మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని

PSV APPARAO
1.6K వీక్షించారు
3 నెలల క్రితం
PSV APPARAO
1.1K వీక్షించారు
3 నెలల క్రితం
#ధనుర్మాసం నెలగంట సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం పూజలు #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) కార్యనిర్వహణాధికారి కార్యాలయం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం మహోత్సవాలు తేదీ 10,డిసెంబర్ 2025, బుధవారం. డిసెంబర్ 16 నుండి జనవరి 19 వరకు ప్రత్యేక ఉత్సవాలు, దర్శన వేళల్లో మార్పులు ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో రాబోయే ధనుర్మాసం సందర్భంగా పలు ప్రత్యేక ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా భక్తుల దర్శన వేళల్లో మరియు ఆర్జిత సేవల్లో తాత్కాలిక మార్పులు చోటుచేసుకుంటాయి. ధనుర్మాసం ప్రారంభం 16.12.2025 మధ్యాహ్నం గం. 01:01 నిమిషాలకు శ్రీ స్వామివారి సన్నిధిలో "నెలగంట పెట్టుట" (ధనుర్మాసం ప్రారంభం) జరుగును. (16.12.2025): ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆ రోజు ఉదయం సుమారు గం. 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం గం. 02:30 నిమిషాల వరకు స్వామివారి దర్శన నిలుపుదల చేయబడును. తేది. 20.12.2025 నుండి తేది. 29.12.2025 వరకు. ఈ పది రోజుల పాటు దేవాలయంలో శ్రీ స్వామివారి పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు మరియు కనుమ పండుగ సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీ స్వామి వారి తిరువీధి ఉత్సవములు, విశేష సేవలు జరుగును. ఈ ప్రత్యేక ఉత్సవాల కారణంగా, పైన పేర్కొన్న తేదీలలో (20.12.2025 నుండి 29.12.2025 వరకు) నిత్యము జరుగు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును. తేది. 30.12.2025 నుండి తేది. 09.01.2026 వరకు రాపత్తు ఉత్సవములు జరుగును. ఈ సందర్భంలో ప్రతి రోజు సాయంత్రం గం. 05:00 లకు శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవములు వైభవంగా జరుగును. రాపత్తు ఉత్సవాల కారణంగా, ఈ తేదీలలో (30.12.2025 నుండి 09.01.2026 వరకు) రాత్రి గం. 07:00 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి దర్శనములు లభించును.రాత్రి దర్శన వేళల్లో మార్పులు గమనించ గలరు. కుడారై ఉత్సవం తేది: 11.01.2026 ఆ రోజు గం. 09:00 నుండి గం. 10:30 వరకు శ్రీ స్వామి వారి దర్శనాలు నిలిపివేయబడును. సుప్రభాతం & ఉదయం ఆరాధన టిక్కెట్ల రద్దు తేదీలు: 16.12.2025 నుండి 19.01.2026 వరకు ధనుర్మాసం దృష్ట్యా ఈ కాలంలో: సుప్రభాతం సేవ ఉదయం ఆరాధన టిక్కెట్లు రద్దు చేయబడుచున్నవి. గోదా కళ్యాణం — భోగి పండుగ తేది: 14.01.2026 గోదా కళ్యాణం — భోగి పండుగఈ రోజు ప్రత్యేకంగా "గోదా కళ్యాణం" సాయంత్రం 05:00 నుండి 06:30 వరకు వైభవంగా జరగును. సాధారణంగా ఉదయం జరుగు నిత్యకళ్యాణం ఈ రోజు గోదా కళ్యాణంతో కలిపి సాయంత్రం జరుగును. భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా దేవస్థానం కోరుచున్నది. సహస్రనామార్చన టిక్కెట్ల రద్దు తేదీలు: 30.12.2025 నుండి 19.01.2026 వరకు ఈ తేది లలో సహస్రనామార్చన సేవ టిక్కెట్లు రద్దు చేయబడును. భక్తులకు వినతి పైన తెలిపిన తేదీలు, సమయాలు, దర్శన మార్పులు, రద్దు చేయబడిన ఆర్జిత సేవలను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ దర్శన, సేవ కార్యక్రమాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవలసిందిగా దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నది మీడియా మాధ్యమాలు— దినపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా పై సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా తెలియజేయవలసిందిగా కోరడమైనది. సుజాత ఎన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం
🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
1K వీక్షించారు
4 నెలల క్రితం
