తెలుసుకుందాం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.4K views
14 hours ago
లక్ష్మీ కటాక్షం కోసం.............!! ప్రతి రోజు చేసే నిత్య పూజ లో లక్ష్మీ దేవి ఫొటో కానీ విగ్రహం కానీ... పసుపుకుంకుమా, పువ్వులు తో అలంకారం చేసి.. ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని. ఈ పూజ చేయాలి.. పూజ విధానం....... 108 ఒక్కరూపాయి బిల్లలు తీసుకుని లక్ష్మీ అష్టోత్తరం తో ఒక్కో నామం చదువుతూ.. ఒక్కో రూపాయి బిళ్ళ అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి..హారతి ఇవ్వాలి రోజూ మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు కానీ శుక్రవారం మటుకు బెల్లంఅన్నం నివేదన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వరులు అయిపోతారు అని నేను చెప్పను కానీ.. మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు అప్పు చేసే అవసరం రాదు, అప్పు ఉన్న కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటుంది... ఈ పూజకు ఆహార నియమాలు , ఇంక ఏమైనా నియమాలు అంటూ లేదు కానీ లక్ష్మీ దేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు. రోజూ ఈ కాసులు పూజ ఐయాక కూడా అక్కడే ఉంచాలి రోజూ అవే వాడాలి .ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికి ఇవ్వకూడదు.. ఖర్చు పెట్ట కూడదు.పూజ 41 రోజు మొక్కుకొని చేయవచ్చు. తర్వాత కూడా ఎన్ని రోజులైనా చేయవచ్చు. ఈ పూజ ఇదే విధంగా తామర గింజలు తో,పసుపు కొమ్ములతో కూడా చేయవచ్చు. స్తోమత ఉన్నవారు.108 వెండి కానీ బంగారు పుష్పాలతో అష్టోత్తరం చదివి పూజ చేయవచ్చు. మంత్రం ఉపదేశం ఉన్న వారు లక్ష్మీ గాయత్రి, లక్ష్మీ మూల మంత్రం, కమలదేవి మంత్రం తో ఇదే విధంగా 108 సార్లు అర్చన చెలుకోవచ్చు. లక్ష్మీ దేవికి నేతితో దీపారాధన శ్రేష్టం, నువ్వులు నూనె ,కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. నిమ్మపండు పులిహోర, పెసరపప్పు చేసుకోవచ్చు.సెనగలు.ఇష్టమైన నైవేద్యం.. లక్ష్మీ పూజకు, కుబేర పూజకు .ధన ప్రాప్తి కోసం చేసే పూజలో సువాసన గల ఆగరబతి గాని సాంబ్రాణి కానీ.సువాసన గల పుష్పలు.పూజ మందిరం సువాసన తో ఉండాలి పూజలో ఇది ముఖ్యమైన విషయం. రోజూ కుదరని వాళ్ళు ప్రతి గురువారం, శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఈ రూపాయి బిల్లలు బీరువాలో పెట్టుకోవచ్చు లేదా నిత్యం పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు ఉంచడం మంచిది. #తెలుసుకుందాం #🪔శ్రావణ మాసం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏 #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
620 views
14 hours ago
*శ్రావణ శనివారం వేంకటేశ్వరస్వామిపూజ* శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేషపూజ ఉంది. పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేద్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర ఆలయం దర్శంచి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా శ్రావణ మాసంలో శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణశాస్త్రాలు, గ్రంధాలు చెబుతున్నాయి. #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔శ్రావణ మాసం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
970 views
4 days ago
శ్రావణ మాసం వస్తోంది............!! పండుగలకు గృహ శోభ కి విశేష మాసం శ్రావణ మాస విశిష్టత ...... వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మే. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పూర్వీకుల ఉవాచ. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మానం ఇదే. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. శ్రావణ సోమవారం ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు శ్రావణ మంగళవారం కొత్త పెళ్లికూతురు శ్రావణమాసంలో వచ్చే ప్రతిమంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు, నిండు ముత్తెదుతనం పొందుతారు. శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు. శ్రావణ శుక్రవారం ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం శ్రావణ శనివారాలు ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. నాగుల చవితి నాగుల చవితి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి