తెలుసుకుందాం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
629 views
2 days ago
కొన్ని ఆలయాల గోడలపై మైథున శిల్పాలు ఎందుకు ఉంటాయి..... ఇది చాలా లోతైనా ప్రశ్న మరియు కొత్త గా మతం మారిన వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్న.. కాకపోతే వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అలాంటి మైథున శిల్పాలు అన్ని ఆలయాల పై ఉండవు కానీ తమ పూర్వ దర్మం పై నిందలు వేయడం లో ఉత్సహం కొద్ది 🐑🐑 లు ఈ ప్రశ్న కావాలనే మనల్ని అడుగు తారు. కాకపోతే ఇలాంటి లోతైన విషయాల పై అందరికి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వాటికి సమాధానం ఇవ్వలేరు. ఇప్పుడు ఆ సమాధానం నేను మీకు ఇస్తున్న. మన సనాతన ధర్మం లో 6 రకాల పూజా పద్ధతులు ఉన్నాయ్. ఆవి 1: దక్షిణా చారం 2: మధ్యమా చారం. 3: వామా చారము 4 : కౌలా చారం. 5: సమయాచారం. 6: సిద్ధాంతా చారం. విటీలో దక్షిణా చారం అనేది సాధారణం గ ప్రతి వారు చేసే పూజా విధి.ఈ ఆచారం ప్రకారం దేవతల ను సాత్విక పద్దతిలో పూజిస్తారు. ఈ విధానం అత్యుత్తమైనది. దేవతలు కూడ ఈ పూజా విధి నే ఇష్ట పడతారు. ఈ విధానం లో ఎలాంటి హింస ఉండదు. అసలు రక్తం అనే దానికి ఇందులో అవకాశం లేదు. ఇక మధ్యమా చారం అంటే ఇందులో కొంత వరకు బలులకు అనుమతి ఉంటుంది. అదికూడా కోడి,మేక,గొర్రె ఇంకా అరుదుగ దున్నపోతు ను బలి ఇస్తారు.ఇలాంటి వాటి వరకే ఈ పూజ లు సాధారణంగ గ్రామ దేవతలకు చేస్తారు. ఈ గ్రామ దేవతలను సాత్విక పూజల ద్వారా కూడ పూజించవచ్చు కానీ పామరులు తమ వద్ద ఉన్న వాటిలో శ్రేష్ఠ మైనవి తమను కాపాడే దేవతకు ఇవ్వాలి అనే ఉద్దేశం తో ఇచ్చేవే జంతు బలులు. బలి అనే పదానికి నిజమైన అర్థం జీవ హింస కాదు. దేవత కు అర్పించిన దానినే బలి అంటారు. అందుకే మనకు సాధారణ ఆలయాల్లో కూడ బలి పిఠాలు ఉంటాయి. వాటి పై భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని ఉంచుతారు. ఆ ప్రసాదాన్ని బలి అన్నము అంటారు. ఆ బలి అన్నం పక్షులు, కీటకాలు తినడం కోసం ఉంచుతారు. అందులోను దేవుని ప్రసాదాన్ని మొదట బలి పీఠం పై ఉంచిన తరువాత నే భక్తులకు ఇస్తారు. కాబట్టి మన పూజా విధానం లో పక్షులు, కీటకాలను కూడ గౌరవించే సంప్రదాయం మనది. ఇక చివరి రెండూ ఐన సమయాచారం, సిద్ధాంతాచారం అనేవి పూర్తిగా యోగులు, సిద్ధులు పాటించే పద్ధతులు. ఐతే మూడు, నాలుగు పద్ధతులు ఐన వామాచారం, కౌలాచారం అనేవి మాత్రం ఒకప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉండి ఇప్పుడు మరుగున పడిన ఆచారాలు. ఇవి పూర్తిగా తాంత్రిక పద్ధతులు ఇందులో దేవతలను పంచ మకారాలతో పూజిస్తారు. ఆ పంచ మకారాలు యేవో చూద్దాం. 1: మద్యం 2:మాంసం 3: మస్త్యం 4: ముద్ర 5:మైథునము. వీటిలో ప్రతిధి పవిత్రము గానే భావిస్తారు. మైథునం అనేది కూడ పూజా విధానం లో భాగం గానే చూస్తారు తప్ప కోరిక తో చెయ్యరు. ఇలాంటి అచారాలు 5 వ శతాబ్దం నుండి 10, 11 శతాబ్దముల మధ్య ఉచ్చ స్థితి లో ఉన్నాయ్. అందులో కూడ కౌలాచారం పద్ధతి లో పూజలు చేసే ఆలయాల గోడల పై మాత్రమే ఇలాంటి మైథున శిల్పాలు ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి పూజలకు కజురహో ఆలయం మూల కేంద్రంగా ఉండేది కాబట్టి ఆ ఆలయం లో మనకు మైథున శిల్పాలు కనిపిస్తాయి. ఈ పద్ధతులలో దశ మహా విద్యలలో నీ కొందరు తాంత్రిక దేవతలను మాత్రమే ఆరాధిస్తారు. తరువాత కాలం లో ఈ విధానం మరుగున పడిపోయింది కానీ బౌద్ధం లో కొన్ని శాఖ లు ఇప్పటికి ఈ పద్ధతులలో రహస్యం గ పూజలు చేస్తుంటారు. ఆ పద్ధతులలో పూజలు అందుకునే దేవతలు కూడ చాలా ఉగ్ర స్వరూపం కలిగి ఉంటారు. పూజలు లో చిన్న పొరపాటు జరిగిన కూడ తీవ్ర మైన శిక్ష లు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు హిందూ ధర్మం లో దక్షిణ, మధ్యమ అచారాలలో మాత్రమే పూజలు జరుగుతాయి. కాబట్టి అన్ని ఆలయాల గోడల పై ఇలాంటి మైథున శిల్పాలు ఉండవు.విటినీ మైథున శిల్పాలు అనాలి అదే సరైన పదం. శృంగార శిల్పాలు అనడం సరైన పదం కాదు అనేది నా అభిప్రాయం. ఇంకా కొన్ని గ్రామ దేవతలు లేద రాజసిక గుణం కలిగిన దేవతల ఆలయాల గోడల పై ఒక బొమ్మను మాత్రం పెడతారు. నిజానికి అది గుడి కీ వచ్చే భక్తుని చిత్తాన్ని పరీక్షించే ఉద్దేశం లో ఒక భాగం కూడ కావచ్చు. #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2K views
