి హెరిటేజ్ సైతం తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నది..? అంటే… చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తాడనే నమ్మకం, రాజధానికి చట్టబద్ధత వచ్చిందనే ధీమా.. పెట్టుబడి దారుల్లో ఉంటే.. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? వాస్తవం ఏమిటంటే… చంద్రబాబు మళ్లీ వస్తారా..? లేదా..? అనే సంగతి కాసేపు పక్కనపెడితే… అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా రైతులను మురిపించగలిగారు తప్ప పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కలిగించలేకపోయారు! ఈ వివరాలు సరిగ్గా చెప్పలేకో.. చంద్రబాబును, అమరావతి భవిష్యత్తును పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదని అంగీకరించలేకో.. అమరావతి కంటే జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ కే ప్రజామద్ధతు రోజు రోజుకీ పెరుగుతుందన్న నిజాన్ని ఒప్పుకోలేకో.. పారిశ్రామికవేత్తలను జగన్ భయపెడుతున్నారంటూ ఏబీ వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను సెల్ఫ్ గోల్ అని ఒకరంటే.. ఆత్మవంచన అని మరికొందరు అంటున్నారు. ఇక మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ సైతం ఈ మావిగన్ అంశంపై మైకుల ముందుకు వచ్చారు.. తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా… మావిగన్ భావన కింద తీసుకున్న చర్యలు ఆవేశపూరితమైనవని, రాష్ట్ర భవిష్యత్తుకు నష్టదాయకమైనవని మొదలు పెట్టిన జయప్రకాష్ నారాయణ… ఆ విధానాలను "తుగ్లక్" చర్యతో పోల్చడం గమనార్హం. అక్కడితో ఆగని జేపీ… ఇది ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి, రాజధాని అభివృద్ధికి నష్టం కలిగిస్తుందని విమర్శిస్తూ… రాజధానులను మార్చే ఈ విధానం రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో జేపీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన తరహా మేధావులూ, నెటిజన్లు. ఇందులో భాగంగా… సుమారు లక్ష ఎకరాల్లో, రెండు మూడు పంటలు పండే ప్రాంతంలో, వర్షాకాలం వస్తే.. వచ్చే నీరు, తోడే నీరు అన్నట్లుగా ఉన్న భూముల్లో.. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం వస్తుందా.. లేక, ఇప్పటికే పోర్టు, ఎయిర్ పోర్టు, రైల్వే జోన్, నేషనల్ హైవేలతో ప్రపంచానికి అద్భుతమైన కనెక్టివిటీ ఉన్న కారిడార్ ను రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రానికి ఆర్ధిక నష్టం వాటిల్లుతుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం జేపీ లాంటి మేధావులకు, మాజీ ఐఏఎస్ అధికారికి తెలియంది కాదు కదా..? ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను వదిలిపెట్టి… పంటలు పండే భూములను సేకరిస్తూ.. పైగా వాటిని రైతుల త్యాగాలుగా అభివర్ణిస్తూ.. వారిని త్రిశంకు స్వర్గంలో పెట్టి.. సుమారు లక్ష ఎకరాల్లో కొన్ని లక్షల కోట్లతో నవ నగరాలు నిర్మిస్తానని చెప్పడాన్ని మహ్మద్ బీన్ "తుగ్లక్" చర్య అంటారా..?.. లేక, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను కలుపుతూ, ఆ కారిడార్ మొత్తాన్ని రాజధానిగా ఆలోచించి, రెట్టింపు అభివృద్ధి దిశగా ఆలోచన చేయడాన్ని "తుగ్లక్" చర్య అంటారా..? చరిత్ర పుస్తకాలు చదువుకున్న జేపీకి తెలియంది కాదు కదా? కాకపొతే ఈసారి కాకరకాయ కాస్త కీకరకాయ అయ్యిందని సరిపెట్టుకోవాలి..! ఏది ఏమైనా… అటు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు "బెదిరింపులు" అంటూ ఆందోళన వ్యక్తం చేసినా.. ఇటు మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ "తుగ్లక్" చర్యగా అభివర్ణించినా.. రేపు మరో ఐ.