🙏🌺మార్గశిర గురువారం వ్రతం🌺🙏 🌺మార్గశిర లక్ష్మీవారం పూజ అనేది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడం. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీపూజ చేయడం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు. ఈ క్రమంలో మార్గశిర గురువారం వ్రతం. 🌺 🌺 శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం ఆయన సతీమణి మహాలక్ష్మీ దేవికి సైతం ఇష్టమైనదే! అయితే.. ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి నాలుగు లేదా ఐదు గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని.. వరాల జల్లు కురుపిస్తుందని నమ్మకం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం వల్ల మిగిలిన పదకొండు మాసాల్లోనూ అష్టలక్ష్మీవైభవం కలుగుతుందట.. ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ వార వ్రతం పూజ విధానం, చదవాల్సిన మంత్రాలు. 🌺 🌺మొదటి గురువారం - నవంబర్‌ 27 రెండో గురువారం - డిసెంబర్‌ 4 మూడో గురువారం - డిసెంబర్‌ 11 నాలుగో గురువారం - డిసెంబర్‌ 18 మొదటి గురువారం - పులగం నివేదించాలి రెండో గురువారం - అట్లు, తిమ్మనం నివేదించాలి మూడో గురువారం - అప్పాలు, పరమాన్నం నివేదించాలి నాలుగో గురువారం - చిత్రాన్నం, గారెలు నివేదించాలి🌺 🌺మార్గశిర మాసంలో గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మం ముందు, తులసి కోట వద్ద, పూజ మందిరంలో ఆవు నెయ్యితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు భాగం లేదా ఈశాన్య భాగంలో ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రము పరచి దానిపై కొత్త ధాన్యం పోయాలి. తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చుట్టూ బియ్యపు పిండితో ముగ్గు వేసి.. పూలు పండ్లతో అలంకరించాలి. 🌺 🌺 అనంతరం మహాగణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడి పూజ అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిర్వహించాలి. 🌺 🌺హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం సమర్పించాలి. 🌺 🌺ఇప్పుడు శక్తివంతమైన లక్ష్మీ దేవి మంత్రాలు చదవాలి. ముఖ్యంగా *ఓం మహాదేవ్యే చ విద్మహే.. విష్ణు పత్నేచ ధీమహే.. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌* *ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః||".* అనే లక్ష్మీ గాయత్రీ మంత్రం చదువుతూ అమ్మవారికి మంత్ర పుష్పం సమర్పించాలి. ఆ తర్వాత సహస్ర దళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని భక్తితో చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించాలి. 🌺 🌺 *మార్గశిర మాసం వ్రత కథ* ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిమను చేసి ఆరాధిస్తూ ఉండేది. బాలిక సవతి తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది. చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. ఆమె పెళ్లి తరవాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకుపోయింది. అప్పటి నుంచి నిత్యదారిద్య్రం దాపురించింది. పుట్టింటివారు దారిద్య్రంతో బాధపడుతున్నారని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి, ఒక వెదురుకర్రను దొలిపించి, అందులో బంగారు నాణెములు పోసి ఇచ్చింది. మార్గమధ్యమున అతను కాలకృత్యములను తీర్చుకోవడానికి ఒకచోట ఆగి, చేతికర్రను ఒకచోట ఉంచగా.. దానిని ఓ బాటసారి తీసుకుపోయెను. చేతికర్ర లేకపోవడం చూసి నిరాశగా తమ్ముడు తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్నాళ్ళ తరువాత పుట్టింటివారి పరిస్థితిలో మార్పు లేదని గ్రహించి అక్క మళ్ళీ తమ్ముడిని రమ్మని, ఒక చెప్పుల జతలో బంగారు నాణెములు పోసి, దాన్ని వస్త్రంతో మూటకట్టి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది. దారిలో దప్పిక తీర్చుకొనుటకు ఒక కొలను దగ్గర ఆగి, మూటను గట్టుపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటను ఎవరో దొంగలించారు. 🌺 🌺మళ్ళీ తమ్ముడిని రమ్మని ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో రత్నాలు పోసి ఇచ్చింది. ఈసారి గుమ్మడికాయను ఒక బీద బ్రాహ్మణుడు తీసుకు వెళ్తాడు. తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తరువాత తల్లి మార్గశిరమాసంలో కూతురు ఇంటికి వెళ్లారు. ఆమె సవతి తల్లితో అమ్మా..! ఈ రోజు మార్గశిర లక్ష్మివారము. కనుక నోము నోచుకుందాము. నీవు ఎటువంటి ఆహారము తీసుకోకు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి తన మనవలు, మనవరాళ్ళకి చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది. చేసేది ఏమీ లేక రెండవ లక్ష్మివారం జరుపుకుందామని చెప్పింది. 