15 days ago
శ్రావణ శుక్రవారం - అమ్మవారికి సొంతం...........!! చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం, విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణం ఒకటి. అంతేకాదు, ఇది శ్రీమహావిష్ణువుకు జన్మ నక్షత్రం. సకల వరాలనూ ప్రసాదించే ఆ అనుగ్రహ దంపతులను (లక్ష్మీనారాయణులను) సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది! శ్రవణం అంటే వినడం అనే అర్థం కూడా ఉంది కదా! అందుకే, ఈ మాసంలో తనను సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినడమే కాదు, పెద్దలు చెప్పే ఆశీర్వచనాలను మనం విని ఆచరించడానికి కూడా ఇది ఒక గొప్ప సమయమట! నూతన వధువు అత్తవారింట అడుగుపెట్టాలన్నా; శుభకార్యాలు, గృహ నిర్మాణం వంటి పనులు ప్రారంభించాలన్నా; నోములు ఆచరించాలన్నా... శ్రావణ మాసం అత్యుత్తమం! అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే ఇక చెప్పనవసరం లేదు. స్త్రీలకు ఐదోతనాన్నీ, అష్టైశ్వర్యాలనీ అందించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు. ఎప్పటిలాగే తన చల్లని చూపును తమ మీద నిలిపి ఉంచాలని వేడుకుంటారు. శ్రావణ శుక్రవారం ఆచారాలు....... శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేస్తారు. ఇంటి గడపలకు పసుపు, కుంకుమలు అద్దుతారు. అమ్మవారిని ఫలపుష్పాలతో పూజించి... పాయసం, చక్కెరపొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలను అర్పిస్తారు. వీటితోపాటు పూర్ణం బూరెలను కూడా ప్రసాదంగా వండితే మంచిదని పెద్దలు చెబుతారు. ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తయిదువను ఇంటికి ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి, భోజనాది సత్కారాలతో సేవించి, తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తయిదువలను పేరంటానికి పిలిచి శనగలు, తమలపాకు, వక్క, అరటిపండులతో కూడిన తాంబూలాన్ని అందించి... తమకు ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారంనాడు ఆడవారు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే, రెండో వారంలో ఏదైనా అవాంతరం వస్తుందనుకునే వారు అప్పటివరకూ వేచి ఉండకుండా తొలి శుక్రవారంలోనే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరాలను ఒసగేందుకు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారమే వరలక్ష్మిదే కదా! #తెలుసుకుందాం #💐వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు🌼 #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #🔱లక్ష్మిదేవి కటాక్షం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
817 views
16 days ago
హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...........!! *1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.* *2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.* *3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము. *4. తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.* *5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.* *6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.* *7. సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.* *8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి బుధునకు, ఇనుము శని కి ఇష్టము.* *9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.* *10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.* *11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.* *12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.