TRS= BRS KCR PARTY 🤠

Mohan
558 views
11 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 8 లక్షల ఇళ్లు కాదు.. 16 వేలే రెండున్నరేళ్లలో కేవలం 16 వేల ఇందిరమ్మ ఇళ్లకే నిధులు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం…మరోవైపు 8 లక్షల ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే కట్టి ఇచ్చేసినట్లు పొంగులేటి బిల్డప్ కాంగ్రెస్ 1000 రోజుల పాలన ప్రకటనలో 4.5 లక్షల ఇళ్లు అప్పుడే ఇచ్చేసినట్లు అబద్ధాలు నిజానికి ఆఖరి బిల్లు అందుకున్న 16 వేల లబ్ధిదారులకు ఇంకా రూ. 30 వేలు పెండింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరికి కూడా పూర్తిగా అందని ఇందిరమ్మ ఇళ్ల రూ. 5 లక్షల సహాయం ఏడాదిగా ఆఖరి బిల్లు ఇవ్వకుండా లబ్ధిదారులను అప్పులపాలు చేసిన కాంగ్రెస్ సర్కారు 70% మందికి ఇంకా అందని రెండో బిల్లు.. ఏడాదిగా రూ. 1.60 లక్షల బిల్లు పెండింగ్ రూ. 5 లక్షలు ఇస్తారని అప్పులు చేసి ఇళ్లు కడితే.. కనీసం రూ. 3 లక్షలు కూడా దక్కని వైనం హైదరాబాద్‌లో రూ. 6 లక్షలకు ఇందిరా టవర్స్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రకటన లక్కీ డ్రా తీసి అప్పుడే ఇళ్లు ఇచ్చేశామన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న పొంగులేటి 10 ఏళ్లలో హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉచితంగా ఇచ్చిన కేసీఆర్
Mohan
819 views
18 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 100 రోజుల్లో 6 గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేస్తామన్నారు.. మాయమాటలతో గద్దెనెక్కి.. 1000 రోజులైనా ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు! మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌పై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాగ్రహం🔥 వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామంటున్న తెలంగాణ ప్రజలు✊ #CongressFailedTelangana
Mohan
1.6K views
21 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party నిన్నటివరకు నిరంతర విద్యుత్తు వెలుగులతో దేశాన్నే నివ్వెరపరిచిన తెలంగాణ.. ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనలో అదే కరెంటు వ్యవస్థచుట్టూ కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. విద్యుదుత్పత్తి మందగించడం, తగినంత సరఫరా లేకపోవడం, కరెంటు కోతలు కాంగ్రెస్‌ వెయ్యిరోజులపాలన సాధించిన ఘనత! నిర్వహణ వైఫల్యాలు, అసంబద్ధ నిర్ణయాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్రాన్స్‌కోతో ఆటలాడుతున్నది. మొన్న రైతుడిస్కమ్‌.. నిన్న స్మార్ట్‌మీటర్లు.. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌కోను బలిపీఠమెక్కిస్తున్నది. రూ.68 వేల కోట్ల ఆస్తులున్న రాష్ట్ర విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ను అమ్మేందుకు సిద్ధమైంది. అదీ కేవలం రూ.3500 కోట్ల కోసం 26శాతం వాటాల విక్రయానికి నిర్ణయించుకున్నది. ఈమేరకు పవర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ప్రతిపాదించడంతో ఐపీవో దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రాన్స్‌కో ఆస్తుల మదింపు కోసం ప్రైస్‌వాటర్‌ కూపర్స్‌ సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిరయించుకున్నట్టు సమాచారం. రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ట్రాన్స్‌కో)ను అమ్మేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఆ సంస్థలోని 26 శాతం వాటాను విక్రయించేందుకు తెలంగాణ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకున్నది. దీంతో ట్రాన్స్‌కోలో ప్రభుత్వ వాటా 74 శాతానికి పడిపోతుంది. ఫలితంగా షేర్‌ మార్కెట్‌ లాభనష్టాలపై ఆధారపడి ఆ సంస్థ నడువాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాన్స్‌కో ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగని, భవిష్యత్తులో మరింత వాటాను విక్రయించి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రమాదం ఉన్నదని విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీజీ ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది. ఆ సంస్థకు దాదాపు రూ.68 వేల కోట్ల ఆస్తులున్నాయి. వాటా విక్రయం కోసం ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితి, నిధుల అవసరం, భవిష్యత్తు ప్రణాళికలు తదితర వివరాలతో ఓ నివేదికను రూపొందించి త్వరలో సెబీ అనుమతి కోరనున్నారు.
