గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు)

PSV APPARAO
727 views
2 months ago
#భోగ భాగ్యలిచ్చే భోగి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గోదాదేవి #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు) #ధనుర్మాసం విశిష్టత *గోదా భోగమే భోగి* గోదా అంటే వాక్కును, వస్త్రములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పరమాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పించుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. భోగి పండగ సందడి తెలుగు లోగిళ్లలో ప్రవేశించింది. ఈ పండగకు భోగి అనే పేరు ఎందుకు వచ్చిందనే సందేహం రావచ్చు. దీనికి రకరకాల కారణాలను తెలుపుతారు. వ్యవ సాయదారులు పంటలను ఇళ్లకు చేర్చుకుని విశ్రాంతితో భోగం అనుభవిస్తారు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే విజ్ఞులు దీనికి మరో కారణాన్ని, అంతరార్థాన్ని, ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. గోదాదేవి నెల రోజులు వ్రతం చేసి రంగనాథుడిని వివాహ మాడి ఆ స్వామి చెంతకు చేరి భోగము అనుభవించిన రోజు భోగి అంటారు. నూటికి తొంభై మంది భోగి మంటలు చలి తీవ్ర తను తట్టుకోలేక వేసుకునేవి అనుకుంటారు. ఆ మంటలలో ఇంట్లోని పాత వస్తువులను ముఖ్యంగా కలపను వేయడం ఆచారం. అందులోని ఆంతర్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్ని అంటే జ్ఞానమని పండితుల నిర్వచనం. కలప అంటే అజ్ఞానం. అనగా జ్ఞానంలో అజ్ఞానాన్ని తగులబెట్టడం భోగి మంట. అజ్ఞానం, ఆరాటం, ఆశ, తుచ్చ అనుభవం, విపరీత ప్రవృత్తి, భ్రమ ఇవి మనలో ఉన్న కలపలు, వీటన్నింటిని జ్ఞానరూపమైన భగవంతునిలో దహింప చేయడమే భోగిమంట చెప్పే సందేశం. ప్రస్తుతం ఉన్న అజ్ఞానం తరువాత కలుగబోయే అజ్ఞానపు ఆలోచనలు అన్నీ కూడా దహింప చేయవలసినవే. ఇందులోని పరమార్థం స్వార్థాన్ని దహింప చేయడమే ఇతరుల ఇళ్ళల్లోని కలపను కూడా భోగి మంటల్లో వేసే ఆచారం ఉంది. అనగా వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారి అజ్ఞానాన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేయాలి, అప డు స్వార్థానికి తావుండదు. భోగి పండుగ రోజు ఐదు సంవత్సరాల లోప పిల్లలకు రేగి పళ్లు, చెరుకు గడలు, కొత్త పంటగా వచ్చిన బియ్యం, నాణేలు, బెల్లం ఇవ్వన్నీ కలిపి భోగి పళ్లుగా వారి శిరస్సున పోసే ఆచారం ఉంది. మన సంపదను పది మందికి పంచిపెట్టే దాత్రుత్వ బుద్ది పిల్లలకు అలవర్చాలని, ఉన్నది, తిన్నది మనది కాదని పది మందికి పంచినదే మనదనే ఉపనిషత్తు వాక్యసారం ఈ ఆచారంలో ఇమిడి ఉంది. ఇక గోదా కల్యాణంలోను అంతరార్థాలు దాగి ఉన్నాయి. ఇక గోదా దేవి విషయానికి వస్తే... శ్రీమన్నారాయణుడు సంసారంలోని జీవులను తరింప చేసే విధానాన్ని ఆలోచిస్తుండగా అమ్మ అతని అనుమతితో విష్ణుచిత్త పుత్రికగా పుట్టి యుక్త వయస్సు రాగానే పరమాత్మను మాత్రమే భర్తగా పొందగోరింది. ద్వాపర యుగంలో గోపికలు చేసిన మాస వ్రతాన్ని తాను ఆచరించి, పరమాత్మను ప్రసన్నుడిని చేసుకుని వివాహమాడింది. గోదా అంటే వాక్కును, వస్త్ర ములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పర మాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పిం చుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. తాను ఆచరించిన వ్రతం, తాను పొందిన ఫ లితం తనలోనే దాచుకొనక పది మందికి వ్రత విధానాన్ని బోధించడానికి తిరుప్పావై అను ముప్పె పాశురాల ప్రబంధాన్ని మృదుమధురంగా లోకానికి అందించింది. గోదాదేవి. ఆర్తి ఉన్నవారు అందరూ భగవంతుని పొందడానికి అర్హులే. కులం,మతం,జాతి వంటి భేదాలు భగ వంతుని పొందే విషయంలో లేవని విశ్వ మానవ కళ్యాణాన్ని వేనోళ్లచాటిన దయా మయురాలు గోదమ్మ. తాను ఒక్కతే కాక పది మంది గోపికలను లేపి వారితో కలిసి పరమాత్మ దగ్గరకు వెళ్లడం ద్వారా రుచి కరమైన పదార్థాన్ని ఒక్కరే భుజించక పది మందికి పంచాలనే ఉపదేశాన్ని తెలియ జేస్తుంది. భగవంతుని చేరాలంటే ఆహార నియ మం, వ్యవహార నియమం తప్పక పాటించాలని, మనం చేసుకునే అన్ని అలంకారాలు భగవంతుని కోసమే అని చెప్పడమే ఈ వ్రతోద్దేశ్యం. ఏ వ్రతమైనా నియమాలను ఆచరించడం తప్పనిసరి. శరీరాన్ని శోషింప చేస్తే మనసు పోషింపబడుతుంది, మనసు పోషించ బడితే స్వార్థం సమూ లంగా నశిస్తుంది. పరార్థం, పరమార్థం వికసిస్తాయి అనే ఉపదేశం గోదా కళ్యాణంలో ఇమిడి ఉంది.