* *13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.* *14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.* *15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.* *16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.* *17. వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.* *18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.* *19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.* *20. కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.* *21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.* #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
🧿 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🧿🙏
1.7K views
16 days ago
*🌅 ఉదయం నిద్రలేవగానే అరచేతులను దర్శించడం శుభప్రదం🙏✨* శాస్త్రాల ప్రకారం, ప్రాతఃకాలంలో నిద్రలేవగానే మంచం మీద నుంచే ముందుగా రెండు చేతుల అరచేతులను (కరతలాలను) దర్శించాలనే విధానం సూచించబడింది. ఆ సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి— > *కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ।* > *కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం॥* *అర్థం:* అరచేతి ముందుభాగంలో శ్రీమహాలక్ష్మీదేవి నివసిస్తుంది. మధ్యభాగంలో విద్యకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీదేవి నివసిస్తుంది. అరచేతి మూలభాగంలో శ్రీగోవిందుడు నివసిస్తాడు. అందువల్ల ప్రాతఃకాలంలో నా అరచేతుల్లో ఈ దివ్య స్వరూపాలను నేను దర్శిస్తున్నాను. ఈ శ్లోకంలో ధనానికి అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మీదేవిని, విద్యకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీదేవిని, శక్తికి మూలమైన, సద్గుణాలను ప్రసాదించే, సమస్త జీవులను పోషించే పరమేశ్వరుడైన శ్రీగోవిందుడిని స్తుతించారు. దీనివల్ల ధనం, విద్య, భగవదనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. ప్రభాత సమయంలో అరచేతులను దర్శించే ఆచారం వెనుక ఒక ఆచరణాత్మక కారణం కూడా ఉంది. నిద్రలేవగానే మన కళ్లకు ఇంకా మత్తు ఉంటుంది. అలాంటి సమయంలో దూరంలోని వస్తువులపై లేదా తీవ్రమైన వెలుగుపై చూపు పడితే కళ్లపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు. అందుకే ముందుగా సమీపంలో ఉన్న అరచేతులను చూడమని ఈ విధానం సూచించబడింది. దీనివల్ల క్రమంగా చూపు స్థిరపడుతుంది. మహర్షి వేదవ్యాసుడు చేతుల ద్వారా లభించే సామర్థ్యాన్ని మానవునికి అత్యంత మేలుకరమైనదిగా పేర్కొన్నారు. అరచేతులను దర్శించే మరో అంతరార్థం ఏమిటంటే, మన చేతుల్లోనే దైవస్వరూపాన్ని దర్శించడం ద్వారా మన ఆలోచనలు భగవంతుని ధ్యానంపట్ల మళ్లుతాయి. దీని వల్ల శుద్ధమైన, సాత్వికమైన కార్యాలను చేయాలనే ప్రేరణ కలుగుతుంది. అలాగే ఇతరులపై ఆధారపడకుండా, స్వీయ శ్రమతో, వివేకంతో జీవనోపాధిని సంపాదించాలనే భావన కూడా ఏర్పడుతుంది. మనం చేసే ప్రతి కార్యానికి మూలం భగవదనుగ్రహమే అని అంగీకరించడమే ఈ ఆచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. డైలీ విష్ ఆధ్యాత్మిక ఆనందం ద్వారా మీరు సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక విశేషాలు, పండుగల ప్రాముఖ్యత, వ్రతాలు, పూజా విధానాలు, దేవతల మహిమలు మరియు జీవితాన్ని సన్మార్గంలో నడిపించే ధార్మిక సందేశాలను తెలుసుకుంటున్నారు. ఈ దివ్య జ్ఞానం మీలో భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందించుగాక. ___________________________________________ HARI ✍🏻 ___________________________________________ #😃మంచి మాటలు #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #🙏🕉️వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు🎉 #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
686 views
18 days ago