🌺 🌺రెండవ లక్ష్మివారం తల్లి పిల్లలకు తలంటుతూ, గిన్నె అడుగున మిగిలిన నూనె ఊడ్చి రాసేసుకుంది. ఇక మూడవవారం నోచుకుందువు అని సముదాయించింది. మూడవవారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని.. ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి, పైన బల్లలు మూతలాగా పెట్టింది. అటు వైపు వచ్చిన పిల్లలు అరటిపళ్ళు, కొబ్బరిముక్కలు తింటూ తినగా మిగిలిన తొక్కలు, ముక్కలు గోతిలో పడేసారు. ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది. 🌺 🌺నాలుగవ లక్ష్మివారం తల్లి కొంగును, తన కొంగుకి ముడివేసుకొని తనతో తిప్పుకుంటూ, ఇంటి పనులు పూర్తి చేసి పూజకు కూర్చుంది. విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగి పోయింది. ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది. చేసిన తప్పు ఏంటని అమ్మవారిని కూతురు అడిగింది. నీ సవతితల్లి ఒక మార్గశిర లక్ష్మివారం నాడు నీ శరీరంపై పేడనీళ్ళు జల్లి, చీపురుకట్టతో కొడుతూ నానా తిట్లు తిట్టింది. అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించలేను అని చెప్పారు. దీనికి పరిష్కారం చెప్పమని కుమార్తె అడుగగా.. నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తానని చెప్పారు. అమ్మవారు చెప్పినట్లు దండించెను. పుష్యమాసంలో మొదటి గురువారం తల్లి, కూతురు అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు కరుణించి ఇద్దరినీ కూడా ఐశ్వర్యవంతులను చేసారు. 🌺 🌺అలాగే మార్గశిర లక్ష్మీ వార వ్రత కథ చదువుకుని అక్షతలు శిరసున వేసుకోవాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. ఇలా మార్గశిర మాసంలో అన్నీ గురువారాల్లో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వార వ్రతం ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలు, ఇహలోకంలో సర్వ సుఖాలు పొంది, చివరిగా మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. 🌺 🌺కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వార వ్రతం ఆచరిద్దాం.. లక్ష్మీ కటాక్షం పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః! 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ___________________________________________ HARI BABU.G __________________________________________ ##మార్గశిర లక్ష్మీ పూజ #మార్గశిర గురువారం లక్ష్మీ పూజ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 #🙏🏻గురువారం భక్తి స్పెషల్
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
838 వీక్షించారు
4 నెలల క్రితం
మార్గశిర మాసం ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది. శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా! ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!! వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది. అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు. ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను. ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ *మార్గశిర మాసం* తెలుగు మాసాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ మాసాన్ని.. అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ మాసామే ఎందుకు అంత విలక్షణమైనదో? మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో కృష్ణపరమాత్మ తాను ‘వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః’అంటే ‘ఇంద్రుడు’ అని చెబుతూనే….. తాను ‘మాసానాం మార్గశీర్షోహం’ అని ప్రకటించాడు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. సూర్యభగవానుడు.. దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనూరాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిరము అంటారు. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియచేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైనమార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్దిచెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. ‘రుతూనాంకుసుమాంకం' అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ క్రిష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట. ఉత్తమమైనవి అనగా పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహము, నెలలో మార్గశిర మాసం, వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనవని భగవద్గీతలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపారు. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు. మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదైనా.. వీటన్నింటిల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే... వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, ‘స్వర్గద్వార ఏకాదశి’, ‘మోక్ష ఏకాదశి’ అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు. దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశిరోజున మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే... మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా. ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో చేసేటటువంటి ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటంవల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి ఆ కార్యాలను నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మ రాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మార్గశిరం..ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు.. మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి.. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. తూర్పు తెలతెల వారుతుండగా..పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు.. వరిపిండితోనూ .. సున్నపుపిండితోనూ వేసి.. వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు.. తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు.. చేకూరుస్తారు.✍️ ఓంనమోభగవతే వాసుదేవాయ నమః ``` *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మోక్షానికి మార్గం మార్గశిర మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం #🙏🕉️మార్గశిర మాసం విశిష్టత☪️✍️🥰 #🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
844 వీక్షించారు
4 నెలల క్రితం
*🙏నేటినుండి మార్గశిర మాసం-విశిష్టత🙏* 🌺\|/హిందూ సాంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది.🌺 🌺\|/మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఇదే విషయాన్ని 'గీత'లో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. 🌺\|/వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది. 🌺\|/వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది. 🌺\|/ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.🌺 *🌺\|/మార్గశిరం అంటే\|/🌺* *🌺\|/‘బృహత్సామ తథాసామ్నాం - గాయత్రీ ఛందసా మహం మహం - మాసానాం మార్గశీర్షోహ-రుతూనాంకుసుమాంకం'* అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ కృష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరంఅంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట.🌺 *🌺\|/మాస సంక్రమణం\|/🌺* 🌺\|/సూర్య భగవానుడు 12 నెలల్లో అంటే ఒక్కో నెలకు ఒక్కో రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉండడాన్ని ‘మాస సంక్రమణం' అంటారు. ఇలా ఒక ఏడాది 12 సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులరాశి నుండి వ్రుశ్చికరాశిలోకి ఆగమనం చేయడాన్ని వ్రుశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైనది🌺. *🌺\|/భగవద్గీత’ జననం\|/🌺* 🌺\|/హిందువులందరికీ ‘భగవద్గీత' జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును తులసీదళంతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని.. పండితులు చెబుతుంటారు. శుక్ల పక్ష ద్వాదశినాడు పంచామ్రుతాలతో అభిషేకం చేయాలి. 🌺\|/శ్రీమహా విష్ణువుతో పాటు సూర్యభగవానుడిని పూజించి.. ఈ మాసంలో ఏ పని చేస్తున్నా *‘ఓం దామోదరయ నమః,* *ఓం నమో నారాయణయ నమః'* అనే మంత్రాలను జపించాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రతిరోజూ బ్రహ్మముహుర్తంలో తులసి సన్నిధిలోని మట్టి, ఆకులను తీసుకుని *‘ఓం నమో నారాయణాయ'* అనే మంత్రాన్ని స్తుత్తిస్తూ శరీరానికి రాసుకుని స్నానం చేయాలి.🌺 *🌺\|/మార్గశిర లక్ష్మీవార వ్రతం\|/🌺* 🌺\|/మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ.. ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం' చేయడంతో పాటు, ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూదనుడు' అనే నామంతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.🌺 *🌺\|/మోక్షం తథ్యం\|/🌺* 🌺\|/మార్గశిర మాసం ఎన్నో పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు.మార్గశిర మాసంలో ధనుర్మాసం వచ్చినట్లు ఐతే మార్గశిర శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' అని ..దీనినే ‘మోక్ష ఏకాదశి' అనీ అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మభాండాగారం అయిన భగవద్గీతను క్రిష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తులందరికీ హర్షం ఇచ్చేదే మార్గ శీర్ష మాసం.🌺 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 #🙏🕉️మార్గశిర మాసం విశిష్టత☪️✍️🥰 #ముక్తికి మార్గం మార్గశిర మాసం #మోక్షానికి మార్గం మార్గశిర మాసం #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని
S.HariBlr (Bangalore)
1.4K వీక్షించారు
4 నెలల క్రితం
#😇My Status #భక్తి స్పెషల్ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని *పర్వదినాల మాసం మార్గశిరం* *మృగశిర నక్ష త్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. హేమంత రుతువులో తొలి మాసం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ‘మాసానాం మార్గశీర్షీహం' అని మాసాలలో తాను మార్గశీర్షాన్ని అని తెలిపాడు. ఆ విధంగా ఈ మాసం భగవత్స్వరూపమే. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనది, శైవ, వైష్ణవానుయాయులకు విశిష్టమైనదిగా చెబుతారు. కార్తిక మాసం వలెనే ఈ మాసంలో కూడా శైవ వైష్ణవ సంబంధితమైన పండగలు, పర్వాలు మెండుగా ఉన్నాయి.* *మార్గశిరమాసం ప్రధానంగా శ్రీమహావిష్ణువు నిత్యానుపాయిని, సిరిసంపదలనిచ్చే సిరుల తల్లికి ప్రియమైనది. ఈ నెలలోని గురువారాలు (లక్ష్మీవారాలు) ఆ తల్లికి అత్యంతప్రియమైనవి. ఈ రోజుల్లో చేసే గురువార నోములు తెలుగు లోగిళ్లలో ముత్తయిదువలు విధిగా ఆచరిస్తారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు, ద్రౌపది మార్గశిర వ్రతాన్ని ఆచరించినట్లు పురాణ కథనం.* *ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంభువుగా వెలసిన శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి, ఆరాధిస్తారు.* *మార్గశిర మాసంలో తొలి తిథి నుంచి అన్నీ పర్వదినాలే!* *శుక్లపాడ్యమి* *ఈ మాసంలోని శుక్ల పాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైటభులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు. ఆ రోజు నుంచే కొంత కాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమయిందని పురాణ వచనం.* *విదియ తదియలు* *ఈ మాసంలోని శుక్ల విదియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయా లని 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ఉటంకిస్తోంది. ఈ వ్రతం వల్ల అప మృత్యు నివారణ జరుగుతుంది. స్త్రీలకు ఐదవతనం వృద్ది చెందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.* *పంచమి* *నాగారాధన పర్వం. నాగుల చవితి, నాగ పంచమినాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించనివారు ఈ రోజు నాగపూజను చేయా లని 'స్మృతి కౌస్తుభం' అంటోంది. ఇంటిలోనే పూజా మందిరంలో నాగ ప్రతిమనుగాని, అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి, పంచామృతాలతో, సుగంధ పుష్పాలతో పూజించాలి.* *షష్ఠి* *ఈ షష్ఠినే స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుని కుండలినీ శక్తికి ప్రతీకగా సర్ప రూపంలో పూజిస్తా రన్నది తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. సంతానం కోరేవారు శిలపై సర్ప రూపాన్ని చెక్కించి వేప, రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వ హిస్తారు. తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు.* *సప్తమి* *దీనినే నందా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది. సూర్యారాధన వల్లఆరోగ్యం చేకూరుతుంది.* *అష్టమి* *ఈ తిథి కాలభైరవాష్టమి. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు. అంతవరకూ బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతారు. శిరసు తుంచిన కాల భైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డున ప్రతిష్టించిస్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు. అయితే బ్రహ్మ తలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటులేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.