🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K views
1 months ago
கும்பகோணத்தில் எந்தெந்த கோயிலுக்குச் சென்றால் என்னென்ன பலன்கள் கிடைக்கும் என தகவல்கள்... கும்பகோணத்தை சுற்றினால் வாழ்க்கையில் அனைத்து செல்வங்களும் கிட்டும் என்பது ஐதீகம். கோவில் என்றாலே அனைவருக்கும் முதலில் நினைவுக்கு வருவது கும்பகோணம் தான். தமிழகத்தில் அதிகப்படியான கோயில்களை கொண்ட ஒரு மாநகரம் என்றால் அது கும்பகோணம் தான். இங்கு பல்வேறு விதமான கோவில்கள் உள்ளன. அதிலும் நவக்கிரகங்கள் கொண்ட கோவில்கள் மிகவும் அதிகம். அதிகப்படியானோர் இந்த பகுதிக்கு தோஷங்களை நீக்க மற்றும் திருமண தடைக்கு இலக்கு வேண்டி வருகின்றனர். இதனால் தான் இது கோவில் நகரம் என்று அழைக்கப்படுகிறது. இந்நிலையில் எந்த கோவிலுக்கு சென்றால் என்ன பலன் 🌹கும்பகோணம் திருக்கோயில்கள் "கருமுதல் சதாபிஷேகம்" வரை பலனடைய இந்த கோவில்களை மட்டும் வழிபட்டால் போதும்.* 🌹கரு உருவாக (புத்திரபாக்கியம்) - கருவளர்ச்சேரி. 🌹 கரு பாதுகாத்து சுகப்பிரசவம் பெற - திருக்கருக்காவூர். 🌹நோயற்ற வாழ்வு பெறுவதற்கு - வைத்தீஸ்வரன் கோவில். 🌹ஞானம் பெற - சுவாமிமலை. 🌹கல்வி மற்றும் கலைகள் வளர்ச்சிக்கு - கூத்தனூர். 🌹எடுத்த காரியம் வெற்றி மற்றும் மனதைரியம் கிடைக்க - பட்டீஸ்வரம். 🌹உயர் பதவியை அடைய - கும்பகோணம் பிரம்மன் கோயில். 🌹 செல்வம் பெறுவதற்கு - ஒப்பிலியப்பன் கோவில். 🌹கடன் நிவர்த்தி பெற - திருச்சேறை சரபரமேஸ்வரர். 🌹இழந்த செல்வத்தை மீண்டும் பெற - திருவிடைமருதூர் மகாலிங்கசுவாமி. 🌹பெண்கள் ருது ஆவதற்கும், ருது பிரச்சினைகள் தீர - கும்பகோணம் காசி விஸ்வநாதர் (நவ கன்னிகை). 🌹 திருமணத்தடைகள் நீங்க - திருமணஞ்சேரி. 🌹 நல்ல கணவனை அடைய - கும்பகோணம் ஆதி கும்பேஸ்வரர் மங்களாம்பிகை. 🌹 மனைவி, கணவன் ஒற்றுமை பெற - திருச்சத்திமுற்றம் குழந்தைபாக்கியத்திற்கு.இரட்டை லிங்கேஸ்வரர்.சென்னியமங்கலம்.திப்பிராஜபுரம் 🌹பில்லி சூனியம் செய்வினை நீக்க - அய்யாவாடி ஸ்ரீ பிரத்தியங்கிர தேவி. 🌹கோர்ட்டு வழக்குகளில் நியாயம் வெற்றியடைய - திருபுவனம் சரபேஸ்வரர். • பாவங்கள் அகல - கும்பகோணம் மகாமகத் திருக்குளத்தில் நீராடல். • எம பயம் நீங்க - ஸ்ரீ வாஞ்சியம். • நீண்ட ஆயுள் பெற - திருக்கடையூர். #తెలుసుకుందాం #అరుణాచల శివ 🙏 #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
733 views
3 months ago
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా శని శింగనాపూర్ ని చూద్దాం.🛕🚩 మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. యాగంటి..🛕🚩 ఆంధ్రప్రదేశ్ లోఇది ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు.. లేపాక్షి..🛕🚩 ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో లేపాక్షి వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు.. తంజావూరులో మిస్టరీ..🛕🚩 తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. పూరీజగన్నాథ్ ఆలయం..🛕🚩 పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు.. షోలాపూర్..🛕🚩 మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ.. అమ్రోహా..🛕🚩 ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు!! అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్ధం కాలేదు. ఇప్పటికి అవి మిస్టరీగానే ఉండిపోయాయి.... 🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #hindu temples
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
877 views
4 months ago
1. మహాలక్ష్మీ ఆలయం - ముంబై ముంబైలోని మహాలక్ష్మీ ఆలయం సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అమ్మవారి పురాతన సుప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి విగ్రహాలు ఉంటాయి. ఇది 1831వ సంవత్సరంలో నిర్మించనబడిని అతి పురాతన దేవాలయం. ముంబై నగరంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఇదొకటి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి సమయాల్లో ఈ దేవాలయం చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు సిరిసంపదలు, శ్రేయస్సు, బుద్ధి కుశలత, జ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. 2. లక్ష్మీ నారాయణ టెంపుల్‌ - వెల్లూర్‌ (శ్రీపురం) వెల్లూర్‌ సమీపంలో ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన బంగారు ఆలయం. దీనిని శ్రీనారాయణి పీఠం నిర్మించింది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం. దీనిని లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శ్రీ యంత్రం ఆకారంలో ఉంటుంది. ఏడు ద్వారాలు కలిగి ఉండి వేల కిలోల (సుమారు 15 వేల) బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతకు, గొప్ప శిల్ప కళకు నిదర్శనం. వెల్లూరు నుంచి సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. జీవితంలో తప్పక చూడాల్సిన దేవాలయాల్లో ఇదీ ఒకటి. 