*నామస్మరణ మహత్యం* 🌹🌹🌹🌹🌹🌹🌹 ii * మనం వెలకట్టలేని సంపదలు రెండే రెండు * *ఒకటి మనశ్శాంతి. రెండోది సంతృప్తి.* * ఈ రెండింటిని సంపాదించుకున్నవాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కష్టపడఖ్ఖర్లేదు సంపాదించుకునేందుకు. *’కులదైవ (ఇలువేలుపు)’ నామ స్మరణ* చేస్తే చాలు. ఆ వెలకట్టలేని రెండు సంపదలూ లభిస్తాయి. *’ఆధ్యాత్మికత’ అనే సరస్సులో ‘నామం’ అనే రాయి వేస్తే శబ్ద తరంగాలు వెలువడతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి.*_ ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామమే *'ఆధ్యాత్మిక శబ్ద తరంగం.'* ”బెల్లం బెల్లం” అంటే బెల్లం రుచి మనకు తెలియదు. "తేనె తేనె” అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా…! బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మన అనుభవంలోకి వస్తుంది. నిజానికి దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే ఆయన మన దగ్గరుంటాడు. ఇది అనుభవైకవేద్యం. నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు. ’ఎంతకాలం నిరీక్షించాలి. ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడు’ అని సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారెవరైనా. మనం నిలబడాల్సింది ఇక్కడే. *దైవం ఒక అనుభవం.* ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది. *నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగాచేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి, ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.* *భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి వెల్లడించారు.* *పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుక్కావల్సింది సాధనయే.* *పూజ కోసం సామగ్రి కొనాలి. ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకూ, నోములకూ ఐతే కఠోరమైన నియమాలుంటాయి. యజ్ఞాలకూ, క్రతువులకూ శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోషరహితంగా చెయ్యాలి.* *కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందూ, పనులు చేస్తూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.* *భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో తేనెను పాలల్లో కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.* *నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామ స్మరణ చేయవచ్చు. విధివిధానాలూ, నిషేధాలూ లేనేలేవు..* #తెలుసుకుందాం #😃మంచి మాటలు #🚩జై శ్రీరామ 🕉️ #🚩🌺జై హనుమాన్🌺🚩 #🕉️🚩జై హనుమాన్🕉️🚩
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
672 views
22 days ago
* సకలశుభాల కొరకు శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతో లక్ష్మీపూజ * శ్రావణమాసంలో సకల శుభాలను కలిగించే పసుపు కొమ్ములతో శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి పూజ.... శ్రావణ మాసంలో ప్రతి రోజు పూజ ఇంట్లో చేసుకునే మహాలక్ష్మిఅమ్మవారి పూజకు ముందుగా మీరు ఏ కోరికతో చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి.. ఈ పసుపు కొమ్ముల పూజను శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుండి ప్రారంభించాలి. మాసం మొత్తం చేయాలి. ప్రతి రోజు ఉదయం ఇల్లు వాకిట్లో శుభ్రం చేసి ఈ నెల రోజులు గడపకు పసుపు కుంకుమా పెట్టాలి... అమ్మవారి విగ్రహం ఉన్న వారు అయితే అమ్మవారికి పసుపు నీటితో అబీషేకం చేయాలి, చేస్తున్న సమయంలో శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనుకుంటూ చేయాలి... విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటో ని అలంకరించిన చాలు, విగ్రహం ఉన్నవారు అభేషేకం ఐయ్యాక అమ్మవారికి అలంకారం చేసి, పూజకు కావాల్సిన వి సిద్ధం చేసుకుని దీపాలు అన్ని పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవాలి. కొన్ని పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి దండలాగా కట్టాలి ఈ దండను రోజు కట్టాల్సిన పని లేదు మొదటి రోజు కట్టిన పసుపుకొమ్ముల దండను నెల రోజులు వేయవచ్చు, తర్వాత మీ కోరిక ను అమ్మవారికి చెప్పుకుని యదా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించు కుని, 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి లక్ష్మిఅష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పసుపుకోమ్ము అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి నెల రోజులు ప్రతి రోజూ అష్టోత్తరం చదవాలి.. అర్చన ఐయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి.. ఈ నెల రోజులు పూజ ప్రారంభంలోనే చిన్న గిన్నెలో పానకం పెట్టాలి పూజ ఐయ్యాక ఆ పానకం తీర్థo లాగా సేవించాలి. వారంలో ఒక్కసారి అయినా తీపి అన్నం, పులిహోర వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం శుభాన్ని కలిగిస్తుంది. ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలి... మరుసటి రోజు మళ్ళీ పూజ సమయంలో శుభ్రం చేసే టప్పుడు ఆ పసుపుకొమ్ముల పక్కకు తీసి పెట్టి ,అవే పసుపు కొమ్ములు మళ్ళి అర్చనకు వాడాలి, అలా నెల రోజులు అదే పసుపుకొమ్ములు వాడాలి.. ఆఖరి రోజు అమ్మవారికి, పంచామృతము అభేషేకం చేసి 11 మంది ముత్తైదువులకు.. తాంబూలం ఇవ్వాలి ఏదైనా తీపి వండి మహా నివేదన చేసి ఆ ముత్తదువులకు తాంబూలంలో పండు తో పాటు ఒక పసుపుకొమ్ము, చిల్లర, పువ్వులు, మీరు వండిన ప్రసాదం వారికి ఇవ్వాలి..అక్షింతలు వేయించుకుంటే మంచిది.. మీరు 11 మందికి ఇచ్చే వారిలో ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి... ఇది చాలా విశేషమైన అర్చన, ఇంటిల్ల పాదికి సకల శుభాలు కలుగుతుంది, గ్రహ దోషం తో పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిస్కారం దొరుకుతుంది.. ఆటంకం వస్తే 7 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు. *నియమాలు* ఆటంకం రాకూడదు, ఆడవారికి అయితే మైలు స్నానం అయ్యాక 7 వ రోజు నుండి కొనసాగించాలి, ఈ నెల రోజులు మాంసాహరం తినకూడదు, పూజ పూర్తి అయ్యాక ఆహారం తినాలి కానీ ఉపవాసం చేయకూడదు మీరు ఎంత సంతోషంగా శ్రద్ధగా పూజ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.. వివాహితులు రోజూ తలస్నానమ్ చేయాలి (బ్రహ్మచర్య నియమం లేదు కనుక). అవివాహితులు మంగళ, శుక్ర, నాడు తల స్నానం చేస్తే సరిపోతుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం 9 లోపు పూజ ఐపోవాలి , ఈ పూజ అంతా అరగంట సమయం పడుతుంది అంతే ఆ కాసేపు అయినా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. ఈ నెల రోజులు రోజూ కూడా రోజంతా శ్రీ మహాలక్ష్మి దేవి నమః అనుకుంటూ ఉండటం చాలా మంచిది... ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్ళితే వచ్చాక మళ్ళీ మొదటి నుండి చేయాలి... ఇందులో ఏలాంటి మార్పు ఉండదు.. (మిగిలిన పసుపుకొమ్ములు వంటకు వాడుకోవచ్చు) #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🪔శ్రావణ మాసం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K views
23 days ago
🌺 శ్రావణ మాసం – వరలక్ష్మీ వ్రతం విశిష్టత 🌺 🙏 శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడు, పార్వతీదేవి, మహాలక్ష్మి, వరలక్ష్మీదేవి తదితర దేవతలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారి పూజకు విశేషమైనవిగా భావిస్తారు. 🌸🪔 🌺 శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున వరాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవిని పూజిస్తారు. 🙏🌺 🌸 వరలక్ష్మీ దేవిని ఎందుకు పూజించాలి? అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు— 💰 ధనసంపద 🌾 ధాన్యసమృద్ధి 🏡 కుటుంబ సుఖశాంతులు 💍 సౌభాగ్యం 👶 సంతాన శ్రేయస్సు 🧘 ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 🏆 విజయాలు, కార్యసిద్ధి 🌺 కుటుంబ క్షేమం కలగాలని ప్రార్థిస్తారు. “వరాలను ప్రసాదించే తల్లి” కనుక ఆమెను వరలక్ష్మీ అని భక్తితో పిలుస్తారు. 