ఎఫ్.ఎస్. అధికారి ఇంకో రకంగా వివరించినా.. వారు చెప్పేది ఏమిటంటే… ఎంతకాలమైనా, ఎన్ని లక్షల కోట్లైనా, ఎంత మంది రైతులు చకోర పక్షిలా ఆకాశంవైపు చూసినా.. అమరావతే ముద్దు - మరో మాట వద్దు అన్నమాట!! మరి గ్రాఫిక్స్ లకు రివ్యూలే తప్ప, ఆచరణాత్మక చర్యలతో వీరికి అవసరం లేదా..? సమాజం ఏమైపోయినా.. వీరి స్నేహాలు, వీరి శ్రేయోభిలాషులు, వారి వారి ఆర్థిక సామర్థ్యాలు, పెట్టుబడులకు లాభాల ఫలాలు మాత్రమే ముఖ్యమా..? అలాంటప్పుడు ఆయా పార్టీల కండువాలు కప్పేసుకుని "తందాన తాన" అంటే సరిపోతుందిగా..? మేధావులు, న్యూట్రల్ విశ్లేషణల మాటున ఈ ముసుగు మాటలేలా..? జనాలు ఏమంటారు, ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారు అనేది ఈ ముసుగు మేధావులకు అవసరం లేదా..? ఆ జనాల్లోనూ ఓ వర్గం జనాల అభిప్రాయమే వీరికి ముఖ్యమా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు వారి వారి అంతరాత్మలకు తెలియంది కాదు..!! కాకపోతే ఈ వాస్తవాలన్నీ జనాలంతా ఇప్పటికైనా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది..! ఇదంతా గమనించినవారు మాత్రం… "చంద్రబాబు పందిని చూపి నంది అంటే అదే నిజమని, నందిని చూపి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్లు ఆయన చుట్టూ పుష్కలంగా ఉన్నారని.. ఆయన పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ల సంఖ్య తగ్గిపోతోందని.. ఆ నాయకులకు తోడు పచ్చ (సోషల్) మీడియా బ్యాచ్‌ ఉండనే ఉందని.. ఇప్పటికీ అమరావతే ప్రధానం, దానికి మరో 50 వేల ఎకరాలు మీరు చేయాలి దారాదత్తం.. అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారని… ఇప్పుడు చంద్రబాబు.. మీ భార్యలు, భార్యలు కాదని చెబితే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్నదాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ ఆయన చుట్టూ తయారైంది" అని రాస్తూ.. "ఆ" పత్రికాధినేత "పలుకు"ను రివర్స్ లో అప్లై చేస్తున్నారు!!
P.Venkateswara Rao
955 views
8 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 💥 రాజశేఖర్ రెడ్డే ABN రాధాకృష్ణను (తల మీద వెంట్రుక చూపిస్తూ) ఏమి చేయలేకపోయాడు ఇంక జగన్ ఏమి చేస్తాడు. -మహా న్యూస్ వంశి అప్పట్లో పెద్దగా YS ఎవరి జోలికి వెళ్లేవారు కాదు.. ఉదాహరణకు.. ఇంట్లో కాల్పుల విషయం లో (షార్ప్ షూటర్) బాలయ్య ను చూసీ చూడనట్టు వదిలేసాడు YS.. విశ్వాసం లేకుండా తరువాత సోనియా తో చేతులు కలిపి జగన్ మీద టీడీపీ వాళ్ల చేత కేసులు వేయించి జైలు లో పెట్టించాడు బాబు.. కట్ చేస్తే.. స్కిల్ స్కాం లో బాబు కూడ జైలు కు వెళ్ళాడు కాకపోతే 70 + కాబట్టి ఆనారోగ్యం పేరుతో 2 నెలల్లో బెయిల్ మీద బయటకి వచ్చాడు.. అధికారం చేతిలో ఉంటె జైలు లో వేయాలనుకొంటే వేస్తారు. ఉదాహరణకు.. 70 ఏళ్ల కొమ్మినేని ఏమి తప్పు మాట్లాడాడు అని జైలు లో పెట్టారు.. మరి అంత ఘోరంగా వైసీపీ వాళ్ల మహిళల మీద ABN రాధాకృష్ణ మాట్లాడితే కేసు పెడితే కేసు కొట్టేస్తారా..? చూద్దాం తొందరేముంది.. ప్రతి ఒక్కరికి ఒక రోజువి వస్తుంది..