* *ఏకాదశి* *మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం. ఈ రోజును వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేంచేస్తాడు. ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు. భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని, ఇలా ఏకాదశి వ్రతంచేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది. మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది. ఈ రోజున వ్యష్టిగా, సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతా పారాయణం చేస్తారు. భగవంతునితో సమా నంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం. మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.* *ద్వాదశి* *నాడు హనుమంతుని షోడషోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి, యశస్సు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమద్ర్వతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి.* *చతుర్దశి* *చతుర్దశి దత్త జయంతి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు. శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరిం చాడు. అందువల్ల దత్తుడని, అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయడని పిలుస్తారు. అధ్యాత్మ, యోగ విద్యలకు ఒజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం. కొందరు పౌర్ణమినాడు దత్త జయంతి జరపడం కద్దు.* *బహుళ పాడ్యమి* *దశావతారాలలో ఒకటైన పరశురామావతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి. జమదగ్ని, రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు. పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు. మహావీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు.* *అమావాస్య* *మార్గశిర అమావాస్య దక్షుని పుత్రుడైన విశ్వకర్మ జయంతి. శివుని వల్లఎన్నో వరాలు పొంది శిల్పులు, స్వర్ణకారులు యంత్రాలు నడిపే కార్మికులకు, చేనేత పనివారికి, స్థపతులకు పూజనీయుడయ్యాడు.* *ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం. వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతి రోజు వేకువనే ఆచరిస్తారు. ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయినీ వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాశురం (పాట) పల్లవించింది. ఆ ముప్పై పాశురాలు 'తిరుప్పావై'గా 'నాలాయిరం' అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. భక్తి తత్త్వం, తాత్త్విక చింతన, ఉపనిష త్సారంతోబాటు ఛందోబద్దమైన ఈ పాశురాలు తమిళ వాఙ్మయంలో మకుటాయమానమైనవి. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు 'తిరుప్పావై' గానం చేస్తారంటే ఈ పాశురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది. అలాగే శివాలయాల్లో నాయనార్లు రచంచిన 'తిరువెంబావై' (శివుని కీర్తిస్తూ పాడిన పాటలు)ని సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు. ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది. భోగి పండగ వరకూ సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం. మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు.* ❀꧁హరేకృష్ణ꧂❀ 🍁🔔🍁 🙏🕉️🙏 🍁🔔🍁
S.HariBlr (Bangalore)
1K వీక్షించారు
4 నెలల క్రితం
#😇My Status #భక్తి స్పెషల్ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం శుభాకాంక్షలు *విష్ణుమయం మార్గశీర్షం.....* *మార్గశీర్ష మాసం వచ్చింది. పవిత్రమైన మాసాలలో ఇది ఒకటి. సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో* *'బృహత్సామ తథా సామం గాయత్రీ ఛందసామహం* *మాసానాం మార్గశీర్షిహం ఋతూనాం కుసుమాకరః'* *అన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. సామవేదంలో బృహత్సామం, ఛందస్సుల్లో గాయత్రి, మాసాల్లో మార్గశీర్షం,ఋతువుల్లో వసంత ఋతువు నేనని ఆయనే చెప్పారు. మాసాల్లో తాను మార్గశీర్షం అన్నాడంటే ఇక దాని గొప్పతనాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఇది విష్ణుప్రియమైన మాసం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్నందున ఈ మాసాన్ని మార్గశిరం అంటారు. అలాగే దీనికి మార్గశీర్షం అనే పేరుకూడా ఉంది. దానికి కారణం ఇది జీవనానికున్న మార్గా లలోకెల్లా ఉత్తమమైనదని అర్థం. ఉత్తమ మార్గం వైదిక మార్గం కనుక అది అనుసరించాలని సూచించే మాసంగా పేర్కొంటుంటారు.