🙏🪷 🌺 చారుమతి చరిత్ర 🌺 🌸 పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రత కథకు ప్రసిద్ధమైన మూలకథ చారుమతి వృత్తాంతం. పూర్వం మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. 👩‍🦱🌸 ఆమె తన భర్తను ఎంతో గౌరవంతో చూసేది. 🙏 అత్తమామలను తన తల్లిదండ్రుల వలె భావించి భక్తితో సేవించేది. ❤️ ఇంటి పనులను ఓర్పుతో, శ్రద్ధతో చేసేది. 🏡 అందరితోనూ మితంగా, మృదువుగా, ప్రేమగా మాట్లాడేది. 🌺 🌅 ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, దేవతలను పూజించి తన దినచర్యను ప్రారంభించేది. 🪔🌸 భర్తను దైవస్వరూపంగా భావించి సేవించడం, అత్తమామలను గౌరవించడం, పెద్దలను ఆదరించడం, అందరితో మంచిగా ఉండడం ఆమె జీవితంలో ముఖ్యమైన లక్షణాలు. 🙏🌷 🌺 మహాలక్ష్మి స్వప్న దర్శనం 🌺 చారుమతి యొక్క భక్తి, వినయం, సేవాభావం, సద్గుణాలు చూసి మహాలక్ష్మీదేవి సంతోషించిందని కథనం. 🪷✨ ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చింది. 🌟🌺 అమ్మవారు ఆమెతో తనను భక్తిశ్రద్ధలతో పూజించే వారికి సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తానని తెలియజేసి, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని చెప్పింది. 🙏🪔 🌸 ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయాలని అమ్మవారు సూచించినట్లు చారుమతి కథలో చెప్పబడుతుంది. 🪷 చారుమతి తన కుటుంబానికి చెప్పడం 🪷 🌅 ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు వివరించింది. 🙏 అందరి అనుమతితో ఇరుగుపొరుగు స్త్రీలను కూడా పిలిచి, అమ్మవారు చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేందుకు సిద్ధమైంది. 🌺🪔 ఇంటిని శుభ్రం చేసి, మంగళకరంగా అలంకరించి, కలశాన్ని ప్రతిష్ఠించి, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించింది. 🌼🥥🍌 స్త్రీలందరూ కలిసి భక్తితో వరలక్ష్మీదేవిని పూజించారు. 🙏🌸 ✨ అమ్మవారి అనుగ్రహం ✨ వ్రతం పూర్తయిన తరువాత చారుమతి మరియు ఆమెతో కలిసి వ్రతం చేసిన స్త్రీలు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారని కథనం. 🌺🙏 💰 వారి ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరిశాయి. 🌾 ధనధాన్యాలు సమృద్ధిగా లభించాయి. 🐘 గజరాజులు, వైభవం కలిగాయని కథలో చెప్పబడుతుంది. 🏡 కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొన్నాయి. 🌸 చారుమతితో పాటు వ్రతం చేసిన స్త్రీల కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాయి. అందుకే వరలక్ష్మీ వ్రతం స్త్రీలలో ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న పవిత్రమైన సంప్రదాయంగా భావిస్తారు. 🙏🪷 🌺 అష్టలక్ష్ములను పూజించాలా? 🌺 అవును బ్రో 🙏🌸 వరలక్ష్మీ పూజలో లక్ష్మీదేవి యొక్క వివిధ స్వరూపాలను స్మరించడం, ముఖ్యంగా అష్టలక్ష్ములను ఆరాధించడం అనేక సంప్రదాయాల్లో ఉంది. అయితే ప్రతి ఇంట్లో ఒకే విధమైన పూజా విధానం తప్పనిసరి కాదు; కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం మారవచ్చు. 🙏 🪷 అష్టలక్ష్ములు 🪷 💰 1. ఆదిలక్ష్మి అమ్మవారి ఆదిస్వరూపం. శుభం, మంగళం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఆరాధిస్తారు. 🌸🙏 💵 2. ధనలక్ష్మి ధనం, సంపద, ఆర్థిక సౌభాగ్యం కోసం పూజిస్తారు. 💰🌺 🌾 3. ధాన్యలక్ష్మి ధాన్యసమృద్ధి, ఆహార సమృద్ధి, కుటుంబ పోషణకు ప్రతీకగా భావిస్తారు. 🌾🙏 👶 4. సంతానలక్ష్మి సంతానం మరియు వారి శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. 👨‍👩‍👧‍👦🌸 🐘 5. గజలక్ష్మి వైభవం, రాజసౌభాగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా ఆరాధిస్తారు. 🐘🪷 📚 6. విద్యాలక్ష్మి విద్య, జ్ఞానం, వివేకం కోసం పూజిస్తారు. 📖🙏 🏆 7. విజయలక్ష్మి కార్యాలలో విజయం, ధర్మబద్ధమైన ప్రయత్నాల్లో సాఫల్యం కోసం ప్రార్థిస్తారు. 🏆🌺 💪 8. ధైర్యలక్ష్మి ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టాలను ఎదుర్కొనే శక్తి కోసం ఆరాధిస్తారు. 