3. నిమిషాంబ టెంపుల్‌ - శ్రీరంగపట్నం (కర్ణాటక) కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం అనే చిన్న పల్లెటూరిలో పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం వెలసి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీరుకి ముఖ్య ఆధారం కావేరి నది. సాధారణంగా జీవుల దాహార్తిని తీర్చే కావేరి నది భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే శ్రీవైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగం క్షేత్రం మరియు శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ కావేరి నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఈ పవిత్ర ప్రదేశంలోనే వెలసిన పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తారు. అలాగే పార్వతీ దేవి అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి సంబంధించిన ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడి పరమేశ్వరుడిని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. 4. వైష్ణో దేవి ఆలయం - జమ్మూ హిందువులకు సంబంధించి అత్యంత పవిత్రమైన వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్‌లోని త్రికూట కొండలపై ఉంటుంది. దీనిని శ్రీమాతా వైష్ణోదేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళీ త్రిమూర్తుల సమ్మేళనంగా ఉంటుంది. వైష్ణో దేవి మహాలక్ష్మి యొక్క అవివాహిత రూపం. ఆమెలో మహాసరస్వతి, మహాకాళి అంశాలు కూడా ఉంటాయి. హిందూ సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన శక్తిపీఠం. భక్తులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం. 5. గోల్డెన్‌ టెంపుల్‌ - అమృత్‌సర్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (Golden Temple Amritsar) సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గోపురం స్వచ్ఛమైన బంగారంతో పూత పూయబడింది. ఇది అమృత్‌ సరోవర్‌ అనే పవిత్ర కొలను చుట్టూ నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వంటశాల (లంగర్‌) కూడా ఉంటుంది. ఇది సిక్కుల సమానత్వ, సేవాభావాలకు ప్రతీకగా చెప్పొచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సిక్కు సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు ప్రతిరూపం. 6. శ్రీ బాలాజీ టెంపుల్‌ (తిరుమల) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Balaji Temple Tirumala) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుమల శేషాచల కొండలపై వెలసి ఉంది. ఈ పవిత్ర హిందూ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు. దీనిని తిరుపతి బాలాజీ టెంపుల్‌ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. 7. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం - ఉజ్జయిని ఉజ్జయినిలో వెలసిన ప్రసిద్ధ కృతయుగం నాటి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. హిందూ పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. సప్త మోక్ష ధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నెలవుగా ఉంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద షిప్రా నది ఒడ్డున వెలసిన ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసియున్న శివుడిని మహాకాళుడిగా వ్యవహరిస్తారు. ఈ మహాకాళుడుని కాలానికి మరియు మరణానికి దేవుడిగా భావిస్తారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన లింగం స్వయంభువు లింగం. ఈ మహా క్షేత్రంలో వెలిసిన శివలింగం ఇతర లింగాల వలె కాకుండా మంత్ర శక్తులతో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. అందుకే ఇక్కడి మహాకాళేశ్వరుడి దర్శనం భయం మరియు పాపాల నుండి విముక్తిని కలిగిస్తుందని చెబుతారు. 8. సిద్ధి వినాయక టెంపుల్‌ ముంబై సిద్ధిని బుద్ధిని ప్రసాదించే వినాయకుడు ఆగ్రహ ఆవేశాలతో అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. దేవతలకు సహాయం అందించడమే కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం అనేది గణపతి యొక్క గొప్పతనం. సమస్త దేవతలచే పూజలు అందుకునే శ్రీమన్నారాయణుడే గణపతికి ఆలయాన్ని నిర్మించాడంటే వినాయకుడి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అంతటి ఖ్యాతి కలిగిన గణపతికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే.. ముంబైలోని ప్రభాదేవిలో ఉండే శ్రీసిద్ధి వినాయక గణపతి ఆలయం ప్రత్యేకమైనది. ఈ గణపతి క్షేత్రాన్ని దర్శిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని, పనుల్లో విఘ్నాలు తొలగి విజయాలు చేకూరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా గణేశ్‌ నవరాత్రుల వేళ ఈ ఆలయం బహు సందడిగా ఉంటుంది. 9. కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ వారణాసి ఇది వారణాసిలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ కాశి వారణాసి నగరం అతి పురాతన నగరాల్లో ఒకటి. ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ లేదా విశ్వనాథ్‌ అని కూడా అంటారు. తెలిసీ తెలియక మనం చేసిన పాపాలకు సంబంధించి ప్రాయశ్చిత్తం పొంది ఆ పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని వద్ద ఉన్న గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. 10. సూర్య దేవాలయం కోణార్క్‌ ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ దేవాలయం పెద్ద రథం ఆకారంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో రాతితో చెక్కబడిన అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉంటుంది. సూర్య దేవాలయంతో పాటు అక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉండే అస్తరాంగ్ బీచ్‌ కూడా అద్భుతమైన సందర్శనీయమైన ప్రాంతం. ఈ బీచ్‌లో సూర్యాస్తమయం చూడడం అనేది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే కోణార్క్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక శిల్పాలు, ఇతర నాగరికతల అవశేషాలను సైతం చూడవచ్చు. #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
710 views
4 months ago
*కోనసీమలో కొలువైన ఏకాదశ రుద్రులు* *శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు* *”విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమ:” అని రుద్రనమకంలో చెప్పబడినది.* *దీనిప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు – 1. విశ్వేశ్వరుడు 2.మహాదేవుడు 3. త్రయంబకుడ 4.త్రిపురాంతకుడు 5.త్రికాగ్నికాలుడ 6.కాలాగ్నిరుద్రుడు 7. నీలకంఠుడు, 8,మృత్యుంజయుడు 9.సర్వేశ్వరుడు 10. సదాశివుడు 11. శ్రీమన్మహాదేవుడు* *ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొనివున్నారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకేచోట చూస్తే మంచిదనే విశ్వా సంతో వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు*. *1. #విశ్వేశ్వరరుద్రుడు- వ్యాఘ్రేశ్వరం. (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వరస్వామి): పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివ లింగరూపాన్ని పొందిందని కథ. వ్యాఘ్రము శివునిగా అవతరించు టచే వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను* *2. #మహాదేవరుద్రుడు- కె.పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి): విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళ డానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అపుడు శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపుమనెను. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి)లో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను*. *3. #త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి): రావణుని సంహరించిన తరువాత శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండ గా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచి పోయింది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించెనని కథ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందు కు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనంద రామేశ్వ రుడని పిలువబడెను.* *4. #త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వే శ్వరస్వామి): తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సం#హ రింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామం లో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కథ. అపుడు ఆ గ్రామపు బ్రాహ్మ ణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను..* *5. #త్రికాగ్నికాలరుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి): మూడు అగ్నుల యందు హోమం చేసిన ద్రవ్యా లను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని పొందుటచే త్రికాగ్నికాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతి ష్ఠింపబడి నది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వరస్వామిగా కొలువబడుచున్నాడు*ఆదిత్యయోగీ* *6. #కాలాగ్నిరుద్రుడు- ముక్కామల (బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ రాఘవేశ్వరస్వామి): రావణ సంహారం తరు వాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను, ఖడ్గం ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింప బడుట వల్ల రాఘవేశ్వరస్వామి అని, పాండవ వనవాసంలో శివుడు అర్జు నుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్యపరా