P.Venkateswara Rao
641 views
11 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 💥 * ABN రాధాకృషను ఎన్ని నెలలు జైలు లో పెట్టాలి జస్ట్ అస్కింగ్..⁉️ హోదా కావాలి అని బాబు అంటే హోదా కావాలి అని హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అని బాబు అంటే ప్యాకేజి ముద్దు అని రాసిన చంద్ర జ్యోతి రాధాకృష్ణ కు , సపోర్ట్ చేసిన టీడీపీ వాళ్లకు రాధాకృష్ణ మాటలు వర్తించవా ..!!! (మావిగాన్ అని జగన్ అంటే .. జగన్ చెప్తే .... కట్టుకున్న భార్యలను కూడా సొంత చెల్లెళ్ళు అని చెప్పి వాళ్లకు పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెనుకాడని వెన్నెముక లేని బ్యాచ్ ఈ వైసీపీ వాళ్ళు -ABN రాధాకృష్ణ చెత్త పలుకు Apr 5, 2026 ) *Note* : అమరావతిలో వాళ్ళు కూడా ఉంటారని కొన్ని గణాంకాలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు ను అరెస్ట్ చేసి నెలల తరపడి జైలు లో పెట్టారు ఆ డిబేట్ లో వద్దు వద్దు అని వారించినా కూడా 70 ఏళ్ల కొమ్మినేనిని కూడా జైలు లో పెట్టారు కదా మరి ఈ రాధాకృషను ఎన్ని నెలలు జైలు లో పెట్టాలి *Note*: ఉద్యోగులను ఉద్దేశించి ఆ నా ...కు అంతంత జీతాలు అవసరమా అని బాబు ముందే అన్నాడు ఈ రాధాకృష్ణ..
P.Venkateswara Rao
3.7K views
13 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు *బాబుకు అదొక్కటే భయం❗* APRIL 4, 2026🎯 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదృష్టవంతుడు. చుట్టూ దృఢమైన “కమ్మ”ని కంచుకోట నిర్మించుకున్నారు. ఇతర పార్టీల నుంచి పని చేస్తూ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వుంటుందేమో. అది కూడా చంద్రబాబుకే ఆ అదృష్టం దక్కుతుందేమో! ఉదాహరణకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. ఈమె చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తారనే అభిప్రాయం వుంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా బాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడ్తారనే పేరు వుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్నాయుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదే విషయాన్ని పార్లమెంట్ వేదికగా వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు. సీఎం రమేశ్నాయుడు ఎప్పుడూ బీజేపీ కోసం పని చేయరని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉన్నారని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎస్ఆర్ఎ. బాగా డబ్బున్న నాయకుడు. రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించడం, గుంటూరు ఎంపీ టికెట్ దక్కించుకోవడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి కావడం... చకచకా జరిగిపోయాయి. చంద్రబాబు ఎంపిక వెనుక దూరదృష్టిని పెమ్మసాని విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు సమాజంలో ప్రధాన మీడియా సంస్థలన్నీ ఏ సామాజిక వర్గానివో, ఎవరి కోసం విలువల వలువల్ని సైతం విడిచి పెట్టి నడుచుకుంటున్నాయో లోకానికంతా తెలుసు. చంద్రబాబుకు రాజగురువు, అలాగే భక్తులు మీడియా యజమానుల రూపంలో ఉన్నారు. చంద్రబాబు కోసం ఎందాకైనా అన్నట్టు, తిమ్మిని బమ్మి; బమ్మిని తిమ్మి చేయడంలో బాబు సామాజిక వర్గ మీడియా పోటీలు పడుతూ పని చేస్తుంటుంది. యజమానులంతా చౌదరీలే మరి! చంద్రబాబు కూడా వాళ్ల రుణాన్ని ఊరికే ఉంచుకోరు. కోరుకోవడమే ఆలస్యం, వరం ఇవ్వడానికి చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇందులో భాగంగానే