🪷✨ 🌸 శ్రావణ శుక్రవారాల్లో ఏం చేయాలి? 🌸 🧹 ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. 🪔 ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. 🌺 లక్ష్మీదేవికి పూలతో అలంకరణ చేయాలి. 🥥 కలశాన్ని ప్రతిష్ఠించి పూజించవచ్చు. 🍌 పండ్లు, పాయసం, లడ్డూలు వంటి నైవేద్యాలను శక్తికి తగిన విధంగా సమర్పించవచ్చు. 🙏 వరలక్ష్మీ వ్రతం చేసే రోజున వ్రతకథను చదివి లేదా విని అమ్మవారిని భక్తితో ప్రార్థించాలి. 🌸 ముత్తైదువులను గౌరవించి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం అనేక కుటుంబాల్లోని సంప్రదాయం. 🪷 ముఖ్యంగా భక్తి, శ్రద్ధ, పవిత్రమైన మనసే ప్రధానమైనవి. 🌺 నాలుగు శ్రావణ శుక్రవారాలు 🌺 శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించవచ్చు. 🪔🌸 🌸 1వ శుక్రవారం – కుటుంబ మంగళం కోసం 🌸 2వ శుక్రవారం – ధనధాన్య సమృద్ధి కోసం 🌸 3వ శుక్రవారం – కుటుంబ ఆరోగ్యం, సుఖశాంతుల కోసం 🌸 4వ శుక్రవారం – ఐశ్వర్యం, శ్రేయస్సు, సర్వమంగళం కోసం 🙏 అయితే నాలుగు శుక్రవారాలు తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రతం చేయాలి అనే నియమం లేదు. ప్రధాన వరలక్ష్మీ వ్రతానికి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 🌺 🪷 చివరగా... “చారుమతి వంటి భక్తి, సేవాభావం, వినయం మనలో ఉంటే అదే నిజమైన లక్ష్మీ అనుగ్రహానికి మార్గం.” 🙏🌸 🌺 శ్రీ వరలక్ష్మీ దేవి కటాక్షం ప్రతి ఇంటిపై ఉండాలి 💰 ధనధాన్య సమృద్ధి కలగాలి 🏡 సుఖశాంతులు వెల్లివిరియాలి 👨‍👩‍👧‍👦 కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి 🌸 అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి 🪔 శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః 🙏🪷 శ్రీ వరలక్ష్మీ దేవి శుభకటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటూ… 🌺🙏 #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
777 views
28 days ago
#depression #mental health నా depression ప్రయాణం లో నేను కొందరిని అదే ప్రాబ్లెమ్ తో ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. first of all మీది డిప్రెషన్ నో కాదో తేల్చాల్సింది doctors . మీకు మీరే అనేసుకోవద్దు. అసలు ఆ dr దగ్గరికి వెళ్లాలో లేదో అనేది చెప్పాల్సింది జనరల్ ఫిజీషియన్స్ డైరెక్ట్ గా మీరే నిర్ణయించుకోకండి. ఆడ/ మగ లో dull గా మనసుబాలేక పోవడానికి చాలా reasons ఉంటాయి. చిన్న చిన్న వాటికి , మనసుబాలేకపోతే , డిప్రెషన్ అని అనేయడం ఈ మధ్య అందరికి పరిపాటి అయ్యింది. జనరల్ గా బాడీ లో డెఫిషియన్సీ లు ఉన్నా dull గా నిద్రపోతూ ఉంటారు. ఆడవాళ్ళకి గైనిక్ సంబంధించిన ,/ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల కూడా mood swings ఉంటాయి. చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కో శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. ఒకరికి ఎక్కువ ఉండచ్చు. ఒక్కోరికి చాలా ఎక్కువ ఇబ్బంది ఉండవచ్చు. ఆ మేమూ దాటివచ్చాం అనే చుట్టుపక్కల వాళ్ళ మాట చెవికి ఎక్కుంచుకోవద్దు. ముందు జనరల్ ఫిజిషియన్/ గైనకాలజిస్ట్ ని సంప్రదించి… వాళ్ళ సలహామేరకు మాత్రమే మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది మిత్రులు నేను వాడే మందులు ఒక స్ట్రిప్ పంపు.. వాడి చూస్తాను . నిద్ర ఉండటం లేదు అనేవాళ్ళు. అమ్మో. సైకియాట్రిస్టులు ప్రిస్కిప్షన్ లేనిదే ఆ మందులు షాప్ లో ఇవ్వరు. లెక్క ప్రకారం రెండు నెలల కి అంటే ఒక్క టాబ్లెట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. అవేం నిద్ర మాత్రలు కావు. చాలా రిస్క్ అలా వేసుకోవడం. అక్కడే అర్ధం అయ్యింది వాళ్లకి డిప్రెషన్ మీద అవగాహన శూన్యం అని. కొందరికి పరిస్థితులు చక్కదిద్దుకునే నార్మల్ అయిపోతారు. అది డిప్రెషన్ కానే కాదు. టెంపరరీ పెయిన్. ప్రతీ ఒక్కరి జీవితం లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని దాటక తప్పదు. మీ వల్ల కాకపోతే, కౌన్సిలింగ్స్ ఉపయోగపడతాయి max. మందులు కాదు. మీకు కౌన్సెలింగ్ చాలా/ మందుల అవసరం ఉందా అనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు. ఒక విషయం చెప్పనా ఫ్రాంక్ గా ………డిప్రెషన్ అనేది ఒక ఏడాది, నెల లో ఏర్పడేదే కాదు. ఆల్రెడీ దానికి పునాది ఎప్పుడో ఎన్నోసార్లు దెబ్బ మీద దెబ్బ పడే ఉంటుంది. #depression #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.9K views