క్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ* . *7. #నీలకంఠరుద్రుడు- మొసలపల్లి (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి): దేవతలు- రాక్షసులు క్షీరసాగర మధన సమయం లో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసికొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలను అందించేవాడు, అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించిన వాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను*. *8. #మృత్యుంజయరుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి): శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యు ముఖము నుండి రక్షించి, యముని జయించి ”మృత్యుంజయుడు” అయ్యె ను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వ రస్వామిగా పిలువబడెను.* *9. #సర్వేశ్వరరుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి): దక్షుని యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్ప డిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిద అయినపుడు శివుడు ఆగ్రంహంచి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూట ములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీర భద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసాడు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేదపండి తు లైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*. *10. #సదాశివరుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరు గొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణు వును తన పాదాలను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదాలను కను గొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*. *11. #శ్రీమన్మహాదేవరుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు): పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవు డు పుల్లేటికుర్రు గ్రామంలో లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి ”పుండరీకపురము” అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీ కము అనగా వ్యాఘ్రము (పులి) అని అర్ధం. వ్యాఘ్రేశ్వరరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుటచేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*. *సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు..* జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః 🙏 #తెలుసుకుందాం #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
818 views
4 months ago
న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు............!! న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 1. సూర్యుడు..! 1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి! (శ్రీకాకుళం) 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి! (తూర్పుగోదావ‌రి) 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి! (తూర్పు గోదావరి) 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి! (కర్నూలు) 2. చంద్రుడు..! 1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం). (ప‌శ్చిమ గోదావ‌రి ) 2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి! (తూర్పుగోదావ‌రి) 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి! పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి! (కృష్ణా జిల్లా) 4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు! (నెల్లూరు) 3. అంగార‌కుడు (కుజుడు)..! 1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి! మ‌రియు చోడ‌వ‌రం (కృష్ణా జిల్లా) 2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి!మ‌రియు పెద్దాపురం (తూర్పుగోదావ‌రి) 3.పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు. (గుంటూరు) కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురిలాంటి నృసింహ క్షేత్రదర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది. 4. బుధుడు..! 1. ద్వార‌కా తిరుమ‌ల‌! (ప‌శ్చిమ గోదావ‌రి) 2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి! (తూర్పుగోదావ‌రి) 3.శ్రీకాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు. 4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి! (చిత్తూరు) 5. బృహ‌స్పతి (గురువు)..! 1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు. (గుంటూరు) 2. అలంపురంలో బ్రహ్మదేవుడు. (మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ) 3.