ని నాగదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, నాగ దేవతలకు పాలు పోస్తే సంతానానికి సంబంధించిన దోషాలు అన్ని తొలుగుతాయి. సర్పదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శ్రీ సంతోషిమాతా వ్రతం శ్రావణ పూర్ణిమ రోజుని శ్రీ సంతోషీ మాతా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున సంతోషిమాతా వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. శ్రీ సంతోషిమాతా వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్నిశుభాలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వాహన యోగంతో పాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మహిళలు భావిస్తారు. . రక్షా బంధనం శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. మహిళలు తమ అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టి వారి క్షేమం కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది. హయగ్రీవ జయంతి శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణాల్లో ఉంది. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతాలు, విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్లు నైవేద్యం పెట్టటం మంచిది. మనలో ఉండే అహంకారం తొలగిపోయి అందరిలో సమ భావన కలిగి ఉంటారు. #తెలుసుకుందాం #🕉️పవిత్ర శ్రావణ మాసం🙏 #🪔శ్రావణ మాసం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
807 views
7 days ago
*🙏వేంకటేశ్వరస్వామి ఎందుకు ఆయుధాలు దరించకుండా మనకు దర్శనమిస్తాడు...!!🙏* 🌹🙏వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.!!🙏🌹 🌿సింహాద అనే దైత్యుడు మహాదుష్టుడు, బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ, గంధర్వ, యక్ష కిన్నెరా కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరం సంపాదిస్తాడు. 🌸దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దేవతల మోర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని శరణు వేడమని సలహా ఇస్తాడు. 🌿తొండమానుడు వారికి అభయం అయితే ఇస్తాడు కానీ సింహాద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టమణి తొండమానునికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు. 🌸దేవతలతో పోరాటానికి సింహాద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్ధ స్థలంలో యుద్ధం చేసాడని పురాణం చెబుతోంది. 🌿తొండమానుడు స్వామి వారి ఖడ్గం, గద, ధనస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక 100 సార్లు తల తెన్చినా మరల బ్రతికి వచ్చేవాడు. ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు. 🌸స్వామి వారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు. అలా సంహరించిన ఆయుధాలు మరల స్వామి వద్దకు వెళ్ళిపోతాయి. తొండమానుడు స్వామి వారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు. 🌿స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు, అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా వుండాలి, 🌸స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు. వింత కోరిక. 🌿స్వామి వారు సరే అని చెప్పి, కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మిమ్పచేస్తాడని, అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు. 🌸స్వామి వారి ఆయుధాలు ఒకొక్క తీర్ధంలో వసించడం మొదలుపెడతాయి. కపిలతీర్ధమే చక్రతీర్ధం, 🌿దానిపై వరుసగా శంఖ తీర్ధ, శాంగతీర్ధం, నందక తీర్ధం, కౌమోదక తీర్ధం అని పంచాయుధ తీర్దాలున్నాయి. ఆ తీర్దాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వేంకటాచలం వస్తారు. 🌸తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ్య కీర్తనలో కూడా వివరించారు. కొండలలో నెలకొన్న ఉదాహరణకి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు. 🌿భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చిన వారు సింహాదను చంపెవారే ఎందుకంటె.. చంపేవి భగవంతుని శక్త్యాయుధాలు కానీ వారు కాదు కాబట్టి. 🌸వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చును కానీ పిలిపించి, అడక్కుండా అనుగ్రహించి, అతనికి కీర్తిని ఇవ్వడానికే, చేసిన భక్తి శ్రద్ధలకు, కైన్కర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామి వారు ఈ లీల చేసారు. 🌿మనకేది మంచో, మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు...మనం చూపించవలిసనిదల్లా ఆయన మీద భక్తిశ్రద్ధలు. 🌸ఆ ద్వాపరంలోని శ్రీ కృష్ణుడే నేడు వేంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు... ఓం శ్రీనివాసో రక్షతు!! ఓం నమో వేంకటేశాయ..!!.🙏 🙏లోకా సమస్తా సుఖినోభవంతు.🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.4K views
