*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి*
*అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు కొండంత అండగా నిలుస్తున్నారు. ఆదివారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైనా చెక్కులను ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి గారు లబ్ధిదారులకు రూ. 5,63,257.00 (రూ. ఐదు లక్షల అరవై మూడు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు) విలువైన చెక్కులను అందజేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పేద ప్రజలు కూడా ధైర్యంగా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చనే భరోసాను కల్పిస్తున్నామన్నారు. ఆర్థిక స్థోమత లేక వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. పేదలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని, గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1068 మంది లబ్ధిదారులకు రూ. 8,95,62,690.00 (ఎనిమిది కోట్ల తొంబై ఐదు లక్షల అరవై రెండు వేల ఆరు వందల తొంబై రూపాయలు ) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించటం జరిగిందని, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.*
*కష్టకాలంలో తమకు కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.*
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్