దాట్ల వెంకట సుబ్బరాజు
2.4K views
2 months ago
🌸 ధనుర్మాసం | తిరుప్పావై | పాశురం 30 🌸 🪔 పాశురం వంగక్కడల్ కడైంద మాదవనై కేశవనై, తింగళ్ తిరుముగత్తు చ్చెయిళైయార్ శెన్ఱిఱైంజి, అంగప్పఱై కొండవాట్రై, అణిపుదువై పైంగమలత్ తణ్‍తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న, శంగ త్తమిళ్ మాలై ముప్పదుం తప్పామే, ఇంగు ఇప్పరిశుఱైప్పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్, శెంగన్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్, ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బుఋవరెంబావాయ్ 🪷భావం: పాలసముద్రమును దేవతల కొరకు మథించి అమృతాన్ని ప్రసాదించిన ఈ మాధవుడు — కేశవుడు — బ్రహ్మ, రుద్రాది దేవతలకు అధిపతియైన నారాయణుడు… చంద్రముఖలైన గోపికలు అలంకారములతో కూడి ఆయనకు మంగళాశాసనము చేసి పఱై వ్రత ఫలమును పొందారు. ఆ దివ్యానుభవాన్ని శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన తామరమాలలను ధరించిన పెరియాళ్వార్ కుమార్తె — శ్రీ గోదాదేవి (ఆండాళ్ తల్లి) ద్రావిడ భాషలో తిరుప్పావైగా లోకానికి ప్రసాదించింది. ఈ ముప్పది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ శ్రద్ధతో అనుసంధించువారు నాల్గు భుజములుగల శ్రీమన్నారాయణుని ఉభయ విభూతి ఐశ్వర్యములతో కూడిన అవ్యాజ కృపను పొంది బ్రహ్మానందముతో జీవించగలరు. శ్రీ గోదా–రంగనాథుల అనుగ్రహమే ఈ తిరుప్పావై🍀జీవన సందేశం: సాధన వ్యక్తిగతముగా మొదలై, ఆశీర్వాదముగా లోకమంతా వ్యాపిస్తుంది. భక్తి చివరికి మన కోసమే కాదు — సర్వజన హితం కోసమే. 🪔 తిరుప్పావై — వ్రతం కాదు. వరము. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 #గోదాదేవి తిరుప్పావై
Aaryan Rajesh
657 views
2 months ago
గోదా శ్రీ రంగనాథుల కళ్యాణ వైభోగంతో ధనుర్మాస వ్రతం పూర్తయింది. రాజేష్ #గోదాదేవి తిరుప్పావై
S.HariBlr (Bangalore)
1.6K views
2 months ago
#గోదాదేవి తిరుప్పావై #ధనుర్మాసం-గోదాదేవి పాశురాలు _*🚩 తిరుప్పావై ఇరవై తొమ్మిదవ రోజు పాశురం🚩*_ *🚩తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాశురం🚩* 🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉 🌹పాశురం🌹 *శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్* *పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;* *పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,* *కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు;* *ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:* *ఎత్తైక్కు మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో* *డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,* *మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్* *☘భావం☘* ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది. *🌴అవతారిక🌴* భగవత్ప్రాప్తిని పొందగోరేవారందరూ ఆ చరించదగిన యీ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తీ, ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడీ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని 'పఱ' అనే వాద్యాన్ని పొందాలని తాహతహలాడారు గోపికలు ఇప్పటివరకు . కాని యీ పాశురంలో 'పఱ' నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యమూ, అతని నిరంతర సేవకే యీ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు. అండాళ్ తల్లితో కూడిన గోపికలు. _*🌳(ధర్మవతిరాగము _ అదితాళము)🌳*_ ప... నీ సన్నిధియే కావలె స్వామీ! నీ సంపెసేనమె మాకు పరమావధి స్వామీ! అ..ప.. నీ సేవకై వేకువజామున నిలిచి నీ సుందర తిరువడులకు మంగళమనగ చ.. పనుల మేపి జీవిక నడిపెడి మా పశుప కులమునన్ బుట్టిన స్వామీ! ఈశ ! మా అంతరంగ సేవలను ఆశల జేయ నిరాకరింపకుమ! నీ సన్నిధియే కావలె స్వామీ! చ.. కాదుసుమా! వాద్యముకై వ్రతము అదియొక నేపమగు నోచ నీ వ్రతము బంధము వీడక యేడేడు జన్మల అందరము కై౦కర్యము చేతుము విందువో గోవిందా! మనవిని మా యందన్య కామనలను పోగొట్టుము. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