8 days ago
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 🌹 శ్రీవారి గర్భగుడిలో ఎన్ని విగ్రహాలు పూజలందుకొంటాయి 🌹 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 శ్రీవారి గర్భగుడిలో మూలవిగ్రహముతో పాటుగా కౌతుకబేరము, ఉత్సవబేరము, స్నపనబేరము, బలిబేరము అనే విగ్రహాలు పూజలందుకొంటాయి. అంటే మొత్తముగా ఐదు విగ్రహాలుంటాయి. అవి (1) ద్రువబేరము (2) కౌతుకబేరము (3) స్నపనబేరము (4) ఉత్సవబేరము (5) బలిబేరము. ఈ ఐదు విగ్రహాలు వైష్ణవవైఖాసన ఆగమము ప్రకారం సందర్భోచితంగా పూజలందుకొంటాయి. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవాలయాలు ఇదే వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తాయి, అయితే తిరుమల క్షేత్రం వైఖానస ఆగమాన్నే ప్రధానంగా పాటిస్తుంది. గ్రామశ్రేయస్సు కొరకు ద్రువబేరానికి పూజలు నిర్వహిస్తారు. ద్రువబేరమంటే మరేమి కాదు మూలవిగ్రహమే. దీన్నే స్థిరమైన, చలింపని విగ్రహంగా భావిస్తారు కనుకనే "ధ్రువ" అనే పేరు వచ్చింది. వైఖానసనాగము ప్రకారము గర్భగుడిలోని దేవుడు రెండు రకాలు. ఒకటి కంటికి కనిపించే బేరము, అంటే సాకారరూపమన్నమాట. రెండోది కంటికి కనబడని దేవుడు. ఈ దేవుడినే నిరాకారరూపుడని అంటారు. కనుక తిరుమలలోని తిరువెంగడనాథుని (శ్రీ వేంకటేశ్వరుని) రూపము సాకారమన్నమాట. మూలబేరాన్ని శిల, మట్టి, దారువు (కట్టె)లతో నిర్మించాలి. వీటికే నిత్యపూజలు వైఖాసన లేదా పాంచరాత్ర ఆగమాల ప్రకారము పూజలు జరపాలి. ద్రువబేరానికి అభిషేకముండదు, ఎందుకంటే మూలవిగ్రహం అత్యంత పవిత్రమైనదిగా, స్పర్శకు అతీతమైనదిగా భావించబడుతుంది. పాలు నేయి తేనె ఘృతం (పెరుగు) వంటి వాటితో తిరుమంజనసేవలు / అభిషేకాలు కౌతుకబేరానికి చేస్తారు. కౌతుకబేరమంటే దినసరిపూజకు ఏర్పాటుచేసిన బంగారు /వెండి/ పంచలోహాలతో చేసిన విగ్రహం. మూలవిగ్రహంలో వుండే శక్తిని కౌతుకబేరములోకి ఆవాహన చేసి పూజలు నిర్వహించి, సాయంత్రం పూజ ద్వారా తిరిగి ఆ శక్తిని మూలవిగ్రహంలోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియనే ఉద్వాసనమంటారు. మూడవదైన విగ్రహము ఉత్సవవిగ్రహము. పుర ఊరేగింపునకు ద్రువబేరాన్ని తీసుకువెళ్ళటానికి వీలుకాదు కనుక ఉత్సవబేరాన్ని ఊరేగిస్తారు. తిరుమలలో ఈ ఉత్సవమూర్తినే "మలయప్పస్వామి" అని పిలుస్తారు, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాలలో వాహనసేవలకు ఈ మూర్తినే ఊరేగిస్తారు. స్నపనబేరాన్ని అమ్మవారి విగ్రహాలతో పాటుగా కోనేరుకు తీసుకువెళ్ళి చక్రవారి స్నానము చేయిస్తారు. ప్రతిదేవాలయంలోనూ ప్రధానమూర్తితో పాటు పరివారదేవతలుంటారు. వీరిని ఉపదేవాలయాలలో వుంచి పూజిస్తారు. గరుడ, నంది, వినాయక, శ్రీదేవి భూదేవి, భైరవ, పరశురామ, బలరామ, యక్షగంధర్వ దేవతలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. చివరిది ఐదవదైన బలిబేరాన్ని పరివారదేవతలకు బలి ఇవ్వటానికి ముందు అర్చిస్తారు. బలి ఇవ్వడమంటే జంతువధ చేయడం కాదు. బల్యాన్నాన్ని (బలి అన్నము) ను సమర్పించడమే. కొన్ని ఆగమవిధానాలలో మూలవిగ్రహానికి అభిషేకము కూడా చేస్తారు. నిరాకార రూపుడైన భగవంతునికి అకారపూజా విధులేమి వుండవు, భక్తిప్రవృత్తులే ఇక్కడ ప్రధానము. ఈ పంచబేరాల విధానం కేవలం తిరుమలకే పరిమితం కాక, వైఖానస ఆగమాన్ని అనుసరించే అనేక దక్షిణ భారత వైష్ణవాలయాలలో కూడా విస్తృతంగా అమలులో ఉందని ఆగమశాస్త్ర పండితులు పేర్కొంటారు. ఏడుకొండలవాడా వెంకటరమణా ☆ \|/ ♧ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏 #TTD తిరుపతి తిరుమల #తిరుమల తిరుపతి దేవస్థానం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.3K views
23 days ago
ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి విశేషం పండరీపురంలో శ్రీ పాండురంగస్వామి యాత్ర – చూడటానికి రెండు కళ్లు సరిపోవు! భారతదేశం అనేక దివ్యక్షేత్రాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, పురాణ ప్రాశస్త్యం, భక్తి సంప్రదాయం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఎంత ప్రసిద్ధమో, మహారాష్ట్రలోని పండరీపురం కూడా అంతే ప్రసిద్ధి చెందిన వైష్ణవ పుణ్యక్షేత్రం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో, భీమా నది (చంద్రభాగా నది) తీరాన వెలసిన ఈ పవిత్రక్షేత్రంలో శ్రీ మహావిష్ణువు శ్రీ పాండురంగ విఠలుడు (విఠోబా) రూపంలో కొలువై ఉన్నారు. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి వస్తుంటారు. పండరీపురానికి చేరుకున్న భక్తులు ముందుగా చంద్రభాగా నదిలో పవిత్ర స్నానం చేసి, అనంతరం పుండలీక మహర్షిని దర్శించి, తర్వాత శ్రీ పాండురంగస్వామి వారి ఆలయానికి వెళ్తారు. ఈ విధానాన్ని అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. పుండలీకుడి మహాభక్తి పండరీపురం క్షేత్ర మహిమ వెనుక పుండలీకుడి భక్తి ప్రధాన కారణంగా పురాణాలు చెబుతున్నాయి. ప్రారంభంలో పుండలీకుడు ఇహలోక సుఖాలకు బానిసై, తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. వారు విష్ణుభక్తులైనా, అతను వారిని గౌరవించలేదు. కాలక్రమేణా మహనీయుల ఉపదేశంతో పుండలీకుడికి జ్ఞానోదయం కలిగింది. తన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో జీవితాన్ని మార్చుకుని, తల్లిదండ్రుల సేవనే పరమధర్మంగా స్వీకరించాడు. ఆయన పితృభక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో శ్రీమహావిష్ణువు స్వయంగా పుండలీకుడి ఇంటికి విచ్చేశారు. ఆ సమయంలో పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. వెంటనే లేచి రాలేక, సమీపంలోని ఒక ఇటుకను శ్రీహరికి విసిరి, “ప్రభూ! దయచేసి ఈ ఇటుకపై నిలబడి కొద్దిసేపు వేచి ఉండండి. ముందుగా నా తల్లిదండ్రుల సేవను పూర్తి చేస్తాను” అని వినయంగా ప్రార్థించాడు. భక్తుని పితృభక్తికి పరమానందం చెందిన శ్రీమహావిష్ణువు ఆ ఇటుకపై రెండు చేతులను నడుముపై ఉంచుకుని నిలబడి, పుండలీకుడి కోసం వేచి చూశాడు. సేవ పూర్తయిన తరువాత పుండలీకుడు భక్తిపూర్వకంగా శ్రీహరిని దర్శించి నమస్కరించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు, “ఏదైనా వరం కోరుకో” అని అనగా, పుండలీకుడు “ప్రభూ! మీరు ఈ పుణ్యక్షేత్రంలో శాశ్వతంగా నిలిచి, యుగయుగాల పాటు భక్తులను అనుగ్రహించాలి” అని ప్రార్థించాడు. భక్తుని కోరికను మన్నించిన శ్రీహరి అక్కడే శిలారూపంలో నిలిచిపోయాడు. అదే నేటి శ్రీ పాండురంగ విఠలస్వామి దివ్యరూపంగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈ కారణంగానే పండరీపురం క్షేత్రం పితృభక్తికి ప్రతీకగా, భక్తికి పరమ నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి విశేషం చంద్రభాగా (భీమా) నది మహిమ పండరీపురం క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహించే భీమా నది అర్ధచంద్రాకారంలో ప్రవహించడం వల్ల దీనిని చంద్రభాగా నది అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి, మనస్సు పవిత్రమవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే పండరీపురానికి చేరుకున్న ప్రతి భక్తుడు ముందుగా చంద్రభాగా నదిలో పవిత్ర స్నానం చేసి, అనంతరం క్షేత్ర దర్శనాన్ని ప్రారంభిస్తాడు. ఈ స్నానాన్ని పుణ్యప్రదమైనదిగా, మోక్షప్రదమైనదిగా భావిస్తారు. పుండలీక మహర్షి ఆలయం చంద్రభాగా నదిలో స్నానం చేసిన తరువాత భక్తులు ముందుగా పుండలీక మహర్షి ఆలయాన్ని దర్శిస్తారు. పండరీపురంలో శ్రీ పాండురంగస్వామి కొలువై ఉండటానికి పుండలీకుడి భక్తియే కారణమని స్థలపురాణం తెలియజేస్తుంది. అందువల్ల పుండలీకుడిని దర్శించిన తరువాతే పాండురంగస్వామి దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. పుండలీక మహర్షిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే, స్వయంగా శ్రీహరిని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ పాండురంగస్వామి ఆలయం పుండలీక మహర్షిని దర్శించిన అనంతరం భక్తులు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పూజా సామగ్రిని తీసుకుని భక్తిశ్రద్ధలతో ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయానికి ప్రధాన ప్రవేశద్వారం సంత్ నామదేవ్ మహాద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ ద్వారం పండరీపుర భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. మహాద్వారం సమీపంలోనే మహాభక్తుడు సంత్ చోఖామేళాకు అంకితమైన