1 months ago
🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు అంటే ఎవరు?🙏📚 విద్య, జ్ఞానం, జ్ఞాపకశక్తి, వాక్పటుత్వానికి అధిదేవతగా ఆరాధించబడే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. శ్రీమహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం అత్యంత విశిష్టమైనది. గుర్రం ముఖం, మానవ శరీరంతో దివ్యరూపంలో దర్శనమిస్తూ, తన కరుణాకటాక్షంతో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 🌺 స్వామివారి విశిష్టత: పురాణాల ప్రకారం మధు–కైటభ రాక్షసులు అపహరించిన వేదాలను తిరిగి సంపాదించి బ్రహ్మదేవునికి అందించిన జ్ఞానస్వరూపుడు హయగ్రీవుడు. అందుకే ఆయనను సర్వవిద్యల ఆధారమూర్తిగా భావిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, పరిశోధకులు, కళాకారులు భక్తితో హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, విజయాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. 🕉️ 1. హయగ్రీవ ధ్యాన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ । ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 🌺 అర్థం: జ్ఞానం, ఆనందం స్వరూపుడై, నిర్మలమైన స్ఫటికంలా ప్రకాశించే, సమస్త విద్యలకు ఆధారమైన శ్రీ హయగ్రీవ స్వామిని నేను భక్తితో ఉపాసిస్తున్నాను. 🕉️ 2. విద్యా ప్రసాద శ్లోకం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ । తస్య నిస్సరతే వాణీ జాహ్ను కన్యా ప్రవాహవత్ ॥ 🌺 అర్థం: ఎవరు భక్తితో "హయగ్రీవ" నామాన్ని జపిస్తారో, వారి మాటలు గంగానది ప్రవాహంలా స్పష్టంగా, మధురంగా ప్రవహిస్తాయి. 🕉️ 3. విద్యా సిద్ధి శ్లోకం శ్రీమాన్ హయగ్రీవో మే సన్నిధత్తాం సదా హృది । విద్యాం బుద్ధిం బలం చైవ దేహి మే కరుణానిధే ॥ 🌺 అర్థం: ఓ కరుణాసాగరుడా! నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించి నాకు విద్య, బుద్ధి, బలం ప్రసాదించు. 🕉️ 4. జ్ఞాన ప్రాప్తి శ్లోకం విద్యానాం దేవతం వందే హయగ్రీవం దయానిధిమ్ । యస్య ప్రసాదాత్ సర్వజ్ఞం భవేత్ మానవ జీవనం ॥ 🌺 అర్థం: సమస్త విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవ స్వామిని నమస్కరిస్తున్నాను. ఆయన అనుగ్రహంతో జ్ఞానం, వివేకం, విజయాలు లభిస్తాయి. 🕉️ 5. ప్రార్థన ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః॥ 🌺 అర్థం: విద్య, జ్ఞానం, బుద్ధి ప్రసాదించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి నమస్కారం. 📖 పిల్లలు ప్రతిరోజూ ఉదయం లేదా చదువు ప్రారంభించే ముందు ఈ శ్లోకాలను భక్తితో చదివితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ధైర్యం, విద్యలో పురోగతి కలుగుతాయని విశ్వాసం. 🙏🌸 🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు 🙏 📍 స్వామివారు ఎక్కడ ఉంటారు? శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి: 📍 తిరువహీంద్రపురం (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి అత్యంత ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ ఊషధగిరి కొండపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 📍 నంగనల్లూరు, చెన్నై (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి ప్రసిద్ధ ఆలయం. 📍 బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (తెలంగాణ) – ఇక్కడ కూడా హయగ్రీవ స్వామివారిని విద్యాప్రదాతగా ఆరాధిస్తారు. #తెలుసుకుందాం #హయగ్రీవ స్వామి #లక్ష్మీ హయగ్రీవ స్వామి #🕉️ శ్రీ హయగ్రీవ 🙏 #హయగ్రీవ