ప్రసిద్ధ హిందూమత ఆధ్యాత్మిక సంస్థ పాలక మండలికి చైర్మన్ కావడాన్ని చూశాం. సదరు మీడియా యజమానిపై విమర్శలొచ్చినా, చంద్రబాబు పట్టించుకోవడం లేదంటే, ఆయన అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక మీడియా దిగ్గజం చనిపోతే, ఆయన సంస్మరణ సభను ప్రభుత్వం తరపున నిర్వహించారంటే, క(కు)లాభిమానం ఎక్కడికెళ్లిందో అర్థం చేసుకోవచ్చనే విమర్శను కొట్టి పారేయడానికి లేదు. చంద్రబాబు రాజకీయ ఎదుగుదలలో కీలకమైన న్యాయ వ్యవస్థ పాత్ర తక్కువేం కాదు. చంద్రబాబు ముందు చూపుతో కీలక వ్యవస్థలో తన వాళ్లను నియమించుకోవడంలో సక్సెస్ అయ్యారు. బాబు వేసిన ఆ విత్తనాలు, నేడు వృక్షాలై చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా మంచి ఫలాల్ని ఇస్తున్నాయి. దీంతో చంద్రబాబు అత్యంత శక్తిమంతుడైన రాజకీయ నాయకుడిగా తయారయ్యారు. తన ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే, తనవైన వ్యవస్థల ద్వారా అడ్డంకులు సృష్టించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇవన్నీ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే చూడాలి. చంద్రబాబు తన చుట్టూ అలాంటి వ్యవస్థల్ని నిర్మించుకున్నారు. తెలివి ఒకరి సొత్తు కాదనేది ఇందుకే. కీలక వ్యవస్థల్లో దేశంలోనే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు పదవీ విరమణ తర్వాత చంద్రబాబుపై అభిమానాన్ని ఎలా చాటుకుంటున్నారో ఇటీవల చూశాం. అలాంటి వాళ్లతో కీలక పదవుల్లో ఎవరి ప్రయోజనాల కోసం బాధ్యతలు నిర్వహించి వుంటారో అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను ఎదుర్కోవాలంటే, ముందుగా బలాన్ని అంచనా వేయాలి. మొట్టమొదట వ్యవస్థల్ని మేనేజ్ చేయగల నైపుణ్యాన్ని సాధించాలి. అప్పుడే ఆయన్ను ఎదుర్కోవడం సులువు. అలా కాకుండా, చంద్రబాబు అలాంటోడు, ఇలాంటోడని తిడుతూ కూచుంటే ఎవరేం చేయలేరు. ఎందుకంటే, ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడే ప్రయోజనం. నేల విడిచి సాము చేస్తే నష్టపోవడం తప్ప, ఒరిగేదేమీ వుండదు. చంద్రబాబు ఎంత తెలివైన వారంటే, చివరికి వామపక్ష పార్టీల్ని కూడా తన కోసమో పని చేయించుకుంటారు. బీజేపీతో అంటకాగే రాజకీయ పార్టీలంటే వామపక్షాలకు తీవ్రమైన కోపం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రం___ చంద్రబాబు దగ్గరికి వచ్చే సరికి వామపక్ష నాయకులు మినహాయింపు ఇస్తుంటారు. తద్వారా చంద్రబాబుపై తమ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. చంద్రబాబు తన చుట్టూ బలమైన కంచుకోటను నిర్మించుకుని, ప్రశాంతంగా ముందుకు సాగుతున్నారు. బాబుకు వ్యతిరేకమల్లా ప్రజలే. అందుకే ఆయనకు ఐదేళ్లకు మించి అధికారం దక్కడం లేదు. ఒక్కసారి మాత్రమే బాబు అధికారం ఐదేళ్లకు మించి కొనసాగింది. అప్పట్లో వాజ్పేయ్ నాయకత్వంపై సానుకూలత చంద్రబాబుకు కలిసొచ్చిందని చెబుతుంటారు. వ్యవస్థల పరంగా మేనేజ్ చేసుకున్న చంద్రబాబుకు, ప్రజల విషయానికి వస్తే సాధ్యం కావడం లేదు. చంద్రబాబు మోసగిస్తున్నారని ప్రజలు సులువుగా పసిగడుతున్నారు. మరీ ముఖ్యంగా సాంకేతిక యుగంలో ఎవరికి వారు నిజానిజాల్ని అంచనా వేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కొరతల్లా ప్రజల్లో వ్యతిరేకతే. దాన్ని జయించాలనే యాత్రలో చంద్రబాబు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నారు. ఎన్నికలంటే భయపడాల్సిన పరిస్థితి. అధికారం ఐదేళ్లకోసారి మారుతుండడం చంద్రబాబును ఇబ్బంది పడుతోంది. మిగిలిన విషయాల్లో మాత్రం ఆయన సక్సెస్ఫుల్ లీడర్.