* *మార్గశిర మాసంలో పంటల సమృద్ధి, పూలు పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఒకప్పుడు ఈ మాసంలో కొత్త పంట చేతికొచ్చేది. ఆ కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నివే దించే ఆచారం ఉండేది. మరో పక్క వేదవేత్తలు కొత్త ధాన్యం తో యజ్ఞాలు చేసేవారు. ఆ విధంగా కూడా ఈ మాసం ఉత్కృ ష్టమైనదని పెద్దలు చెబుతారు. ఈమాసం విష్ణు ప్రియం అను కున్నాం. అయితే విష్ణు వక్షస్థల నివాసి అయిన లక్ష్మీదేవికి కూడా ఇది ప్రీతికరం. వాటికంటె కూడా ఈ నెలలో వచ్చే గురువారాలు మరీ ప్రీతికరం. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవికి సంబంధించిన ఒక వ్రతం చేయాలని చెబుతారు. అదే మార్గశిర లక్ష్మీవారవ్రతం. లక్ష్మీవారం అంటే ఏమిటి అనే సందేహం కొన్ని ప్రాంతాలవారికి రావచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు. ఆ పేరుతో ఈ వ్రతం ప్రచారంలోకి వచ్చింది. ఈ వ్రతం ఐశ్వర్య ప్రాప్తినిస్తుంది. స్వయంగా శ్రీకృష్ణుడే ఈ వ్రతాన్ని ఆచరించమని ద్రౌపదికి చెప్పాడని, ఆమె ఆచరించిందని చెబుతారు.* *అది కాక దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది.* *పూర్వం ఒక బాలిక ఉండేది. చిన్న తనంలోనే ఆమె తల్లి చనిపోయింది. సవతి తల్లి పెంచేది. అయితే ఆమెపై ఇంటిపని బరువంతా వేయడంతో పాటు వేధించేది. ఆమె బాధను చూసి ఆ ఊరి ఆలయ పూజారి ఆమెను లక్ష్మీ ఆరాధన చేయమని చెప్పాడు. ఆమె ఎవరి వద్దో లక్ష్మీదేవి చెక్క బొమ్మ ఒక్కకి తెచ్చి దానిని పూజించేది. సవతి తల్లితనకు పుట్టిన బిడ్డను చూడమని, అందుకు గాను బాలికకు ఒక చిన్న బెల్లం ముక్క ఇచ్చేది. దానినే ఈ బారిక లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేది ఇలా రోజులు గడిచాయి. బాలిక యుక్త వయస్కురాలయింది. వివాహం చేద్దామనుకున్నారు. ఉత్తముడైన భర్త దొరికాడు. ఆమె చేసిన లక్ష్మీ దేవి పూజ ద్వారా ఆ ఇంటికి వచ్చిన ఐశ్వర్యం ఆమెతో పాటే తరలిపోయింది. ఆమె పుట్టింటి వారు ఆర్థిక బాధలు పడసాగారు. ఇది తెలిసిన ఆమె. వారికి రకరకాలుగా సాయం చేయాలని ప్రయత్నించింది. అయితే ఆమె పంపిన డబ్బు, ఇంగారం వంటివి వారికి చేర కుండా ఏవో అవరోధాలు వచ్చాయి. చివరకు ఆమె ఒకసారి పుట్టింటికి వచ్చింది. మార్గశీర్ష లక్ష్మీవారవ్రతం చేద్దామని చెప్పింది. అయితే మొదటి గురువారం వరకు సవతి తల్లి మొత్తం నాలుగు లక్ష్మీవారాలు ఏదో ఒక విధంగా వ్రత నియ మాలు పొరపాటున ఉల్లంఘించింది. ఐదో లక్ష్మీవారమైనా చేద్దామని సవతి తల్లిని కనిపెట్టి ఉండి వ్రతం చేయించింది. తాను చేసింది. వ్రతం పూర్తయిన తర్వాత ఆమె పెట్టిన నైవేద్యం బూరెలను లక్ష్మీదేవి లీలామాత్రంగ వచ్చి ఆరగించింది. సవతి తల్లి పెట్టిన నైవేద్యాన్ని ఆమె స్వీకరించలేదు. దానికి కారణం ఏమిటని అడగ్గా, ఆమె నిన్ను చిన్నతనంలో కోపం వచ్చినప్పుడు చీపురుతో కొట్టేదని, ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలైనందున వారిని ఆ విధంగా కొట్టినందుకే తాను ఆ నైవేద్యం స్వీకరించలేదని చెప్పింది. దానితో సవతి తల్లి లక్ష్మీ దేవికి క్షమాపణ చెప్పడంతో నైవేద్యాన్ని స్వీకరించి వారికి ఐశ్వర్యాన్నిచ్చిందని కథ.* *ఏ పవిత్రమాసమైనా అందరు దేవతలకు ప్రీతికరమని చెప్పాలి. ముఖ్యంగా ఈ మాసంలో శివుణ్ని పొగడ పూలతో అర్చిస్తే కైలాసానికి వెళ్లవచ్చని పెద్దల మాట. ఇది కాక ఈ నెలలోనే జ్ఞాన స్వరూపుడు, సంతానాభివృద్ధికి అధిదేవుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించే సుబ్రహ్మణ్య షష్టి వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠినే కొన్ని చోట్లస్కంద షష్ఠి అంటారు. అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణునికి సంబంధించిన గీతా జయంతి, గురు స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతి వంటి పర్వాలు కూడా వస్తాయి. ఈ మాసంలో గంగా స్నానం చేస్తే కోటి గ్రహణ స్నానాలు చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఈ నెలలో విశేషంగా విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణు ఆరాధన, విష్ణ్వాలయాల సందర్శన అధిక పలాన్ని ఇస్తుంది.* ꧁హరేకృష్ణ꧂ 🍁📿🍁 🙏🕉️🙏 🍁📿🍁