మందిరం ఉంది. శ్రీ పాండురంగస్వామిపై అపారమైన భక్తి కలిగిన చోఖామేళా, భక్తుల ప్రార్థనలను స్వామివారి సన్నిధికి చేర్చే మహాభక్తుడిగా గౌరవింపబడుతున్నాడు. అదేవిధంగా సంత్ నామదేవ్ మహారాజ్ విగ్రహాన్ని దర్శించి, ఆయన పవిత్ర మెట్లను నమస్కరించిన తరువాతే ప్రధాన గర్భగుడి వైపు వెళ్లడం అనాదిగా కొనసాగుతున్న ఆచారం. గర్భగుడిలో దివ్య దర్శనం గర్భగుడిలో ఎత్తైన పీఠంపై రెండు చేతులను నడుముపై ఉంచుకుని నిలబడి ఉన్న శ్రీ పాండురంగ విఠలస్వామి వారి దివ్యమంగళ విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆ స్వామివారి కరుణామయమైన రూపాన్ని చూసిన ప్రతి భక్తుడి హృదయం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, సంప్రదాయ ప్రకారం భక్తులకు స్వామివారి పవిత్ర పాదాలను స్పర్శించి నమస్కరించే అవకాశం లభిస్తుంది. ఆ దివ్యస్పర్శ భక్తుల జీవితంలో మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. స్వామివారిని ప్రధానంగా తులసీదళాలతో అర్చిస్తారు. తులసీదళాలతో చేసిన పూజను శ్రీహరి అత్యంత ప్రీతిగా స్వీకరిస్తారని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. రుక్మిణీదేవి ఆలయం స్థలపురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు పుండలీకుడి కోరిక మేరకు పండరీపురంలోనే నిలిచి ఉండగా, ఆయనను వెతుకుతూ వచ్చిన శ్రీ రుక్మిణీదేవి కూడా ఈ క్షేత్రానికి విచ్చేసింది. తనకు తెలియజేయకుండా కృష్ణుడు ఇక్కడికి రావడంతో అమ్మవారు అలిగి, స్వామివారి ప్రధాన ఆలయానికి కొంత దూరంలో నివసించారని కథనం చెబుతుంది. అందుకే పండరీపురంలో శ్రీ రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో భక్తులు కుంకుమార్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆలయంలోని రుక్మిణీదేవి పాదాలను భక్తులు భక్తిశ్రద్ధలతో స్పర్శించి నమస్కరించవచ్చు. ఉపాలయాల విశిష్టత ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సత్యభామాదేవి, శ్రీ రాధాదేవి, శ్రీ దత్తాత్రేయస్వామి, శ్రీ కాలభైరవస్వామి, శ్రీ సూర్యనారాయణస్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర దేవతలకు అంకితమైన ఉపాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శించడం ద్వారా భక్తులు సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందుతారని విశ్వసిస్తారు. ఆషాఢీ ఏకాదశి మహిమ పండరీపురంలో జరిగే ఉత్సవాలలో ఆషాఢ శుక్ల ఏకాదశి (ఆషాఢీ ఏకాదశి) అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దీనినే శయన ఏకాదశి, దేవశయనీ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. ఈ పవిత్ర తిథి నాడు పండరీపురం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆలయమంతా నామసంకీర్తనలు, భజనలు, అభంగాలు, హరినామ స్మరణలతో మారుమోగిపోతుంది. భక్తులు "విఠల్... విఠల్... జై హరి విఠల్..." అంటూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ "వారీ" పాదయాత్ర ఆషాఢీ ఏకాదశి సందర్భంగా జరిగే "వారీ" పాదయాత్ర ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. మహారాష్ట్రలోని ఆలంది నుండి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వారి పాలఖీ, దేహు నుండి సంత్ తుకారాం మహారాజ్ వారి పాలఖీ వేలాది మంది వార్కరి భక్తులతో కలిసి వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పండరీపురం చేరుకుంటాయి. మార్గమంతా భక్తులు అభంగాలు పాడుతూ, హరినామ సంకీర్తన చేస్తూ, భగవన్నామ స్మరణలో మునిగిపోతారు. ఈ యాత్రలో జాతి, మతం, కులం, ధనిక–పేద అనే భేదాలు ఉండవు. అందరూ భగవంతుని సన్నిధిలో సమానులే అనే సందేశాన్ని ఈ వారీ యాత్ర ప్రపంచానికి చాటిచెబుతుంది. వార్కరి సంప్రదాయం పండరీపురం వార్కరి సంప్రదాయానికి కేంద్రబిందువుగా ప్రసిద్ధి చెందింది. "వారీ" అంటే ప్రతి సంవత్సరం నియమితంగా పండరీపురానికి పాదయాత్ర చేయడం. ఈ సంప్రదాయాన్ని పాటించే భక్తులను వార్కరీలు అని పిలుస్తారు. వార్కరీలు సత్యం, అహింస, దయ, సేవ, భక్తి వంటి సద్గుణాలను జీవితంలో ఆచరిస్తారు. తులసీమాలను ధరించి, "రామకృష్ణ హరి", "జై జై రామకృష్ణ హరి", "విఠల్ విఠల్" అనే నామాలను నిరంతరం జపిస్తూ భక్తిమార్గంలో నడుస్తారు. మహాభక్తుల పుణ్యభూమి పండరీపురం అనేక మంది మహాభక్తుల తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. వారిలో ముఖ్యులు: - సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ - సంత్ నామదేవ్ మహారాజ్ - సంత్ తుకారాం మహారాజ్ - సంత్ ఏకనాథ్ మహారాజ్ - సంత్ చోఖామేళా - సంత్ జనాబాయి - సంత్ సక్కుబాయి ఈ మహాభక్తులు విఠలుని మహిమను అభంగాల రూపంలో ప్రపంచానికి పరిచయం చేశారు. వారి భక్తి, వైరాగ్యం, సేవాభావం నేటికీ కోట్లాది మంది భక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సక్కుబాయి భక్తి శ్రీ పాండురంగస్వామిపై అపారమైన భక్తి కలిగిన సంత్ సక్కుబాయి జీవితం భక్తికి ప్రతీకగా నిలిచింది. కుటుంబ సభ్యుల వేధింపులను భరించిన ఆమెను స్వయంగా శ్రీ పాండురంగుడు రక్షించి, ఆమె సేవలను తానే స్వీకరించాడని భక్తి సంప్రదాయం చెబుతుంది. ఆషాఢీ ఏకాదశి సందర్భంగా సక్కుబాయి భక్తిని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భీమా (చంద్రభాగా) నది పురాణం స్థలపురాణం ప్రకారం, త్రిపురాసురుడిని సంహరించిన అనంతరం పరమేశ్వరుడు తీవ్రమైన అలసటతో సహ్యాద్రి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి కారిన చెమటధారలు ఒక ప్రవాహంగా మారి భీమా నదిగా అవతరించాయని పురాణాలు పేర్కొంటాయి. పండరీపురం వద్ద ఈ నది అర్ధచంద్రాకారంలో ప్రవహించడం వల్ల దీనిని చంద్రభాగా నది అని పిలుస్తారు. ఈ పవిత్ర నదిలో స్నానం చేసి, అనంతరం శ్రీ పాండురంగస్వామిని దర్శిస్తే జన్మజన్మల పాపాలు నశించి, విష్ణు అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తికి నిలువెత్తు నిదర్శనం పండరీపురం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ఇది భక్తికి, సేవకు, పితృభక్తికి, నామసంకీర్తనకు ప్రతీక. భక్తుడి కోసం ఇటుకపై నిలబడి ఎదురుచూసిన భగవంతుని దివ్యక్షేత్రం ఇదొక్కటే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా పండరీపురాన్ని దర్శించి, శ్రీ పాండురంగ విఠలస్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుందాం. శ్రీ పాండురంగాష్టకం శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన ఈ పవిత్ర స్తోత్రం శ్రీ పాండురంగ విఠలస్వామి వారి మహిమను అద్భుతంగా వర్ణిస్తుంది. «మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః । సమాగత్య తిష్ఠంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 1 ॥» «తటిద్వాససం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ । పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 2 ॥» «ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ । విధాతుర్వసత్యై ధృతో నాభికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 3 ॥» «స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ । శివం శాంతమీడ్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 4 ॥» «శరచ్చంద్రబింబాననం చారుహాసం లసత్కుండలాక్రాంతగండస్థలాంగమ్ । జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 5 ॥» «కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంతభాగం సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః । త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 6 ॥» «విభుం వేణునాదం చరంతం దురంతం స్వయం లీలయా గోపవేషం దధానమ్ । గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 7 ॥» «అజం రుక్మిణీప్రాణసంజీవనం తం పరం ధామ కైవల్యమేకం తురీయమ్ । ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ॥ 8 ॥» ఫలశృతి «స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ । భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి ॥» ఇతి శ్రీ పాండురంగాష్టకం సంపూర్ణమ్। ఆషాఢీ ఏకాదశి సందేశం ఆషాఢీ ఏకాదశి మనకు ఉపవాసం యొక్క గొప్పతనాన్ని మాత్రమే కాదు, భక్తి, సేవ, వినయం, నామస్మరణ, మాతాపితృ సేవ అనే ఐదు మహోన్నత విలువలను కూడా గుర్తుచేస్తుంది. పుండలీకుడి పితృభక్తి, సంత్ జ్ఞానేశ్వర్, తుకారాం, నామదేవ్, సక్కుబాయి వంటి మహాభక్తుల నిష్కపట భక్తి, శ్రీ పాండురంగుని అపార కరుణ – ఇవన్నీ కలిసే పండరీపురాన్ని భూలోక వైకుంఠంగా నిలబెట్టాయి. పండరీపురానికి వెళ్లే ప్రతి యాత్రికుడు కేవలం ఒక దేవాలయాన్ని మాత్రమే దర్శించడు; భక్తి అనే జీవన మార్గాన్ని అనుభవిస్తాడు. ముగింపు భక్తుని కోసం ఇటుకపై నిలబడి వేచి చూసిన దయామయుడు శ్రీ పాండురంగ విఠలుడు. మాతాపితృ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి ఆచరణలో చూపించిన పుండలీక మహాభక్తుడు. నామసంకీర్తనే మోక్షమార్గమని చాటి చెప్పిన మహనీయుల పుణ్యభూమి పండరీపురం. జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి, శ్రీ పాండురంగ విఠలస్వామి వారి కృపాకటాక్షాలను పొందాలని ప్రతి భక్తుడు సంకల్పించాలి. జై జై రామకృష్ణ హరి! జై జై విఠల్! పాండురంగ విఠల్! శ్రీ పాండురంగ విఠల స్వామికి జయము! 