కోటిప‌ల్లిలో కోటిలింగేశ్వర స్వామి! మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి! (తూర్పుగోదావ‌రి) 4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి! కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి! (గుంటూరు) 6. శుక్రుడు..! 1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, సింహాచ‌లం ల‌క్ష్మీ దేవి. (విశాఖ) 2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీదేవి! (చిత్తూరు) 3. పెంచ‌ల‌కోన ఆదిల‌క్ష్మీదేవి! (నెల్లూరు) 7. శ‌ని..! 1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి! (తూర్పుగోదావ‌రి) 2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు! (అనంత‌పురం) 3. విజ‌యవాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి! (కృష్ణా జిల్లా) 4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి! (ప్రకాశం) 8. రాహువు, 9. కేతువు..! 1. శ్రీ కాళ‌హ‌స్తి! (చిత్తూరు) 2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి! (తూర్పుగోదావ‌రి) 3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గాదేవి! (కృష్ణా జిల్లా) 4. సంప‌త్ వినాయ‌క స్వామి! (విశాఖ) 5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, తెనాలి వైకుంఠ‌పురం పుట్ట. (గుంటూరు) #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
729 views
5 months ago
🌺 హాటకేశ్వరం క్షేత్రం – శ్రీశైల మహాత్మ్యం లోని బంగారు కాంతి క్షేత్రం 🌺 ప్రారంభం: భారతదేశం ఆధ్యాత్మిక సంపదతో నిండిన దేశం. అటువంటి పవిత్ర క్షేత్రాలలో శ్రీశైలం మహాక్షేత్రానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి అనే జ్ఞానశక్తులు సాక్షాత్కారంగా వెలసినవి. అదే శ్రీశైలం ప్రదేశంలో హాటకేశ్వరం అనే అరుదైన, అద్భుతమైన దేవాలయం భక్తులను ఆశీర్వదిస్తోంది. 🔱 హాటకేశ్వర దేవాలయ స్థాపన “హాటకేశ్వరము” అనే పేరుకు అర్థం — హాటకం అంటే బంగారం, ఈశ్వరుడు అంటే పరమశివుడు. అంటే “బంగారంలా ప్రకాశించే శివలింగం” అని భావం. ఈ దేవాలయంలో లింగం స్వయంభువంగా (తనంత తాను) ఒక కుండపెంకులో ఆవిర్భవించింది. ఆ కారణంగా ఈ క్షేత్రం “స్వయంభు హాటకేశ్వర క్షేత్రం”గా పూజింపబడుతుంది. ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం పరిధిలోని ఒక చిన్న, కానీ అత్యంత పవిత్రమైన స్థలం. హాటకేశ్వర లింగం స్వల్ప పరిమాణంలో ఉండి బంగారు వర్ణ కాంతిని వెదజల్లుతుంటుంది. 🌸 భ్రమరాంబా అమ్మవారి అనుబంధం శ్రీశైలంలోని భ్రమరాంబా అమ్మవారి ఆలయం సమీపంలోనే హాటకేశ్వర దేవాలయం ఉంది. శంకరాచార్య స్వాములు స్వయంగా భ్రమరాంబా ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇది దేవీ ఆరాధనకు, తంత్ర మార్గానికి అత్యంత పవిత్ర స్థలం. తల్లిముందు కుంకుమార్చన చేస్తే ఆ మహిళకు త్రిపురసుందరి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. ఆ అమ్మవారి సన్నిధిలో భక్తురాలు కూర్చుని భక్తితో ఆర్చన చేస్తే — “ఆమె మూడు తరములు చూసి, జీవితాంతం సుఖశాంతులతో జీవించి, చివరికి తన భర్త తొడమీద తల ఉంచి ప్రాణం విడిచే అదృష్టం పొందుతుంది.” ఇలాంటి వ్రత విశ్వాసం శ్రీశైల భ్రమరాంబా క్షేత్రంలోని ఆధ్యాత్మిక శక్తి ప్రవాహానికి నిదర్శనం. 🔔 పూజా విధానం హాటకేశ్వర దేవాలయానికి ప్రత్యేకమైన పూజ విధానం ఉంది: మొదట భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించాలి. ఆ తరువాత భ్రమరాంబా అమ్మవారి శ్రీచక్రం వద్ద కుంకుమార్చన చేయాలి. చివరగా హాటకేశ్వర లింగం వద్ద అబిషేకం చేసి బిల్వదళాలు సమర్పించాలి. ఈ విధంగా చేసిన పూజ కామకళానిధి శివశక్తి సమ్మేళనంగా పరిగణించబడుతుంది. 🪔 హాటకేశ్వర క్షేత్ర మహిమ ఈ క్షేత్రంలో రాత్రి పూజలు, మహాశివరాత్రి వేళ జరిగే అభిషేకాలు అత్యంత పవిత్రమైనవి. గురు–శిష్య పరంపరలోని అనేక మఠాధిపతులు ఇక్కడ తపస్సు చేశారు. హాటకేశ్వర లింగం వద్ద ధ్యానం చేస్తే అష్టసిద్ధులు, నవనిధులు, జ్ఞానప్రకాశం లభిస్తాయని విశ్వాసం. తపోభూమిగా ప్రసిద్ధి చెందిన ఈ స్థలంలో చింతామణి సిద్ధులు, నాగార్జున మునులు, శివయోగులు సాధన చేసినట్లు పురాణాలు పేర్కొంటాయి. 🏞️ క్షేత్ర దృశ్య వైభవం హాటకేశ్వర ఆలయం చిన్నదైనా — దాని చుట్టూ ఉన్న శ్రీశైల అరణ్య పర్వతాలు, మల్లికార్జున ఆలయ శిఖరాలు, నల్లమల అడవి నిశ్శబ్దం ఆధ్యాత్మిక ఆవేశాన్ని కలిగిస్తాయి. సాయంత్ర వేళ సూర్యాస్తమయం సమయంలో బంగారు కాంతులు లింగం మీద పడుతుంటే అది నిజంగా హాటకం లాంటి దివ్యదృశ్యంగా కనిపిస్తుంది. 🖋️ ముగింపు హాటకేశ్వరం కేవలం ఒక దేవాలయం కాదు — అది శివశక్తి మేళనం యొక్క సాక్షాత్కారం. భక్తి, ధ్యానం, స్త్రీశక్తి, తపస్సు — ఇవన్నీ ఒకే చైతన్య రూపంలో ఇక్కడ కలిసినట్టు అనిపిస్తుంది. శ్రీశైల యాత్రలో హాటకేశ్వరం దర్శనం లేకుంటే ఆ యాత్ర పూర్తి అయినట్టుగా భావించరాదు. 🌹❤🌹❤🌹❤🌹❤🌹❤🌹❤ #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #save Hindu temples #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