Mohan
725 views
1 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 🎯 14లోపు సాగర్‌ నీళ్లివ్వకపోతే.. మహా పాదయాత్ర ✊🏻📣 ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం 💥📢 వినాయక చవితి పండుగ డెడ్‌లైన్, కోదాడ నుంచి హాలియా నేనే యాత్ర చేస్తా 🚨 వరద లేకపోయినా వెలిగొండకు నీళ్లు ఇస్తావ్? వెలిగొండకు నీళ్లతో గురుదక్షిణ తీర్చుకుంటున్నావ్ 🗳️ ఓట్లు వేసి గెలిపించడమే 'సాగర్' రైతుల నేరమా? ⚠️ కళ్లున్నా చూడలేని కబోదులు నల్లగొండ కాంగ్రెస్ మంత్రులు 💥 మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్‌రెడ్డీ... సాగర్‌ ఎడమ కాలువ కింద ఉన్న రైతులు ఏం పాపం చేశారు? వాళ్లు నీకు ఏం ద్రోహం చేశారు? నీకు ఓట్లు వేసి, నీ ఎమ్మెల్యేలను గెలిపించి, నిన్ను ముఖ్యమంత్రిని చేయడమే ఈ ప్రాంత రైతులు చేసిన తప్పా? మిర్యాలగూడ, పాలేరు, మధిర, నకిరేకల్‌, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతులకు వెంటనే నీళ్లివ్వాలి. రక్తం రుచి మరిగిన కాంగ్రెస్‌ అనే పులి మళ్లీ వచ్చింది. మనం మన ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వాలని అడుగుతున్నం. నీళ్లు ఇవ్వుమన్నందుకు బీఆర్‌ఎస్‌ వాళ్లను కోసి, ఆ రక్తంతో పంట పొలాల్లో చల్లుతామని రేవంత్‌రెడ్డి అంటున్నడు. అలాంటి రక్తపిశాచి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. మిర్యాలగూడ వేదికగా ప్రభుత్వానికి చేస్తున్న హెచ్చరిక ఒక్కటే. మీకు సరిగ్గా పది రోజలు గడువు ఇస్తున్నాం. సెప్టెంబర్‌ 14 వినాయక చవితి పండుగలోపు నీళ్లు ఇచ్చే షెడ్యూల్‌ విడుదల చేయాలి. ఎన్ని నీళ్లు, ఎన్ని తడులకు ఇస్తారో ప్రకటించాలి. లేకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకూ పాదయాత్ర చేస్తం. మీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకూ పోరాటం చేస్తం.
Mohan
4.3K views
2 days ago
#పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party ఇది నిజమైనమాట సొల్లు కబుర్లు చెప్పి కాలయాపన చేస్తూన్న మార్పు పాలన డిపాజిట్ కూడా రాదు
Mohan
725 views
2 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party "బెసిన్లు తెల్వదు. ట్రిబ్యునల్స్ తెల్వదు, సజ్జెక్టు లేదు.. బూతులు తప్ప తెలుగు కూడా సక్కగా రాదు. ఈయన మాటలు వినడానికి అసెంబ్లీకి కేసీఆర్ రావాలని ఉపన్యాసాలు ఇస్తుండు. కానీ.. రేవంత్ రెడ్డికి చెంచాగిరి చేయటం మాత్రం బాగా తెలుసు. చంద్రబాబుకు చెంచాగిరి చేయటం, గురువుగారి గురుదక్షిణ కోసం.. గోదావరి, కృష్ణా నీళ్లను సంతార్పణ చేయటం మాత్రం బాగా తెలుసు. చంద్రబాబు చెంచా రేవంత్ రెడ్డి. అలాంటి చెంచాల పాలన తెలంగాణలో నడుస్తోంది." అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి???
Mohan
632 views
2 days ago
#🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 📢 అసమర్థత.. అవినీతి.. అరాచకం 🚨 ⚠️ ఆర్థిక విధ్వంసం.. సామాజిక సంక్షోభం.. సాంస్కృతిక విద్రోహం.. ఇదే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన 🆘 📣 అభయ‘హస్తం’.. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ⛔ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వరెస్ట్‌ ప్రభుత్వమిది 🗑️ వెయ్యి రోజులు క్రిమినల్‌ వేస్ట్‌.. జీరో వాల్యూ 🚫 రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ద్రోహం 💼 జాబులు నింపుమంటే జేబులు నింపుకొంటుండ్రు 🤑 వాటాల కోసం కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి కొట్లాట 💰 దందాలకు అడ్డాగా ముఖ్యమంత్రి నివాసం 💥 బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం 📃 రేవంత్‌ వెయ్యి రోజుల పాలనపై చార్జ్‌షీట్‌ విడుదల అజ్ఞానం.. అరాచకం.. అవినీతి.. అబద్ధం.. అనే నాలుగు తలలతో బుసకొడ్తున్న అనుముల నాగుపాము పాలన ఇది! వెయ్యి రోజులుగా రైతులను రాచిరంపాన పెడ్తున్న రాక్షస పాలన ఇది! నిరుద్యోగులను నిండాముంచిన, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన, విద్యార్థులకు విషం పెట్టిన పరమ నికృష్ట పాలన ఇది! కేసీఆర్‌ మాటలో చెప్పాలంటే అన్ని రంగాలను భ్రష్టు పట్టించిన సర్వభ్రష్ట ప్రభుత్వమిది! అనుముల అనుయాయులు, అన్నదమ్ములు, పొంగులేటి తాబేదార్లు భూములు, వనరులను కొల్లగొడుతున్నారు, 22-ఏ పేరుతో కోట్లాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను హింసిస్తున్నారు. నాడు గురువు చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిండు. నేడు శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ కోటి ఎకరాల మాగాణాన్ని నిషేధించిండు. ఒక్కో ఎకరానికి 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నడు. ఇది ముమ్మాటికీ కమీషన్లు, పర్సంటేజీల పాలనే. ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన. తెలంగాణను ఢిల్లీకి తాకట్టుపెట్టిన సామంతుల పాలన. జలద్రోహం చేస్తున్న జలగల పాలన.