🙏 #తెలుసుకుందాం #తొలి ఏకాదశి #🌻" తొలి ఏకాదశి శుభాకాంక్షలు "🌻 #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 #పాండురంగ స్వామి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.5K views
1 months ago
శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) 🙏🏻🔱🌺 అర్జున ఉవాచ | శ్లోకం 1: నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని | కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే || 1 || అర్థం: ఓ సిద్ధులకు సేనానివైన దేవీ! ఆర్యా! మందర పర్వతంపై నివసించేదానా! కుమారీ, కాళీ, కాపాలి, కపిల వర్ణంలో ఉండేదానా, నల్లని-పింగళ వర్ణం కలిగిన దానా, నీకు నమస్కారం. శ్లోకం 2: భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తు తే | చండీ చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని || 2 || అర్థం: ఓ భద్రకాళీ! నీకు నమస్కారం. మహాకాళీ! నీకు నమస్కారం. చండీ, చండే! నీకు నమస్కారం. సంసార సాగరం నుండి తరింపజేసేదానా, శ్రేష్ఠమైన రంగు కలిగిన దానా, నీకు నమస్కారం. శ్లోకం 3: కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే | శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే || 3 || అర్థం: ఓ కాత్యాయనీ! మహా భాగ్యవంతురాలా! భయంకర రూపం కలిగిన దానా! విజయ స్వరూపిణీ, జయ అనే పేరు కలిగిన దానా! నెమలి పింఛం జెండాగా ధరించిన దానా, రకరకాల ఆభరణాలతో అలంకరించబడిన దానా! శ్లోకం 4: అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి | గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే || 4 || అర్థం: భయంకరమైన శూలాన్ని ఆయుధంగా కలిగిన దానా! ఖడ్గం, డాలు ధరించిన దానా! శ్రీకృష్ణుని చెల్లెలివైన దానా! జ్యేష్ఠాదేవీ! నందగోపుని వంశంలో పుట్టిన దానా! శ్లోకం 5: మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని | అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే || 5 || అర్థం: మహిషాసురుని రక్తం అంటే ఇష్టపడే దానా! ఎల్లప్పుడూ కౌశికి రూపంలో ఉండేదానా, పసుపు వస్త్రాలు ధరించిన దానా! పెద్దగా అట్టహాసం చేసేదానా, తోడేలు ముఖం కలిగిన దానా, యుద్ధం అంటే ఇష్టపడే దానా, నీకు నమస్కారం. శ్లోకం 6: ఉమే శాకంభరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని | హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తు తే || 6 || అర్థం: ఓ ఉమాదేవీ! శాకంభరీ! తెల్లని దానా, నల్లని దానా! కైటభుడిని చంపిన దానా! బంగారు కన్నులు, వికృత కన్నులు, పొగ రంగు కన్నులు కలిగిన దానా, నీకు నమస్కారం. శ్లోకం 7: వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి | జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || 7 || అర్థం: వేదాల్లో చెప్పబడిన మహా పుణ్య స్వరూపిణీ! బ్రాహ్మణులను కాపాడే దానా! అగ్నిలో పుట్టిన దానా! జంబూక అనే ప్రదేశంలో, స్మశానాల్లో, దేవాలయాల్లో ఎల్లప్పుడూ నివసించే దానా! శ్లోకం 8: త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ | స్కందమాతా భగవతీ దుర్గా కాంతారవాసిని || 8 || అర్థం: నువ్వే అన్ని విద్యలలో బ్రహ్మవిద్యవు. జీవులకు మహానిద్రవు. స్కందునికి తల్లివి, భగవతివి, దుర్గవి, అడవుల్లో నివసించే దానివి. శ్లోకం 9: స్వాహాకారః స్వధాకారశ్చ వషట్కారశ్చ వాఙ్మయీ | త్వమేవ సంధ్యా సావిత్రీ గాయత్రీ జననీ పరా || 9 || అర్థం: యజ్ఞాల్లో "స్వాహా", పితృకార్యంలో "స్వధా", హోమంలో "వషట్" అనే మంత్రాలు నువ్వే. వాక్కు స్వరూపిణివి నువ్వే. సంధ్య, సావిత్రి, గాయత్రి, జగన్మాతవు నువ్వే. శ్లోకం 10: త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్ సృజ్యతే జగత్ | త్వయైతత్ పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా || 10 || అర్థం: ఓ దేవీ! ఈ విశ్వాన్ని భరించేది నువ్వే. ఈ జగత్తును సృష్టించేది నువ్వే. పాలించేది నువ్వే. ప్రళయంలో లయం చేసేది కూడా నువ్వే. శ్లోకం 11 - ఫలశ్రుతి: విశుద్ధేన హృదా యస్తు త్వాం సదా పరిపూజయేత్ | రణే విజయమాప్నోతి కీర్తిం చైవాప్నుయాన్నరః || 11 || అర్థం: స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తారో, వారు యుద్ధంలో విజయం పొందుతారు. గొప్ప కీర్తిని కూడా పొందుతారు. శ్రీ దుర్గా స్తోత్రం సంపూర్ణం || విశిష్టత: కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడు ఇది చదివి దుర్గమ్మ ప్రత్యక్ష వరం పొందాడు. "విజయం నీదే" అని అమ్మ చెప్పింది.