*టీడీపీలోకి భారీగా చేరికలు*
*15 కుటుంబాలకు పైగా టీడీపీలో చేరిక – కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి*
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గిద్దలూరు మండలంలోని నరవ బయనపల్లె గ్రామానికి చెందిన పలువురు గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.*
*నరవ బయనపల్లె గ్రామానికి చెందిన బయనపల్లె బాబాయ్ & బూనబోయిన శేఖర్ గారి ఆధ్వర్యంలో పెట్టెల రామ్మోహన్ యాదవ్, శ్రీనివాసులు, చిన్న ఖాదరయ్య , సురేంద్ర, సాయికృష్ణ, శ్రీరాములు,రామాంజనేయులు , బుడతా లక్ష్మయ్య, దగ్గెపోగు పిలీప్ తదితరులు వైసీపీ పార్టీకి చెందిన పలువురు నేతలు కలిపి సుమారుగా 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.*
*ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీలో చేరడం పట్ల ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.*
*ఈ కార్యక్రమంలో నరవ బయనపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.*
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్