P.Venkateswara Rao
650 views
14 days ago
#❤❤మనలో మన మాట❤❤ #అమరావతి #ఏపీ అప్ డేట్స్..📖 *మనలో మన మాట...* ఇదే పని వైయస్ జగన్ చేసి ఉంటే.... రాయలసీమలో ఒక మారుమూల ప్రాంతంలో ...తన వారి చేత చౌకగా భూములు ముందుగానే కొనిపించి... అసైన్డ్ భూములను , పంట భూములను బలవంతంగా తీసుకొని... తక్కువ రేటుకు రైతుల నుండి ఒక 50,000 ఎకరాల భూమిని తీసుకుని... ఏపీకి ఇదే శాశ్వత రాజధాని అని ఒక తీర్మానం చేస్తే.... మన పచ్చ ముఠా ఏమి చేసేదో తెలుసా...? దారిన పోయే ప్రతి అడ్డమైన వాడిని , ప్రతి పనికిమాలిన వాడిని తమ మీడియా కొంపలకు పిలిచి ... శుభ్రంగా స్నానం చేయించి , జుట్టు కత్తిరించి , సూటు బూటు తొడిగించి , కాస్త మేకప్ వేసి ..... మెడలో ఆర్థిక నిపుణుడు , విశ్లేషకుడు , సామాజికవేత్త .. అనే బోర్డులు వేలాడదీసి ... వారి చేత ఇలా చెప్పించేవి జగన్ కి బొత్తిగా అనుభవం లేదని ... గతంలో హైదరాబాదు విషయంలో చేసిన తప్పును ఇప్పుడు మళ్లీ ఏపీలో అన్నీ ఒకే చోట కేంద్రీకరించి ఘోరమైన తప్పు చేస్తున్నాడని ...ప్రవచనాలు చెప్పించేవాళ్లు పచ్చని పంట భూములను నాశనం చేస్తూ, అటు సేద్య రంగానికి.. ఇటు పర్యావరణానికి పెను శాపంలా జగన్ తయారయ్యాడని శపించేవి ... ఒక ప్రాంతంలో రాజధానిని నిర్మించి ఇతర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని... దీనిపై ఇతర ప్రాంతాల వారు తీవ్రంగా మండిపడుతున్నారంటూ .. పచ్చ మీడియా గుడ్డలు చింపుకొని నడిరోడ్డుపై నాట్యం చేసేది...! ఈ భూమిపై ఎక్కడైనా లక్ష ఎకరాల పరిధిలో రాజధాని ఉందా... రోజుకు 500 కోట్లు అప్పులు చేస్తున్న మనకు ... లక్షల కోట్లతో రాజధానిని నిర్మించడం సాధ్యమేనా .... అని పొద్దస్తమానం చర్చల మీద చర్చలు పెట్టి ... ప్రశ్నల వర్షం కురిపించి .... జగన్ని , జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వాళ్ళు.. కదూ ..!? ఏమంటారు..❓ శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
P.Venkateswara Rao
588 views
15 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 *వారెవ్వా.. చంద్రబాబు భలే మందు వేశారే❗* APRIL 2, 2026🤣 అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఏకంగా ఎస్పీ ఆఫీసు మీదకు వెళ్లి వీరబీభత్స స్థాయిలో దందా చేశారు. దాష్టీకం చేశారు. జిల్లా ఎస్పీని ఇంచుమించుగా బెదిరించారు. తాను చెప్పిన మనిషికి పోలీసు న్యాయసలహాదారు పదవి ఇచ్చి తీరాల్సిందేనని యాగీ చేశారు. తన సిఫారసు ఉత్తరం మేరకు ఆ పోస్టు ఇవ్వకపోవడం పట్ల ఎస్పీతో తగాదా పెట్టుకున్నారు. ఆయన సిఫారసు లేఖను ఎస్పీ సంతకం చేసి పై అధికారులకు పంపేసినా కూడా ఆయన అక్కడినుంచి పదిగంటలపాటు కదల్లేదు. పై అధికార్లనుంచి నియామక ఉత్తర్వులు వచ్చేదాకా అక్కడినుంచి కదలనంటూ భీష్మించుకున్నారు. మరో ఎమ్మెల్యే ఇతర నాయకులు సర్దిచెప్పడానికి ఎస్పీ కార్యాలయానికి వెళితే.. ఎస్పీ ఛాంబర్ బాత్రూంలోకి వెళ్లి గడియ బిగించుకున్నారు. చివరకు పోలీసు అధికారులు డంబెల్స్ తో బాత్రూం తలుపులు పగలగొట్టి.. ఆయనను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. తన మనిషికి పోస్టు ఇచ్చేదాకా కుదరదంటూ ఆ తర్వాత కూడా ఆయన మొండికేశారు. ఈలోగా.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ కార్యాలయాలనుంచి ఆయనకు ఫోను వచ్చినా కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. లోకేష్ అయితే నాకేంటి.. నేను చెప్పిన వ్యక్తి అడిగిన పోస్టు దక్కాల్సిందే అన్నట్టుగా తలెగరేసి నిలబడ్డారు. ఈ మొత్తం దందాతో.. పార్టీ పరువు బజార్న పడింది. ఈ ఎమ్మెల్యే రచ్చచేశాడు గనుక.. అందరికీ తెలిసింది గానీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నెన్ని దందాలు సాగిస్తున్నారో కదా.. అని అందరూ విస్తుపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటి ఆగడాల ఎమ్మెల్యేలకు చంద్రబాబు చూపిస్తున్న పరిష్కారం ఇంకా చిత్రంగా ఉంది. ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉంటే దానిని తగ్గించుకోవడానికి ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలని చంద్రబాబు హితోపదేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేల టెన్షన్ కు కారణాలను ఓటీటీ సిరీస్ ల మీదకు నెట్టేస్తున్నారు. ఆయన చెబుతున్నదేంటో తెలుసా.. “ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లలో సిరీస్ లు చూడడం ఎక్కువైంది. నేరాలు ఘోరాలు చేస్తున్న రీల్స్ ను తెగ చూస్తున్నారు. దీంతో మనసు పాడు చేసుకోవడం, అక్కడినుంచి ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా అసహనానికి గురవడం మెంటల్ ఇన్ బ్యాలన్స్ అవడం జరుగుతోంది. మా ఎమ్మెల్యే నిన్న వెళ్లి ఓ కార్యాలయంపై పడ్డారు.. అందుకే అందరూ టెన్షన్ ఎక్కువగా ఉంటే మైండ్ కంట్రోల్ చేసుకునేందుకు ఓ ఇరవై నిమిషాలు ధ్యానం మెడిటేషన్ చేయండి. అవసరమైతే ప్రత్యేకంగా క్లాసులు పెట్టిస్తా' అని అంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేల దుడుకు తనాన్ని కంట్రోల్ చేయలేని చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాక్షాత్తూ చంద్రబాబు స్థాయి వ్యక్తి ఇలాంటి పలాయనవాదపు మెడిటేషన్ డైలాగులు వల్లించడం మరీ కామెడీగా ఉంది. ఏ ఎమ్మెల్యే అయితే ఎస్పీ మీదనే దందా చేయదలచుకుని పార్టీ పరువు బజార్న పడేశాడో.. ఆ ఎమ్మెల్యే ఏదో పబ్లిక్ టెన్షన్ లో ఉన్నట్టుగా రంగుపులమడానికి పాపం.. చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుంది. తన అనుచరుడికి పోలీసు శాఖలో పోస్టు ఇప్పించుకుని దందాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఎమ్మెల్యే చేసిన బాహాటపు కుట్రలు కూడా చంద్రబాబుకు 'టెన్షన్' రూపంలో కనిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఇక ఎవరు బాగు చేయగలరు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే పని ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసి ఉంటే చంద్రబాబు ఇదే రీతిగా స్పందించేవారేనా అని కూడా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
P.Venkateswara Rao
576 views
16 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 *పర్యవేక్షణ అధ్వానం.. ఏపీలో సర్వర్ డౌన్❗* APRIL 1, 2026💻⌨️ పన్నులు చెల్లించాలని మున్సిపాల్టీలకు వెళితే సర్వర్ డౌన్ కనిపిస్తోంది. భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు మ్యుటేషన్ కోసం సచివాలయాలకు వెళితే.. సర్వర్ డౌన్ అనే మాటే వినిపిస్తోంది. మరోవైపు ఇంటర్నెట్కు ఏపీనే పుట్టినిల్లు అన్న బిల్డప్. మరోవైపు క్షేత్రస్థాయిలో వ్యహారం మాత్రం అందుకు విరుద్ధంగా వుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించి ఏదైనా చేద్దామని అనుకుంటే సర్వర్ పని చేయడం లేదనే మాట వినిపిస్తోంది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెళ్లిన ప్రజలు ఉస్సూరుమంటూ తిరుగు ముఖం పట్టాల్సి వస్తోంది. అర్ధ గంట లేదా గంట సమయం వేచి చూస్తే సర్వర్ పని చేస్తుందనే ఆశతో ప్రజలు రోజంతా కాపలా కాసే పరిస్థితి. అయినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్ పని చేయకపోవడం సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే, పనులన్నీ మానుకుని ఎక్కడెక్కడి నుంచో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ కార్యాలయాలకు ప్రజలు వెళుతుంటారు. త్వరగా పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని భావిస్తుంటారు. అయితే సర్వర్ పని చేయకపోవడంతో ఇతర పనులు కూడా ఆగిపోయే పరిస్థితి. దీంతో ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి సర్వర్ పని చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు అదే సమస్య పునరావృతం అవుతున్నదంటే, పర్యవేక్షణ అధ్వానంగా వుందని అర్థం. ఈ తీరులో మార్పు రావాలి. తరచూ సర్వర్ పని చేయకుండా, మొరాయించడంపై దృష్టి సారించాలి. సంబంధిత నిపుణులతో సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రభుత్వానికే చెడ్డపేరు.