🙏🏻🌺🔱 అర్జున కృతం చదివితే ఉపయోగాలు 1. విజయం గ్యారెంటీ రణే విజయమాప్నోతి - యుద్ధంలో విజయం వస్తుంది అని ఫలశ్రుతిలోనే ఉంది. ఇప్పటి కాలంలో: ఎగ్జామ్, ఇంటర్వ్యూ, కోర్టు కేసు, బిజినెస్ డీల్, కాంపిటీషన్ - దేనిలోనైనా గెలవడానికి. 2. భయం, టెన్షన్ మాయం కురుక్షేత్రంలో అర్జునుడు భయంతో వణికిపోయాడు. ఈ స్తోత్రం చదివాక ధైర్యం వచ్చింది, గాండీవం ఎత్తాడు. నువ్వు భయపడుతున్నప్పుడు 1 సారి చదివితే చాలు, గుండె ధైర్యం వస్తుంది. 3. శత్రు బాధలు తొలగిపోతాయి నమస్తే సిద్ధసేనాని - అమ్మ సేనాని. శత్రువులు, కుట్రలు, నరదృష్టి, చేతబడి అన్నీ కట్ అవుతాయి. ఆఫీస్ పాలిటిక్స్‌లో ఇరుక్కున్నోళ్లు రోజూ చదవాలి. 4. కీర్తి, పేరు ప్రతిష్టలు కీర్తిం చైవాప్నుయాన్నరః - గొప్ప కీర్తి వస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి, పేరు రావాలి అనుకునేవాళ్లకు బెస్ట్. 5. ఆటంకాలు తొలగిపోతాయి పని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతుందా? పెళ్లి కుదరట్లేదా? జాబ్ రావట్లేదా? దుర్గమ్మ అడ్డంకులు తీసేస్తుంది. "దుర్గ" అంటేనే కష్టాల కోట అని అర్థం. 6. రక్షణ కవచం యాక్సిడెంట్లు, అనారోగ్యం, దిష్టి నుండి రక్షణ. అర్జునుడికి యుద్ధంలో ఒక్క దెబ్బ కూడా తగలలేదు అమ్మ దయ వల్ల. 7. శ్రీకృష్ణుడి సపోర్ట్ దుర్గమ్మ వరం ఇచ్చినప్పుడు "నీకు నారాయణుడు తోడుగా ఉన్నాడు" అని చెప్పింది. ఈ స్తోత్రం చదివితే విష్ణు అనుగ్రహం కూడా వస్తుంది. మహాభారతంలో అర్జునుడు ఒక్కడే కాదు, యుధిష్ఠిరుడు కూడా జూదంలో ఓడిపోయాక అడవిలో ఈ స్తోత్రం చదివాడు. అప్పుడే అమ్మ ప్రత్యక్షమై అక్షయ పాత్ర ఇచ్చింది. #అర్జునకృతదుర్గాస్తోత్రం #తెలుసుకుందాం #🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి #కనక దుర్గమ్మ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.6K views
1 months ago
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏🙏 లలితా సహస్రనామం చదవటం అయిపోయాక శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః అనే ఈ మంత్రాన్ని చదవాలి. ఇది ఒక అమోఘమైన మంత్రం దీని అర్థం ఏంటంటే అమ్మవారికీ నాకూ భిన్నత్వం లేదు. అమ్మే నేను అని అర్థం. అంటే అమ్మవారిని తనతో వేరు చేయలేని విధంగా, తనలో ఒక భాగంగా భావించి ధ్యానించాలి. ఈ శ్లోకం అర్థం అది. ఈ రకంగా ఈ మంత్రాన్ని లలితా సహస్రనామ పారాయణ చేసిన అనంతరం ప్రతిసారీ స్మరించడం వలన భక్తులకి సర్వ శ్రేయస్సునీ విజయాన్నీ కలిగిస్తుంది. ఈ మంత్రాన్నే మరొక ప్రాయశ్చిత్త కర్మలో కూడా చదువుతారు. మన నోటి వెంట అపశకునం మాటలు రాకూడదు. నేను చచ్చినా పర్వాలేదు, నాకు ఇంక ఏం కలిసిరాదు, నీ గతి ఇంతే వంటి మాటలకు ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలంటే.. శుక్ల ఏకాదశిరోజు గానీ, బహుళ ఏకాదశిరోజు గానీ, ప్రతినెలా వచ్చే సంక్రమణంరోజు కానీ, పూర్ణిమ, అమావాస్య రోజులలో కానీ.. లెంపలు వేసుకుని నేను తెలిసీ తెలియక అపశబ్దములు వాడితే నేను అన్న మాటలకు ప్రాయశ్చిత్తమగును గాక అనుకుని..లలితా సహస్రనామం చదివి కాసిని నీళ్లు చేతిలోకి తీసుకుని రాగిపళ్ళెంలో గానీ ,ఇత్తడిపళ్ళెంలో గానీ, వెండిపళ్ళెంలో గానీ,పంచలోహాలపళ్ళెంలో గానీ ఆ నీళ్లు విడిచి పెట్టాలి. తదుపరి పైన చెప్పిన శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః అనే మంత్రాన్ని పఠించి ఉంగరం వేలు మధ్యవేలుతో నీళ్లను చేతితో తాకి ఆ నీటితో ముందు కుడి కన్నునూ తర్వాత ఎడంకన్నునూ తుడుచుకోవాలి. ఈ రకమైన ప్రాయశ్చిత్తము వలన ఈ జన్మలోనే కాక పూర్వజన్మలో మాట్లాడిన మాటలవలన కలిగే దోషం, సంభవించే నష్టం పోతుంది. #తెలుసుకుందాం #☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #🙏🏻sri lalitha devi #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #lalitha thripurasundari devi