P.Venkateswara Rao
618 views
17 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 మొత్తానికి 'ఆయన' భయం అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. 'ఆయన' రాడు.. అని ఒకరంటే.. రాకూడదు అని అందరూ బలపరిచారు. 'ఆయన్ను' రానివ్వకూడదని మరొకరంటే.. రానివ్వబోం అని ప్రతిన పూనారు.. .... అయితే.. ఇక్కడో విషయం వీళ్లంతా గుర్తు పెట్టకోవాలి. 'ఆయన' రావాలా వద్దా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. మీ పాలనపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పేర్ని నాని చెప్పినట్లు.. 23 సీట్లు వచ్చిన వాళ్లు అధికారంలోకి వచ్చినప్పుడు, 11 సీట్లు వచ్చిన వాళ్లు రాకూడదని రూల్ ఏమైనా ఉందా? కాబట్టి.. మీకు మీరు రానివ్వం, రాకూడదు.. అని బాకా ఊదుకుంటే ఉపయోగం ఉండదు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. #APAssembly
P.Venkateswara Rao
566 views
19 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #అమరావతి #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *మాయలే మాయలు: అప్పుడొకలా.. ఇప్పుడొకలా..❓* MARCH 30, 2026🎯 అమరావతి రాజధాని' అనేది ప్రత్యేకించి నారా చంద్రబాబునాయుడుకు ఒక కల్పవృక్షంలాగా, కామధేనువులాగా మారినట్టుగా కనిపిస్తోంది. ఈ అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టును ఆయన ఏటీఎంలాగా మార్చుకుని.. విపరీతమైన అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల రూపాయలు స్వాహా చేసేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అలాంటి విమర్శలను పక్కన పెట్టినప్పటికీ.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల్ని మాయ చేయడానికి, వాస్తవాలవైపు వారి దృష్టి మరలకుండా.. వారిని నిరంతరమూ మభ్యపెడుతూనే ఉండడానికి అమరావతి రాజధాని చంద్రబాబునాయుడుకు ఒక అద్భుతమైన వనరుగా కలిసి వస్తోంది. 2014లో సీఎం అయినప్పుడు.. అమరావతిని రాజధానిగా ప్రకటించి.. చంద్రబాబునాయుడు అయిదేళ్లపాటు ఒకేరకం మాయలు చేస్తూ వచ్చారు. బొమ్మలు చూపించారు. కంప్యూటరు తెరల మీద, కాగితాల మీద డిజైన్లు చూపించారు. కానీ తమాషా ఏంటంటే.. 2024 లో అధికారంలోకి వచ్చి పనులను పునఃప్రారంభించిన తర్వాత కూడా.. ఇంకా అదే తరహాలో ప్రజల్ని మాయ చేయాలని అనుకుంటున్నారు. కాకపోతే.. ఆ మాయలకు కొత్త కొత్త సృజనాత్మకతను జోడిస్తున్నారు. అప్పటిలాగా కాకుండా కొత్త మాయలు చేయాలనుకుంటున్నారు. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం అనేది ఒక పెద్ద డ్రామా. ఇతరత్రా ఏమీ అంశాలు తమ ఎదుట లేవు కాబట్టి.. జగన్మోహన్ రెడ్డిని కొన్ని నెలలపాటు కంటిన్యువస్ గా ఆడిపోసుకుంటూ ఉండడానికి, తూలనాడుతూ ఉండడానికి ఒక సందర్భాన్ని సృష్టించుకోవడం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టారు తప్ప మరొకటి కాదు. అమరావతే రాజధాని అని తెలుగుదేశం సర్కారు 2014లోని నిర్ణయించుకున్నదే అనుకుందాం. జగన్ దానిని పట్టించుకోకపోయిన నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకోసం చర్యలు తీసుకుని ఉండొచ్చు. విభజన చట్టం నిర్దేశించిన ‘హైదరాబాదు పదేళ్లపాటు రాజధాని' అనే క్లాజు 2024 జూన్ లోనే పూర్తయిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఈ రెండేళ్లలో ఏ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయినా అమరావతి రాజధానికి చట్టబద్ధత గురించి తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపి ఉండవచ్చు. కానీ.. అలా వారు చేయలేదు. రెగులర్ సమావేశాల సమయంలో ఇలాంటి తీర్మానం ప్రవేశపెడితే శాసనమండలిలో కూడా చర్చించాల్సి వస్తుంది. అందుకే స్కిప్ చేశారు. రెండేళ్లు గడుస్తుండగా ఇప్పుడు కేవలం శాసనసభప్రత్యేకసమావేశం పెట్టి తీర్మానించారు. ఈ తీర్మానం కేంద్రానికి వెళుతుంది. చట్టబద్ధత దక్కుతుంది. కానీ, అదంతా కేవలం లాంఛనం మాత్రమే. కానీ చట్టబద్ధత వచ్చిన వెంటనే ఊరూ వాడా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇల్లలకగానే పండగ అనే సామెత గుర్తుకొస్తున్నది.. ప్రభుత్వం చేస్తున్న మాయ చూస్తోంటే. అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత.. అక్కడినుంచి ప్రభుత్వ కార్యకలాపాలు, అక్కడ ప్రజల జీవనాలు ప్రారంభం అయిన తర్వాత.. రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించినా కూడా అర్థముంది. కేవలం చట్టబద్ధత దక్కగానే అన్నిచోట్లా వేడుకలంటే.. ఇల్లు అలకడానికంటె ముందు.. అలకడానికి పేడ దొరికిన వెంటనే పండగ చేసుకున్నటుగా. అతిశయంగా, ఉంటుంది. కానీ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. చంద్రబాబు స్ట్రాటజీ కూడా అదే. అమరావతి ఇంకా పూర్తి కావడం లేదే.. అన్న భావన ప్రజల్లోకి రానివ్వకూడదు. దానిని ఈ అయిదేళ్లలో పూర్తిచేయకూడదు. నన్ను మళ్లీ గెలిపిస్తే తప్ప ఇది పూర్తి కాదు.. అని ప్రజల్ని ఎన్నికల సమయంలో బెదిరించాలి. ఈలోగా తన వైఫల్యం మీద వారికి అసంతృప్తి కలగకుండా ఇలాంటి వేడుకలు నిర్వహించాలి- అనేదే వ్యూహంగా సాగుతున్నారని అంటున్నారు. ఈ వేడుకల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తగలేసే ఖర్చుతో.. అమరావతి కనీసం ఒక చిన్న భవనం అయినా నిర్మించవచ్చు కదా.. అని ప్రజలు అంటున్నారు.
P.Venkateswara Rao
1.8K views
19 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 మళ్లీ జగన్‌ వస్తే పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు -లోకేశ్‌.. చెప్పకనే జగన్ వస్తాడు అని చెబుతున్నారు బహుశా మీరు చెప్పిన పారిశ్రామికవేత్తలు ఈనాడు కిరణ్ ABN రాధాకృష్ణ , TV5 BR నాయుడు లాంటి వారై ఉంటారు వాస్తవాలు: 1) పారిశ్రామిక వృద్ధి లో జగన్ పాలనలో సౌత్ ఇండియా లో ఏపీ టాప్ దేశం లో 8 వ స్థానం తయారీ రంగం లో సౌత్ ఇండియా లో ఏపీ టాప్ దేశం లో 5 వ స్థానం -రిజర్వ్ బ్యాంక్ (RBI ) Dec 24,2025 2) ఇక మీ కూటమి హయాములో పారిపోతున్న కంపెనీలు 6 వేల కోట్లు అవుట్ 1) కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణకు కోకోకోలా పరార్ 2 )అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకోని జ్యూపిటర్ రెన్యువల్ ఎనర్జీ 3) 'అనంత'లో గతేడాది కేటాయించిన 121 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన 'జిన్ఫ్రా’ 4) శ్రీసత్యసాయి జిల్లా నుంచి 'ఆజాద్ మొబిలిటీ' పరుగోపరుగు 5)నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకున్న నాల్కో-మిథాని 6)ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతల వేధింపులు ఉత్తరాంధ్ర నుంచి 'సీమ' దాకా సేమ్ సీన్.. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వ రరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజ మాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపె నీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫ రాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లి పోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహి రంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్ర మట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర vఇబ్బందులు ఎదు ర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థి తులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.